/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz శ్రీ సీత రామాంజనేయ స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై భారీ విరాళం అందించిన - పిల్లి రామరాజు యాదవ్ Yadagiri Goud
శ్రీ సీత రామాంజనేయ స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై భారీ విరాళం అందించిన - పిల్లి రామరాజు యాదవ్

నేడు కనగల్ మండలం బుడమర్లపల్లి గ్రామంలో పరిధిలోని నూతనంగా శ్రీ సీత రామాంజనేయు స్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి తెరాస రాష్ట్ర నాయకులు,RKS ఫౌండేషన్ ఛైర్మెన్ - పిల్లి రామరాజు యాదవ్ గారు. హాజరై తమ RKS ఫౌండేషన్ ద్వారా 1,00,116/- (లక్ష నూట పదహారు రూపాయల ) విరాళంగా అందజేశారు..

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారింగు పార్వతమ్మ - జానయ్య ఎంపీటీసీ యెరెడ్ల సరస్వతి సుధాకర్ రెడ్డి ఉప సర్పంచ్ మామిడాలా శివ PACS వైస్ చైర్మన్ కారింగు లక్ష్మయ్య ఆలయ చైర్మన్ చెదురుపెల్లి సైదులు BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కందుల రమేష్ వార్డ్ సభ్యులు కందుల ప్రవీణ్ అనుముల సుధాకర్ బొడ్డుపల్లి శ్రీను కారింగు నర్సింహా మామిడాల నర్సింహా పంతంగి సైదులు కారింగు వినోద్ బోయపల్లి నాగరాజు నకిరేకంటి రాము పంతంగి నగేష్ పంతంగి కార్తీక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు మహిళ న్యాయమూర్తి కి రోడ్డు ప్రమాదం: స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి

మంత్రి జగదీశ్‌ రెడ్డి సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది.

ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత ప్రయాణిస్తున్న వాహనం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో జస్టిస్‌ సుజాత తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రథమ చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు.

అదే సమయంలో తిరుమలగిరిలో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీశ్‌ రెడ్డి విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. న్యాయమూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో.. వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు.

సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేలా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఓ వైపు జోరు వాన కురుస్తుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా జస్టిస్‌ సుజాతను తరలిస్తున్న అంబులెన్స్‌ను తన కాన్వాయ్ మధ్యలో ఉంచి గంట 15 నిమిషాల్లో హైదరాబాద్‌ తరలించారు.

దగ్గరుండి ఆమెను దవాఖానలో చేర్పించారు. ప్రస్తుతం జస్టిస్‌ సుజాత ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సకాలంలో న్యాయమూర్తిని హైదరాబాద్ తరలించడం మంచి పరిణయం అని వైద్యుడు తెలిపారు...

Rahul Gandhi: మేం పెట్టిన పేరు చిరాకు పుట్టిస్తుందేమో..?: కేంద్రానికి రాహుల్‌ కౌంటర్‌

పారిస్‌: కేంద్రం 'ఇండియా' పేరును మారుస్తుందంటూ వస్తోన్న ఊహాగానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రతిపక్షాల కూటమికి 'ఇండియా' పేరు పెట్టడం వల్ల ప్రభుత్వం చిరాకుపడి ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు.‌

ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన.. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

''రాజ్యాంగం.. రెండు పేర్లను వాడుతోంది. అందులో 'ఇండియా, భారత్‌' అని ఉంటుంది. ఈ పేర్ల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. ఆ రెండు పేర్లు ఆమోదయోగ్యమైనవి. అయితే మా కూటమికి ఇండియా పేరు పెట్టి.. మేం ప్రభుత్వాన్ని చిరాకుకు గురిచేసి ఉండొచ్చు. అదే పేరు మార్చాలనే వారి నిర్ణయానికి దారి తీసి ఉండొచ్చు' అంటూ రాహుల్(Rahul Gandhi) చిరునవ్వు చిందించారు.

శని, ఆదివారాలు భారత్‌ జీ20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించింది. దానిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అతిథులకు పంపిన ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించడంతో ఈ పేరు మార్పు అంశంపై చర్చ మొదలైంది.

అలాగే జీ20 సదస్సు(G20 Summit)లోనూ కేంద్రం భారత్‌పేరునే ఉపయోగించింది. ఈ సమావేశంలో మోదీ కూర్చున్న స్థానం వద్ద నామఫలకంపై మన దేశం పేరును 'భారత్‌'గానే పేర్కొన్నారు. అంతేకాదు సదస్సును ప్రారంభిస్తూ.. ప్రధాని మోదీ కూడా 'భారత్‌ మీకు స్వాగతం పలుకుతోంది' అని వ్యాఖ్యానించారు.

Supreme Court: సునీత విజ్ఞప్తి.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా పడింది..

అనివార్య కారణాల నేపథ్యంలో వాయిదా వేయాలంటూ వివేకా కుమార్తె, పిటిషనర్‌ సునీత నర్రెడ్డి తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది.

అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇస్తూ ఈ ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ కన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కొన్ని అనివార్య కారణాల రీత్యా కేసు విచారణను వాయిదా వేయాలని సునీత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. ఆ తర్వాత నాన్‌ మిస్లేనియస్‌ డే రోజు విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది..

నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్తో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

స్టోర్ రూమ్లో చెలరేగిన మంటలు ఇతర వార్డులకు వెంట వెంటనే వ్యాపించాయి. స్టోర్ రూమ్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలు వ్యాపించడంతో వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చిన్నారులతో సహా తల్లులు బయటకు పరుగులు తీశారు.

పొగ దట్టంగా అలుముకోవడంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే పొగ బయటకు పోయేలా కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగ వల్ల గొంతులో మంట పుడుతోందని చెప్పారు...

ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే: చట్టపరమైన చర్యలు

గణేశ్‌ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్‌ పోలీసులు సోషల్‌మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదంగా భావించిన పోలీసులు..

ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు సోషల్‌ మీడియా యాక్షన్‌ టీమ్‌ స్మాష్‌ పర్యవేక్షిస్తుంది. ప్రశాంతతను భంగం కల్గించే పోస్టులను గుర్తించి వాటిని వెంటనే తొలగించడంతో పాటు పోస్టు చేసిన వారిని పట్టుకుంటున్నారు.

గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జనోత్సవ ర్యాలీకి హైదరాబాద్‌ పోలీసులు 20 వేలకుపైగా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. పటిష్టమైన బందోబస్తును, పీస్‌ కమిటీ సమావేశాలతో ప్రజల్లో ఐక్యత చెదరకుండా చేస్తూ సోదర భావంతో వేడుకలు పూర్తయ్యే విధంగా చేస్తుంటారు.

కాని కొందరు తప్పుడు వార్తలు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ వాటిని సర్క్యూలేట్‌ చేసి, ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడమే కాకుండా, అలాంటి వాటితో శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో సోషల్‌మీడియాపై పోలీసులు నిరంతరం ఫోకస్‌ పెడుతున్నారు...........

మాజీమంత్రి పరిటాల సునీత హౌస్ అరెస్ట్: మోహరించిన పోలీసులు

మాజీ మంత్రి పరిటాల సునీతను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

పోలీసు నిర్బంధాన్ని దాటుకొని మరీ సునీత బయటికి వచ్చారు. టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ నిర్వహించారు.

పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ పరిటాల సునీత ముందుకు దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు....

సమ్మెకు వెళ్లడం లేదని ప్రకటించిన: అంగన్ వాడీ యూనియన్ నాయకులు

రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేశారు.

ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మినీ అంగన్‌వాడీ టీచర్లు ఎలాంటి సమ్మెలో పాల్గొనడం లేదని తేల్చిచెప్పారు. ఎవరూ ధర్నాలకు, సమ్మెకు వెళ్లొద్దని ఆమె పిలుపునిచ్చారు. కొన్ని యూనియన్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

త్వరలో అప్‌గ్రేడ్‌ జీవోను విడుదల చేస్తామన్న అధికారుల హామీని తాము పూర్తిగా నమ్ముతామని స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీచేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు...

బంద్ కు పిలుపునిచ్చిన టిడిపి:144 సెక్షన్ విధించిన పోలీసులు

స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో తెలుగుదేశం పార్టీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చింది.

ప్రతి మండల కేంద్రంలోనూ ఆదివారం సాయంత్రం నుంచే దీన్ని అమలు చేయాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడా ర్యాలీలు, నిరసనలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఏపీఎస్పీ పోలీసులను అవసరం మేరకు వినియోగించుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎస్పీలకు సూచించినట్లు తెలిసింది.

ఆదివారం ఉదయం చంద్రబాబును విజయవాడ కోర్టుకు తీసుకెళ్లినప్పటి నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో అలర్టయ్యారు. విజయవాడ పోలీసులు కోర్టు పరిసరాలను పూర్తిగా అదుపులోకి తీసుకోవడంతోపాటు టీడీపీ నేతల ఇళ్లు, ప్రధాన కూడళ్లలో మోహరించారు.

అదే సమయంలో ప్రతిపక్ష నేతను జైలుకు తరలిస్తే ఎటువంటి భద్రతా సమస్యల్లేకుండా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు...

ఘోల్లుమంటున్న బంతిపూలు: గిట్టుబాటు ధర లేక రైతన్న దిగులు

మన రాష్ట్రంలో బంతిపూలకు ప్రత్యేకత ఉంది. ఏ వ్రతమైనా, ఏ పూజకైనా మొదటగా గుర్తుకు వచ్చేది బంతిపూలే కావటం విశేషం. అందునా శ్రావణమాసం ప్రారంభం కావటంతో పండుగలు, శుభకార్యాలు వరస పెట్టి జరుగుతుండటంతో ఏడాది పొడవునా బంతిపూల సాగు చేసిన రైతులు అధిక లాభాలు పొందొచ్చని ఆశపడ్డారు.

ఇప్పుడు ఆ ఆశ నిరాశే అయ్యింది. కిలో రూ 5 రూపాయలకు మించి ధ‌ర రాక‌పోవ‌డంతో రైతుల్లో కలవరం మొదలయ్యింది. లాభాల మాట అటుంచితే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా రాదోసన్న అనుమానంతో రైతుల కలవరపాటుకు లోనవుతున్నారు.

విజయవాడ పూలమార్కెట్లో శనివారం బంతిపూల ధర కిలో ఐదు రూపాయలు పలికింది. గత నాలుగు రోజుల నుంచే పది రూపాయలుగా ఉన్న ధరలు శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఐదు రూపాయలకు పడిపోయాయి.

దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మకానికి తీసుకువచ్చిన బంతి పూలను రైతులు విజయవాడ మార్కేట్ వద్ద రోడ్లపై పడేసి నిరాశగా వెనుతిరిగారు. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా బాడుగ కూడా రాకపోవటంతో కన్నీటి పర్యంతం అయ్యారు. నంద్యాల, మహానంది. కర్నూలు జిల్లా నుంచి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు ఉసూరుమన్నారు. ఇటువంటి ధరలు ఎప్పుడూ చూడలేదని పలువురు పూలవ్యాపారులు తెలిపారు. శ్రావణమాసం అందులోనూ చివరి శుక్రవారం పూలకు గిరాకీ ఉంటదని భావించి పెద్ద ఎత్తున విజయవాడ మార్కెట్ కి బంతిపూలను తీసుకువచ్చిన రైతులు వ్యాపారులు నిరాశగా వెనుదిరిగారు...