/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz 81.5 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్! Mane Praveen
81.5 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్!

ఆధార్ వివరాలపై మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగలకు చిక్కినట్లు తెలుస్తోంది.

 81.5 కోట్ల మంది పౌరుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్ వెబ్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. 

దీనిపై CBI దర్యాప్తు చేయనుంది. డేటా ఎక్కడి నుంచి లీక్ అయిందో తెలియాల్సి ఉంది.

RR: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల జోష్

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు, మైనార్టీ సోదరులు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి.. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

పార్టీలో చేరిన వారి ముఖ్య వివరాలు.

అబ్దుల్లాపూర్ మెట్ మండలం బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ నసీరుద్దీన్ బృందం కాంగ్రెస్ పార్టీలో చేరిక.

బాటసింగారం గ్రామ మాజీ ఉపసర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు సాలం ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

పసుమాముల గ్రామం నుండి బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

మంచాల మండలం చాంద్ ఖాన్ గూడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.*

ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్ గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్ పేట పరిసర ప్రాంతాల ఆర్.ఎం.పి వైద్యులు మల్ రెడ్డి రంగారెడ్డి గారిని కలిసి పూర్తి సంఘీభావం తెలియజేశారు.

HYD: నగరంలో 144 సెక్షన్ అమలు: సిపి సందీప్ శాండిల్య

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లి ఎన్నికల దృష్ట్యా జంట నగరాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు నగరంలోని 15 నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్‌ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు నగర సిపి సందీప్‌ శాండిల్య ప్రకటించారు.

ఈ నిబంధనలు నవంబర్‌ 3 నుంచి 15వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. అప్పటి వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని నిషేధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

నల్గొండ లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు, వ్యాయామ విద్యా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని "జాతీయ ఐక్యత దినోత్సవం" నిర్వహించారు. 

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్ ఉపేందర్ ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ ఐక్యత భావంతో కలిసిమెలిసి ఉండాలని, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ప్రక్కకు పెట్టి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

పటేల్ యొక్క దేశ సేవలను గుర్తు చేసుకొని, నేటి యువతరం వారిని ఆదర్శంగా తీసుకొని దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అన్నారు. విద్యార్థులు ఐకమత్యంగా ఉండి, దేశ సమగ్రతను, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం కావాలని, భారత దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వయంగా కదిలి సత్యనిష్టతో ముందుకెళ్లాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చేత "ఐక్యత ప్రతిజ్ఞ" చేయించారు. తదనంతరం "రన్ ఫర్ యూనిటీ" అనే పరుగును నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు ఇ.యాదగిరి రెడ్డి, ఎమ్. వెంకట్ రెడ్డి,కే.శివరాని,ఫిజికల్ డైరెక్టర్ కే.మల్లేశ్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలను జరపండి: CPI (M-L) న్యూడెమోక్రసీ

నల్లగొండ: భూమి, భుక్తి, విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్) అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించాలని, నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని.. సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా కమిటీ.. విప్లవ శ్రేణులకు, సానుభూతి పరులకు, ప్రజలకు పిలునిస్తుందని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

AP: మధ్యంతర బెయిల్ తో విడుదల కానున్న చంద్రబాబు

AP: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు.. సెప్టెంబర్ 10 నుండి 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టేసిన కోర్టు.. ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.

విచారణను హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. మెడికల్ గ్రౌండ్స్ పై చంద్రబాబుకు వచ్చే నెల 24 వరకు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ కు సంబంధించి కోర్టు ఎలాంటి షరతులు విధించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. బెయిల్ కు సంబంధించిన తీర్పు కాపీ వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. కాగా, ప్రధాన బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10న విచారణకు రానుంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు ఆయన బెయిల్ పై విడుదల కానున్నట్లు సమాచారం.

Breaking news: చంద్రబాబు కు మధ్యంతర బెయిల్ మంజూరు

AP: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్న నల్లగొండ ఉమెన్స్ కాలేజ్ అధ్యాపకులు

TS: హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 83వ కాన్వకేషన్ సందర్భంగా, యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు ఎడబో(Adobe ) సిఈఓ శాంతన్నారాయణ , యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ చేతుల మీదుగా.. నేడు నల్లగొండలోని ప్రభుత్వ మహిళ కళాశాల అధ్యాపకులు డాక్టరేట్ అధ్యాపకులు  తీసుకోనున్నారు.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్న అధ్యాపకులు:

డాక్టర్ ఎస్.రాజారాం-లైబ్రరీ సైన్స్

డాక్టర్ బి.జ్యోతి-కెమిస్ట్రీ

డాక్టర్ ఆర్.నరేష్-జువాలజీ

డాక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు-ఫిజిక్స్

డాక్టర్ ఎం.రవి-కెమిస్ట్రీ

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు సహచర అధ్యాపకులు, విద్యార్థులు వారికి అభినందనలు తెలుపుతున్నారు.

TS: 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల

HYD: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బహుజన సమాజ్ పార్టీ సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 3న 20 మందితో తొలి జాబితా విడుదల చేసిన బిఎస్పీ,, సోమవారం 43 మందితో రెండో జాబితా ప్రకటించింది.

ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే పార్టీలకు ఓట్లు వేయవద్దన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దన్నారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు.

43 అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితాలో విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన మొత్తం 63 అసెంబ్లీ స్థానాలకు తొలి, రెండో విడత జాబితా కలిపి బీసీ-26, ఎస్సీ -21, ఎస్టీ-11, ఓసీ-03, మైనార్టీలు-02 లకు సీట్లు కేటాయించారు.

బహుజన్ సమాజ్ పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా:

1.బెల్లంపల్లి(ఎస్సీ) –జాడీ నర్సయ్య

2.మంచార్యాల–తోట శ్రీనివాస్

3.ఆసిఫాబాద్ (ఎస్టీ) –కనక ప్రభాకర్

4.బోథ్(ఎస్టీ)–మెస్రాం జంగుబాపు

5.కామారెడ్డి –ఉడతావర్ సురేష్ గౌడ్

6.కోరుట్ల– నిశాంత్ కార్తీకేయ గౌడ్

7.జగిత్యాల–బల్కం మల్లేష్ యాదవ్

8.రామగుండం–అంబటి నరేష్ యాదవ్

9.సిరిసిల్ల–పిట్టల భూమేష్ ముదిరాజ్

10.హుజూరాబాద్ –పల్లె ప్రశాంత్ గౌడ్

11.దుబ్బాక–సల్కం మల్లేష్ యాదవ్

12.ఉప్పల్– సుంకర నరేష్

13.రాజెందర్ నగర్–ప్రొ. అన్వర్ ఖాన్

14.చేవేళ్ల(ఎస్సీ)–తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ

15.పరిగి–యంకెపల్లి ఆనంద్

16.మలక్ పేట్–అల్లగోల రమేష్

17.నాంపల్లి–మౌలానా షఫీ మసూదీ

18.చంద్రాయణగుట్ట- మూల రామ్ చరణ్ దాస్

19.కొడంగల్–కురువ నర్మద కిష్టప్ప

20.మహుబూబ్ నగర్–బోయ స్వప్న శ్రీనివాసులు

21.దేవరకద్ర–బసిరెడ్డి సంతోష్ రెడ్డి

22.మక్తల్–వర్కటన్ జగన్నాధ్ రెడ్డి

23.అచ్చంపేట్(ఎస్సీ) – మెత్కూరి నాగార్జున

24.కల్వకుర్తి–కొమ్ము శ్రీనివాస్ యాదవ్

25.షాద్నగర్–పసుపుల ప్రశాంత్ ముదిరాజ్

26.కొల్లాపూర్–గగనం శేఖరయ్య

27.హుజూర్ నగర్– రాపోలు నవీన్

28.మునుగోడు–అందోజు శంకరాచారి

29.ఘన్పూర్ –స్టేషన్ (ఎస్సీ)– తాళ్లపల్లి వెంకటస్వామి

30.పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త

31.డోర్నకల్(ఎస్టీ) –గుగూలోత్ పార్వతీనాయక్

32.నర్సంపేట్– డా.గుండాల మధన్ కుమార్

33.వరంగల్ ఈస్ట్–చిత్రపు పుష్పిత లయ

34.వర్థన్పేట్(ఎస్సీ)–డా.వడ్డేపల్లి విజయ్ కుమార్

35.ములుగు(ఎస్టీ)–భూక్యా జంపన్న నాయక్

36.పినపాక(ఎస్టీ)–వజ్జ శ్యామ్

37.మధిర(ఎస్సీ)–చెరుకుపల్లి శారద

38.ఆశ్వారావుపేట్(ఎస్టీ)–మడకం ప్రసాద్

39.భద్రాచలం(ఎస్టీ)–ఇర్పా రవి

40.ఇబ్రాహీం పట్నం - గొరిగే మల్లేష్ యాదవ్

41.మహబూబాబాద్ - గుగులోత్ శేఖర్ నాయక్

42.శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

43.వేములవాడ - గోలి మోహన్

కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకం

TS: కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన పమేలా సత్పతి ని నియమిస్తూ,, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు

ప్రస్తుతం పమేలా సత్పతి,, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతి ని నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

2011 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి మహంతి.. ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసి గత కొన్ని నెలల క్రితం తెలంగాణకు నియమించబడ్డారు. కడప జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్ డిసిపి గా విధులు నిర్వహిస్తున్నారు.