/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ Yadagiri Goud
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుపతి :జులై 29

వీకెండ్ వచ్చేసింది. నేడు శనివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.కాగా

శుక్రవారం 69,378 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 28,371 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

వాటర్ ఫాల్స్,పర్యాటక ప్రాంతాలకు అనుమతి లేదు : కమీషనర్ రెమా రాజేశ్వరి

పెద్దపల్లి జిల్లా :జులై 28

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్ట్ లు, డ్యామ్స్ చెరువులు, నాలలు, వాగులు నిండుగా ఉన్నాయి. అట్టి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు ఎవ్వరు వెళ్లకూడదని రామగుండం సిపి రెమా రాజేశ్వరి వెల్లడించారు.

పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.

ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు.

ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కమిషనరేట్ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, నాళాలు, వాగులు నిండుగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వారి హెచ్చరికలు, సూచనలు చేసిన పట్టించుకోకుండా వాహనాలతో వరద నీటి నుండి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్టి సాహసాలు చేయకూడదని ఆమె కోరారు.

శనివారం,ఆదివారం సెలవులు ఉన్నందున చాలా మంది పర్యాటకులు ఇతర ప్రాంతాల ప్రజలే కాకుండా, స్థానిక ప్రజలు కుడా వాటర్ పాల్స్, ప్రాజెక్ట్, పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా

ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, డ్యామ్స్ పరిసరాల వద్దకు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, ఆమె అన్నారు.

సాధారణ పరిస్థితి వచ్చే వరకు పర్యాటక ప్రాంతాలకు ఎవరు వెళ్లకూడదని ప్రజలు పోలీస్ వారికి సహకరించగలరని సీపీ రేమా రాజేశ్వరి కోరారు.

"షా"హైదరాబాద్‌ పర్యటన రద్దు

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన రద్దయింది.

షెడ్యూల్‌ ప్రకారం ఆయన శనివారం హైదరాబాద్‌కు చేరుకుని జేఎస్ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కావాల్సి ఉంది.

అయితే అనివార్య కారణాలతోఈ పర్యటన రద్దయినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ,సుభాస్ తెలిపారు...

SB NEWS

SB NEWS

వర్షాలు తగ్గిన బోధన ఎలా ❓️

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు శుక్రవారం కూడా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

ఇప్పటికే జూలై 20, 21, 26 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించగా 22, 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు పనిచేసినా దాదాపు 80 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

జూలై 29న మొహర్రం సెలవు కాగా వర్షాలు, వరదల వల్ల నెలకొన్న ఇబ్బందులు కుదుటపడకపోతే జూలై 31 సైతం విద్యాసంస్థలు పనిచేయడం కష్టమని అధికారులు అంటున్నారు.

పాఠశాల విద్యాశాఖ వివరాల ప్రకారం ఇప్పట్లో సజావుగా బోధన సాగే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల స్కూళ్లలో కుండపోత వర్షాల వల్ల గదుల్లోకి, స్కూల్‌ ప్రాంగణాల్లోకి వరదనీరు చేరింది. దాదాపు 3 వేల స్కూళ్ల ఆవరణలో బురద పేరుకుపోయింది. 6,200 స్కూళ్లలో గోడలు చెమ్మపట్టడంతోపాటు విద్యుత్‌ బోర్డుల్లోకి నీరు చేరింది. 78 శాతం స్కూళ్లలో వర్షాలు తగ్గినా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ హాస్టళ్ల నుంచి చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. బడులు తెరిచినా గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నందువల్ల వారంపాటు వారు తిరిగి రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో డెంగీ, మలేరియా, అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందువల్ల స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మండలస్థాయి ప్రకారం నివేదికలు తెప్పించుకోవాలని సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు.....

పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం..

దిల్లీ: ఈ వర్షాకాల సమావేశంలో మణిపుర్‌ అంశం పార్లమెంట్‌(Parliament)ను కుదిపేస్తోంది. తాజాగా ఇదే విషయమై విపక్ష ఎంపీల(opposition) నుంచి నిరసన వ్యక్తం కావడంతో రెండు నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది..

దీనికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషి(Parliamentary Affairs Minister Pralhad Joshi) మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని తప్పుపట్టారు.

'వారు పార్లమెంట్‌లో శాంతియుత చర్చకు ముందుకురావడం లేదు. అలాగే బిల్లుల్ని ఆమోదించడానికి సహకరించడం లేదు. వారి నుంచి సూచనలు స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

కానీ వారు మాత్రం ఉన్నట్టుండి అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. వారు మణిపుర్‌కు సంబంధించిన వాస్తవాలు బయటకురావాలని కోరుకుంటే..

దానిపై చర్చించడానికి పార్లమెంట్‌కు మించి మంచి వేదిక లేదు' అని అన్నారు. మరోపక్క రాజ్యసభలోనూ ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.

PSLV C56 Launch: 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది.

ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్‌ను మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)కు తీసుకువచ్చారు.

అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్‌ శిఖరభాగాన అమర్చి.. హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు.

29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది.

ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు..

Vijayawada: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణస్వీకారం

విజయవాడ: ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణస్వీకారం చేశారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు..

ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు..

SB NEWS

SB NEWS

భద్రాచలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి

భద్రాచలం జిల్లా:జులై 28

భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.

ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొన సాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగు తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది.

దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది.

ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు...

Flood Effect: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు

నందిగామ: హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే..

శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్‌ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి..

SB NEWS

SB NEWS

SB NEWS

holidays for schools: భారీ వర్షాలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది..

ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు బుధ, గురువారాలు సెలవు ప్రకటించాయి.

తాజాగా ఆ సెలవులను శుక్రవారం వరకూ పొడిగించారు. మరోవైపు శనివారం మొహర్రం, ఆ తర్వాత ఆదివారం ఇలా విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చినట్లైంది..