వాటర్ ఫాల్స్,పర్యాటక ప్రాంతాలకు అనుమతి లేదు : కమీషనర్ రెమా రాజేశ్వరి

పెద్దపల్లి జిల్లా :జులై 28
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్ట్ లు, డ్యామ్స్ చెరువులు, నాలలు, వాగులు నిండుగా ఉన్నాయి. అట్టి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు ఎవ్వరు వెళ్లకూడదని రామగుండం సిపి రెమా రాజేశ్వరి వెల్లడించారు.
పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.
ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు.
ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కమిషనరేట్ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, నాళాలు, వాగులు నిండుగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వారి హెచ్చరికలు, సూచనలు చేసిన పట్టించుకోకుండా వాహనాలతో వరద నీటి నుండి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్టి సాహసాలు చేయకూడదని ఆమె కోరారు.
శనివారం,ఆదివారం సెలవులు ఉన్నందున చాలా మంది పర్యాటకులు ఇతర ప్రాంతాల ప్రజలే కాకుండా, స్థానిక ప్రజలు కుడా వాటర్ పాల్స్, ప్రాజెక్ట్, పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా
ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, డ్యామ్స్ పరిసరాల వద్దకు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, ఆమె అన్నారు.
సాధారణ పరిస్థితి వచ్చే వరకు పర్యాటక ప్రాంతాలకు ఎవరు వెళ్లకూడదని ప్రజలు పోలీస్ వారికి సహకరించగలరని సీపీ రేమా రాజేశ్వరి కోరారు.
Jul 28 2023, 19:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.0k