/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz దోస్త్ హెల్ప్ డెస్క్ నిర్వహణకు అనుమతి Mane Praveen
దోస్త్ హెల్ప్ డెస్క్ నిర్వహణకు అనుమతి
నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గన్ శ్యామ్ ను, బుధవారం  స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దోస్తు(డిగ్రీ) ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల సందేహాల కొరకు, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో HELP-DESK నిర్వహించుటకు అనుమతి తీసున్నట్లు ఆకులపల్లి నరేష్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేడి వాసుదేవ్, ఇట్టమల్ల రాకేష్ ఉన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని  20వ వార్డులో ఉన్నటువంటి తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల/ జూనియర్ కళాశాలలో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయడం కొరకు బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు.        కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బాబా షరీఫ్, ప్రిన్సిపాల్ సరోజినీ, పాఠశాల చైర్మన్ చింతల సాయిలు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
లెంకలపల్లి లో ముమ్మరంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో  గామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ సూచనల మేరకు ముమ్మరంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణ శాఖ వారు నేడు, రేపు వర్షాలు అనే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది కందికంటి స్వామి, గ్రామస్తులు దాసరి వెంకన్న, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
జీవో 60 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి: చినపాక లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఆరవ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ.. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, 60 జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని, గ్రామపంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి ఊరి పక్క లింగయ్య, పోలేపల్లి రాములు, నక్క నరసింహ, పెరుమాండ్ల మంజుల, అమ్రాబాద్ సునీత, ఐతపాక పద్మ, సిల్వేరు రమేష్, లక్ష్మీకాంత్ గుండెపురి నరసింహ, ఆవుల ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు
బిఆర్ఎస్ పార్టీలో చేరిన చామలపల్లి వార్డ్ మెంబెర్
నల్లగొండ జిల్లా, చండూర్ మండలంలోని చామలపల్లి గ్రామం నుండి వార్డ్ మెంబెర్ కొండల్, యూత్ అధ్యక్షుడు,  వారితో పాటు పలువురు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇతర పార్టీ నుండి, నేడు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో జాయిన్ అయినవారు మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
ఐదవ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సోమవారం 5వ రోజుకు చేరుకుంది. సిఐటియు కార్యాలయం నుండి మర్రిగూడ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. జిపి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ఒట్టిపళ్లి హనుమంతు, ఊరిపక్క లింగయ్య పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల మహాధర్నా
నల్లగొండ: ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సలీం మాట్లాడుతూ.. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ 26,000 చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటి చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాల జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూ లో 77 మంది విద్యార్థులు ఎంపిక
నల్గొండ: ఈరోజు ఎన్జీ కళాశాలలో రసాయన శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ కెమికల్ ల్యాబ్ సహకారంతో జాబ్ డ్రైవ్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఘన శ్యామ్ తెలిపారు.       రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూకి 136 మంది హాజరు కాగా, 77 మంది  విద్యార్థులు ఎంపికయ్యారని, ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజన వసతి మరియు ఉన్నత విద్యలో కూడా అవకాశం ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, నాగిరెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు,ముత్తయ్య, యాదగిరి, దుర్గాప్రసాద్ తదితరులు అధ్యాపకులు, ఎమ్ ఎస్ ఎన్ ల్యాబ్ మేనేజర్ బ్రహ్మానంద రెడ్డి, మోహన్ , ప్రశాంత్ పాల్గొన్నారు.
'హోటల్ కుటీరం' ను ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో హైదరాబాద్ - విజయవాడ హైవే పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన "హోటల్ కుటిరం" ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లు  ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోటల్ యాజమాన్యం నాణ్యమైన సేవలను అందిస్తూ మంచి పేరు పొందాలని అన్నారు.
జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా
నల్లగొండ జిల్లా: గీత కార్మికులు హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రీపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జులై 10న నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కల్లుగీత కార్మికుల సొసైటీలో సభ్యులందరికీ మోటార్ బైకులు, సేఫ్టీ మోకులు అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల వృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తామన్నా లక్ష రూపాయల ఆర్థిక సహాయంచేయాలని, సొసైటీలకు భూమి, కల్లుకు మార్కెట్, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రభుత్వం 5వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని అన్నారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, గీత కార్మికులకు మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని వారు అన్నారు. జులై 10న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు  వేలాది మంది గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అయితగోని పాపయ్య, సొసైటీ ఉపాధ్యక్షులు బోడ అంజయ్య, కార్యదర్శి అయితగోని మల్లయ్య, కారింగి నరసింహ గౌడ్, బురుకల లక్ష్మయ్య గౌడ్, అయితగోని అంజయ్య గౌడ్, అయితగోని వెంకటయ్య గౌడ్, తిరుపతయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.