/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆస్ట్రేలియా బ్యాట్స్ మేన్ కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు Yadagiri Goud
ఆస్ట్రేలియా బ్యాట్స్ మేన్ కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో భారత జట్టు ఆల్రౌండ్ ప్రతిభ చూపుతోంది. అటు బౌలింగ్ .. ఇటు ఫీల్డింగ్ పరంగా అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. ఇక.. ఈ మ్యాచ్లో బౌలర్ రవీంద్ర జడేజా స్పిన్నింగ్ మ్యాజిక్ భలేగా వర్కవుట్ అయ్యింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక.. సెకండ్ బ్యాటింగ్కు దిగనున్న భారత జట్టు ముందు 200 పరుగుల లక్ష్యం ఉంది..

‌‌ఆట ప్రారంభంలో 6 బంతులు మాత్రమే ఆడిన మిచెల్ మార్ష్ ఒక్క పరుగు కూడా చేయకుండానే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. వరల్డ్ కప్‌‌ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్‌ని ఆదిలోనే డకౌట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు..

ఆ తర్వాత డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలోపడ్డారు. రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్, ఏబీ డివిల్లియర్స్ రికార్డులను ఇవ్వాల జరిగిన మ్యాచ్లో డేవిడ్ వార్నర్ బ్రేక్ చేశాడు..

52 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 41 బంతుల్లో ఓ ఫోర్‌తో 27 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

క్లియర్‌గా అవుటైనా డీఆర్‌ఎస్ తీసుకుని ఓ రివ్యూని లబుషేన్ వేస్ట్ చేశాడు. అదే ఓవర్‌లో అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రెండు బంతులాడిన అలెక్స్ క్యారీ డకౌట్ అయ్యాడు.

భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో భారత జట్టు ఫీల్డింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. 21.4 నుంచి 31.5 ఓవర్ల మధ్య 12.1 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం విశేషం..

టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ,టీఎస్ఆర్టీసీ, చైర్మన్ గా నేడు బాధ్యతలు చేపట్టారు..

హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, , ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి.. సన్మానించారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్మన్ ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్, నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు.

తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.

సంస్థ ఉద్యోగులతో తాను ఒకరిగా సమిష్టిగా పని చేసి.. టీఎస్ఆర్టీసీ లాభాల బాటవైపునకు తీసుకెళ్తామని వివరించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్ తోపాటు చైర్మన్ యాదగిరి రెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముత్తిరెడ్డికి స్థానం లభించకపోవడం తెలిసిందే. కాగా, ముత్తిరెడ్డికి ముందు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు.

ఆయన పదవీకాలం ముగిసింది. ముత్తిరెడ్డి పదవీ స్వీకార కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలిసారి తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక భాషల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు అడుగులు వేస్తున్నాయి. తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించి ఏపీ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

రెండు సివిల్ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన జస్జిస్ మన్మథరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన రెండు సివిల్ కేసుల విచారణ జరిపింది ఏపీ హైకోర్టు. విచారణ అనంతరం తెలుగులో తీర్పు చదివి వినిపించారు న్యాయమూర్తి మన్మథరావు.

ఇటీవల క్రింది స్థాయి కోర్టులు స్థానిక భాషల్లో ఆదేశాలు ఇవ్వచ్చొని సుప్రీం సూచించింది. ఈనేపథ్యంలోనే ఇష్టపూర్వకంగా తెలుగులో తీర్పు చదివి వినిపించారు న్యాయమూర్తి. తీర్పుకు సంబంధించిన తెలుగు ఆర్డర్ కాపీని వెబ్ సైట్‌లో పెట్టింది హైకోర్టు.

వాస్తవానికి సుప్రీం కోర్టు, హైకోర్టులు తీర్పులను అందరికీ అర్థమయ్యే ఇంగ్లిష్‌లోనే వెలువరించాల్సి ఉంటుంది. సాక్ష్యాధారాలు, ఇతర పత్రాలు స్థానిక భాష లో ఉంటే వాటిని ఇంగ్లిష్‌లోని అనువదించి ధర్మాసనానికి అందించాలి. లేకపోతే సుప్రీం కోర్టు, హైకోర్టుల రిజిస్ట్రీలు పిటిషన్లను స్వీకరించవు. అలాంటిది.. రాష్ట్ర హైకోర్టు చరిత్రలోనే తొలిసారి తెలుగులో తీర్పు చెప్పి, కొత్త చరిత్ర లిఖించారు న్యాయమూర్తి. ఏపీ హైకోర్టు నిర్ణయంపై తెలుగు భాషాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు జైలుకెళ్లడంతో టిడిపి నేతలకు పిచ్చి పట్టింది: మంత్రి రోజా

టిడిపి నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని మంత్రి రోజా తెలిపారు. ఆదివారం బండారుకు రీకౌంటర్ ఇచ్చారు.

న్యాయపరంగా పోరాడతానని, బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలని పిలుపునిచ్చారు. మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. మహిళలను కించపరిస్తే చరిత్రరహీనులుగా మిగిలిపోతారని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడంతో టిడిపి నేతలకు పిచ్చెక్కిందని, బాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారని రోజా విమర్శించారు.

టిడిపి ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికే తనని టార్గెట్ చేశారని, టిడిపి, జనసేనకు దిగజారుడు రాజకీయలు మాత్రమే తెలుసునని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు...

అఫ్గానిస్థాన్ భూకంపంలో రెండు వేలు దాటిన మృతుల సంఖ్య

అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఆదివారం సంభవించిన ప్రకృత్తి విపత్తు కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది.

ఈ విపత్తులో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వీడియాకు వెల్లడించారు.

భూప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో వరుసగా ఏడు సార్లు ప్రకంపనలు రాగా వీటిలో అయిదు తీవ్రస్థాయిలో ఉన్నాయి.

ఈ ప్రమాదంలో ఎన్నో భవనాలు నెలమట్టం అయ్యాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భూకంప కేంద్రమైన హెరాత్‌ జిల్లాలో నాలుగు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..

సూర్యాపేట జిల్లాలో నలుగురు ఎస్సై ల బదిలీలు

సూర్యాపేట జిల్లాలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గం చింతలపాలెం ఎస్సైగా ఎర్రెడ్ల.సైదిరెడ్డిని, నల్గొండ డీ.ఎస్.డీ,డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్,చింతలపాలెంకు బదిలీ చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన సైదిరెడ్డి గతంలో హైదరాబాద్‌లోని చిలకలగూడ సైఫాబాద్ చార్మినార్ సైబర్ క్రైమ్ పని చేసి నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్, నల్గొండ ఎస్.బీ నుంచి చింతలపాలెంకు బదిలీపై వెళ్లనున్నారు.

అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం ఎస్సైగా సూర్యపేట టౌన్ ఎస్సైగా పని చేస్తున్న వై.సైదులు గౌడ్ బదిలీ చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన సైదులు గౌడ్ గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేసి ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి కోదాడ రూరల్ పాలకవీడు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేశారు.

ప్రస్తుతం సూర్యాపేట వన్ టౌన్ నుంచి నాగారం ఎస్సైగా బదిలీపై రానున్నారు. చింతలపాలెం ఎస్సైగా పని చేసిన హరీష్‌రెడ్డిని నాగారం ఎస్సైగా పని చేస్తున్న ముత్తయ్యను సూర్యాపేట వీ.ఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఎలక్షన్ బదిలీలో ఇదే చివరి డీవోగా ఉండవచ్చని సమాచారం.......

Crime news | నల్లగొండ జిల్లాలో దారుణం..గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు

నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు విష్ణు గొంతి కోసి పారిపోయాడు.

గాయపడిన విష్ణును సహచరులు దవాఖానకు తరలించారు. గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మళ్లీ మొదటికొచ్చిన బతుకమ్మ చీరలు లొల్లి

తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ‍్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా లాభం లేకుండా పోతోంది. కనీసం తీసుకున్నట్టు ఫొటోకు ఫోజు ఇవ్వమని బతిమాలితే.. తీరా తీసుకుని వాటిని ఆ నేతల ముందే చింపేస్తూ, కాల్చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని తక్కలపల్లి గ్రామానికి చెందిన మహిళలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశారు.

కేసీఆర్ భార్య గానీ, కోడలు గానీ.. కూతురు కవిత గానీ ఈ చీరలు కట్టుకుంటారా?అంటూ నిలదీస్తున్నారు.

చేనేత చీరలను పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం.. తీరా డామేజీ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు.

కేవలం వంద రూపాయల విలువ చేసే సాధారణ చీరలు పంపిణీ చేశారనీ అన్నారు. క్రైస్తవుల పండగల సమయంలో విందులు ఏర్పాటు చేసి బహుమతులు ఇస్తారని.. ముస్లింలకు ఇఫ్తార్ విందులు, బట్టలు, కుట్టుమిషన్లు ఇస్తారని.. మరి హిందువుల పండగలకు మాత్రం నామమాత్రంగా చీరలు ఇచ్చి సీఎం కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇదిలా ఉంటే.. కొత్తూరు మండలం ఎస్బీపల్లికి చెందిన మహిళలైతే.. బతుకమ్మ చీరలను తీసుకోడానికి కూడా నిరాకరించారు. గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద స్థానిక జడ్పీటీసీ తదితర నాయకులు గ్రామంలో ఉన్న మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

కానీ చీరలు తీసుకోడానికి మహిళలు ముందుకు రాలేదు. చీరలు తీసుకుంటున్నట్లు కనీసం ఫొటో అయిన దిగాలని మహిళలను కొందరు బతిమాలారు. అయితే.. కొందరు మహిళలు తీసుకున్నా.. ఆ చీరలను చూసి నాసిరకంగా ఉన్నాయి అంటూ అక్కడే రోడ్డుపై పడేసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన: హోం మంత్రి

సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ ఐవీఎఫ్‌, సెంటర్‌ను తెలంగాణ సర్కార్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదివారం నాడు హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

పేట్లబూర్జు, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లో కూడా ఐవీఎఫ్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటి ద్వారా ఖరీదైన ట్రీట్మెంట్‌ను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు.

కాగా, రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చెప్పారు.

ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు

ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్‌ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ వెల్లంకి జానకీ తెలిపారు.

తెలంగాణ విద్యారంగంలో అభివృద్ధి చెందింది: మంత్రి జగదీశ్ రెడ్డి

విద్యతోనే జీవితానికి వెలుగు అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితోనే తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్న్నారు. జిల్లాలోని చివ్వెంల మండలంలో ఐలాపురం గ్రామం వద్ద 4.2 కోట్లతో నిర్మించిన టీటీడబ్ల్యూఆర్‌జేసీ బాలికల పాఠశాల, కళాశాలను ఆదివారం మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి విద్యతోనే సాధ్యమని అందుకే కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.

ఏదైనా సమాజంలో వెనుక బాటు తనానికి విద్య లేక పోవడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న కులాల అంతరాలు పోవాలంటే విద్య వళ్లనే సాధ్యమవుతుందని నమ్మిన కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా వెయ్యి గురుకుల పాఠశాలలను నెలకొల్పినారని తెలిపారు.

అందరూ చదువుకునేలా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్, సంత్ సేవాలాల్ ప్రజలను విద్య వైపు మళ్లించే విధంగా పోరాటం చేశారని వారి ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలన్నీ అన్ని జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జెట్పీటీసీ సంజీవ్ నాయక్, గ్రామ సర్పంచ్ బి సునీత, కళాశాల ఆర్సీ కే లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ మంజుల, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు...