ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేరాఫ్ తెలంగాణ: మంత్రి కేటీఆర్
★ ప్రపంచస్థాయి పరిశ్రమలకు
కేరాఫ్ తెలంగాణ
★ రాష్ట్రంలో పెట్టుబడులకు జపాన్
కంపెనీల ఆసక్తి: మంత్రి కేటీఆర్
★ చందనవెల్లిలో నికోమాక్, దైఫుకు
పరిశ్రమలకు శంకుస్థాపన
★ జపాన్ కంపెనీలతో క్లస్టర్ ఏర్పాటు
చేయాలని రాయబారికి వినతి
★ 2 వేల ఉద్యోగాలు.. పరోక్షంగా మరో
4 వేల మందికి ఉపాధి
ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమతులతో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లిలో రూ.576 కోట్లతో ఏర్పాటుకానున్న జపాన్కు చెందిన దైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నికోమాక్ తైకిష క్లీన్ రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. చందనవెల్లిలో ప్రత్యేకంగా జపాన్ కంపెనీలతో క్లస్టర్ను ఏర్పాటు చేయాలని భారత్లో జపాన్ రాయబారిని కోరారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. జపాన్ భాషలో ఆశీర్వచనంగా వాడే ‘ఇనీ ఆరాటా’ పదాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా వివరించారు. ఇనీ అరాటా గతంకంటే భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించటమని, రాష్ట్రంలో ఏర్పాటు కానున్న కంపెనీలు కూడా అలాగే ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. జపాన్ కంపెనీల కచ్చితత్వం, పనితీరు మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని, భవిష్యత్తులో కూడా ఇంతే ప్రభావవంతమైన పనితీరును కనబరుస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఫ్యాక్టరీలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.
జపాన్ కంపెనీల కోసం ప్రత్యేక క్లస్టర్
----------------------------------------------
127 మిలియన్ల జనాభా ఉన్న జపాన్ దేశానికి ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరినప్పటికీ ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగటం ప్రశంసనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మనదేశంలో ఎవరి ఇంట్లో చూసినా జపాన్కు చెందిన ఏదో ఒక వస్తువు ఉంటుందని, జపాన్ ఉత్పత్తులపై ఇక్కడి ప్రజలకు ఉన్న గౌరవం అలాంటిదని తెలిపారు. జపాన్కు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలని మంత్రి సూచించారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ రాయబారికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోనే కీలకంగా చందనవెల్లి పారిశ్రామిక వాడ
---------------------------------------------
విస్తారంగా ఏర్పాటవుతున్న పరిశ్రమల స్థాపనతో చందనవెల్లి పారిశ్రామిక వాడ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఎదుగుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్స్టైల్స్ మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాల వరకు విభిన్నమైన కంపెనీలు చందనవెల్లినే కేంద్రంగా ఎంచుకొంటున్నాయని తెలిపారు. దైఫుకు, నికోమాక్ తైకిష కంపెనీలు పెడుతున్న రూ.576 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా 1600 నుంచి 2 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకొని యువతకు శిక్షణ ఇచ్చి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, దైఫుకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గరిమెళ్ల, నికోమాక్ తైకిష కంపెనీ ఎండీ తకుయ మోరిసన్, కౌన్సిల్ జనరల్ మసయుకి టగసన్, దైఫుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నావ్యుకి ఆండౌ తదితరులు పాల్గొన్నారు.


 
						



 ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నల్గొండ జిల్లా పరిషత్ ఫ్లోర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారిని జడ్పిటిసి రామ్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. సర్వసభ్య సమావేశంలో మండల అధికారులు వ్యక్తిగతంగా వారి వారి ఎజెండాను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండల అభివృద్ధి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. తిప్పర్తి మండలం లో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్, SDF నిధులతో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు డ్రెయిన్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు. తిప్పర్తి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ రాములు, ఎంఈఓ కత్తుల అరుంధతి, ఏపిఎం శ్రీదేవి, ఏఈ గంగాభవాని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నల్గొండ జిల్లా పరిషత్ ఫ్లోర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారిని జడ్పిటిసి రామ్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. సర్వసభ్య సమావేశంలో మండల అధికారులు వ్యక్తిగతంగా వారి వారి ఎజెండాను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండల అభివృద్ధి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. తిప్పర్తి మండలం లో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్, SDF నిధులతో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు డ్రెయిన్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు. తిప్పర్తి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ రాములు, ఎంఈఓ కత్తుల అరుంధతి, ఏపిఎం శ్రీదేవి, ఏఈ గంగాభవాని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
 తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా
తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా గుంటూరులో నేడు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతి అవార్డులు 2023 నిర్వహించిన అవార్డు వేడుకలో నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టీసీ ఉద్యోగి సాదిక్ పాషా గారికి "విశిష్ట సేవ రత్న" జాతీయ అవార్డు తో ఘనంగా సన్మానించడం జరిగింది. అనేక రంగాలలో సాదిక్ పాషా గారు సొంతంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధిక్ పాష గారు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి అవార్డులు రావడంతో తనకు మరింత బలం చేకూరిందని, తనలా సొంతంగా సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు మరింతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకోవాలని సాటి మనిషిని గౌరవించాలని ఈ సందర్భంగా పాషా గారు తెలిపారు.
గుంటూరులో నేడు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతి అవార్డులు 2023 నిర్వహించిన అవార్డు వేడుకలో నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టీసీ ఉద్యోగి సాదిక్ పాషా గారికి "విశిష్ట సేవ రత్న" జాతీయ అవార్డు తో ఘనంగా సన్మానించడం జరిగింది. అనేక రంగాలలో సాదిక్ పాషా గారు సొంతంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధిక్ పాష గారు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి అవార్డులు రావడంతో తనకు మరింత బలం చేకూరిందని, తనలా సొంతంగా సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు మరింతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకోవాలని సాటి మనిషిని గౌరవించాలని ఈ సందర్భంగా పాషా గారు తెలిపారు.
 కోట.సరిత కు జాతీయ నంది అవార్డ్
కోట.సరిత కు జాతీయ నంది అవార్డ్
 నల్లగొండ జిల్లా చండుర్ ZPHS లో SGT గ పనిచేస్తున్న శ్రీమతి కోట.సరిత గారు నేడు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన జాతీయ ఉత్తమ అవార్డులలో ఉత్తమ   జాతీయ నంది అవార్డు    వరించింది.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, క్యారమ్ జాతీయ క్రీడాకారిణి, లయన్స్ క్లబ్ ద్వారా సేవ, టీచర్ యూనియన్ లీడర్ గాను, ఇంపాక్ట్ ట్రైనర్ గా కోట సరిత గారు తన వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కోట సరిత గారు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు ఉత్తమ జాతీయ నంది అవార్డు ఇచ్చినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదికకు కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ జిల్లా చండుర్ ZPHS లో SGT గ పనిచేస్తున్న శ్రీమతి కోట.సరిత గారు నేడు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన జాతీయ ఉత్తమ అవార్డులలో ఉత్తమ   జాతీయ నంది అవార్డు    వరించింది.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, క్యారమ్ జాతీయ క్రీడాకారిణి, లయన్స్ క్లబ్ ద్వారా సేవ, టీచర్ యూనియన్ లీడర్ గాను, ఇంపాక్ట్ ట్రైనర్ గా కోట సరిత గారు తన వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కోట సరిత గారు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు ఉత్తమ జాతీయ నంది అవార్డు ఇచ్చినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదికకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి
ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి 


 

 ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

Jul 16 2023, 10:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
30.1k