/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని కలిసిన పిడమర్తి రవి Yadagiri Goud
మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని కలిసిన పిడమర్తి రవి

హైదరాబాద్:

హైదరాబాదులోని మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఆర్ దామోదర్ రెడ్డిని గురువారం ఆయన నివాసంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు పెడమర్తి రవి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆర్ దామోదర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని పిడమర్తి రవి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్ దామోదర్ రెడ్డి రాజకీయంగా ఉన్నంత పదవులు చేపట్టి ప్రజలకు మరింత సేవ చేసే ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ నియోజక వర్గం బీసీలకు త్యాగం చేస్తానని మాట తప్పిన వెంకట్ రెడ్డి.

•వెంకట్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ విద్యార్థి సంఘం..

•నల్లగొండలో నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

•బీసీలకు ఇచ్చిన మాట తప్పితే చిత్తుచిత్తుగా ఓడిస్తాం..

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నియోజక వర్గం నుండి నాలుగు పర్యాయాలు గెలుపొంది తదననంతరం ఓడిపోయిన క్రమంలో భువనగిరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొంది మళ్లీ నల్లగొండ నియోజక వర్గం తన సామంతరాజ్యంగా, ఈయన గట్టిన కోట బురుజులా మాట్లాడుతున్నారని ఇలాంటి పద్ధతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ హెచ్చరించారు.

నల్లగొండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ బీసీలకు త్యాగం చేస్తానని చెప్పి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నల్లగొండ పట్టణంలో గడియారం చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం నల్లగొండ పార్లమెంటు పరిధిలో నల్లగొండ నియోజక వర్గాన్ని బీసీలకు త్యాగం చేస్తానని చెప్పి ఈరోజు మాట మార్చి నేనే 50 వేల మెజార్టీతో గెలువబోతున్నానని ప్రగల్బాలు పలకడం బీసీల పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టడంలో వెంకట్ రెడ్డి దిట్ట అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఏనాడు బీసీలపై ప్రేమ లేదన్నారు తన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక జెడ్పిటిసి స్థాయికి ఎదిగితే ఎంపీటీసీగా పోటీ చేయించి ఓడగొట్టిన చరిత్ర కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అన్నారు.

వెంకట్ రెడ్డి కడుపులో కత్తులు పెట్టుకొని భయటికి బీసీల పట్ల జపం చేస్తున్నారని వారన్నారు. భువనగిరి నియోజకవర్గం లాంటి చోట్ల బీసీలను అడ్డం పెట్టుకొని గెలిచే అభ్యర్థులను కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టిన చరిత్ర వెంకట్ రెడ్డి అన్నారు.బట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా కేంద్రానికి పాదయాత్రగా వచ్చిన సందర్భంలో ఆహ్వానం పలికి వేదికపైకి ఎక్కిన డాక్టర్ చెరుకు సుధాకర్ లాంటి ఉద్యమ నేతలను తన అనుచరుల ప్రోద్భలంతో కిందికి దింపించిన దుర్మార్గపు చరిత్ర వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో గాని నల్లగొండ జిల్లాలో గాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సంబంధించిన ఆధిపత్య వర్గాలు కాంగ్రెస్ పార్టీలో ఏనాడు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి బి.సిలను ఎదగనీయలేదు అన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ది నల్లగొండ జిల్లాలో బీసీలను అణిచివేసిన చరిత్రే కానీ ఎదగనిచ్చిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. నకిరేకల్ లాంటి ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో అనేక మందికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇప్పిస్తానని కోట్ల రూపాయలు దండుకున్న రాజకీయ దుర్మార్గుడు ఈయన గారు అన్నారు. అక్కడ గెలిచే అభ్యర్థి పార్టీలోకి వస్తానంటే ఈయన పెత్తనం కోసం అడ్డుకుంటున్నారని వారన్నారు.

గాలి మాటలు మాట్లాడకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నల్లగొండ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ను బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమందరం కలిసి వెంకటరెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడిస్తామని వారన్నారు.

ఈ కార్యక్రమంలోబీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్, మండల యాదగిరి యాదవ్, కొంపల్లి రామన్న గౌడ్ లక్ష్మణ్ యాదవ్, ఉపేందర్ యాదవ్ మహేష్ కుమార్ పృద్వి, శేఖర్, సాయికుమార్, విగ్నేష్ గౌడ్, చింటూ, రమేష్ యాదవ్, లింగస్వామి, ఊరుపక్క సాయి, బొంత రమేష్, చాకలి అంజి. తదితరులు పాల్గొన్నారు.

పార్కింగ్ చేసిన కారులో నుండి ఐదు లక్షలు కొట్టేసిన దొంగలు

నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్ట పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు.

అక్కడి నుండి తన మిత్రులతో కలిసి ఐదు లక్షల క్యాష్ కారులో పెట్టి భోజనం కోసం ఓ రెస్టారెంట్ ముందు కారు పార్కింగ్ చేశారు.

వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

టి ఎస్ ఆర్ టి సి బిల్లుకు గవర్నర్ ఆమోదం

టి ఎస్ ఆర్ టి సి విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.

దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

యువతి విషయంలో గొడవ.. వివాదంలో మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ కుమారుడు!

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్‌ 10లో ఓ పబ్‌ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ యువతి విషయంలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు..

ఈ దాడుల్లో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగ్నమ్ ఉండగా.. మరో వర్గంలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఉన్నట్లు సమాచారం. పబ్‌లో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. కాసేపటి తరువాత బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం.

ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్‌కు గాయాలయ్యాయి. దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు..

kishan reddy: భాజపా రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ నిమ్మరసం ఇచ్చి ఆయన చేత దీక్షను విరమింపజేశారు.

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బుధవారం కిషన్‌రెడ్డి ఇందిరా పార్కు వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు ఆ ప్రాంగణాన్ని చుట్టుముట్టి ఆయన్ని బలవంతంగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ధర్నాచౌక్‌ వద్ద జరిగిన తోపులాటలో కిషన్‌రెడ్డి చేతికి, ఛాతికి గాయాలు కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు.

రాబోయే వంద రోజుల్లో మరిన్ని పోరాటాలు : ప్రకాశ్‌ జావడేకర్‌

నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. దీక్ష నేపథ్యంలో భాజపా కార్యకర్తలు చూపిన తెగువను ఆయన అభినందించారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో భాజపా సత్తా ఏంటో సీఎం కేసీఆర్‌కు చూపించామని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేసినా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. తెలంగాణ యువతను మోసం చేశాననే విషయం కేసీఆర్‌కు తెలుసు కాబట్టే.. భయంతో పోలీసులను పంపించారని దుయ్యబట్టారు. రాబోయే వంద రోజుల్లో కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు..

Chandrababu: చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు..

చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకున్నారు.

పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కంటే ముందు టీడీపీ క్యాంప్ కార్యాలయానికి పవన్‌ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు భార్య భువనేశ్వరితో కొద్దిసేపు పవన్‌ కళ్యాణ్‌ చర్చలు జరిపారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చారు. ఆరు వాహనాల కాన్వాయ్‌తో పవన్ కళ్యాణ్ జైలు వద్దకు చేరుకోగా.. ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని అధికారులు సూచించారు. పవన్‌ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ ప్రయత్నించగా.. ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..

చికెన్ పాక్స్ కొత్త వేరియంట్.. తొలికేసు నమోదు

దేశంలోనే తొలిసారిగా చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ ' క్లాడ్ 9'ను గుర్తించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సైంటిస్టులు వెల్లడించారు.

మంకీపాక్స్ అనుమానిత కేసులను పరిశీలించే క్రమంలో పలువురిలో 'క్లాడ్ 9' వేరియంట్ ను గుర్తించినట్లు తెలిపారు.

యూకే, జర్మనీ, యూఎస్ లో ఈ వేరియంట్ అధికంగా కనిపిస్తుందన్నారు.

'క్లాడ్ 9' సోకిన 2 వారాల తర్వాత దద్దుర్లు, తలనొప్పి, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు.

ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమచారం.

ఈ క్రమంలో అరుణ్ నుంచి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

అరుణ్ రామచంద్రన్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ అభియోగం మోపింది. గత మార్చి 7న ఈడీ అధికారులు పిళ్లైని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారడం ఆసక్తి రేపుతోంది.

వాస్తవానికి అరుణ్‌ పిళ్లై అప్రూవర్‌గా మారడం ఇదేం కొత్త కాదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా మారి స్టేట్‌మెంట్‌ ఇచ్చిన పిళ్లై.. ఆ తర్వాత బలవంతంగా అప్రూవర్ గా మారేలా చేశారంటూ మాట మార్చారు. ఈడీ బలవంతంగా వాంగ్మూలం తీసుకుందని.. అదంతా తప్పంటూ పిళ్లై మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అదేసమయంలో ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలంటూ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఈడీ అధికారులు తన వద్ద బలవంతంగా సంతకం చేయించుకున్నారని.. ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించారని.. అదంతా ఫేక్ అంటూ వివరించారు. అయితే.. తాజాగా పిళ్లై మరోసారి అప్రూవర్‌గా మారి కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇవ్వడం.. సంచలనంగా మారింది.

అయితే, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటి వరకూ అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూపు‌నకు చెందిన వారే ఉన్నారు. దీనిలో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, దినేష్ ఆరోరా ఉండగా.. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు

Pakistan vs Sri Lanka, Super Fours, 5th Match : ఆసియా కప్ 2023 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో టీమిండియాతో ఆడనుంది. దీంతో అందరు కచ్చితంగా పాకిస్తాన్ జట్టు గెలుస్తుందని… అనుకుంటున్నారు.

Sri Lanka XI: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (WK), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (c), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ.

Pakistan XI: మహ్మద్ హారిస్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిమ్ జూనియర్, జమాన్ ఖాన్