/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్లు... Miryala Kiran Kumar
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్లు...

రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా..

2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది.

71 శాతం మంది యువ, మహిళా ఓటర్లే

ఐదేండ్లలో 19 లక్షలు పెరిగిన ఓటర్ల సంఖ్య

అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి

అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం

మరోసారి ఓటు హక్కు అవకాశం కల్పించిన ఈసీ

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. మొత్తం ఓటర్లలో 2.12 కోట్లు (71 శాతం) మహిళలు, యువ ఓటర్లే ఉండటం గమనార్హం. ఈసీ గణాంకాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షలు ఉన్నారు. గత జనవరిలో ప్రకటించిన తుది ఓటరు జాబితాలో వివిధ కారణాలతో 2.72 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 6.84 లక్షల మందిని కొత్తగా చేర్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 34,891 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్‌లో ప్రకటించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోసారి ఓటు నమోదుకు అవకాశం

రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలకు మరో అవకాశం లభించింది. ఓటర్ల జాబితాలో పేరు లేని వారు, ఓటును వేరే ప్రాంతానికి మార్చాలనుకొనే వారికి ఈసీ మరోసారి అవకాశం కల్పించింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సెప్టెంబర్‌ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలిస్తారు. అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. 2023 అక్టోబర్‌ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చేనేత దినోత్సవం సందర్భంగా మాత్మ గాంధీ కి నూలు పోగు దండ వేసి చేనేతలకు శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంఘం నాయకులు

చేనేత దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రామగిరి లో మహాత్మా గాంధీ విగ్రహానికి నూలు పోగు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి దుడుకు లక్ష్మీనారాయణ గారు కర్నాటి యాదగిరి నేత రావిరాల వెంకట్ చిట్టిపోలు సురేష్ కర్నాటి మచ్చ గిరి రుద్ర లక్ష్మీనారాయణ సంగిశెట్టి సురేష్ వల కీర్తి శ్రీనివాస్ దుడుకు తిరుపత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన : బిజేపి చేనేత నాయకులు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన : బిజేపి చేనేత నాయకులు

ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ పార్కులో మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చర్లపల్లి లోని చేనేత కార్మికులను,చేనేత కళాకారులను శాలువలతో సత్కరించి వారిని సన్మానించిన బిజెపి నల్లగొండ జిల్లా చేనేత సెల్ కన్వీనర్ మరియు చేనేత పారిశ్రామిక సంఘం వైస్ చైర్మన్ తీరందాసు కనకయ్య గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక ఆగస్టు 7 వ తేదీని చేనేత దినోత్సవంగా ప్రకటించడం చేనేత కార్మికులకు ఎంతో గర్వకారణమని తెలియజేశారు మన భారత దేశ చేనేత కార్మికుని పనితనాన్ని ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు రాపోలు విద్యాసాగర్ గారు, పట్టణ చేనేత సెల్ కన్వీనర్ 

కటికం శ్రీధర్ గారు,గజం పాండు, గారు బద్దం నగేష్ గారు, గంజి యాదగిరి గారు,సంఘెం కొండయ్య గారు రాపోలు సత్తయ్య గారు, రాపోలు యాదగిరి గారు,రాపోలు పరమేశం గారు,నగేష్ గారు తదితులు పాల్గొన్నారు.

నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం    

     *మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ...

నీలగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నందనవనంగా మార్చడమే లక్ష్యమని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు.

ఆదివారం పట్టణంలోని ఐదవ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో పట్టణములో సిసి రోడ్లు, మురుగు కాలువలు వరద కాలువలు అంతర్గత రహదారులు, పార్కుల అభివృద్ధి కళాభారతి వంటి వి సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడి ఉందన్నారు.. కానీ నేడు రాష్ట్ర ఎవరు ఊహించని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో మూడు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పున్న గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్ గార్లు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

ప్రజా యుద్ధనౌక గద్దర్‌..ఇకలేరు

ప్రజా యుద్ధనౌక గద్దర్‌..ఇకలేరు 

ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్‌ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌(74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ 1949లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్‌ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినీమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయినప్పటికి తుది వరకు ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు. గద్దర్‌కు భార్య విమల, కొడుకు, కూతురు ఉన్నారు.

నల్గొండలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఎమ్మెల్యే కంచర్ల ... 

 

ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ పార్క్ సమీపంలో గల జయశంకర్ సార్ విగ్రహానికి BRS ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జయశంకర్ సార్ పేరు మీద జిల్లా మరియు వ్యవసాయ యూనివర్సిటీకి పేరు పెట్టి గొప్పగా కీర్తించుకోవడం జరిగింది. జయశంకర్ సార్ తన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, BRS పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, BRSV నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

మూడవ వార్డులోని పనులు తక్షణమే పూర్తి చేయాలి: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

మూడవ వార్డులోని పనులు తక్షణమే పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కార్మికులను ఆదేశించారు...

పట్టణంలోని మూడవ వార్డులో గల ఎస్బిఐ హమాలి వర్కర్స్ కాలనీ లోని ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, వీధిలైట్లను వెంటనే ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి సంబంధిత సిబ్బందికి సూచించారు.

శనివారం పట్టణంలోని మూడో వార్డులో గల ఎస్బిఐ అమాలి వర్కర్స్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ స్థలంలో క్రీడా ప్రాంగణం, పట్టణ పకృతి వనం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలనీ మొత్తాన్ని శుభ్రం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మున్సిపల్ అధికారులు, దండం పెల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండను హరిత నీలగిరిగా మార్చుకుందాం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

హరిత నీలగిరిగా మార్చుకుందాం : చైర్మన్ మందడి

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం 17వ వార్డు ఆర్జాల బావి కాలనీ వాసులకు ఆయన మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రెండు ముక్కలు నాటి వాటిని సంరక్షించుకోనీ హరిత నీలగిరిగా మార్చుకుందామని అన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దానికోసం ఎన్నో నిధులు కేటాయిస్తుందని అన్నారు . రాబోవు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మొక్కలు నాటడమే శరణ్యం అన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మహేందర్, ఆర్పీ విజయలక్ష్మి, అన్వర్, హనుమంతు, నందు, నాగరాజు, నరేష్, గోపి, కాశయ్య, మహేష్ గార్లు మరియు _బిఆర్ఎస్, ఉమర్, మస్తాన్ గార్లు కార్యకర్తలు పాల్గొన్నారు..

-------------------------------------

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం.

తల్లిపాలు తల్లిపాలే బిడ్డకు అత్యంత శ్రేయస్కరమని ఆరోగ్యకరమని మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆయన 17 వ వార్డు ఆర్జాలబావి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల విశిష్టతపై పలువురు వివరించారు. చిన్నారులు పౌష్టికారంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పౌష్టికరమైన ఆహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

Q ఈ కార్యక్రమంలో BLO ఖుర్షిద్ బేగం, సుగుణ, RP విజయలక్ష్మి, సిస్టర్ పూలమ్మ, ఆశ వర్కర్ సరిత గార్లు మరియు గర్భిణులు, మహిళలు పాల్గొన్నారు..

ఆగస్టు 6న జరిగే బిసి సింహ గర్జన సభను విజయవంతం చేయండి: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ

ఆగస్టు ఆరవ తేదీ ఆదివారం రోజున నల్లగొండ పట్టణం చిన్న వెంక రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10:30 గంటలకు నిర్వహించబడే బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ గారు హాజరై మాట్లాడుతూ

 

ఈ సభకు ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు హాజరుకానున్నారని

 

కావున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల నుంచి బీసీ బంధుమిత్రులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయాలని 

75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కలేదని

 ఓట్లు మనవి సీట్లు వారివి ఇకనుంచి ఓట్లు మనవి సీట్లు మనవి అనే నినాదంతో మనందరం పనిచేయాలని 

నీలా వెంకటేష్ గారు విజ్ఞప్తి చేశారు .

జనగణలో కులగలను చేపట్టాలని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని

 బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని

 ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్ కల్పించాలని

 నీల వెంకటేష్ గారు డిమాండ్ చేశారు 

.

ఈ కార్యక్రమంలో లోకనబోయిన వెంకట ముదిరాజు గారు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాస్ ప్రసన్నకుమార్ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి, ప్రధాన కార్యదర్శిM A ఖదీర్ ,భరత్, పట్టణ అధ్యక్షులు సదాశివ ,యువజన సంఘం కార్యదర్శి మల్లబోయిన సతీష్ యాదవ్, కల్లూరి సత్యనారాయణ ,వల కీర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

దేశంలోనే తొలిసారిగా వీల్ చైర్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఎస్బిఐ జనరల్

ఇలా దేశంలో ఖరీదైన వీల్ చైర్లకు బీమా చేయడం ఇదే తొలిసారి. దీని వల్ల రానున్న రోజుల్లో వికలాంగులకు ఎంతో మేలు జరగనుంది. అనేక సంవత్సరాల కృషి, సాధారణ బీమా కంపెనీలతో నిరంతరం అనుసరించిన ఫలితంగా అర్మాన్ అలీ తన ఖరీదైన వీల్ చైర్‌కు బీమా చేయడంలో విజయం సాధించాడు. భారతదేశంలో వీల్‌చైర్‌లకు బీమా చేయడం ఇదే తొలిసారి.

మొదటిసారిగా వీల్ చైర్ బీమా

ప్రపంచవ్యాప్తంగా తిరిగే అర్మాన్ అలీ తన జర్మన్ వీల్ చైర్ భద్రత గురించి భయపడేవాడు. ఎందుకంటే అతను వికలాంగుల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు, సెమినార్లలో పాల్గొనడానికి ప్రయాణిస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు తన ఖరీదైన వీల్‌చైర్‌కు బీమా చేయించుకోవడంలో ఎట్టకేలకు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. దీని కోసం అతను 21 జూలై 2023న తన వీల్ చైర్ కోసం ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీని జారీ చేసిన SBI జనరల్ ఇన్సూరెన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. జూలై 20, 2024న ఈ బీమా గడువు ముగుస్తుంది. అర్మాన్ అలీ వీల్ చైర్ రూ. 426,245కి SBI జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బీమా చేయబడింది. ABP లైఫ్ బీమా పాలసీ కాపీ కూడా ఉంది.

SBI జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బీమా చేయబడింది

అర్మాన్ అలీ గత రెండు సంవత్సరాలుగా వీల్ చైర్లు, ఇతర పరికరాలకు బీమా కవరేజీని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం 22 బీమా కంపెనీలకు లేఖ కూడా రాశారు. దీనిపై 9 కంపెనీలు స్పందించినా చివరకు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బీమా చేసేందుకు అంగీకరించింది. అర్మాన్ అలీ నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇది వికలాంగుల కోసం పని చేస్తోంది.

వీల్ చైర్లు చాలా ఖరీదైనవి

వికలాంగులకు అవసరమైన ఈ ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. అలాగే ఈ విషయాలపై బీమా కవరేజీకి ఎటువంటి నిబంధన లేదు. దీంతో ఈ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వీల్‌చైర్లు చాలా ఖరీదైనవి. బీమా కవరేజీని పొందడం వలన మరమ్మతుల ఖర్చును కొనుగోలు చేయడం, భరించడం సులభతరం అవుతుందని అర్మాన్ అలీ అభిప్రాయపడ్డారు.