/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం Miryala Kiran Kumar
అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం

అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం హర్షణీయం

శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

కార్తీక మాసములో నియమ నిబంధనలు పాటిస్తూ నలబై రోజుల పాటు దీక్షలో వుండే అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు, ఇతర దీక్షా స్వాములకు  డిసెంబరు 31 వరకు ప్రతిరోజూ శబరినగర్ అయ్యప్ప స్వామి ఆలయం వెనకభాగంలో నిర్వహించే అన్నదానం కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలందరిపై వుండాలని, అయ్యప్ప స్వామి అందరిని చల్లగా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గండూరి ప్రకాష్, మొరిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వూర రామ్మూర్తి, మద్ది శ్రీనివాస్ యాదవ్, శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి సభ్యులు అంతటి విజయ్, యర్రంశెట్టి ఉపేందర్, రాచకొండ దేవయ్య, రాచకొండ క్ర్రష్ణ, చీపూరి క్ర్రష్ణ, వెంపటి పురుషోత్తం, కొండ్లె రంగయ్య, గుండా శ్రీధర్, పందిరి ఉపేందర్, దేశోజు నాని, గాలి క్ర్రష్ణ, ఎర్ర వెంకన్న, వెంపటి శభరినాధ్ తది తరులు పాల్గోన్నారు.

శ్రీలంకలో భారీ భూకంపం

శ్రీలంకలో భారీ భూకంపం

శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. భయాందోళనలకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..

Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. దీపావళి రోజే ఇంటి దీపాన్ని ఆర్పేశాడు..

Neredumet:ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది.. కానీ ఆ తరువాత కుటుంబంలో ఆర్థిక సమస్యలతో గొడవలు మొదలయ్యాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం ఆమె అద్దె ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు భర్త మహేందర్.. ఈ క్రమంలోనే..


హైదరాబాద్, నవంబర్14; దీపావళి పండుగ రోజే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ను హత్య చేసాడు కట్టుకున్న భర్త…కులాలు వేరే అయిన కలిసి జీవించాలి అనుకున్నారు.. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు.. సుఖ సంతోషాలతో కలిసి జీవించాలి అనుకున్న ఆ ఇద్దరి మధ్య అనంతర కాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో భర్త ప్రవర్తనలో మార్పులు రావడం తో ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసాయి.. క్రమ క్రమంగా ఈ సమస్యలు మరింత ఎక్కువ అవ్వడంతో పుట్టింటికి వెళ్ళింది భార్య. అయినప్పటికీ అతనిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత బలపడ్డాయి… పలుమార్లు కుటుంబ సభ్యులు హెచ్చరించిన మార్పు మాత్రం రాలేదు. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేశాడు ఓ భర్త. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోనే చోటు చేసుకుంది.


నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి రోజున ఇంటి ఇల్లాలిని హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా గన్నారం గ్రామానికి చెందిన స్రవంతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీగిరి పల్లి కి చెందిన మహేందర్ తో వివాహం జరిగింది. మహేందర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. వీరు ఏడాది క్రితం ఉప్పల్ పరిధిలోని జవహర్ నగర్ లోని కందిగూడా లో నివసిస్తున్నారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు గొడవలు చోటు చేసుకోవడంతో స్రవంతి చాలా రోజులుగా తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. శనివారం రాత్రి మహేందర్ భార్యకు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె ఆదివారం ఉదయం సమతా నగర్లో అద్దె ఇంటికి వెళ్లి చూడగా భర్త తన వస్తువులు తీసుకెళ్లి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో భర్త పై ఆగ్రహం వ్యక్తం చేసింది స్రవంతి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేందర్ కోపంతో భార్య స్రవంతి ముఖంపై, తలపై బలంగా కొట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అనంతరం ఆమె మెడకు చున్ని చుట్టి తీసుకెళ్లి మంచం కింద దాచాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

వస్తువుల్ని తీసుకోవడానికి వెళ్ళినటువంటి చెల్లి తిరిగి రాకపోవడంతో స్రవంతి అన్న ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానం వచ్చి డోర్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా పడివుంది. దీంతో పోలీసులు మహేందర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఈ విధంగా హత మార్చడంతో స్రవంతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ చూసి ఎన్నికల అధికారుల షాక్.. ఎందుకో తెలుసా..?

Telangana Election: స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ చూసి ఎన్నికల అధికారుల షాక్.. ఎందుకో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. సాధారణంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు హంగామాతో నామినేషన్లు వేస్తుంటారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ దాఖలు చేస్తుంటారు. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్థిని చూసి ఎన్నికల అధికారులు షాక్ తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. సాధారణంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు హంగామాతో నామినేషన్లు వేస్తుంటారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్ దాఖలు చేస్తుంటారు. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్థిని చూసి ఎన్నికల అధికారులు షాక్ తిన్నారు. స్వతంత్ర అభ్యర్థి పోటీకి విశేషమేంటి..? ఎన్నికల అధికారులు ఎందుకు అవాక్కయ్యారో తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!


యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన గుజ్జా రాంచంద్రా రెడ్డి సామాజిక కార్యకర్త. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులు చేస్తూ ఉంటాడు. ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రామచంద్రారెడ్డి ఆలేరు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేయడంలో ఎలాంటి విశేషం కూడా లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు పదివేల రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా అభ్యర్థులు ఎవరైనా ఈ డిపాజిట్‌ను చెల్లిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ప్రజల నుంచి ఒక్కో రూపాయి నాణెలను విరాళంగా సేకరించారు. ఇలా పదివేల నాణెలు పోగు చేసిన మూటతో నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చాడు. నాణెల మూటను చూసి ఎన్నికల అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పదివేల రూపాయల నాణాలను లెక్కించడానికి ఎన్నికల అధికారులకు రెండు గంటల సమయం పట్టింది.


రామచంద్రారెడ్డి ఇలా 2009 నుంచి ఇప్పటివరకు వరసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిసారి ప్రజల నుంచి విరాళంగా రూపాయి కాయిన్స్ సేకరించి డిపాజిట్ చెల్లిస్తుంటాడు. ప్రస్తుతం.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని, ఇందులో ఓటర్లు పావులుగా మారారని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవా రంగంగా ఉండాల్సిన రాజకీయ రంగాన్ని పార్టీలు వ్యాపారంగా మార్చి వేశాయని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు ప్రజాస్వామ్యానికి చేటని ఆయన అంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల నుంచి ఒక్కో రూపాయను విరాళంగా సేకరించి ఎన్నికల్లో డిపాజిట్ చెల్లిస్తుంటానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు తెలిపిన ఆయన. ఆలేరు నియోజకవర్గ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

గొప్ప నటునికి తెలుగులో సంతాపం తెలిపిన ప్రధాని...

సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేని శూన్యతను కలిగించిందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘ప్రముఖ తెలుగు నటుడు శ్రీ చంద్ర మోహన్ గారు మృతి చెందడం అత్యంత బాధాకరం. సినీ ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. వారి ఉత్తమమైన నటన మరియు ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వారి నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేన ఒక శూన్యతను కలిగించింది. నా ఆలోచనలు వారి కుటుంబం మరియు అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి’’ అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని ఇంగ్లిష్‌లోనూ ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, మహేశ్ బాబు తదితర సినీ ప్రముఖులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న చంద్రమోహన్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.



సీఎం కుర్చీపై సీనియర్ నేతల ఆశలు.. అన్ని పార్టీల్లోనూ అదే తంతూ.. తేడా కొడితే..?

Telangana Election: సీఎం కుర్చీపై సీనియర్ నేతల ఆశలు.. అన్ని పార్టీల్లోనూ అదే తంతూ.. తేడా కొడితే..?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం. ఇలా చెబితేనే నియోజకవర్గ ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకుంటున్నారా? లేక నిజంగానే ఆయనకు అంత సీనుందా? తెలంగాణలో ఓటర్లు ఇప్పుడు వింత పరిస్థితి ఎదురవుతోంది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇటు ఎవరు అని బీఆర్‌ఎస్‌ చేసే టీజింగ్‌ని భరించలేక.. నేనే సీఎం అంటూ బయల్దేరారు జాతీయ పార్టీల సీనియర్‌ నేతలు.



తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం. ఇలా చెబితేనే నియోజకవర్గ ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకుంటున్నారా? లేక నిజంగానే ఆయనకు అంత సీనుందా? తెలంగాణలో ఓటర్లు ఇప్పుడు వింత పరిస్థితి ఎదురవుతోంది. అటు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇటు ఎవరు అని బీఆర్‌ఎస్‌ చేసే టీజింగ్‌ని భరించలేక.. నేనే సీఎం అంటూ బయల్దేరారు జాతీయ పార్టీల సీనియర్‌ నేతలు.


సీఎం.. సీఎం.. సీఎం.. మేమంటే మేమే సీఎం.. ఇక అధికారం తథ్యమే.. సీఎం కుర్చీపై కూర్చోడమే తరువాయి అన్న రేంజ్‌లో అన్ని పార్టీల ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్‌కే పరిమితం అయిన సీఎం కుర్చీ రేసు.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకీ పాకింది. ఇది చూసి బీఆర్‌ఎస్‌ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం కేసీఆర్‌.. మరి మీ పార్టీలో సీఎం ఎవరైతారు అని మొఖం పట్టుకుని అడిగినంత పని అవుతోంది.

బీసీ సీఎం నినాదంతో తెలంగాణలో ఎన్నికలకు వెళ్తోంది కమలం పార్టీ. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎక్కడా సీఎం అభ్యర్థులను ప్రకటించని బీజేపీ.. తెలంగాణ విషయంలో మాత్రం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిగా నియమిస్తామని బీజేపీ ప్రకటించింది. దీంతో తెలంగాణలోని బీసీలు తమవైపే ఉంటారన్న ధీమాలో ఉంది కమలం పార్టీ.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి దాకా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి లేరు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీకి అవకాశం ఇస్తామని.. 30 – 35 మంది ఉన్న సమావేశంలో తనవైపు చూస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని అంటున్నారు ఈటల రాజేందర్. అటు కార్యకర్తలకూ ఇదే చెబుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారు ఈటల రాజేందర్‌. ఈటల ఇలా మాట్లాడిన 24 గంటల్లోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ రియాక్టయ్యారు. సీఎం అవుతానని తానైతే చెప్పననీ.. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు పార్టీ అధిష్టానమే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటిస్తుందంటున్నారు బండి సంజయ్.

మొన్నటికి మొన్న ఖానాపూర్‌ నియోజకవర్గంలోని జన్నారం సభలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ బండి సంజయ్‌. ఆయన ప్రసంగం సందర్భంగా సీఎం.. సీఎం.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నినాదాలే తన కొంపముంచాయని, ఉన్న పదవి పోయిందన్నారు బండి సంజయ్‌. తెలంగాణాలో బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం అవుతారని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారని అన్నారు.

ఇదంతా బీజేపీ సంగతి.. ఇప్పుడు కాంగ్రెస్‌ విషయానికి వస్తే.. స్వేచ్ఛ, అంతర్గత స్వాతంత్ర్యం ఉన్న పార్టీ. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారే సీఎం నేనంటే నేనని ప్రకటనలు చేసేస్తున్నారు. దసరా రోజు తాజా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనసులో మాట బయట పెట్టేశారు. తాజా మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ టీవీ9 వేదికగా సీఎం సీటుపై ఆశని చాటుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి కామెంట్స్‌ చాలా చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అయితే.. సీఎంగా తన తొలి సంతకం గురించి మాట్లాడడం అంతా చూస్తున్నాం. వీరందరికీ గట్టి కౌంటరే ఇచ్చారు ఆ పార్టీ సీనియర్‌ నేత వి. హన్మంత రావు. ముందు గెలిచిరండి.. సీఎం గురించి అధిస్టానం చూసుకుంటుందని హితవు పలికారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు. మాకు సీఎం అభ్యర్థి కేసీఆర్‌.. మీకు ఎవరు అంటూ టీఆర్‌ఎస్‌ చేస్తున్న టీజింగ్‌ను తప్పుబట్టారు. తమది జాతీయ పార్టీ, అదంతా అధిస్టానం చూసుకుంటుందన్నారు.

బీజేపీలో లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి వంటి నేతలు కూడా సీఎం సీటుకు అర్హులే. కాంగ్రెస్‌లో నల్గొండ జిల్లా సీనియర్లంతా పోటీలోనే ఉంటారు. ఇలా ఎవరికి వారు సీఎం పదవిపై ఆశలు పెట్టుకుని, ఇటు పార్టీ విజయం కోసం కృషి చేయడంలో తేడా కొడితే, ఉన్నది పోతుంది..! అన్నీ పోతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు..!!

అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు!

BREAKING

అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు!

అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు లేఖలు రాసిన తెలంగాణా చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్.

అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్న సీఈఓ.

ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఆ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం.

ఆ మేరకు మీడియా సంస్థలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం.

ఆ ప్రకటనల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఛానళ్లకు సూచన.

సదరు ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, క్లిప్ లను కూడా జతపరచిన సీఈఓ కార్యాలయం.

పదవులే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు: జగదీశ్వర్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయం

వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల ప్రజలు చేస్తున్న శపదాలే దీనికి నిదర్శనం

కాంగ్రెస్ నేతలకు నేను శత్రువైతే, వారు మాత్రం ప్రజల శత్రువులు

ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి ఓటు వేయమని చెప్పిన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్

పదవులే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు

కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజాధనం ఆ నేతల జేబుల్లోకి వెళితే... బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ప్రజలకు వెళుతుంది 

కాంగ్రెస్ పార్టీని మరోసారి క్రిష్ణ లో కలపడం ఖాయం

 సూర్యాపేట 

ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి ఓటు వేయమని చెప్పిన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గం లోని శాలగౌరారం లో మీడియా తో మాట్లాడిన మంత్రి,కాంగ్రెస్ పార్టీని మరోసారి ప్రజలు క్రిష్ణ లో కలపడం ఖాయం అన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయం అన్నారు.వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల ప్రజలు చేస్తున్న శపదాలే దీనికి నిదర్శనం అన్నారు.

కాంగ్రెస్ నేతలకు నేను శత్రువైతే, వారు మాత్రం ప్రజల కు శత్రువులు అని పేర్కొన్నారు. వారికి పదవులే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదన్నారు.

కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజాధనం ఆ నేతల జేబుల్లోకి వెళితే... బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ డబ్బులు ప్రజల జేబులో కి వెళతాయి అని అన్నారు.

ఇంటి దగ్గర నుండి ఓటేసే అవకాశం ఉన్న... స్పందన కరువు..

ఎన్నికల్లో వృద్ధులకు దివ్యాంగులకు లైన్‌లో ఉండి ఓటు నమోదు చేసుకోవాలంటే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల కమిషన్‌ ఇంటి వద్ద నుంచే ఓటు నమోదు చేసుకునే విధంగా సువర్ణ అవకాశాన్ని కల్పించింది. మంచాన పడ్డ వారు, కదులలేని, బయటకు రాలేని పరిస్ధితులున్నా... అలాంటి వారితోనూ ఓటు వేయించడం ద్వారా ఓటింగ్‌ శాతం పెంచే సరికొత్త ఆధికారులు ఈసారి రూపొందించారు. సంబంధిత వ్యక్తుల నుంచి అంతగా స్పందన లేకపోవడం గమనార్హం. అధిక శాతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడుతుండగా, సుముఖంగా ఉన్న కొద్దిమంది నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు సైతం పోలింగ్‌ కేంద్రాల వద్దకే వచ్చేందుకు ఇష్టపడుతున్నట్లు తెలస్తుంది.

13 వేల పైచిలుకు గుర్తింపు...

80 ఏళ్లు నిండిన వృద్ధులు, నడువలేని దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ ఇచ్చింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈలాంటి వారు మొత్తం 13,076 మందిని అధికారులు గుర్తించారు. వారిలో 80 ఏళ్లు నిండిన వృద్ధులు 10031 మంది, దివ్యాంగులు 3045 మంది ఉన్నారు. వారికి 12-డీ ఫామ్‌లను ఇప్పటికే పంపిణీ చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. దీన్ని ఆర్‌వో ఎన్‌.రవికిరణ్‌, నోడల్‌ అధికారి సుధ లింగాలలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 13,076 లో కొంత మంది మరణంచగా, వీరిలో వృద్ధులు 103 మంది, దివ్యాంగులలో 15 మంది మాత్రమే సుముఖతను వ్యక్తం చేస్తూ లేటర్‌లను ఇచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు

బ్యాలెట్‌ పత్రాలు ముద్రించాక కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం. పోలింగ్‌కు ముందే దీని కోసం ప్రత్యేకంగా నియమించే పోస్టల్‌ బ్యాలెట్‌ బృందం బ్యాలెట్‌ బాక్స్‌తో పోలీసులు, అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లతో సహా ఆయా ఇళ్లకు వెళ్లి వృద్దులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రక్రియనంతా వారి ఇంటి వద్దకు అధికారులు వెళ్లినప్పటినుంచి రహస్యంగా సదరు వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునే వరకు వీడియో రికార్డ్‌ చేస్తారు.

ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రం దాఖలు చేసిన నల్గొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి

నేడు..నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా.. కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. నామినేషన్ దాఖలు...

 ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రం దాఖలు...

 రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కంచర్ల....

 ఉదయం తమ స్వగ్రామం ఉరుమడ్ల గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు...

 సరిగ్గా ఉదయం 9.20 గంటలకు...

కుటుంబ సభ్యులు, సోదరీమణులు... మంగళ హారతులు పట్టి విజయ తిలకం దిద్దగా.. మాతృమూర్తి కౌసల్య, సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకున్న... భూపాల్ రెడ్డి గారు... ముఖ్య నాయకులు.. వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు వెంటరాగా...తాను నివాసముంటున్న... బీటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో... ప్రత్యేక పూజలు నిర్వహించారు... అనంతరం తన ఇష్ట దైవం... రామలింగేశ్వరుడికి  ఛాయా సోమేశ్వరాలయంలో... అభిషేకం నిర్వహించి పూజలు చేశారు...

 ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్డివో కార్యాలయం చేరుకొని

నిబంధనల మేరకు ఐదుగురు.. నాయకులు వెంట రాగా.. నల్లగొండ నియోజకవర్గ ఆర్ వో గారికి.. రుసుము చెల్లించి.. నామినేషన్ పత్రం అందచేశారు...

అనంతరం వెలుపల మీడియా తో మాట్లాడుతూ..

# నల్లగొండ పునర్నిర్మాణం కోసం ఆలోచనతో ఓటు వేయండి..

#అభివృద్ధిని కొనసాగించేందుకు మరోసారి అవకాశం ఇవ్వండి.

# కడుపు నింపే కేసీఆర్ కావాలా కడుపు కొట్టి కాంగ్రెస్ కావాలో నిర్ణయించుకోండి.

# కోమటిరెడ్డిని తరిమేస్తేనే నల్లగొండలో ఖాళీ జాగాలు మిగులుతాయి.

# ఐదేళ్లు కనపడని కోమటిరెడ్డి ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చి నాయకులను కొనుగోలు చేస్తుండు.

.... కంచర్ల.

 గత 20 ఏళ్లుగా గోస తీసి.. అభివృద్ధి కి నోచుకోక... ఇప్పుడిప్పుడే నల్లగొండ నిర్మాణం చెందుతూ అభివృద్ధి దిశ వైపు పరుగులు తీస్తుంటే... గత ఐదు సంవత్సరాలుగా కనపడని.. నల్లగొండ ప్రజల సమస్యలు పట్టని పట్టించుకోని.. కోమటిరెడ్డి మళ్లీ డబ్బు సంచులతో వచ్చి.. నాయకులను కొనుగోలు చేసి...

 హైప్ క్రియేట్ చేసి... ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నాడ ని.. గతంలోల ఆయన మాటలు ఇప్పుడు సాగవని.. ఆయన మాయ మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు... కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని.. వాటిని మరింత పెంచుతూ మేనిఫెస్టోలో తెలిపిందని

 ఆసరా పెన్షన్లు 3016 నుంచి 5016 కు దివ్యాంగుల పెన్షన్ 6016 రైతుబంధు 12 వేల నుండి 16 వేలకు.. 3016 రూపాయల సౌభాగ్య లక్ష్మి... 400 రూపాయలకే సిలిండర్.. తదితర ప్రజలకు ఉపయోగపడే లాభపడే.. పథకాలు ప్రవేశపెట్టనిందని... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడి తెచ్చిన కేసీఆర్ ద్వారానే ఈ పనులన్నీ... నెరవేరుతాయని...

ప్రజలకు తెలియజేశారు.

 కంచర్ల నామినేషన్ కార్యక్రమంలో..

 మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కరీం పాషా జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు చాడ కిషన్ రెడ్డి, నిరంజన్ వలి ,మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ఎంజి యూనివర్సిటీ సినీనటి సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, చిట్యాల సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్య గౌడ్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు గోలిమా అమరేందర్ రెడ్డి జేఏసీ అధ్యక్షులు జే వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు నేతి రఘుపతి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ జెడ్పి కోఆప్షన్ సభ్యులు.. తీగల జాన్ శాస్త్రి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ,జమాల్ ఖాద్రి రంజిత్ ఉద్యమ నాయకులు బక్క పిచ్చయ్య మాలే శరణ్య రెడ్డి సింగం రామ్మోహన్, లక్ష్మి, ఫరీద్ దొద్దిన్ మైనం శ్రీనివాస్,

పెఱిక ఉమామహేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ లు వంగాల సహదేవరెడ్డి ఆలకుంట నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్ ,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్,తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్రెడ్డి దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య..

 తిప్పర్తి కనగల్ మాడులపల్లి నల్లగొండ వైస్ ఎంపీపీలు.. ఏనుగు వెంకట్ రెడ్డి రామగిరి శ్రీధర్ రావు, రామగిరి శ్రీధర్ రావు, జిల్లా పరమేష్... సింగిల్ విండో వైస్ చైర్మన్ లు, కందుల రేణుక లక్ష్మయ్య, తవిటి కృష్ణ...

 పట్టణ మండలం పార్టీ.కార్యదర్శులు సందినేని జనార్ధన్ కాసం శేఖర్,జాఫర్,వనపర్తి నాగేశ్వరరావు కందిమల్ల నరేందర్ రెడ్డి, ఇరుగంటిపల్లి శేఖర్ రెడ్డి,బడుపుల శంకర్, పలువురు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.