/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం Yadagiri Goud
నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్తో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

స్టోర్ రూమ్లో చెలరేగిన మంటలు ఇతర వార్డులకు వెంట వెంటనే వ్యాపించాయి. స్టోర్ రూమ్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలు వ్యాపించడంతో వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చిన్నారులతో సహా తల్లులు బయటకు పరుగులు తీశారు.

పొగ దట్టంగా అలుముకోవడంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే పొగ బయటకు పోయేలా కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగ వల్ల గొంతులో మంట పుడుతోందని చెప్పారు...

ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే: చట్టపరమైన చర్యలు

గణేశ్‌ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్‌ పోలీసులు సోషల్‌మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదంగా భావించిన పోలీసులు..

ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు సోషల్‌ మీడియా యాక్షన్‌ టీమ్‌ స్మాష్‌ పర్యవేక్షిస్తుంది. ప్రశాంతతను భంగం కల్గించే పోస్టులను గుర్తించి వాటిని వెంటనే తొలగించడంతో పాటు పోస్టు చేసిన వారిని పట్టుకుంటున్నారు.

గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జనోత్సవ ర్యాలీకి హైదరాబాద్‌ పోలీసులు 20 వేలకుపైగా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. పటిష్టమైన బందోబస్తును, పీస్‌ కమిటీ సమావేశాలతో ప్రజల్లో ఐక్యత చెదరకుండా చేస్తూ సోదర భావంతో వేడుకలు పూర్తయ్యే విధంగా చేస్తుంటారు.

కాని కొందరు తప్పుడు వార్తలు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ వాటిని సర్క్యూలేట్‌ చేసి, ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడమే కాకుండా, అలాంటి వాటితో శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో సోషల్‌మీడియాపై పోలీసులు నిరంతరం ఫోకస్‌ పెడుతున్నారు...........

మాజీమంత్రి పరిటాల సునీత హౌస్ అరెస్ట్: మోహరించిన పోలీసులు

మాజీ మంత్రి పరిటాల సునీతను తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

పోలీసు నిర్బంధాన్ని దాటుకొని మరీ సునీత బయటికి వచ్చారు. టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ నిర్వహించారు.

పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ పరిటాల సునీత ముందుకు దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు....

సమ్మెకు వెళ్లడం లేదని ప్రకటించిన: అంగన్ వాడీ యూనియన్ నాయకులు

రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్‌వాడీలను ఎలాంటి షరతులు లేకుండా ప్రధాన అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ దశలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలంగాణ మినీ అంగన్‌వాడీ టీచర్స్‌ అసోసియేషన్‌ బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి స్పష్టం చేశారు.

ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మినీ అంగన్‌వాడీ టీచర్లు ఎలాంటి సమ్మెలో పాల్గొనడం లేదని తేల్చిచెప్పారు. ఎవరూ ధర్నాలకు, సమ్మెకు వెళ్లొద్దని ఆమె పిలుపునిచ్చారు. కొన్ని యూనియన్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

త్వరలో అప్‌గ్రేడ్‌ జీవోను విడుదల చేస్తామన్న అధికారుల హామీని తాము పూర్తిగా నమ్ముతామని స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీచేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని తెలిపారు...

బంద్ కు పిలుపునిచ్చిన టిడిపి:144 సెక్షన్ విధించిన పోలీసులు

స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో తెలుగుదేశం పార్టీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకొచ్చింది.

ప్రతి మండల కేంద్రంలోనూ ఆదివారం సాయంత్రం నుంచే దీన్ని అమలు చేయాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడా ర్యాలీలు, నిరసనలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఏపీఎస్పీ పోలీసులను అవసరం మేరకు వినియోగించుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎస్పీలకు సూచించినట్లు తెలిసింది.

ఆదివారం ఉదయం చంద్రబాబును విజయవాడ కోర్టుకు తీసుకెళ్లినప్పటి నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో అలర్టయ్యారు. విజయవాడ పోలీసులు కోర్టు పరిసరాలను పూర్తిగా అదుపులోకి తీసుకోవడంతోపాటు టీడీపీ నేతల ఇళ్లు, ప్రధాన కూడళ్లలో మోహరించారు.

అదే సమయంలో ప్రతిపక్ష నేతను జైలుకు తరలిస్తే ఎటువంటి భద్రతా సమస్యల్లేకుండా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు...

ఘోల్లుమంటున్న బంతిపూలు: గిట్టుబాటు ధర లేక రైతన్న దిగులు

మన రాష్ట్రంలో బంతిపూలకు ప్రత్యేకత ఉంది. ఏ వ్రతమైనా, ఏ పూజకైనా మొదటగా గుర్తుకు వచ్చేది బంతిపూలే కావటం విశేషం. అందునా శ్రావణమాసం ప్రారంభం కావటంతో పండుగలు, శుభకార్యాలు వరస పెట్టి జరుగుతుండటంతో ఏడాది పొడవునా బంతిపూల సాగు చేసిన రైతులు అధిక లాభాలు పొందొచ్చని ఆశపడ్డారు.

ఇప్పుడు ఆ ఆశ నిరాశే అయ్యింది. కిలో రూ 5 రూపాయలకు మించి ధ‌ర రాక‌పోవ‌డంతో రైతుల్లో కలవరం మొదలయ్యింది. లాభాల మాట అటుంచితే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా రాదోసన్న అనుమానంతో రైతుల కలవరపాటుకు లోనవుతున్నారు.

విజయవాడ పూలమార్కెట్లో శనివారం బంతిపూల ధర కిలో ఐదు రూపాయలు పలికింది. గత నాలుగు రోజుల నుంచే పది రూపాయలుగా ఉన్న ధరలు శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఐదు రూపాయలకు పడిపోయాయి.

దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మకానికి తీసుకువచ్చిన బంతి పూలను రైతులు విజయవాడ మార్కేట్ వద్ద రోడ్లపై పడేసి నిరాశగా వెనుతిరిగారు. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా బాడుగ కూడా రాకపోవటంతో కన్నీటి పర్యంతం అయ్యారు. నంద్యాల, మహానంది. కర్నూలు జిల్లా నుంచి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు ఉసూరుమన్నారు. ఇటువంటి ధరలు ఎప్పుడూ చూడలేదని పలువురు పూలవ్యాపారులు తెలిపారు. శ్రావణమాసం అందులోనూ చివరి శుక్రవారం పూలకు గిరాకీ ఉంటదని భావించి పెద్ద ఎత్తున విజయవాడ మార్కెట్ కి బంతిపూలను తీసుకువచ్చిన రైతులు వ్యాపారులు నిరాశగా వెనుదిరిగారు...

దేశంలోనే తెలంగాణ హోంగార్డులకు ఆర్థిక అభివృద్ధి

హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ సర్కారు పోలీసులతో సమానంగా హోంగార్డులకు భద్రత కల్పిస్తున్నది.

ఈ విషయం తెలిసి కూడా కళ్లుండి చూడలేని కబోదుల్లా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకించి బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో హోంగార్డు వ్యవస్థలను పర్మినెంట్‌ చేయకపోయినా.. తెలంగాణలో మాత్రం వెంటనే ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిస్సిగ్గుగా హోంగార్డులను రెచ్చగొడుతున్నారు.

ఇక వేతనాల విషయంలోనూ తెలంగాణ కంటే మెరుగ్గా బీజీపీ, కాంగ్రెస్‌ పాలిత వేతనాల విషయంలో ఒక్క పుదుచ్చేరి మినహా ఏ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేదు. పోలీసులతో సమానంగా నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల సీఎం కేసీఆర్‌, పోలీసుశాఖ ఉదారంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఎన్నో ఏండ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు.

2014లో రూ.9 వేలు.. నేడు రూ.27 వేలు

ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు కేవలం రూ. 6 వేల జీతం మాత్రమే వచ్చేది. 2014 వరకూ వారి వేతనం రూ. 9 వేలే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్‌ మానావతా దృక్పథంతో 2014 డిసెంబర్‌ 5న హోంగార్డుల జీతాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

పెంచిన జీతాలను 2015 ఏప్రిల్‌ నుంచి అమలు చేశారు. నెలకు రెండుసార్లు పరేడ్‌ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28ని రూ.100కు పెంచారు. ఆదివారాలు కూడా సెలవు లేకుండా, పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల వేతనాన్ని 2017 డిసెంబర్‌ 13న రూ.12 వేల నుంచి రూ.21 వేలకు పెంచారు.

మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి 30 శాతం పీఆర్సీ ఇవ్వడంతో.. వేతనాలు అనూహ్యంగా రూ. 27 వేలకు పెరిగాయి. దీంతో 16 వేలకు పైగా హోంగార్డు కుటుంబాలు నేడు స్వరాష్ట్రంలో సగౌరవంగా జీవిస్తున్నాయి....

ఏసీబీ కోర్టుకు చంద్రబాబు

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ కు సంబంధించి ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టుకు త‌ర‌లించింది. భారీ భ‌ద్ర‌త మ‌ధ్య వాదోప‌వాదన‌లు కొన‌సాగుతున్నాయి.

చంద్ర‌బాబు నాయుడు ఆనాడు సీఎం హోదాను అడ్డం పెట్టుకుని అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది. మొత్తం కీల‌క‌మైన వ్యాఖ్య‌లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ప‌లు సెక్ష‌న్ల కింద చంద్ర‌బాబు నాయుడుపై కేసులు న‌మోదు చేశారు.

చంద్ర‌బాబు నాయుడు పీఏ శ్రీ‌నివాస్ కు, త‌న‌యుడు నారా లోకేష్ కు కిలారి రాజేష్ కు ముడుపులు ముట్టాయ‌ని పేర్కొంది, ఏపీ సీఐడీ. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు త‌ర‌పున ఇద్ద‌రు అడ్వొకేట్లు వాదిస్తున్నారు.

ప్ర‌ధానంగా ఢిల్లీ నుంచి వ‌చ్చిన ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్దార్థ్ లూత్రా 409వ సెక్ష‌న్ కింద ఎలా న‌మోదు చేస్తారంటూ త‌న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా న‌మోదు చేయ‌డం స‌బ‌బు కాద‌ని పేర్కొన్నారు.

క‌నీసం సాక్ష్యం లేకుండా ఏపీ సీఐడీ కావాల‌ని చంద్ర‌బాబు నాయుడిపై కేసు న‌మోదు చేసింద‌ని ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

ఏపీ సీఐడీ త‌ర‌పు లాయ‌ర్లు. ప‌క్కా ఆధారాల‌తోనే తాము కేసు న‌మోదు చేశామ‌ని, ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు రిమాండ్ రిపోర్టులో ఉన్నాయ‌ని పేర్కొన్నారు...

స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చంద్రబాబుకు సిఐడి ప్రశ్నల వర్షం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు.

ఇవాళ ఉదయం నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నా పోలీసులు.. సుమారు తొమ్మిది గంటల ప్రయాణం అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడ సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు.. చంద్రబాబును విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో నిధులు మళ్లింపుపై దాదాపు గంటకు పైగా అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక, విచారణ అనంతరం మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఆయనను విజయవాడ ఏసీబీలో కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు...

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన AICC

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ శనివారం కమిటీలను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.

వంశీ చంద్ రెడ్డి, E, కొమురయ్య , జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిడ్ల శ్రీనివాస్ , జగన్లాల్ నాయక్, సుప్రభాత్ రావు, భారత్ చవాన్, ఫక్రుద్దీన్‌ను నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది.

మేనిఫెస్టో కమిటీ

మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మేనిఫెస్టో వైస్ చైర్మన్ గా గడ్డం ప్రసాద్‌ను నియమించారు

దామోదర రాజనర్సింహ,

పూనాల లక్ష్మై, బలరాం నాయక్,

ఆర్ దామోధర్ రెడ్డి,

జి. చిన్నా రెడ్డి,

సంభాని చంద్రశేఖర్,

పోట్ల నాగేశ్వరరావు,

రమేష్ ముదిరాజ్,

ఒబైదుల్లా కొత్వాల్,

తాహెర్ బిన్ హమ్దాన్, యర్రా శేఖర్,

జి నాగయ్యా,

జి. సుజాత,

రవళి రెడ్డి,

కె. వెంకట స్వామి,

మర్రి ఆదిత్య రెడ్డిని ఎంపిక చేశారు..