/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం: గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి Miryala Kiran Kumar
మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం: గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం

- రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు మంత్రి జగదీష్ రెడ్డి

- 9,8 వార్డులో కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి

ఒక రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అని ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9 మరియు 8 వార్డులో జగదీష్ అన్న కప్2023 కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. 2014లో తాము ప్రజల వద్దకు వస్తే సమస్యలు చెప్పారని నేడు మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. 2014లో సూర్యాపేట పట్టనం ఇప్పుడు ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదే అన్నారు. ముఖ్యంగా హరితహారంలో మొక్కలను బాగా పెంచి సూర్యాపేట జిల్లాలో అటవీశాతాన్ని పెంచడం అభినందనీయమన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంతటి అభివృద్ధి మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలోనే జరిగిందన్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఆలోచించే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ప్రజలంతా ఆదరించాలని అప్పుడే మనమంతా ఆనందంగా ఉంటామని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటామని అన్నారు.

 సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజల అదృష్టం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా మార్చి పాలన దగ్గర చేయడంతో పాటు రెండు మినీ ట్యాంక్ బండ్లు, మెడికల్ కళాశాల, 21 స్మశానవాటికలు మహాప్రస్థానం, మూసి మురికి నీటి నుంచి విముక్తి కల్పించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అభివృద్ధి చేసిన ఘనత మంత్రి జగదీశ్ రెడ్డి కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సీఎంఆర్ఎఫ్ తో వైద్య సదుపాయానికి, నిరుపేదల విదేశీ విద్యకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ విజయం అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి, మచ్చ రాము,బొడ్డు దుర్గయ్య, బండమీది రజిత, రజిని పందిరి సువర్ణ,అనుములపురి వినయ్, నవీన్, మహిళ నాయకురాలు కరుణశ్రీ,అంజమ్మ విజయ,మహేశ్వరి,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి: పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఒక్కరికి 3 హాస్టల్ల నిర్వహణ ఎలా సాధ్యం ? వార్డెన్లు అంటే పప్పులు ఉప్పు ఇవ్వడానికేనా ? ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

  

పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్.

విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి సంక్షేమ హాస్టల్లో ఎంతో ఉపయోగపడతాయనుకుంటే జిల్లాలో ఒక వార్డెన్ కు మూడు హాస్టల్ నిర్వహణ ఎలా సాధ్యమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రశ్నించారు. సంక్షేమ హాస్టల్ వార్డెన్లు అంటే పప్పులు, ఉప్పులు ఇవ్వడానికేనా అని అన్నారు. నల్లగొండ జిల్లాలో 61sc సంక్షేమ హాస్టల్స్ ఉంటే 23 మంది ఉన్నారని,41 st సంక్షేమ హాస్టల్స్ ఉంటే 28 మంది ఉన్నారని, bc 42 హాస్టల్స్ ఉంటే 24 మంది మాత్రమే వార్డెన్లు మాత్రమే ఉన్నారని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

      

శుక్రవారం రోజు చిట్యాల మండలంలోని ఉరుమడ్ల sc సంక్షేమ హాస్టల్లో నిర్వహణ తీరుపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా లో సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనము అందించాలని కోరారు. సంక్షేమ హాస్టల్స్ లో తల్లిదండ్రులను వదిలేసి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు వార్డెన్లు తప్పక పరిశీలించాలని చదువులో మెరుగైన సూచనలు అందించాలని కోరారు. సరియగు వసతులు కల్పించాలని ఫ్యాన్లు మంచినీరు టాయిలెట్స్ సక్రమంగా ఉంచాల్నారు. విద్యార్థులకు అందవలసిన కాస్మోటిక్ చార్జీలను వెంటనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వము పెట్టెలు దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు ఈ విద్యా సంవత్సరంలో అందించాలని కోరారు. విద్యార్థులు జబ్బున పడకుండా వైద్యం సక్రమంగా అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సర్వేలు పూర్తయిన తర్వాత కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

   

ఈ సర్వే కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్, నాయకులు అయితరాజు నరసింహ, బెలిజ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించండి ఢిల్లీలో వేలాది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహా ర్యాలీ: నేషనల్ వైస్ చైర్మన్ కృష్ణ మోహన్

పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించండి

ఢిల్లీలో వేలాది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహా ర్యాలీ 

ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను తీవ్రతరం 

హామీ లేని జాతీయ పెన్షన్ విధానాన్ని (ఎన్ పీఎస్) రద్దు చేసి నిర్వచించబడిన, హామీ ఇవ్వబడిన పాత పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని వేలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ బలగాలు, పెన్షనర్లు ఢిల్లీలో పెన్షన్ హక్కుల మహా ర్యాలీ నిర్వహించి రాంలీలా మైదానంలో గురువారం భారీ సభ ఎన్ జేసిఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన జరిపారు.

జాయింట్ ఫోరం ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపిఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర మరియు స్వయంప్రతిపత్త ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని నో పెన్షన్ స్కీమును రద్దు చేయాలని నినదించారు.

ఎన్ పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నందున ఓపీఎస్‌ ను పునరుద్ధరించడం న్యాయబద్ధమైన కోర్కె అని 

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ ఉపాధ్యక్షులు వి.కృష్ణ మోహన్ తెలిపారు.

జనవరి 1, 2004 న లేదా ఆ తర్వాత నియమించబడ్డ ఉద్యోగులకు అమలు చేయబడిన ఎన్ పీఎస్ ను ఉపసంహరించుకొని వారందరినీ ఓపీఎస్ పరిధి లోకి తీసుకురావాలని, పి.ఎఫ్.ఆర్.డి.ఏ ని రద్దు చేసి దానిలో ప్రతి నెలా జమ చేయబడ్డ 10 శాతం బేసిక్ పే మరియు డి.ఏ ను జీపిఎఫ్ పధకాన్ని అమలు చేసి దానిలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

కాని పి.ఎఫ్.ఆర్.డి.ఏ మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు 2004 నుండి పి.ఎఫ్.ఆర్.డి.ఏ కి అందించిన విరాళాలను తిరిగి పాత పెన్షన్ స్కీమ్‌కి మారాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నాయని వాపోయారు.

పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, పింఛను బహుమతి కాదని, అది వారి జీవితంలో ఉచ్ఛ స్థితిలో యజమాని కోసం నిరంతరం శ్రమించిన వారికి సామాజిక-ఆర్థిక న్యాయం అందించే సామాజిక సంక్షేమ చర్య అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం తన స్వంత ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వి.కృష్ణ మోహన్ విమర్శించారు.

సీ.ఆర్.పీ.యఫ్, సీ.ఐ.యస్.యఫ్, ఐ.టి.బీ.పి, యస్.యస్.బీ, ఎన్.ఎస్.జీ, అస్సాం రైఫిల్స్ మొదలైన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీ.ఏ.పి.యఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్‌ స్కీమ్‌కు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సీ.ఏ.పి.యఫ్ లకు కూడా ఓపీఎస్‌ని అమలు పరచటానికి తిరస్కరించటం శోచనీయమన్నారు.

 

ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు మరియు ఒక వర్గం మీడియా చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు.అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్ట పోయారని, భారత దేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గుర్తు చేశారు.

ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నదనీ, సామాజిక రంగానికి మరియు వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాక దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘ కాలంగా అపరిష్కృతంగానున్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని వి. కృష్ణ మోహన్ హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని *శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ* అమ్మవారి బోనాల పండుగని విజయవంతం చేయండి: మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్

మొక్కితే వరాలిచ్చే తల్లి ఊర ముత్యాలమ్మ

- 13న బోనాల పండుగ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

- మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు : మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

మొక్కితే వరాలు ఇచ్చే తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారని సూర్యపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని బుధ వారం దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ, పోలీస్ శాఖ సహకారంతో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన తల్లి జ్ఞాపకార్థం దేవాలయానికి ఆర్చి నిర్మించ డముతో దేవాలయానికి కొత్త కళ వచ్చిందన్నారు. అమ్మవారి చల్లని దీవెనలతో సూర్యాపేట అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. వేయి కండ్లతో అందరిని కాపాడే ఊర ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆదివారం నిర్వహించే బోనాల పండుగ ఉత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో కన్నుల పండుగ జరుపుకోవాలని కోరారు. కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో దేవాలయంలోని సమస్యలు పరిష్కారం అయ్యాయనీ అన్నారు. దేవాలయంలో బోనాల పండుగ రోజున భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని, దేవాలయ ఆవరణ మొత్తం ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని, పండుగ రోజున ప్రత్యేకంగా సిబ్బందిని పెంచి బందోబస్తును ఏర్పాటు చేయాలని మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రామానుజుల రెడ్డి, పట్టణ సిఐ రాజశేఖర్, ఎస్సై మహేంద్రనాథ్, దేవాలయ కమిటీ అధ్యక్షులు సారగండ్ల రాములు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, సారగండ్ల శ్రీనివాస్, సారగాండ్ల కోటేష్, కోలా నాగరాజు, గుంటి సైదులు, వెంకులు, వెంకటేశం, అర్వపల్లి లింగయ్య, కొల లక్ష్మయ్య, ఇండ్ల వెంకటలక్ష్మి, ఎస్. వెంకన్న, మొర జానకిరమూలు, ఎస్. రంగయ్య, బసవయ్య, బైరు వెంకన్న తదితరులు ఉన్నారు.

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ

తేది:09-08-2023

ప్రెస్ రిలీజ్

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ 

దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

హైదరాబాద్:

" గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి రు. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు.

ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాం."

- వేముల ప్రశాంత్ రెడ్డి

రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి

నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు

నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు

స్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా క్లాక్ టవర్ అమరవీరుల స్తూపం నందు ప్రజాయుద్ధనౌక గద్దర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధనకై తొలి దేశ మలిదశ ఉద్యమంలో అనేక పాటలతో యువ నాయకులని ఉద్యమ బాట పట్టించిన గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తిలిపరు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతి కెవిపిస్ కార్యదర్శి పాలడుగు నాగార్జున బిఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు రంగాపూర్ యాదయ్య షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్తుల జగన్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్,,, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్య దర్శి మరియు మాలమహానాడు జిల్లా అద్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, విద్యావంతుల వేదిక పందుల సైదులు నియోజకవర్గ ఇన్చార్జ్ కుడూతాల నాగరాజ్ తీగల నవీన్ గంటకాంప నరేష్,కట్టెల మహేష్ ,బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు......

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్?

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది.2018 లో లాగే ఈసారి కూడా మిజోరం, రాజస్థాన్,MP, ఛత్తీస్గఢ్, రాష్ట్రాలతో కలిపి తెలంగాణ ఎన్నికలను జరపనున్నట్లు సమాచారం. అక్టోబర్ 5 కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ రావచ్చని అంటున్నారు... ఈ లెక్కన రాష్ట్రంలో నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ తొలి రెండు వారాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

రేపు ప్రారంభించనున్న నిజామాబాద్ ఐటీ టవర్

రేపు ప్రారంభించనున్న నిజామాబాద్ ఐటీ టవర్*

హైదరాబాద్‌:ఆగస్టు 08

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్‌.. తాజాగా నిజామాబాద్‌ ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధంచేసింది.

ఇందూరు ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్లు...

రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా..

2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది.

71 శాతం మంది యువ, మహిళా ఓటర్లే

ఐదేండ్లలో 19 లక్షలు పెరిగిన ఓటర్ల సంఖ్య

అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి

అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం

మరోసారి ఓటు హక్కు అవకాశం కల్పించిన ఈసీ

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. మొత్తం ఓటర్లలో 2.12 కోట్లు (71 శాతం) మహిళలు, యువ ఓటర్లే ఉండటం గమనార్హం. ఈసీ గణాంకాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షలు ఉన్నారు. గత జనవరిలో ప్రకటించిన తుది ఓటరు జాబితాలో వివిధ కారణాలతో 2.72 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 6.84 లక్షల మందిని కొత్తగా చేర్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 34,891 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్‌లో ప్రకటించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోసారి ఓటు నమోదుకు అవకాశం

రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలకు మరో అవకాశం లభించింది. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, ఓటును వేరే ప్రాంతానికి మార్చాలనుకొనే వారికి ఈసీ మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సెప్టెంబర్‌ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలిస్తారు. అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. 2023 అక్టోబర్‌ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చేనేత దినోత్సవం సందర్భంగా మాత్మ గాంధీ కి నూలు పోగు దండ వేసి చేనేతలకు శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంఘం నాయకులు

చేనేత దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రామగిరి లో మహాత్మా గాంధీ విగ్రహానికి నూలు పోగు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి దుడుకు లక్ష్మీనారాయణ గారు కర్నాటి యాదగిరి నేత రావిరాల వెంకట్ చిట్టిపోలు సురేష్ కర్నాటి మచ్చ గిరి రుద్ర లక్ష్మీనారాయణ సంగిశెట్టి సురేష్ వల కీర్తి శ్రీనివాస్ దుడుకు తిరుపత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు