గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ
తేది:09-08-2023
ప్రెస్ రిలీజ్
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ
దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
హైదరాబాద్:
" గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి రు. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు పంపించవచ్చు.
ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాం."
- వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి

తేది:09-08-2023
నల్లగొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గద్దర్ గారికి నివాళులు అర్పించారు
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్?
రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన : బిజేపి చేనేత నాయకులు
నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రజా యుద్ధనౌక గద్దర్..ఇకలేరు
Aug 09 2023, 16:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.7k