/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Hyderabad: నా భర్తపై వాళ్లిద్దరూ పెట్రోల్‌ పోసి తగులబెట్టారు: హోంగార్డు భార్య Yadagiri Goud
Hyderabad: నా భర్తపై వాళ్లిద్దరూ పెట్రోల్‌ పోసి తగులబెట్టారు: హోంగార్డు భార్య

హైదరాబాద్‌: తన భర్త 17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించారని మృతిచెందిన హోంగార్డు రవీందర్‌ భార్య సంధ్య అన్నారు. రవీందర్‌పై ఏఎస్సై నర్సింగ్‌రావు, కానిస్టేబుల్‌ చందు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని ఆమె ఆరోపించారు..

దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రవీందర్‌ ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి డేటా డిలీట్‌ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు. తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆరోపించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు..

రవీందర్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతడిని హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సంధ్యతో పాటు కుటుంబసభ్యులు ఉదయం 9 గంటల నుంచి ఉస్మానియా ఆస్పత్రి ఓపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రవీందర్‌ భార్య ఆందోళనకు మరికొందరు హోంగార్డులు మద్దతు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సంధ్యతో చర్చించారు. ఉస్మానియాలో అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారికి ఇబ్బంది ఎదురవుతోందని.. ఆందోళన విరమించాలని సీఐ కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. రవీందర్‌పై పెట్రోల్‌ పోసి తగులబెట్టారని.. ఆ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు..

ఎమ్మెల్సీ కవిత పోరాటంతో కేంద్రంలో కదలిక: ఎంపీ ఆర్‌ కృష్ణయ్య ప్రశంస

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రంలో కదలిక రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన కారణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య ప్రశంసించారు. ఆమె వల్లే దేశంలోని రాజకీయ పార్టీలు ఆ బిల్లుపై పట్టుబడుతున్నాయని చెప్పారు.

గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూనే ఆమెను అభినందిస్తున్నామని కృష్ణయ్య తెలిపారు.

మహిళా బిల్లుపై కవిత ఉద్యమించడం, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయడంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల రక్షణ, హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు తోడ్పాటును అందించాయని పేర్కొన్నారు.

మహిళా బిల్లును స్వాగతిస్తున్నామని స్పష్టంచేశారు. ఈ బిల్లులో బీసీ మహిళలకు న్యాయమైన వాటా దక్కేలా ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్‌ పార్టీ అవసరమైన కార్యాచరణ చేపట్టాలని కోరారు.

మహిళా బిల్లుకు బీసీలు వ్యతిరేకం కాదని, అయితే బీసీ బిల్లు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయనే చర్చ జరిగిన ప్రతిసారీ మహిళా బిల్లును తెరమీదకు తెస్తున్నారని, దీనివల్ల హక్కుల కోసం కొట్లాడే వర్గాల మధ్య తగువు పెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని దుయ్యబట్టారు..

G-20 సదస్సు.. ఐటీసీ మౌర్యలో బైడెన్.. శాంగ్రీలాలో సునాక్..

న్యూఢిల్లీ..

జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు బయల్దేరుతున్నారు. వారి కోసం దిల్లీలో ఖరీదైన హోటళ్లు పటిష్ఠ భద్రతతో ముస్తాబయ్యాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్కు హోటల్ ఐటీసీ మౌర్యలో బైడెన్‌కు వసతి కల్పించారు..

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తొలిసారి ప్రధాని హోదాలో భారత్‌కు వస్తున్నారు. ఆయనకు షాంగ్రి లా హోటల్‌లో బస చేసేందుకు వసతి కల్పించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోస్‌, జపాన్‌ ప్రధాని పుమియో కిషిదా.. ది లలిత్ హోటల్‌లో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ఇంపీరియల్‌ హోటల్‌లో బస చేస్తారు.

దిల్లీలోని మరో ప్రముఖ హోటల్‌ క్లారిడ్జెస్‌లో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ ఉంటారు. డాక్టర్‌ జాకిర్‌ హుస్సేన్‌ మార్గ్‌లో ఉన్న ఒబెరాయ్‌ హోటల్‌ను తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ బస కోసం బుక్‌ చేశారు. గురుగ్రామ్‌ ఒబెరాయ్‌ హోటల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ఉంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గైర్హాజరవుతున్న వేళ.. ఆ దేశ ప్రతినిధిగా వస్తున్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కూడా ఒబెరాయ్‌లోనే ఉంటారని సమాచారం. చైనా ప్రధాని లీ చియాంగ్ బృందం కోసం తాజ్ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు..

తిరుమలలో మరి కాస్త పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ మరి కాస్త పెరిగింది.

నేడు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్‌లన్నీ భక్తులతో నిండిపోయింది.

గురువారం స్వామివారిని 58,855 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు శ్రీవారి మాడవీధుల్లో ఉట్లోత్సవం జరగనుంది. నేడు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు...

ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌ గెలిచిన తెలంగాణ ఆడపడుచు

ఆస్ట్రేలియాలోని స్థానిక‌ సంస్థల ఎన్నిక‌ల్లో డిప్యూటీ మేయర్‌గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి శాండీ రెడ్డి ని ఎన్నారై కోఆర్డీనేటర్‌ మహేష్‌ బిగాల అభినందించారు.

ఇది తెలంగాణ ఆడపడుచుకు దక్కిన గౌరవం అని ప్రశంసించారు. సెప్టెంబర్ 5న జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ కరెన్ పెన్సబెన్ మేయర్‌గా ఎన్నికయ్యారని, కౌన్సిలర్‌గా గెలిచిన తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి శాండీ రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారని స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ప్రకటించారు.

ఆస్ట్రేలియాలోని పీవీ విగ్రహం వద్ద మహేష్‌ బిగాల తదితరులు

ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో శాండీ కౌన్సిలర్‌గా గెలుపొంది డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. కాగా, సంధ్యా రెడ్డి శాండీ రెడ్డి కి 2020 సంవత్సరానికి స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న సంధ్యారెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాక్షించారు

గులాబీ గూటికి యూత్ కాంగ్రెస్ నాయకులు

బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

తాజాగా తొర్రూరు మండలం సోమవారపు కుంట తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ అధ్వర్యంలో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. నూతనంగా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం గెలువడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు........

సర్వ శిక్షకుల పోరు బాట

మహబూబాద్ ,

విద్యాశాఖ సమగ్ర శిక్ష )(ఎస్ ఎస్) లో కాంటాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోరు బాట పట్టారు. ఈ సందర్భంగా విద్య శాఖలో పనిచేస్తున్న నెలకి 19500 వేలు ఇవ్వడం చాలా బాధాకరమని నిరసన కార్యక్రమం చెప్పట్టారు.

ఈ సందర్భంగా తెలంగాణ సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి వీరన్న మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఎస్ ఎస్ లు చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థలు రద్దుచేసి సమగ్ర శిక్షకులు ఎస్ ఎస్ లను రెగ్యులరైజ్ చేస్తామని నాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎస్ ఎస్ లకు 30,500 వేతనం చెల్లిస్తుండగా మన తెలంగాణలో మాత్రం 20వేల లోపే వేతనం ఇవ్వడం జరుగుతుంది.

ప్రభుత్వ పాఠశాలను విద్యారంగం బలోపేతం కోసం ఎస్ ఎస్ లు చేస్తున్న కృషి అమోఘం కనుక ఎస్ ఎస్ లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస పే స్కేల్ అమలు చేస్తూ రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ షేక్ ఖాదర్, ఝాన్సీ, యమునా, ఉష,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను శ్రమ దోపిడికి గురిచేస్తుంది: కిషన్ రెడ్డి

17 సంవత్సరాలుగా హోంగార్డు ఉద్యోగం చేస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, దురదృష్టకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందని, తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను అవమానిస్తోందని, హోంగార్డు సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేశానని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డు హక్కులు, సమస్యల కోసం ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదని ఆరోపించారు. హోంగార్డు వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి.. ఇంత వరకు చేయలేదని విమర్శించారు.

హోంగార్డుల డ్యూటీ 8గంటలయితే.. అంతకంటే ఎక్కువ సమయం డ్యూటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని, హెల్త్ పరంగా, అలెవెన్సు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు హోంగార్డులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చిన హోంగార్డులకు న్యాయం జరగలేదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వీడియోను మీడియాకు చూపించారు. కేసీఆర్ హామీ ఇచ్చి ఐదున్నరేళ్లు కావొస్తున్న సమస్య పరిష్కారం కాలేదన్నారు. హోంగార్డులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హోంగార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, రవీందర్ ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవీందర్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నానన్నారు.

హోంగార్డు హక్కులను కపాడాల్సిన అవసరం ఉందని, హోంగార్డులు ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆత్మహత్యల ద్వారా సమస్య పరిష్కారం కాదని, హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక హోంగార్డులకు అండగా ఉంటామని, రవీందర్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన:సీఎం కెసిఆర్

శ్రీకృష్ణ జన్మాష్టమి’ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఉట్ల పండుగ"గా పిలుచుకుంటూ యువతి, యువకులు కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని సీఎం తెలిపారు.

శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని సీఎం తెలిపారు.

భగవద్గీత ద్వారా కర్తవ్యబోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించని స్థితప్రజ్ఞతతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని సీఎం ప్రార్థించారు....

Japan Moon Mission: జాబిల్లిపైకి దూసుకెళ్లిన జపాన్‌ 'స్లిమ్‌'.. ల్యాండింగ్‌ ఎప్పుడంటే..?

టోక్యో: జాబిల్లి (Moon)పై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్‌ (Japan) కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్‌ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది..

నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌-రే టెలిస్కోప్‌ (X-ray telescope), లూనార్‌ ల్యాండర్‌ (lunar lander)ను తీసుకొని హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

జపార్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ JAXA ఈ ప్రయోగాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత XRISM (ఎక్స్‌-రే ఇమేజింగ్ అండ్‌ స్పెక్ట్రోస్కోపి మిషన్‌) ఉపగ్రహాన్ని హెచ్‌-2ఏ రాకెట్‌ భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ప్రయోగించారు. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని జపాన్‌ చెబుతోంది..

మూన్‌ స్నైపర్‌ మిషన్‌..

ఇక ఇదే ప్రయోగంలో జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు స్లిమ్‌ (స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌) పేరుతో ఓ తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ను కూడా పంపించారు. ఈ ల్యాండర్‌.. మూడు - నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంటే.. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ స్లిమ్‌ ల్యాండర్‌ (SLIM Lander) జాబిల్లిపై దిగనుందని స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది.

జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం 'పిన్‌పాయింట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీ'తో స్లిమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు అటుఇటూగా దిగుతుంటాయి. కానీ, నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్‌ అయ్యేట్లు దీనిని డిజైన్‌ చేశారు..