/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్‌ Yadagiri Goud
నేడు సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్‌

వైఎస్సార్‌ జిల్లా: జూలై 08

నేటి నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు.శనివారం దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకోనున్న సీఎం.. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం తిరిగి ఇడుపులపాయలో

తన నివాసానికి సీఎం చేరుకోనున్నారు.

9వ తేదీ పర్యటన

రెండో రోజు పర్యటనలో భాగంగా 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకోనున్న సీఎం జగన్‌.. గండిపేట వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ ఆఫీసు భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.

అనంతరం పులివెందుల, రాణి తోపు చేరుకుని నగరవనం ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్‌ ఫ్రెంట్‌ చేరుకుని.. గరండాల కెనాల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌ –1 పనులను సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్‌ ఐఎస్‌టిఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్‌ బయో సైన్సెస్‌ను సీఎం ప్రారంభించున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు.

10వ తేదీ పర్యటన

మూడో రోజూ వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్‌ మార్గ్, రాజీవ్‌ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లనున్న సీఎం.. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్‌ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు.........

గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా సాయిచంద్‌ సతీమణి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్‌డబ్ల్యూసీ) చైర్‌పర్సన్‌గా వేద రజినిని ప్రభుత్వం నియమించింది. ఈ సంస్థ చైర్మన్‌గా ఉన్న గాయకుడు సాయిచంద్‌ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సాయిచంద్‌ భార్య రజినికే ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ మేరకు సాయిచంద్‌ భార్య రజినిని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివంగతులైన బీఆర్‌ఎస్‌ నేతలు సాయిచంద్‌, కుసుమ జగదీశ్‌ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇరువురి కుటుంబాలకు రూ.కోటిన్నర చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. వారి పిల్లలు, తల్లిదండ్రుల పేరిటరూ.25 లక్షల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని ప్రకటించారు. సాయిచంద్‌ సతీమణికి గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చామని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మొదటి నుంచి ఉద్యమంలో తమతోపాటు కలిసి పనిచేశారని గుర్తుచేశారు. 2001 నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కు అనుంగు సహచరుడిగా, యువజన విభాగం నాయకుడిగా పనిచేశారని చెప్పారు. చిన్న వయసులో కుసుమ జగదీశ్‌ మరణించడం బాధాకరమని, ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌, తమ్ముడు సాయిచంద్‌ చాలా చిన్న యవసులో అకాలమరణం చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరి అకాల మరణం పట్ల పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తీవ్రంగా కలత చెందారని తెలిపారు. పార్టీకి దశాబ్దాలపాటు వారు చేసిన సేవలను గౌరవించి జగదీశ్‌ను జెడ్పీ చైర్మన్‌గా, సాయిచంద్‌ను గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారని చెప్పారు......

మత్స్యకారుల వలలో బంగారు తాబేలు!

శ్రీసత్యసాయిజిల్లా:జూలై 08

మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో శుక్రవారం సాయంత్రం మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది.

గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా చేపలతోపాటు తాబేలు పడింది. ఆ తాబేలు బంగారు రంగులో ఉంది. దానిని చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.

ఆ తాబేలు పలువురు పూజలు చేశారు. ఏదైనా దేవస్థానానికి సంబంధించిన కోనేరులో ఆ తాబేలును వదలాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు

నేడు వరంగల్ కు ప్రధాని రాక

6 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార బీఆర్‌ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ వరంగల్‌ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ సందర్భంగా బీజేపీ విజయసంకల్ప సభ నేపథ్యంలో ఈ సభలో మోదీ రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఇటీవలి పరిణామాలతో రాష్ట్రంలో అయోమయంలో పడిపోయిన బీజేపీ క్యాడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. సరిగ్గా మూడు నెలల క్రితం ఏప్రిల్‌ 8న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. సికింద్రాబాద్‌ రైల్వేస్షేషన్‌ ఆధునికీకరణతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా, పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదని తేల్చిచెప్పారు. దీంతో, అప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించిన దృష్ట్యా.. ఆమెను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా గడచిన మూడునెలల్లో సమీకరణాలు మారాయి. లిక్కర్‌ స్కాం కేసు దర్యాప్తు మందగించింది. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి రాజుకుని క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ వరంగల్‌కు వస్తున్నారు.

భారీగా పోలీసు బందోబస్తు..

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనలో భాగంగా బహిరంగ సభకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో వేదిక సిద్ధమైంది. మోదీ రాక సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించగా, కాంగ్రెస్‌, వామపక్షాలు సైతం మోదీ పర్యటనను నిరసిస్తున్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయా పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. పలువురు ముఖ్యనేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బృందం 24 గంటల ముందే స్వాధీనం చేసుకుంది. కాగా, ప్రధాన మోదీ శనివారం ఉదయం 10.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. మామునూరు విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో దిగుతారు. భద్రకాళి దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ఇక్కడ రూ.6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ.3,441 కోట్ల ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా వరంగల్‌మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ, రూ.2,147 కోట్లతో జగిత్యాలకరీంనగర్‌వరంగల్‌ మధ్య రహదారి పనులు, రూ.521 కోట్లతో చేపట్టనున్న రైల్వే గూడ్స్‌ వ్యాగన్ల తయారీ కేంద్రం ఉన్నాయి. వీటికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం.. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

వర్షం వచ్చినా అంతరాయం కలగకుండా..

బహిరంగ సభకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో సభాప్రాంగణాన్నంతా జర్మన్‌ టెక్నాలజీ టెంట్లతో కప్పేశారు. సభలో ఎక్కడ కూర్చున్నా అందరికీ మోదీ స్పష్టంగా కనిపించేలా పలుచోట్ల డిజిటల్‌ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఒక ప్రధానమంత్రి వరంగల్‌కు రావడం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రధాని ఏమైనా వరాలు ప్రకటించవచ్చునని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీపై ద్వేషంతోనే సీఎం కేసీఆర్‌ వరంగల్‌లో అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. బెంగాల్‌, తమిళనాడు, ఏపీతోపాటు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో కూడా సీఎంలు ప్రొటోకాల్‌ పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని కేసీఆర్‌కు హితవు పలికారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు హీరో అంటూ కీర్తిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు...

తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల :జూలై 08

వీకెండ్ కావడంతో నేడు (శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 69,483 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 32,459 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

ఏ మొహం పెట్టుకొని మోదీ వరంగల్ కు వస్తున్నాడు

ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు.

తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, కానీ రాష్ట్ర పునర్ విభజన హామీలో భాగమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారని, కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారని కేటీఆర్ మండిపడ్డారు.

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు : తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారన్నారు కేటీఆర్. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్....

సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

సంగారెడ్డి జిల్లా:జూలై 07

జహీరాబాద్ అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆబ్కారీ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ కారులో రెండు బాక్సుల్లో తరలిస్తున్న కేజీన్నర బంగారాన్ని పట్టుకున్నారు.

ముంబయి నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న కారులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సరైన పత్రాలు లేకుండా బంగారం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....

కడియం శ్రీహరి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ :;ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

హన్మకొండ:జూలై 07

ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

''కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త. ఆయన మంత్రిగా ఉన్నపుడు నా మాదిగ బిడ్డలను ఎంతోమందిని ఎన్‌కౌంటర్ చేయించాడు.

నేను త్యాగం చేసి పార్టీలోకి వస్తే.. కడియం శ్రీహరి స్వార్థం కోసం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. కడియం శ్రీహరి ఆంధ్రా అల్లుడు.. వారసుడా...? కులం పేరు చెప్పుకునే దమ్ము ఆయనకుందా..?" అని ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు...

ప్రధాని పర్యటన వరంగల్ నగరానికి కొత్త తేజస్సు : కిషన్ రెడ్డి

హనుమకొండ:జూలై 07

ఈరోజు వరంగల్ లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే అని అన్నారు.

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు కోసం పని చేశారని ఎన్నటికైనా ఆ రెండు పార్టీలు కలుస్తాయని తెలిపారు. రేపటి శనివారం బీజేపీ సభ చాలా కీలకమైనదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పర్సంటేజీల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. వాటాల ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. బీజేపీపై కొందరు విషం చిమ్ముతున్నారని.. దీన్ని తిప్పి కొట్టాలన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనపై మోదీ మాట్లాడతారని తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాల్సి ఉందన్నారు. కుటుంబ పార్టీల వల్ల దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన రావాలని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా రోజుకు ఏడు గూడ్స్ బోగీల ఉత్పత్తి జరుగుతుందన్నారు. మోదీ తొలుత మామునూర్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుంచి భద్రకాళీ గుడి, అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాలకు వస్తారన్నారు. ఇక్కడే శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు...

సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చందు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు.

ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామన్నారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని వెల్లడించారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని అన్నారు. ఇరు కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయం ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు. కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు....