NLG: మునుగోడు లో సీపీఐ పోటీకి ఏకగ్రీవంగా తీర్మానం
నల్లగొండ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా బలమైన పార్టీ క్యాడర్, గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సిపిఐ కి మునుగోడు సిటు కేటాయించాలని లేదా సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు.
నల్గొండ జిల్లాలో బలమైన ఉద్యమ చరిత్ర ఉన్న మునుగోడు స్థానాన్ని సిపిఐ కేటాయించాలని లేని పక్షంలో సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని జాతీయ, రాష్ట్ర కమిటీలను జిల్లా కౌన్సిల్ సమావేశంలో కోరారు.
2018 ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా, పొత్తులో ప్రతిసారి మునుగోడు నియోజకవర్గం సిపిఐ కి కేటాయించకపోవడంతో పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యురాలు గిరి రామ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, ఆర్ అంజచారి, బోల్గురి నర్సింహా, టీ వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, గురుజా రామచంద్రం, బొడ్డుపల్లి వెంకట్ రమణ పాల్గొన్నారు.



నల్లగొండ: పట్టణ బిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు దుబ్బ రూప అశోక్ సుందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ దుబ్బ అశోక్ సుందర్, ఈ రోజు హైదరబాద్ లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు.
ఈ సందర్బంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి, కోమటిరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు అంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిసినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత తొమ్మిది రోజులుగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా గరుడోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మాడవీధుల్లో తిరిగే స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో గతంలో శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు దసరా సెలవులు కొనసాగుతుండటంతో నేడు మంగళవారం కూడా రద్దీ ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు.
నిన్న తిరుమల శ్రీవారిని 79,693 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 21,864మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.


ఈ సందర్భంగా సర్పంచ్ పాక నగేష్ మాట్లాడుతూ.. దసరా పండుగను గ్రామ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని, ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు గ్రామ ప్రజలందరూ పైన ఉండాలని.. సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.




నల్గొండ పట్టణంలోని, ఐదో వార్డు గరుడాద్రి నగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి శీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు కాలనీ మహిళలు, చిన్నారులు, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొని.. ఆనందంగా ఆట పాటలతో మరియు కోలాటాలు ఆడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
తొమ్మిది రోజులుగా నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగిసాయి. అనంతరం పానగల్ బైపాస్ లో గల బతుకమ్మ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
SB NEWS
Oct 25 2023, 09:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.1k