/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణను మరో మణిపూర్ గా మార్చకండి: RS ప్రవీణ్ కుమార్ Yadagiri Goud
తెలంగాణను మరో మణిపూర్ గా మార్చకండి: RS ప్రవీణ్ కుమార్

హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలపై అధికారి తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేశారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఒక వెటర్నరీ డాక్టర్‌కు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏం పని అని ప్రశ్నించారు. ఈ దుండగుడు ఎవరో డాక్టర్ హరిక్రిష్ణ అని అంటున్నారని, ఈయనను పశుసంవర్ధక శాఖ నుంచి క్రీడా శాఖకు ఎవరు బదిలీ చేశారని, ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు.

ఈయన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడనేనా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతనికి 2025 దాకా డెప్యుటేషన్ ఇచ్చిండు అని ప్రశ్నించారు. హరికృష్ణ-శ్రీనివాస్ గౌడ్ మంత్రి వ్యవహారాల మీద లోతైన విచారణ జరిపి ఈ కీచకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

బాధిత బిడ్డలపై, మహిళల మీద సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం గౌరవమున్నా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అర్జెంటుగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘

మీ పిల్లలకొక న్యాయం, మా పేద పిల్లలకొక న్యాయం ఉండొద్దు. తెలంగాణను మరో మణిపూర్‌గా మార్చకండి’ అంటూ ట్వీట్ చేశారు...

లైంగిక వేధింపులకు పాల్పడితే అవసరమైతే ఉరి తీయిస్తాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థినులపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. స్కూల్‌లోని కీచక అధికారి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నట్లు పత్రికలో వచ్చిన కథనం తీవ్ర కలకలం రేపింది.

కాగా, ఆదివారం ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందిచారు. విద్యార్థునుల పట్ల నీచంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్‌‌ను కోరారు.దీంతో ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే రియాక్ట్ అయ్యారు.

విద్యార్థునులపై వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. పత్రికలో వచ్చిన వార్తలపై విచారణ జరిపించాలని ఆదేశించామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని.. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారత మహిళల రెజ్లర్లపై వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో కోరామని గుర్తు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు తెలిసిందని.. దీంతో గంట వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

వేధించినట్లు రుజువైతే అధికారిని జైలుకు పంపిస్తాం.. అవసరమైతే ఉరి తీయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ..

మహానగరంలో జాతీయ జెండాకు అవమానం..!

రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులకు, పాదచారులకు షాక్ ఇచ్చే విధంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరిట ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం, మినిస్టర్ కేటీఆర్, నగరవాసులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటుచేసిన

ఈ ఫ్లెక్సీలో జాతీయ జెండాలోని మూడు రంగులను తారుమారు చేశారు. త్రివర్ణములలో రౌద్రానికి ప్రతీక అయినా ఎరుపు రంగు పైన ఉండవలసింది, సస్యశ్యామలానికి ప్రతీక అయిన ఆకుపచ్చ రంగు ఎగువ బాగాన ముద్రించారు.

ఈ ఫ్లెక్సీని చూసిన వాహనదారులు, రాకపోకలు సాగించే సాధారణ జనం అధికారులకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు. కాస్త విస్మయాన్ని కుడా వ్యక్తం చేస్తున్నారు...

జనగామ జిల్లాలో సెల్ఫీ వీడియో తీస్తూ భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

జనగామ జిల్లాలో ఆదివారం ఉదయం దారుణం జరిగింది. సెల్ఫీ వీడియో తీస్తూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.

ఇరుగు, పొరుగువారు గమనించి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది.

నర్మెట్ట మండలం, సూర్యబండతండా గ్రామానికి చెందిన గురు, సునీత భార్యాభర్తలు. తమ భూమిని కొంతమంది దళారులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగులు మందు సేవించి ఆత్మహత్యయత్నం చేశారు. భూమి కబ్జా చేసిన వారి పేర్లు సెల్ఫీ వీడియోలో బాధితులు పేర్కొన్నారు....

వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీ పార్టీకి రాజీనామా?

జిల్లాలో బీజేపీ కి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి తన రాజీనామా లేఖ ను పంపారు.

రాజీనామా లేఖలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ లపై ఆరోపణలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించి తెలంగాణకు న్యాయం చేస్తాదని భావించి అనేకమంది ఉద్యమకారులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు.

బీజేపీ, తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని ఆరోపణలు వస్తున్నాయని.. అందువల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

కాగా గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు చంద్రశేఖర్ దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం....

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల:ఆగస్టు 13

తిరుమలలో వీకెండ్ కావడంతో తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో

భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 82,265 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారికి 41,300 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

Revanth reddy: 'తిరగబడదాం.. తరిమికొడదాం..' నినాదంతో ముందుకెళ్లాలి: రేవంత్‌

హైదరాబాద్‌: 'తిరగబడదాం.. తరిమికొడదాం' నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు..

భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం రూపొందించినట్టు తెలిపారు. బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడుతూ..

నెల రోజుల పాటు గ్రామ గ్రామాన భారాస వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగా భారాస ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 12వేల గ్రామాల్లో, 3వేల డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75లక్షల కుటుంబాలను కాంగ్రెస్‌ శ్రేణులు కలుస్తారని వెల్లడించారు..

నిజాం కాలేజీలో చదువుకోవడం నాకు గర్వంగా ఉంది..: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

1933 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు. కాలేజీకి గొప్ప పేరుందన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు తాను నిజాం కాలేజీలో చదువుకున్నట్లు గొప్పగా చెబుతానని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ లో బాయ్స్‌ హాస్టల్‌, న్యూ కాలేజీ బ్లాక్‌కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి శనివారం మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. యూనివర్సిటీల పరంగా తెలంగాణకు నాలుగవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఓయూ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు. వర్సిటీ వీసీ రవీందర్ కూడా ఓయూ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందన్నారు. తెలంగాణ టీశాట్‌తో కలిసి ఉస్మానియా టీవీ ఏర్పాటు చేయడం ద్వారా మారుతున్న పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యను మరింతమందికి అందించేలా ప్రయత్నం చేయడం స్వాగతించదగిన విషయమని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. నిజాం కాలేజీ కోసం నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ఆయన కూడా నిజాం కాలేజీ విద్యార్థేనని గుర్తుచేశారు.

గతంలో ఈ కాలేజీలో డిగ్రీ చదువుతున్న బాలికలకు హాస్టల్ వసతి లేకపోవడంతో వెంటనే నిర్మాణం చేసి, ప్రారంభించుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విద్యాశాఖకు నిధులకు అదనంగా పురపాలక శాఖలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.40.75 కోట్లు ఇచ్చామన్నారు.

నేడు బాయ్స్ హాస్టల్‌తోపాటు అదనపు తరగతి గదులను నిర్మించుకోబోతున్నామని తెలిపారు. వచ్చే 15 నెలల్లో భవనాల నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. కాలేజీ గ్రౌండ్‌కు ఇబ్బంది రాకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

నిర్మాణం కోసం మా నిధుల తోపాటు మంత్రి కేటీఆర్ HMDA నిధులు కూడా ఇచ్చినందుకు కేటీఆర్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థులకు కూడా హాస్టల్ కల్పించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారని, యూనివర్సిటీల కోసం 500 కోట్లు ముఖ్యమంత్రి కేటాయించారని వెల్లడించారు.

గురుకులాలు ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరిగిందని చెప్పారు. కల్యాణ లక్ష్మితో వచ్చిన డబ్బును కొంతమంది అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం వాడుకుంటున్నారని తెలిపారు....

Justice NV Ramana: రాజద్రోహం సెక్షన్‌ను ఆనాడే నిలిపేసిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

దిల్లీ రాజద్రోహం సెక్షన్‌ను భారతీయ శిక్షాస్మృతి నుంచి రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ 15 నెలల కిందటే దాన్ని నిలుపుదల చేశారు..

ఐపీసీలోని సెక్షన్‌ 124ఎ కింద ఎలాంటి కేసులూ నమోదుచేయొద్దని, వలస పాలకులు తెచ్చిన ఆ చట్టాన్ని సమీక్షించాలని ఆయన 2022 మే 11న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేశారు.

''చట్ట సమీక్ష పూర్తయ్యేంతవరకూ రాజద్రోహ నిబంధనలు ప్రయోగించించడం మంచిదికాదు. 124ఎ సెక్షన్‌ కింద కొత్త కేసులు నమోదుచేయడంకానీ, విచారణ కొనసాగించడంకానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు. ఒకవేళ కొత్తగా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదుచేస్తే దాన్నుంచి విముక్తి కోసం సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చు..

సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి కోర్టులు నిందితులకు ఉపశమనం కల్పించవచ్చు'' అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆరోజు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే బ్రిటిష్‌ కాలంలో తయారైన చట్టాలను భారతీయీకరించాలని, నేటి పరిస్థితులకు అనుగుణంగా అందులో మార్పులు తేవాలని ప్రధాన న్యాయమూర్తి హోదాలో ప్రతి సభ, సమావేశాల్లో ఆయన చెబుతూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఆ దిశలోనే సాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం తెచ్చిన కొత్త బిల్లు ప్రకారం దేశద్రోహానికి పాల్పడితే కేసులు నమోదుచేయడానికి వీలవుతుంది. రాజద్రోహానికి పాల్పడితే కేసులు పెట్టడానికి వీల్లేదు..

శంషాబాద్‌లో హత్యకు గురైన మహిళ మంజుల గా గుర్తింపు

శంషాబాద్‌లో దిశ తరహాలో ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇది తెలంగాణలో సంచలనం సృష్టించింది. అయితే.. మహిళ దారుణ హత్య కేసులో పోలీసులు కాస్త పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ ఎవరో గుర్తించారు.

శంషాబాద్‌లో దారుణ హత్యకు గురైన మహిళ మంజులగా పోలీసులు గుర్తించారు. మంజుల స్వస్థలం.. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని దొడ్డి గ్రామం. ఈ నెల 10 న కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్‌కు వెళ్లేందుకు మంజుల బయటకు వచ్చింది. ఈ మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులకు భర్త లక్ష్మయ్య ఫిర్యాదు చేశారు.

నిందితుల కోసం పది బృందాలుగా ఎస్ఓటి పోలీసులు గాలిస్తున్నారు. పెట్రోల్ బంక్ లో రికార్డ్ అయిన సిసి విజువల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలింపులు నిర్వహిస్తున్నారు.

పెట్రోల్ బంక్‌లో ఐదు లీటర్ల డీజిల్ తీసుకున్న ఇద్దరు వ్యక్తులే నిందితులా? లేదంటే మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది...