/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు Yadagiri Goud
మసాజ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు

హైదరాబాద్ :జులై 15

హైదరాబాద్‌లో పలుచోట్ల మసాజ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లోని పలు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 34 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

SB NEWS

హైదరాబాద్ లో యువకుడిపై కాల్పులు కలకలం

హైదరాబాద్:జులై 15

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శామీర్ పేట్ లోని సెలబ్రిటీ క్లబ్ లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. సిద్దార్ధ్ దాస్ అనే వ్యక్తిపై మరో యువకుడు ఈ కాల్పులు చేసినట్టు తెలుస్తుంది.

దీనితో బాధితుడు శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే కాల్పులు జరిపిన యువకుడు సిద్దార్ధ్ దాస్ కు తెలిసిన వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి సెల బ్రిటీ క్లబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే ఈ కాల్పులకు సంబంధించి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాత కక్షలతోనే ఈ కాల్పులు జరిగాయా? లేక మరే ఇతర కారణాలున్నాయనేది తేలాల్సి ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పులు జరిపిన యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఆచూకీని చూస్తున్నారు........

కుంటాల జలపాతం వద్ద యువతి ఆత్మహత్యాయత్నం సినిమా తరహాలో కాపాడిన పోలీసులు

ఆదిలాబాద్ జిల్లా :జులై 15

యూట్యూబర్ యువతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో శుక్రవారం సాయంత్రం దూకి చనిపోయేందుకు సిద్ధమైన యూట్యూబర్ ను పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. అయితే ఆత్మహత్యాయత్నానికి మానసిక స్థితే కారణంగా తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మధురానగర్ కాలనీకి చెందిన మైథిలి ఇంట్లో వారికి చెప్పకుండా శుక్రవారం ఉదయం కుంటాల జలపాతానికి బయలు దేరింది.

అయితే వెంటనే తండ్రి ఎల్లారెడ్డి మధురానగర్ పీఎస్ లో కంప్లైంట్ చేవారు. మధురానగర్ పోలీసులు నేరడిగొండ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు విషయాన్ని గ్రామ సర్పంచ్ అశోక్ కు తెలిపారు. సర్పంచ్, ఫారెస్ట్ అధికారులు మెట్లు దిగుతున్న యువతిని పట్టుకున్నారు. అక్కడినుంచి పీఎస్‌కు తరలించారు. నేరడిగొండకు చేరుకున్న తండ్రికి కూతురిని అప్పగించారు. యాక్టివ్ గా ఉండే మైథిలి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు...

PM Modi : ఫ్రాన్స్‌ అధ్యక్షుడి సతీమణికి.. తెలంగాణ చీర..

పారిస్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందజేశారు..

అలాగే మెక్రాన్‌ సతీమణికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్‌ ఇక్కత్‌ చీరను అందజేశారు. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా మోదీకి పలు బహుమతులను మెక్రాన్‌ అందజేశారు.

కాగా, శుక్రవారం పారిస్‌లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్‌ డే పరేడ్‌ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే..

నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

హైదరాబాద్ :జులై 15

నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్గా చలామణి అవుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సర్టిఫికెట్ను సమకూర్చిన మరో వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫలక్నుమా ప్రాంతానికి చెందిన ఖాజా ముజామిలుద్దీన్ (29) ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అనంతరం మాసబ్ ట్యాంక్ లోని ఓ దంత వైద్యశాలలో పనిచేశాడు.

దీనిని ఆసరాగా చేసుకుని తన స్నేహితుడు సయ్యద్ అబ్దుల్ అస్లాం ద్వారా కర్నాటక నుంచి నకిలీ బీడీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ పొందాడు. ఇలా 2020 నుంచి ఫలక్నుమాలో ఆక్సీజన్ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. దీని పై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్, శాలిబండ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వైద్య సామాగ్రి, నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు....

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :జులై 15

తిరుమలలో భక్తుల రద్దీ నేడు శనివారం కొనసాగుతోంది. వీకెండ్ అయినప్పటికీ నిన్నటితో పోలిస్తే నేడు భక్తుల రద్దీ కాస్త తక్కువగానే ఉంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.శుక్రవారం 71,472 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 31,980 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Chandrayaan-3: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3..

Chandrayaan-3: LVM-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. జాబిల్లి దక్షిణ ధృవం దగ్గర దిగడమే టార్గెట్ ఈ ప్రయోగం సాగుతోంది..

24 రోజుల పాటు రాకెట్ భూమి చుట్టూ తిరగనుంది. 613 కోట్లు బడ్జెట్‌తో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. 3 వేల 900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 .. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో ప్రకటించింది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రయాన్‌పై దిగి ప్రయోగాలు చేయనుంది. చంద్రుడి ఉపరితలాన్ని రోవర్ అధ్యాయనం చేయనుంది.

వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధృవం దగ్గర దిగితే- జాబిల్లిపై ప్రయోగాల్లో ప్రపంచ దేశాలకు ఇప్పటిదాకా అందని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనుంది ఇస్రో. దక్షిణ ధృవం దగ్గర ఉపగ్రహాన్ని ల్యాండ్ చేసిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది..

Supreme Court: సుప్రీం కోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం..

దిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌. వెంకటనారాయణ భట్‌ నేడు బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

2011లో గువాహటి హైకోర్టులో భూయాన్‌ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2022 జూన్‌ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తాజాగా సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ట్యాక్సేషన్‌ లాలో ప్రత్యేక నైపుణ్యం పొందారు. ఆయన బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ సేవలందించి ట్యాక్సేషన్‌తో పాటు విభిన్న రంగాలకు సంబంధించిన కేసులను విచారించారు. ఆయన తీర్పుల్లో చట్టం, న్యాయానికి సంబంధించి విస్తృత కోణాలను స్పృశించారు.

మరోవైపు జస్టిస్‌ వెంకట నారాయణ భట్‌ 2013లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో తొలిసారి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2019లో ఆయన్ను కేరళ హైకోర్టుకు బదిలీ చేశారు. అక్కడ ఆయన 2023 జూన్‌ నుంచి ప్రధాన న్యాయమూర్తిగా అదే కోర్టులో బాధ్యతలను స్వీకరించారు. వీరిద్దరి రాకతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32 నుంచి 34కు చేరింది..

Cheetah: మరో చీతా మృతి.. నాలుగు నెలల్లో 8వ ఘటన..

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో చీతాల మరణాలు ఆగడం లేదు! రెండు రోజుల క్రితమే మగ చీతా (Cheetah) 'తేజస్‌' మృత్యువాతపడగా..

నేడు 'సూరజ్‌' అనే మరో మగ చీతా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు నెలల వ్యవధిలో ఈ పార్కులో మృతి చెందిన చీతాల్లో ఇది ఎనిమిదో చీతా కావడం గమనార్హం.

దీన్ని నమీబియా నుంచి తీసుకొచ్చారు. అయితే, సూరజ్‌ మృతికిగల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు..

హరీష్ రావు‌ను కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!

తెలంగాణలో రాజకీయాలు రసవతరంగా మారాయి. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటి అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. గత కొంతకాలంగా రాజాసింగ్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయ్. ఈ తరుణంలోనే బిజెపి నేతలు కొంతమంది ఇతర పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం ఉపందుకుంది. ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా తరుణంలోనే మంత్రి హరీష్ రావును బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరుతారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా... అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం లేనిది ఎన్నికల ముందు ఒక్కసారిగా కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడుతున్నారని ప్రచారం ఊపు అందుకున్న తరుణంలో రాజాసింగ్ బీఆర్ఎస్ మంత్రితో భేటీ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది......