/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz దేశంలోనే తెలంగాణ హోంగార్డులకు ఆర్థిక అభివృద్ధి Yadagiri Goud
దేశంలోనే తెలంగాణ హోంగార్డులకు ఆర్థిక అభివృద్ధి

హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ సర్కారు పోలీసులతో సమానంగా హోంగార్డులకు భద్రత కల్పిస్తున్నది.

ఈ విషయం తెలిసి కూడా కళ్లుండి చూడలేని కబోదుల్లా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకించి బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో హోంగార్డు వ్యవస్థలను పర్మినెంట్‌ చేయకపోయినా.. తెలంగాణలో మాత్రం వెంటనే ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిస్సిగ్గుగా హోంగార్డులను రెచ్చగొడుతున్నారు.

ఇక వేతనాల విషయంలోనూ తెలంగాణ కంటే మెరుగ్గా బీజీపీ, కాంగ్రెస్‌ పాలిత వేతనాల విషయంలో ఒక్క పుదుచ్చేరి మినహా ఏ రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేదు. పోలీసులతో సమానంగా నిత్యం విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల పట్ల సీఎం కేసీఆర్‌, పోలీసుశాఖ ఉదారంగా వ్యవహరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఎన్నో ఏండ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు.

2014లో రూ.9 వేలు.. నేడు రూ.27 వేలు

ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు కేవలం రూ. 6 వేల జీతం మాత్రమే వచ్చేది. 2014 వరకూ వారి వేతనం రూ. 9 వేలే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్‌ మానావతా దృక్పథంతో 2014 డిసెంబర్‌ 5న హోంగార్డుల జీతాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

పెంచిన జీతాలను 2015 ఏప్రిల్‌ నుంచి అమలు చేశారు. నెలకు రెండుసార్లు పరేడ్‌ అలవెన్సు పేరిట ఇస్తున్న రూ. 28ని రూ.100కు పెంచారు. ఆదివారాలు కూడా సెలవు లేకుండా, పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల వేతనాన్ని 2017 డిసెంబర్‌ 13న రూ.12 వేల నుంచి రూ.21 వేలకు పెంచారు.

మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి 30 శాతం పీఆర్సీ ఇవ్వడంతో.. వేతనాలు అనూహ్యంగా రూ. 27 వేలకు పెరిగాయి. దీంతో 16 వేలకు పైగా హోంగార్డు కుటుంబాలు నేడు స్వరాష్ట్రంలో సగౌరవంగా జీవిస్తున్నాయి....

ఏసీబీ కోర్టుకు చంద్రబాబు

ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ కు సంబంధించి ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టుకు త‌ర‌లించింది. భారీ భ‌ద్ర‌త మ‌ధ్య వాదోప‌వాదన‌లు కొన‌సాగుతున్నాయి.

చంద్ర‌బాబు నాయుడు ఆనాడు సీఎం హోదాను అడ్డం పెట్టుకుని అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది. మొత్తం కీల‌క‌మైన వ్యాఖ్య‌లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ప‌లు సెక్ష‌న్ల కింద చంద్ర‌బాబు నాయుడుపై కేసులు న‌మోదు చేశారు.

చంద్ర‌బాబు నాయుడు పీఏ శ్రీ‌నివాస్ కు, త‌న‌యుడు నారా లోకేష్ కు కిలారి రాజేష్ కు ముడుపులు ముట్టాయ‌ని పేర్కొంది, ఏపీ సీఐడీ. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు త‌ర‌పున ఇద్ద‌రు అడ్వొకేట్లు వాదిస్తున్నారు.

ప్ర‌ధానంగా ఢిల్లీ నుంచి వ‌చ్చిన ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్దార్థ్ లూత్రా 409వ సెక్ష‌న్ కింద ఎలా న‌మోదు చేస్తారంటూ త‌న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా న‌మోదు చేయ‌డం స‌బ‌బు కాద‌ని పేర్కొన్నారు.

క‌నీసం సాక్ష్యం లేకుండా ఏపీ సీఐడీ కావాల‌ని చంద్ర‌బాబు నాయుడిపై కేసు న‌మోదు చేసింద‌ని ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

ఏపీ సీఐడీ త‌ర‌పు లాయ‌ర్లు. ప‌క్కా ఆధారాల‌తోనే తాము కేసు న‌మోదు చేశామ‌ని, ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు రిమాండ్ రిపోర్టులో ఉన్నాయ‌ని పేర్కొన్నారు...

స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చంద్రబాబుకు సిఐడి ప్రశ్నల వర్షం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలోని సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించారు.

ఇవాళ ఉదయం నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్నా పోలీసులు.. సుమారు తొమ్మిది గంటల ప్రయాణం అనంతరం విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు.

ఇవాళ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడ సీఐడీ సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు.. చంద్రబాబును విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో నిధులు మళ్లింపుపై దాదాపు గంటకు పైగా అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక, విచారణ అనంతరం మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఆయనను విజయవాడ ఏసీబీలో కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు...

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన AICC

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ శనివారం కమిటీలను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.

వంశీ చంద్ రెడ్డి, E, కొమురయ్య , జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిడ్ల శ్రీనివాస్ , జగన్లాల్ నాయక్, సుప్రభాత్ రావు, భారత్ చవాన్, ఫక్రుద్దీన్‌ను నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది.

మేనిఫెస్టో కమిటీ

మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మేనిఫెస్టో వైస్ చైర్మన్ గా గడ్డం ప్రసాద్‌ను నియమించారు

దామోదర రాజనర్సింహ,

పూనాల లక్ష్మై, బలరాం నాయక్,

ఆర్ దామోధర్ రెడ్డి,

జి. చిన్నా రెడ్డి,

సంభాని చంద్రశేఖర్,

పోట్ల నాగేశ్వరరావు,

రమేష్ ముదిరాజ్,

ఒబైదుల్లా కొత్వాల్,

తాహెర్ బిన్ హమ్దాన్, యర్రా శేఖర్,

జి నాగయ్యా,

జి. సుజాత,

రవళి రెడ్డి,

కె. వెంకట స్వామి,

మర్రి ఆదిత్య రెడ్డిని ఎంపిక చేశారు..

గంగులకు అసమ్మతిసెగ ❓️

కరీంనగర్‌లో వరుసగా నాలుగోసారి విజయం కోసం కష్టపడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌కు సొంత పార్టీ లీడర్ల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతున్నది.

ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఇదే అతి పెద్ద సమస్యగా మారుతున్నది. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రస్తుత మేయర్ సునీల్ రావు వర్గం.. మంత్రి విజయం కోసం పనిచేస్తారా? అని ఓపెన్‌గానే డిస్కర్షన్ జరుగుతున్నాయి. ఒక్క పార్టీకి చెందినవారే కావడంతో స్వయంగా వారి నుంచి ఎలాంటి నెగెటివ్ రావడంలేదు.

కానీ చాపకింద నీరులా గ్రౌండ్ వర్క్ మాత్రం గంగులకు వ్యతిరేకంగా జరుగుతున్నదని టాక్. మంత్రికి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లు స్థానికంగా చేసిన పలు అభివృద్ది పనుల్లో నాణ్యత లేవనేది ఓపెన్ టాక్. మంత్రికి ఈ సంగతి తెలిసినా నివారణ చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. నిఘా వర్గాలు దీన్ని గుర్తించాయి.....

కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ అరెస్ట్..?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ వద్ద తోడుదొంగలు’అనే పోస్టర్ ప్రచారం సందర్భంగా ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోన్నది.

గోడలకు పోస్టర్లు అతికించే సమయంలో అనుమతి లేదంటూ అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తోడు దొంగలు అనే పోస్టర్‌ను ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, డీసీసీ సమీరుల్లా తదితరులు పాల్గొన్నారు.......

కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు

ఎన్టీఆర్ జిల్లా: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కాసేపట్లో ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది..

ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ సివిల్‌ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్‌ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్‌ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. ఇప్పటికే కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుని 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది..

మహిళల భద్రతకోసం "షీ టీం"కొత్త ఫోన్ నెంబర్లు

తెలంగాణలో విద్యార్థినులు, మహిళల భద్రతకోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. షి-టీమ్స్ ద్వారా ఈవ్ టీజింగ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది.

ఆ దిశగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో రెండు నెెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని, ఫోన్ లో ఫీడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీస్ అధికారులు.

తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్‌ ద్వారా నూతన నెంబర్లను వెల్లడించింది.

ఫోన్ ద్వారా 8712656858

వాట్సప్ ద్వారా 8712656856

TS News: తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరం: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు..

ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని భాజపా 25 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, నేటి భారాస ప్రభుత్వంగానీ.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఈ విషయంలో భాజపా రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

గతేడాది సెప్టెంబర్ 17న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌'లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా 'తెలంగాణ విమోచన ఉత్సవాలను' నిర్వహించామని కిషన్‌రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తెలంగాణలో త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. గత ఏడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఎందుకు జరపలేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించడం లేదని ఆరోపించారు..

నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెట్‌ హాల్‌టికెట్లు.. ఈ నెల 15న పరీక్ష

టీఎస్‌ టెట్‌ హాల్‌టికెట్లు నేడు విడుదల కానున్నాయి. నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచనున్నది. ఈనెల 15న టెట్‌ పరీక్ష జరుగునుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు.

ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.inలో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

టెట్‌కు 20 శాతం వెయిటీ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్‌ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్‌ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు...