/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులకు ఆంక్షలు విధించిన టిటిడి Yadagiri Goud
తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులకు ఆంక్షలు విధించిన టిటిడి

గత రెండు మాసాల్లో అలిపిరి కాలిబాట మార్గంలో రెండు దురదృష్టకర ఘటనలు జరిగాయని సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నడకమార్గంలో గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగాయని చెప్పారు. రెండు నెలలుగా అలిపిరి నడకమార్గంలో నిఘా పెంచామని.. త్వరలోనే అలిపిరి నడకమార్గంలో వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ట్రాప్ కెమెరాల ద్వారా నడక మార్గంలో చిరుత, ఎలుగు బంటిలు సంచరించడాన్ని గుర్తించామన్నారు. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించామని.. ఇంకా ఐదు చిరుతలు సంచరిస్తునట్లు గుర్తించామని చెప్పారు.

వ్యర్థ పదార్ధాల కారణంగానే నడక మార్గంలో జంతు సంచారం పెరిగిందన్నారు. కాలిబాట మార్గంలో ఇరువైపులా 20 మీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని చదును చేశామన్నారు. తద్వారా జంతువుల సంచారాన్ని భక్తులు ముందుగానే గుర్తించి అప్రమత్తం అవుతారన్నారు.

త్వరలోనే అత్యధునాతన టెక్నాలజీతో ఉన్న 500 కెమెరా ట్రాప్‌లను నడకమార్గంలో ఏర్పాటు చేస్తామన్నారు. 130 మంది అటవీ సిబ్బందితో నడకమార్గంలో నిఘా ఉంచామన్నారు. ఘాట్ రోడ్డు, నడక మార్గంలో పలు చోట్ల అండర్ పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నడక, ఘాట్ రోడ్డుల్లో ఆంక్షలు కొనసాగుతాయని సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి స్పష్టం చేశారు...

CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ

అమరావతి: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) సమావేశమయ్యారు.

మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) , వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar reddy), ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు (Intelligence Chief Sitaramanjanulu), ఎఎజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) , తదనంతర పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు..

Balakrishna: నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ

మంగళగిరి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు..

ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు.

''పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? ఛార్జిషీట్‌ ఎందుకు వేయలేదు? ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు..

చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు

జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి.. బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్‌ టెక్‌ సంస్థకు జగన్‌ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్‌.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు ..

చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి బ్రహ్మణి కి ములాఖత్

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన త్వరగా నిద్రపోయారు.

ఈ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆయన వాకింగ్, యోగా చేశారు. అనంతరం న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన సహాయకుడు ఆయనకు అల్పాహారాన్ని అందించాడు.

టిడిపి అధినేత చంద్రబాబు ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ములాఖత్ అనుమతి తీసుకున్నారు. చంద్రబాబు సతీమణి, భువనేశ్వరి కోడలు బ్రహ్మణి లు ఈరోజు మధ్యాహ్నం రాజమండ్రి కి చేరుకోనున్నారు,

వీరికి సాయంత్రం నాలుగు గంటలకు ములాఖత్ కు జైలు అధికారులు అనుమతిచ్చారు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం జరగనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు ను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి వాస్తవాలను వివరించేలా టిడిపి అధిష్టానము కార్యచరణ రూపొందించింది

చంద్రబాబుకు జైల్లో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఒక పత్రేక గదిని ఆయనకు ఇచ్చారు.

చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది...

ఈ నెల 15న ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరుగనున్నది.

ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులందరూ హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

నేడు బిజెపి గూటికి చికోటి ప్రవీణ్ కుమార్

చికోటి ప్రవీణ్ కుమార్‌‌ కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. మంగళవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.

నగరానికి చెందిన ప్రవీణ్ కుమార్ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టి క్రమంగా ఎదిగారు. గతంలో నుంచే హిందుత్వ ఎజెండాతో ఆయన పనిచేస్తున్నారు. పార్టీలో లేకపోయినా బీజేపీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకున్నారు.

స్వ యంగా ఆయన ధర్మ రక్ష పేరిట ఒక హిం దూ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 10 లక్షల మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు దిశగా చికోటి అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ముగింపు వరకు ఈ లక్ష్యాన్ని అధిగమిస్తానని ఆయన చెబుతున్నారు.

బీజేపీలో చేరేందుకు చికోటి ప్రవీణ్ భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి అవకాశం ఇస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపుతున్నారు.

అదే పార్లమెంట్ స్థానం నుంచి అయితే జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తను నివసించేది ఎల్బీనగర్ సెగ్మెంట్ పరిధిలోనే కావడంతో స్థానికంగా పట్టు ఉందని ఆయన అనుకుంటున్నారు.

అలాగే హిందుత్వ, తన సామాజిక వర్గం సపోర్ట్ ఉంటుందని చికోటి భావిస్తున్నారు. జహీరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు హిందువుల ఓట్లు కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏరియాలో హిందువుల ఓట్లు భారీగా ఉండటంతో నే ఆయన ఈ ప్లేస్‌ను ఎంచుకున్నట్లు తెలు స్తోంది.....

తెలంగాణలో త్వరలో సింగరేణి ఎన్నికల షెడ్యూల్

సింగరేణి కార్మిక సంఘాలతో హైదరాబాద్ లో సోమవారం డిప్యూటీ లేబర్ కమిషనర్ సమావేశమయ్యారని, ఇందులో సింగరేణి ఎన్నికలకు సంబంధించి తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలు పట్టుబట్టాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.

ఈ నెల 21న సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లిస్తున్నందున 22వ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని మిగిలిన కార్మిక సంఘాలన్నీ కోరాయని పేర్కొన్నారు.

మెజార్టీ కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈ నెల 22న షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారని, అక్టోబర్ నెలాఖరు లేదా అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ఒక ప్రకటన విడుదల చేశారు.....

అధికార పార్టీ అక్రమ అరెస్టులకు న్యాయం కోసం ప్రజల్లోకి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి?

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ తరుణంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్ పై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, వారిని తప్పుడు కేసులో ఇరికించి వేధిస్తోందని, గడిచిన 24 గంటలుగా ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని ప్రజల వద్దకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ ప్రజల్లోకి వెళ్లే అంశంపై ఇప్పటికే పార్టీలో ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడే సమయంలో సీఐడీ చీఫ్ సంజయ్ నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు పరోక్షంగా చెప్పారు.

ప్రతిపక్ష నేతలను ఎన్నికల సంవత్సరంలో అరెస్ట్ చేయడం సాధారణంగా జరగవు. వారిపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమైతే తమకు నష్టం చేస్తుందని అధికార పార్టీ ఆలోచిస్తుంది.

రాజకీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం ఏదీ ఉండదు. వైఎస్ మరణించిన తర్వాత ప్రజల్లో సానుభూతి అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు వెల్లువలా వచ్చింది. అదే తరహాలో ప్రస్తుతం సానుభూతిని ఉపయోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడంతో ప్రజలు ఇచ్చారని, అదే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోపాటు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటూ వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కితే సానుభూతి వెల్లువలా వస్తుందంటున్నారు. టిడిపికి చెందిన సీనియర్ నాయకులు.

చెంపలు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొడతారా?

అమరావతిలో బడుగు, బలహీన వర్గాల వారి నుండి భూములు

భూముల పక్కనుండి రింగ్ రోడ్ వెళ్లేలా ప్లాన్

స్కిల్ స్కాంకి సూత్రధారి చంద్రబాబే

పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడేనా?

జగన్ కేసులు వేరు, చంద్రబాబు కేసులు వేరు

వ్యక్తిగతంగా మాకు ఎవరి మీదా కోపం లేదు

తాడేపల్లి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబేమీ యుగపురుషుడు కాదని, చేసిన తప్పును ఒప్పుకుని పొరపాటయిందని చెప్పి చెంపలకు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొట్టడమేంటని ప్రశ్నించారు.

అమరావతి పేరుతో అక్రమాలు..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుని రిమాండుకు తరలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పి బడుగు, బలహీన వర్గాల వారి నుండి భూములు దోచుకున్నారన్నారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో కట్టిన టిట్కో ఇళ్ల దగ్గర్నుంచి సెక్రటేరియట్ వరకు అన్నిటిలోనూ దోపిడీ చేశారని తెలిపారు..

Nadendla Manohar: 144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా?: నాదెండ్ల మనోహర్‌

మంగళగిరి: ఏపీలో పోలీసులు వైకాపాకు కొమ్ముకాస్తూ.. తొత్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై చేపట్టిన బంద్ విషయంలో పోలీసులు 144 సెక్షన్ పెట్టారని... కానీ, వైకాపా నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగారని ఆరోపించారు. గుంటూరులో మేయర్ కావటి మనోహర్ నాయుడు పోలీసు లాఠీతో జనసేన కార్యకర్తల్ని బెదిరించటాన్ని తప్పుబట్టారు.

144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుని కుట్రపూరితంగా అరెస్టు చేసింది నిజమేనని.. అందుకే రాష్ట్రంలో ప్రజలు ఇవాళ స్వచ్చందంగా బంద్ పాటించారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ రెడ్డి ఇంటికి పోవటం ఖాయమని నాదెండ్ల దుయ్యబట్టారు.