/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేరాఫ్ తెలంగాణ: మంత్రి కేటీఆర్ Miryala Kiran Kumar
ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేరాఫ్ తెలంగాణ: మంత్రి కేటీఆర్

★ ప్రపంచస్థాయి పరిశ్రమలకు 

   కేరాఫ్‌ తెలంగాణ

★ రాష్ట్రంలో పెట్టుబడులకు జపాన్‌ 

   కంపెనీల ఆసక్తి: మంత్రి కేటీఆర్‌

★ చందనవెల్లిలో నికోమాక్‌, దైఫుకు 

   పరిశ్రమలకు శంకుస్థాపన

★ జపాన్‌ కంపెనీలతో క్లస్టర్‌ ఏర్పాటు

   చేయాలని రాయబారికి వినతి

★ 2 వేల ఉద్యోగాలు.. పరోక్షంగా మరో 

   4 వేల మందికి ఉపాధి

ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమతులతో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని చందనవెల్లిలో రూ.576 కోట్లతో ఏర్పాటుకానున్న జపాన్‌కు చెందిన దైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, నికోమాక్‌ తైకిష క్లీన్‌ రూమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. చందనవెల్లిలో ప్రత్యేకంగా జపాన్‌ కంపెనీలతో క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని భారత్‌లో జపాన్‌ రాయబారిని కోరారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. జపాన్‌ భాషలో ఆశీర్వచనంగా వాడే ‘ఇనీ ఆరాటా’ పదాన్ని కేటీఆర్‌ ప్రత్యేకంగా వివరించారు. ఇనీ అరాటా గతంకంటే భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించటమని, రాష్ట్రంలో ఏర్పాటు కానున్న కంపెనీలు కూడా అలాగే ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. జపాన్‌ కంపెనీల కచ్చితత్వం, పనితీరు మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్దిష్ట సమయంలో కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని, భవిష్యత్తులో కూడా ఇంతే ప్రభావవంతమైన పనితీరును కనబరుస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఫ్యాక్టరీలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.

జపాన్‌ కంపెనీల కోసం ప్రత్యేక క్లస్టర్‌

----------------------------------------------

127 మిలియన్ల జనాభా ఉన్న జపాన్‌ దేశానికి ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరినప్పటికీ ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగటం ప్రశంసనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మనదేశంలో ఎవరి ఇంట్లో చూసినా జపాన్‌కు చెందిన ఏదో ఒక వస్తువు ఉంటుందని, జపాన్‌ ఉత్పత్తులపై ఇక్కడి ప్రజలకు ఉన్న గౌరవం అలాంటిదని తెలిపారు. జపాన్‌కు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలని మంత్రి సూచించారు. జపాన్‌ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ రాయబారికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోనే కీలకంగా చందనవెల్లి పారిశ్రామిక వాడ

---------------------------------------------

విస్తారంగా ఏర్పాటవుతున్న పరిశ్రమల స్థాపనతో చందనవెల్లి పారిశ్రామిక వాడ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఎదుగుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టెక్స్‌టైల్స్‌ మొదలుకొని ఎలక్ట్రిక్‌ వాహనాల వరకు విభిన్నమైన కంపెనీలు చందనవెల్లినే కేంద్రంగా ఎంచుకొంటున్నాయని తెలిపారు. దైఫుకు, నికోమాక్‌ తైకిష కంపెనీలు పెడుతున్న రూ.576 కోట్ల పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా 1600 నుంచి 2 వేల వరకు ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకొని యువతకు శిక్షణ ఇచ్చి స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనిత హరినాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, దైఫుకు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ గరిమెళ్ల, నికోమాక్‌ తైకిష కంపెనీ ఎండీ తకుయ మోరిసన్‌, కౌన్సిల్‌ జనరల్‌ మసయుకి టగసన్‌, దైఫుకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నావ్‌యుకి ఆండౌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది: తిప్పర్తి జడ్పిటిసి

ప్రజా ప్రతినిధులు మండల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నల్గొండ జిల్లా పరిషత్ ఫ్లోర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ గారిని జడ్పిటిసి రామ్ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. సర్వసభ్య సమావేశంలో మండల అధికారులు వ్యక్తిగతంగా వారి వారి ఎజెండాను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మండల అభివృద్ధి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. తిప్పర్తి మండలం లో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఈజీఎస్, SDF నిధులతో అవసరం ఉన్నచోట సిసి రోడ్లు డ్రెయిన్లు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని అన్నారు. తిప్పర్తి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ రాములు, ఎంఈఓ కత్తుల అరుంధతి, ఏపిఎం శ్రీదేవి, ఏఈ గంగాభవాని, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, మండల సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం

 అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న మోడీ ప్రభుత్వం .

 బడా కార్పోరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్న బీ జే పీ కేంద్ర ప్రభుత్వం.. 

 ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్... 

బడుగు జీవుల, అసంఘటిత రంగ కార్మికుల బతుకులను భారంగా మార్చుతున్న కేంద్ర ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ మోడీ ప్రభుత్వం,బడా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ,దేశ సంపదను దోచిపెడుతున్నదని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ అన్నారు.

శనివారం నాడు నల్గొండ పట్టణం లోని శ్రామిక భవన్ (సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం) లో ఐ ఎఫ్ టి యు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం,

జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ,దేశంలో ముప్ఫై అయిదు కోట్లకు పైగా ఉన్న అసంఘటిత కార్మికుల జీవనోపాధి రోజు రోజుకు కడు దయణీయంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు,నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం,కార్మికుల కూలీ రేట్లు,వేతనాలను పెంచడంలో అశ్రద్దగా, మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

కార్మికుల శ్రమ మూలంగా అనేక కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతున్న సంపదను,కార్మికుల శ్రమను,వివిధ రంగాలకు చెందిన యాజమాన్యాలు యదేచ్ఛగా దోచుకోవడానికి మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,నాలుగు లేబర్ కోడ్ లుగా ముందుకు తెచ్చిందని ఆరోపించారు.

రాష్ట్రంలో కేసిఆర్ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం,75 షెడ్యూల్డ్ జీ ఓ లకు గెజిట్ లు లేకుండా కాలయాపన చేస్తుందని,75 షెడ్యూల్డ్ పరిశ్రమలలో ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, జీ ఓ లకు గెజిట్ ఇవ్వకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు.

కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన గా,జూలై,ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కేంపైన్ నిర్వహిస్తుందని,అందులో భాగంగానే జూలై 20 న,హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, క్విట్ ఇండియా కు పిలుపు నిచ్చిన ఆగస్టు 9 నాడు హైదరాబాద్ సిటీలో, అన్ని జిల్లా కలెక్టరేట్ ల ముందు మహా ధర్నాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో IFTU జిల్లా అధ్యక్షుడు బొంగరాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,జిల్లా నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, రావుల వీరేశ్,జానీ,అశోక్ పాషా,స్వామి,ముత్తు,ఎం.డి జానీ,రవి,తదితరులు పాల్గొన్నారు.

తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషా

తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ అవార్డు 2023 కు "విశిష్ట సేవ రత్న"జాతీయ అవార్డు గెలుచుకున్న నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాదిక్ పాషాగుంటూరులో నేడు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతి అవార్డులు 2023 నిర్వహించిన అవార్డు వేడుకలో నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టీసీ ఉద్యోగి సాదిక్ పాషా గారికి "విశిష్ట సేవ రత్న" జాతీయ అవార్డు తో ఘనంగా సన్మానించడం జరిగింది. అనేక రంగాలలో సాదిక్ పాషా గారు సొంతంగా చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాధిక్ పాష గారు మాట్లాడుతూ తాను చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు, ఇలాంటి అవార్డులు రావడంతో తనకు మరింత బలం చేకూరిందని, తనలా సొంతంగా సేవా కార్యక్రమాలు చేసే వారికి ఈ అవార్డు మరింతో ఊరటనిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ భావాన్ని అలవర్చుకోవాలని సాటి మనిషిని గౌరవించాలని ఈ సందర్భంగా పాషా గారు తెలిపారు.

చండూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల లో ఎస్ జి టి గా పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్ శ్రీమతి కోట సరిత గారికి తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయస్థాయి అవార్డు

కోట.సరిత కు జాతీయ నంది అవార్డ్

నల్లగొండ జిల్లా చండుర్ ZPHS లో SGT గ పనిచేస్తున్న శ్రీమతి కోట.సరిత గారు నేడు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక నిర్వహించిన జాతీయ ఉత్తమ అవార్డులలో ఉత్తమ జాతీయ నంది అవార్డు వరించింది.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, క్యారమ్ జాతీయ క్రీడాకారిణి, లయన్స్ క్లబ్ ద్వారా సేవ, టీచర్ యూనియన్ లీడర్ గాను, ఇంపాక్ట్ ట్రైనర్ గా కోట సరిత గారు తన వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కోట సరిత గారు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు ఉత్తమ జాతీయ నంది అవార్డు ఇచ్చినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదికకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి

ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి 

ఏవి రంగారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎండాకాలంలో నల్గొండ విద్యుత్ నగర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి విజయవంతం గా పూర్తి చేసుకున్న సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏవి రంగారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాదాచారులకు నల్గొండ విద్యుత్ నగర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ సేవలు కొనసాగించామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండాకాలం పూర్తి కావడంతో చలివేంద్రం ముగింపు కార్యక్రమంలో పాల్గొని, తమ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఇన్ని రోజులు నడిచినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎ.తిరుమలనాద్, వేణుగోపాలరావు, చెరి పెళ్లి వెంకటేశ్వర్లు, చెరి పల్లి జయప్రకాష్,m. సైదులు, తలారి యాదగిరి, గంజి రాజేందర్, పెండం ధనుంజయ,కే.సుధీర్, ప్రతాప్, మిర్యాల కిరణ్, బండారు హరినాథ్, ఎస్ నారాయణ, సయ్యద్, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో తెలుగు వెలుగు సాహితి సంస్థ నిర్వహించే తెలుగు వెలుగు జాతీయ పురస్కారాలు 2023 కు ఎంపికైన నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాధిక్ పాష

గుంటూరులో తెలుగు వెలుగు సాహితి సంస్థ నిర్వహించే తెలుగు వెలుగు జాతీయ పురస్కారాలు 2023 కు ఎంపికైన నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాధిక్ పాష

తెలుగు వెలుగు సాహితీ సంస్థ తెలుగు వెలుగు జాతీయ పురస్కారాలు-2023 అవార్డుకు గాను నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారిని ఎంపిక చేశారు. ఈనెల 25 నాడు గుంటూరు లో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సామాజిక సేవా రంగంలో సేవలందిస్తు పలువురికి ఈ అవార్డు అందించనున్నారు. కాగా నల్గొండ జిల్లాలో పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్న సామాజిక కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త సాదిక్ పాషా గారికి తెలుగు వెలుగు జాతీయ విశిష్ట సేవా రత్న పురస్కారం అందజేయనున్నారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ గొల్లగూడ హాస్పిటల్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంచిన కార్యకర్తలు

నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ గొల్లగూడా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు బ్రెడ్ లు పంచిన నల్గొండ 17వ వార్డు ముఖ్య కార్యకర్తలు

నల్గొండ మున్సిపల్ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా గొల్లగూడ హాస్పిటల్ లో పేషంట్లకు అరటిపండ్లు, బ్రెడ్లు పంచిన 17వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు దొంత రవి, మిర్యాల కిరణ్ కుమార్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు సైదిరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తాము పండ్లను బ్రెడ్లను పంచామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 17 వార్డు ముఖ్య నాయకులు కట్ట హనుమంతు, షేక్ అన్వర్, సుధీర్, వంశీ, యోగానందం, మొహమ్మద్ ఉమీర్,మధు పాల్గొన్నారు.

ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలి.

మృతుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం తో పాటు,భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి.

 ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన బి.ఎస్.పి  ముఖ్య కార్యకర్త సమావేశంలో మునుగోడు నియోజకవర్గం నాయకులు పెండెం  ధనుంజయ నేత పాల్గొని మాట్లాడుతూ  

 కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప గిస్తున్నది. అందు కోసం ఆయా రంగాల రెగ్యులర్ ఉద్యోగులను తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతున్నది. 

రెండు జూన్ రాత్రి ఏడున్నర గంటలకు జరిగిన ప్రమాదం కూడా రైల్వేలో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక పరిణామా ల ఫలితమే నని రైల్వే కార్మికులు అంటున్నారు.

ప్రైవేటీ కరణ వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గించారు. ట్రాక్ పరిశీలన చేసే వాళ్లు తగ్గి పోయారు. ఇంకో వైపు ఈ పాత ట్రాక్ ల మీదనే వేగంగా నడిచే వందే భారత్ రైళ్లు ప్రవేశ పెడుతున్నారు. 

ఏకారణాలతో పట్టాలు ఎలా మారుతున్నాయో పరిశీలన లేదు. రైల్వే శాఖ వైఫల్యానికి ఆ రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారి నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఇవి కేవలం ప్రమాద మరణాలు కావు. రైల్వే శాఖ చేసిన హత్యలు. 

మహబూబ్ నగర్ జిల్లా లో అప్పన్న పల్లి దగ్గర రైల్ ప్రమాదం జరిగినప్పుడు రైల్వే శాఖ మంత్రి గా ఉండిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జరిగింది అంతకన్నా మూడు నాలుగు రెట్లు పెద్ద తీవ్ర ప్రమాదం. 

 కరుణ గల భారత ప్రజలందరూ ఈ ప్రమాదాన్ని ప్రభుత్వ వైఫల్య మని గుర్తించాలని బాధితులకు న్యాయం కోసం కృషి చేయాలని కోరుతున్నాము. 

ప్రధాన మంత్రి, రైల్వే మంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటనలు చేస్తూ కన్నీరు కారుస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వీరందరూ దేశంలో అమలు అవుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విధానాలకు బాధ్యులు. ఈ మరణాలకు కూడా వీరు బాధ్యత వహించాలి. 

ప్రతి బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల పరిహారం తో పాటు ప్రతి కుటుంబానికి ఒక భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. 

ఊహించకుండా మృత్యు వాత పడిన, కోలుకోలేని విధంగా గాయాల బారిన పడిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తూ...

 ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి  నాయకులు బొట్టు శివ, పందుల సూరన్న, హరీష్, తీగల రమేష్, శివ, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగురాలు అయినా అవివాహితపై అగాయిత్యం చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం వెంటనే శిక్షించాలి: Ts వికలాంగుల జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ కుమారస్వామి

దివ్యాంగురాలైన అవివాహితపై అఘాయిత్యం చేసిన వ్యక్తిపై 2016 చట్టం అమలు చేయాలి.

తెలంగాణ వికలాంగుల-జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్

     వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండల కేంద్రంలోని పత్రిక మిత్రులతో తెలంగాణ వికలాంగుల జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు ఎన్ని చట్టాలు వచ్చిన,ఎన్ని ప్రభుత్వాలు మారిన మా పరిస్థితులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు.

   2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 కేసు అమలు చేస్తే దివ్యాంగ మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.బాపునగర్ గ్రామానికి చెందిన వివాహిత దివ్యాంగురాలుపై అదే గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కారోబార్ (మల్టీ పర్పస్ వర్కర్)గా పనిచేస్తున్న గుగులోత్ రాజు అఘాయిత్యానికి పాల్పడి పలుమార్లు అత్యాచారం చేశాడనీ వెంటనే కారోబార్ విధులనుంచి తొలిగించి ఆ వ్యక్తిపై 2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 కేసు అమలు చేసి కఠినంగా శిక్షించి తగిన విధంగా చర్య తీసుకొని జైలుకి పంపించాలని డిమాండ్ చేశారు.

   ఆ దివ్యాంగ మహిళకి తగిన న్యాయం జరగాలంటే అత్యాచారం చేసిన గుగులోత్ రాజుపై 2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 అమలు చేస్తే ఆ మహిళకి తగిన న్యాయం జరుగుతుందనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వికలాంగుల-జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి కోరారు.