/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు Yadagiri Goud
కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు

సిద్దిపేట జిల్లా :జులై 15

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చికెళ్లిన ఘటన శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.

ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్ రెండుసార్లు అధికారం చేపట్టినా అభివృద్ధి ఫలితం శూన్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించి రాజకీయ పబ్బంగడుపుకుంటుందని ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోని దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని తీవ్రంగా విమర్శించారు. పంట నష్ట పరిహారం ఇస్తానని బస్సు ప్రయాణం చేసిన సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి 10000 ఇచ్చి రాష్ట్రమంతా ఎగబెట్టాడని, అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చుకెళ్ళారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు......

రేపే లాల్ దర్వాజా బోనాల జాతర.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని..

హైదరాబాద్ :జులై 15

రేపే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

పెద్ద ఎత్తున భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకానున్నారు. జూలై 16, 17వ తేదీల్లో రెండు రోజులపాటు అమ్మవారికి బోనాల సమర్పించుకోవడంతోపాటుఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు, ఇంతగానో తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే ఘట్టం రంగం కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన పటిష్ట ఏర్పాటు, ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుండి ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించారు. మహా హారతికి వేల సంఖ్యలో ఆలయం బయట మహిళలు అందరూ నిలబడి అమ్మవారికి హారతి ఇచ్చారు. ఇక ఈ వచ్చే ఆదివారం సోమవారం లాల్ దర్వాజా లో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది....

ఇంటి వద్దకే పోలీసు సేవలు..రాచకొండ సీపీ DS చౌహన్

రాచకొండ:జులై 15

నిరాధారణకు గురవుతున్న పిలల్లు, మహిళలు, బాధితులు ఎవరైనా పోలీసు స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉంటే వారు 8712662111 రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నెంబర్ నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసు సేవలు తక్షణమే అందుతాయని కమిషనర్ డీఎస్ చౌహన్ భరోసా ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా కమిషనరేట్ పరిధిలో సీపీ చౌహన్ పలు పీఎస్‌లను సందర్శించినప్పుడు ఈ నెంబర్ ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేస్తున్నారు. దీంతో పాటు పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై సొంత నిర్ణయంతో కాకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని.. న్యాయం అందేలా అధికారులు పనిచేయాలని సీపీ సూచిస్తున్నారు.

ఈ విధంగా సీపీ చౌహన్ ప్రజల్లో పోలీస్ ప్రతిష్టను పెంచేలా తన మార్క్ వ్యూహలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే నేరాల నియంత్రణలో తనదైన శైలిలో వ్యవహిరిస్తోన్న సీపీ.. వాహనాల నెంబర్ ప్లేట్‌లను ప్రతి వాహనదారుడు పెట్టుకునేలా చేస్తున్నారు. దీంతో నేరాలు జరిగినప్పుడు నేరగాళ్ళు ఉపయోగించిన వాహనాలను వెంటనే గుర్తించి క్రిమినల్స్‌ను కటాకటాలోకి నెడుతున్నారు. ప్రజలు కూడా శాంతి భద్రతలను వారి చేతుల్లోకి తీసుకోవద్దని.. పోలీసులు మీకు న్యాయం జరిగేలా అందుబాటులో ఉంటారనే సీపీ హామీ ఇస్తున్నారు...

నేడు హైదరాబాద్ కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ రాక

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ తన 12వ స్నాతకోత్సవ వేడుకను జూలై 15, శనివారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించబోతోంది. దాదాపు 1,000 మంది విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్ అందించే వివిధ విభాగాల్లో డిగ్రీలు అందుకోనున్నట్లు ఐఐటీ పత్రిక ప్రకటనలో పేర్కొంది.

ఐ ఐ టి హెచ్‌లో ఉన్న సమయంలో పెంపొందించుకున్న జ్ఞానం మరియు నైపుణ్యాలతో వారి వృత్తిపరమైన వృత్తిలోకి అడుగుపెట్టినందున,

ప్రొఫెసర్ బీ యస్ మూర్తి ఐఐటి హైదరాబాద్ కంది డైరెక్టర్ ఒక పత్రికా ప్రకటన పేర్కొంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ మరియు స్పేస్ కమిషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్ హాజరై స్నాత కోత్సవ ప్రసంగాన్ని కూడా చేయనున్నారని ఆయన తెలిపారు...

మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు

హైదరాబాద్ :జులై 15

హైదరాబాద్‌లో పలుచోట్ల మసాజ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లోని పలు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 34 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

SB NEWS

హైదరాబాద్ లో యువకుడిపై కాల్పులు కలకలం

హైదరాబాద్:జులై 15

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్ పేట్ లోని సెలబ్రిటీ క్లబ్ లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. సిద్దార్ధ్ దాస్ అనే వ్యక్తిపై మరో యువకుడు ఈ కాల్పులు చేసినట్టు తెలుస్తుంది.

దీనితో బాధితుడు శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కాల్పులు జరిపిన యువకుడు సిద్దార్ధ్ దాస్ కు తెలిసిన వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి సెల బ్రిటీ క్లబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే ఈ కాల్పులకు సంబంధించి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాత కక్షలతోనే ఈ కాల్పులు జరిగాయా? లేక మరే ఇతర కారణాలున్నాయనేది తేలాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఆచూకీని చూస్తున్నారు........

కుంటాల జలపాతం వద్ద యువతి ఆత్మహత్యాయత్నం సినిమా తరహాలో కాపాడిన పోలీసులు

ఆదిలాబాద్ జిల్లా :జులై 15

యూట్యూబర్ యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో శుక్రవారం సాయంత్రం దూకి చనిపోయేందుకు సిద్ధమైన యూట్యూబర్ ను పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. అయితే ఆత్మహత్యాయత్నానికి మానసిక స్థితే కారణంగా తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మధురానగర్ కాలనీకి చెందిన మైథిలి ఇంట్లో వారికి చెప్పకుండా శుక్రవారం ఉదయం కుంటాల జలపాతానికి బయలు దేరింది.

అయితే వెంటనే తండ్రి ఎల్లారెడ్డి మధురానగర్ పీఎస్ లో కంప్లైంట్ చేవారు. మధురానగర్ పోలీసులు నేరడిగొండ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు విషయాన్ని గ్రామ సర్పంచ్ అశోక్ కు తెలిపారు. సర్పంచ్, ఫారెస్ట్ అధికారులు మెట్లు దిగుతున్న యువతిని పట్టుకున్నారు. అక్కడినుంచి పీఎస్‌కు తరలించారు. నేరడిగొండకు చేరుకున్న తండ్రికి కూతురిని అప్పగించారు. యాక్టివ్ గా ఉండే మైథిలి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు...

PM Modi : ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి.. తెలంగాణ చీర..

పారిస్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు..

అలాగే మెక్రాన్‌ సతీమణికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్‌ ఇక్కత్‌ చీరను అందజేశారు. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా మోదీకి పలు బహుమతులను మెక్రాన్‌ అందజేశారు.

కాగా, శుక్రవారం పారిస్‌లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్‌ డే పరేడ్‌ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే..

నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

హైదరాబాద్ :జులై 15

నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్గా చలామణి అవుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సర్టిఫికెట్ను సమకూర్చిన మరో వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్నుమా ప్రాంతానికి చెందిన ఖాజా ముజామిలుద్దీన్ (29) ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అనంతరం మాసబ్ ట్యాంక్ లోని ఓ దంత వైద్యశాలలో పనిచేశాడు.

దీనిని ఆసరాగా చేసుకుని తన స్నేహితుడు సయ్యద్ అబ్దుల్ అస్లాం ద్వారా కర్నాటక నుంచి నకిలీ బీడీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ పొందాడు. ఇలా 2020 నుంచి ఫలక్నుమాలో ఆక్సీజన్ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. దీని పై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్, శాలిబండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వైద్య సామాగ్రి, నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు....

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :జులై 15

తిరుమలలో భక్తుల రద్దీ నేడు శనివారం కొనసాగుతోంది. వీకెండ్ అయినప్పటికీ నిన్నటితో పోలిస్తే నేడు భక్తుల రద్దీ కాస్త తక్కువగానే ఉంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.శుక్రవారం 71,472 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...