NLG: మర్రిగూడెం మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది, నేడు 22వ రోజుకు చేరుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగా రావు లు అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి, మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్ చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు ఐదు లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఆగదని వారు హెచ్చరించారు జరగబోయే ఎన్నికల్లో అంగన్వాడీ ఉద్యోగులు తలుచుకుంటే ప్రస్తుత ప్రభుత్వం కూలిపోక తప్పదని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కాకులవరం రజిత, బొబ్బిలి శోభారాణి, చిట్యాల సువర్ణ, విగ్నేశ్వరి, అనంతలక్ష్మి, శిలువేరు లక్ష్మి, ఉడుతల లక్ష్మి, అరుణ, పద్మ, సులోచన, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA







నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: ఆశా వర్కర్ల సమ్మె శిబిరం వద్ద, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, ఆశాలు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ.. గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందజేశారు. ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ 18,000/- నిర్ణయించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సెప్టెంబర్ 25 నుండి చేస్తున్న ఆశా ల సమ్మె న్యాయమైనదని అన్నారు.
ఆశల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని డిమాండ్ చేశారు.
TS: నేడు గాంధీ జయంతి సందర్భంగా, హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహం ఎదుట కేయూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. పీహెచ్డి అడ్మిషన్ల అవకతవకలపై గత కొద్దిరోజులు కేయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం గాంధీ విగ్రహం ఎదుట చేతులకు సంకెళ్లు, నల్ల రిబ్బన్ లతో నిరసన దీక్ష చేపట్టారు.
11 గంటల లోగా వీసీ, రిజిస్ట్రార్ స్పందించకపోతే 12 గంటలకు ఆత్మార్పణకు పాల్పడుతామని విద్యార్థులు హెచ్చరించారు. అయితే ఆత్మార్పణ చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులను తరలించేందుకు పోలీసులు యత్నించారు. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గాంధీ విగ్రహం దగ్గర ఇనుప సంకెళ్లతో విద్యార్థులు తమను తాము బంధించుకున్నారు. దీంతో కట్టర్లతో ఇనుప సంకెళ్లు తెంచి విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
SB NEWS TELANGANA
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, గాంధీ సెంటర్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ ఎంచుకున్న అహింస మార్గాన్ని, గాంధీ సిద్ధాంతాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ అడుగుజాడల్లో నడవాలని భావితరాల యువతకి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పగిళ్ల హరీష్, పగిళ్ల రాహుల్, మానే ప్రవీణ్, పాక పరమేష్, కుందారపు సాయి, దాసరి విగ్నేష్, పాక శివ, తదితరులు పాల్గొన్నారు
నల్లగొండ జిల్లా: ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. కార్యక్రమంలో మేతరి శంకర్, ఏర్పుల సురేష్, కల్లెట్ల శంకర్, ఏర్పుల నరసింహ, దాసరి నరసింహ, పగిళ్ల యాదయ్య, పాక అంజయ్య, గురుస్వామి, ఏర్పుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్: జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం - హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్లైన్, వరంగల్ - ఖమ్మం - విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్లో నారీశక్తి బిల్లును ఆమోదించుకున్నాం.
తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. రవాణా సదుపాయాలు మెరుగవుతాయని మోదీ అన్నారు. రోడ్డు ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు.
NLG: గత రెండు రోజులుగా మెదక్ జిల్లా సదాశివపేట లో జరుగుతున్న SGF U/19 బాలుర ఫుట్బాల్ పోటీల్లో.. నల్గొండ జిల్లా ఫుట్బాల్ టీం ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ లలో రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, జిల్లా జట్ల పై విజయం సాధించి, పూల్ విన్నర్ గా సెమి ఫైనల్ కు చేరుకుందని జిల్లా జట్టు కోచ్, మేనేజర్లు లింగయ్య నాయక్, మద్ది కరుణాకర్ లు తెలిపారు.
ఈ సందర్భంగా SGF అండర్19 సెక్రెటరీ ఇందిర మరియు ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
SB NEWS NALGONDA DIST
NLG: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గంలో అభివృద్ధి పర్యటనలో భాగంగా.. సోమవారం మునుగోడు మరియు చండూరు మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
SB NEWS NALGONDA DIST
చండూరు: మంత్రుల సమక్షంలో నేడు జరిగిన అంగన్వాడీ ఉద్యోగ సంఘాల చర్చల హామీలు.. రాతపూర్వకంగా ఇచ్చేవరకు సమ్మె యధావిధి గా కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. చండూరు మండల కేంద్రంలో మండల తహసిల్దార్ ఆఫీస్ ముందు జరుగుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ నిరవధిక సమ్మె నేటితో 21వ రోజు కు చేరుకుంది.
ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ.. మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ ఇరువురి సమక్షంలో అంగన్వాడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సిఐటియు, ఏఐటియూసి సంఘాల నాయకులు ఆదివారం మంత్రి నివాసంలో చర్చలు జరపడం జరిగిందని తెలిపారు. చర్చలలో పి ఆర్ సి పరిధిలోకి వచ్చే విధంగా వేతన పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేతనాలు ఎంత పెంచాల్సి ఉంటుందో మరో మారు చర్చిద్దామని అన్నారని తెలిపారు. అయితే వేతన పెంపు ఎంత అని స్పష్టమైన హామీ రాతపూర్వకంగా వచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని బండ శ్రీశైలం తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొమ్మరగోని కిరణ్ అడ్వకేట్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు కేదారి, నాగమణి, సత్తెమ్మ, తారక, మునిసా, రాజేశ్వరి, పార్వతమ్మ, భాగ్యమ్మ, సుజాన, అనంతలక్ష్మి, వెంకటమ్మ, మంగ, కలమ్మ, ఉషారాణి, జగదీశ్వరి, సునీత, ఆయాలు అండాలు, సుగుణమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Oct 02 2023, 15:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.4k