/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కీలక నోట్ Yadagiri Goud
బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కీలక నోట్

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వినూత్న కార్యక్రమాలతో జనాల్లోకి చొచ్చుకెళ్లారు. ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన చేసిన ప్రజా సంగ్రామ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

ఒకనొక దశలో అధికార బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి రావడానికి కారణం బండి సంజయ్ అనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. ఇవాళ జులై 11 బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కీలక నోట్ విడుదల చేశారు.

ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు తెలియజేయునది ఏమనగా నా జన్మదినం సందర్భంగా ఇవాళ విశ్వనాథుని దర్శన నిమిత్తం నేను వారణాసి వెళ్తున్నాను. అందువల్ల మీకు అందుబాటులో ఉండలేకపోతున్నాను. నేను వచ్చిన తర్వాత మీ అందరినీ ప్రత్యక్షంగా కలుసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ అసౌకర్యానికి అన్యదా భావించవద్దని కోరుకుంటూ... మీ అభిమానం, ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే నాపై కురిపించాలని ఆశిస్తున్నాను.’’ అంటూ పుట్టిన రోజున అభిమాలను బండి సంజయ్ నోట్ విడుదల చేశారు...

ట్రాఫిక్లో చిక్కుకున్న గవర్నర్

హైదరాబాద్లో సోమవారం రాత్రి గవర్నర్ తమిళిసై ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. గవర్నర్ ప్రయాణిస్తున్న వాహనం హెవీ ట్రాఫిక్లో నిలిచిపోయింది. ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్కు వచ్చిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో రాజ్భవన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఖైరతాబాద్, ఎర్రమంజిల్ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతోనే ఇట్లా జరిగిందని తెలుస్తోంది. కాగా, గవర్నర్ భద్రతా సిబ్బంది ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇక.. చలాన్లు వేయడంలో, వేహికల్స్ని ఆపి ఫొటోలు తీయడంలో ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో చూపించడం లేదని, రోజూ 50 కేసుల టార్గెట్ల పేరుతో కానిస్టేబుళ్లను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అసలు విషయమ్మీద ఫోకస్ పెట్టకపోతే గుడ్ కాప్స్ అన్న పేరు కాస్త బ్యాడ్ కాప్స్గా మారే ప్రమాదం ఉందని చాలామంది అంటున్నారు.....

అనసూయ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం : ఉందా ❓️

•ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి అయితే తొలి మహిళ

•గిరిజన, మాజీ మావోయిస్టుగా రికార్డు

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీతక్క అలియాస్‌ దాసరి అనసూయ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా!? తెలంగాణలో ఆ పదవిని చేపట్టబోయే తొలి మహిళగా.. తొలి గిరిజన నాయకురాలిగా ఆమె నిలవనున్నారా!? ఇంకా చెప్పాలంటే, ఒకప్పుడు తుపాకీ పట్టిన మాజీ మావోయిస్టు రాజ్యాధికారాన్ని అంది పుచ్చుకుని చరిత్ర సృష్టిస్తారా!? అంటే.. ‘సందర్భం వస్తే.. సీతక్కను ముఖ్యమంత్రిని చేయవచ్చు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి!

ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న తానా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా, సోమవారం ఎన్నారైలతో రేవంత్‌ సమావేశమయ్యారు. పలువురు ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా, ‘తెలంగాణలో 18 శాతంగా ఉన్న ఎస్సీల నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా ఫోకస్‌ చేస్తున్నారు. మరి, 12 శాతంగా ఉన్న ఎస్టీల నుంచి సీతక్కను ఉప ముఖ్యమంత్రిగాఫోకస్‌ చేస్తారా!?’ అని సమావేశంలో ఓ ఎన్నారై ప్రశ్నించారు. దానికి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ‘‘మీరు కాంగ్రెస్‌ పార్టీ బిగ్‌ పిక్చర్‌ చూడట్లేదు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షునిగా పార్టీ చేసింది. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే.. వాటిలో మూడుచోట్ల ముఖ్యమంత్రులు ఓబీసీలే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల పక్షాన పార్టీ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు పోతోంది.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించడం కాంగ్రెస్‌ సంప్రదాయం కాదు. అయినా.. ఎన్నారైలు ఇచ్చిన సూచనపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటాం. మీరు సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా!? అని అడిగారు కదా? ఆ సందర్భం వస్తే అక్కను సీఎంగా కూడా చేయవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ ఒక పాలసీతో ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులో వారికి విస్తృత అవకాశాలు ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు; రాజధానిగా అమరావతి నిర్మాణానికి కాంగ్రెస్‌ చొరవ తీసుకుందని, ఆ రెండిటినీ పూర్తి చేయడం పార్టీ సిద్ధాంతమని తెలిపారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి తమకు సహకరించాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు. తనను, కాంగ్రెస్‌ పార్టీని వేర్వేరుగా చూడడం సరికాదని, తెలంగాణలో కాంగ్రెస్‌ అంటే రేవంత్‌ రెడ్డి.. రేవంత్‌ అంటే కాంగ్రెస్‌ అని చెప్పారు...

ఇల్లు కట్టుకో బిడ్డా.. మంజూరు చేస్తా.. పోచారం

ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు సూచించారు.

సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో సోమవారం సాయంత్రం పర్యటించారు

కురుమ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న ఆయన.. దారిలో రేకుల షెడ్డు, దానిపై పాలిథీన్‌ కవర్‌ కప్పిన ఇంటిని చూసి చలించిపోయారు. రేకుల షెడ్డు ముందు తన బగ్గీ వాహనాన్ని ఆపి ఇంట్లో ఉన్న మహిళతో మాట్లాడారు. గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకోవాలని మహిళకు సూచించారు. గ్రామ సర్పంచ్‌ను పిలిచి పేద కుటుంబం ఇల్లు నిర్మించుకునేలా సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆ మహిళ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది.

ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని వెల్లడించింది.

సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా వేంసూరులో 56 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్‌ జిల్లా కేశవరంలో 18.3, ఖమ్మం జిల్లా పంగిడిలో 11.5, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 11 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.....

జర్నలిస్టు ఫోన్‌ సీజ్‌ చేయడానికి వీల్లేదు: కేరళ హైకోర్టు..

ఓ కేసుకు సంబంధించి విచారణ పేరుతో ఓ జర్నలిస్టు ఫోన్‌ను పోలీసులు సీజ్‌ చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. చట్టం నిర్దేశించిన నిబంధనలు అనుసరించకుండా జర్నలిస్టు ఫోన్‌ను సీజ్‌ చేయడానికి వీల్లేదని పేర్కొంది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో ‘నాలుగో స్తంభం’లో భాగమని.. ఏదైనా కేసులో వారి ఫోన్‌ అవసరమని భావిస్తే, సీఆర్‌పీసీ నిబంధనలను అనుసరించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే..?

కేరళకు చెందిన షాజన్‌ స్కారియా అనే వ్యక్తి.. ఓ యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. అయితే, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలతో తన పరువు తీశాడని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పీవీ శ్రీనిజిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. స్కారియాతో జి.విశాఖన్‌ అనే ఓ మలయాళ జర్నలిస్టుకు వార్తల విషయంలో కొద్దిపాటి పరిచయం ఉంది.

సంబంధం లేకపోయినా..

ఈ క్రమంలోనే షాజన్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. విచారణలో భాగంగా పోలీసులు వేధిస్తున్నారని విశాఖన్‌ ఆరోపించారు. ఇదే విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంట్లో అక్రమంగా సోదాలు (జులై 3న) జరిపారని.. భయభ్రాంతులకు గురిచేస్తూ తన ఫోన్‌ను సీజ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనను వేధించొద్దంటూ పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సోదాలు నిర్వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పోలీసుల తీరు తప్పు..

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పీవీ కున్హి కృష్ణన్‌.. ఈ కేసులో పోలీసుల తీరును తప్పుపట్టారు. సదరు జర్నలిస్టు నేరంలో భాగస్వామ్యం కాదని.. అలాంటప్పుడు ఫోన్‌ సీజ్‌ చేయడం జర్నలిస్టు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని మౌఖికంగా అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడి ఫోన్‌ అవసరమని భావిస్తే నిబంధనలు పాటించాలన్నారు. ఫోన్‌ను సీజ్‌ చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పోలీసులు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేసింది.

తెలంగాణ రూటే సపరేటు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధోకారికంగా అనగా కేవలం వార్తలు రాశారు లేదా వార్తలను చూపారనే ఉద్దేశ్యంతో 47మంది జర్నలిస్టుల (అనధికారికంగా 173 కేసులలో వివిధ రూపాలలో జర్నలిస్టు)లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులలో వందకు పైగా ఫోన్లు సీజ్ చేశారను.

నల్గొండ కేసులో.. ఫోన్లు గాయబ్.._

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక పరిశోధన పాత్రికేయుడి అరెస్ట్ సందర్భంగా పది ఫోన్లు, ఒక ల్యాబ్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆ మేరకు పంచనామా కూడా న్యాయస్థానంలో దాఖలాలు చేశారు. అయితే

తాజాగా కేసు కథ ముగిసింది. సీజ్ చేసిన ఫోన్లనో నాలుగు ఫోన్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై హైకోర్టులో కేసు ఉండటం గమనార్హం. ఈ విషయంలో పోలీసులపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు, హైకోర్టు న్యాయవాది యల్లంకి పుల్లారావు చెప్పారు.

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ

తిరుపతి :జులై 11

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం 64,347 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,358 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.....

రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు… హరీష్ రావు

తెలంగాణ‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. పటాన్ చెరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ తో కలిసి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రక్కన ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జిహెచ్ఎంసి వార్డు కార్యాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు.

పట్టణ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ భవనాన్ని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జీఎంఆర్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

రిజెక్టెడ్ లీడ‌ర్లు, స్క్రాప్ లీడర్లు జాయిన్ అయితే పోయేది లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్ర‌మేన‌ని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్య‌మ‌న్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పట్టణవాసులు పాల్గొన్నారు...

Tomato Robbed: మార్కెట్‌కు తరలిస్తుండగా రెండు వేల కిలోల టమాటాల చోరీ..

బెంగళూరు: మార్కెట్‌లో ప్రస్తుతం టమాటా (tomatoes)ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చోరీల ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. మొన్నటికిమొన్న కర్ణాటకలో ఓ రైతు పొలంలో 60 బస్తాల టమాటాలను ఎత్తుకెళ్లారు..

తాజాగా టమాటాలను మార్కెట్‌కు తరలిస్తున్న వాహనాన్ని దొంగతనం చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చిక్కజాల సమీపంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులు కథనం ప్రకారం.. చిత్రదుర్గలోని ఓ రైతు కోలార్‌ మార్కెట్‌కు 2 వేల కిలోల టమాటాలను తరలిస్తుండగా ముగ్గురు దుండగులు కారులో ఆ వాహనాన్ని అనుసరించారు. తమ వాహనాన్ని ఆ రైతు ఢీకొట్టాడని ఆరోపిస్తూ.. రైతు, డ్రైవరుపై దాడి చేశారు. అనంతరం వారిని నష్టపరిహారం కూడా డిమాండ్‌ చేశారు. అలా వారి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత రైతు, డ్రైవరును రోడ్డుపై వదిలేసి దుండగులు టమాటాల వాహనంతో పారిపోయారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల గురించి గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. చోరీ ఘటనలు పెరుగుతుండటంతో రైతులు పొలాల వద్ద టెంట్లు వేసి కాపలా కాస్తున్నారు..

తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం భద్రత కేటాయింపు

తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్ ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్‌ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది.

హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటలకు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు.

అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అర్వింద్‌కు సెక్యూరిటీగా ‘వై' కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. ఈరోజు సోమవారం ఈటల, అరవింద్ నివాసాలకు కేంద్ర భద్రతా బలగాలు వెళ్లనున్నారు.