/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఏ మొహం పెట్టుకొని మోదీ వరంగల్ కు వస్తున్నాడు Yadagiri Goud
ఏ మొహం పెట్టుకొని మోదీ వరంగల్ కు వస్తున్నాడు

ప్రధాని నరేంద్ర మోదీ పై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని ధ్వజమెత్తారు.

తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి, తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, కానీ రాష్ట్ర పునర్ విభజన హామీలో భాగమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మాత్రము మొండి చేయి చూపించారని, కేవలం 520 కోట్ల రూపాయలతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారని కేటీఆర్ మండిపడ్డారు.

ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారు : తెలంగాణకు 520 కోట్ల రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ కి 20000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ తీసుకుపోయిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారన్నారు కేటీఆర్. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్....

సంగారెడ్డి జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

సంగారెడ్డి జిల్లా:జూలై 07

జహీరాబాద్ అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆబ్కారీ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ కారులో రెండు బాక్సుల్లో తరలిస్తున్న కేజీన్నర బంగారాన్ని పట్టుకున్నారు.

ముంబయి నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న కారులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ కోటికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సరైన పత్రాలు లేకుండా బంగారం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది....

కడియం శ్రీహరి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ :;ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

హన్మకొండ:జూలై 07

ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

''కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త. ఆయన మంత్రిగా ఉన్నపుడు నా మాదిగ బిడ్డలను ఎంతోమందిని ఎన్‌కౌంటర్ చేయించాడు.

నేను త్యాగం చేసి పార్టీలోకి వస్తే.. కడియం శ్రీహరి స్వార్థం కోసం బీఆర్ఎస్‌లోకి వచ్చారు. కడియం శ్రీహరి ఆంధ్రా అల్లుడు.. వారసుడా...? కులం పేరు చెప్పుకునే దమ్ము ఆయనకుందా..?" అని ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు...

ప్రధాని పర్యటన వరంగల్ నగరానికి కొత్త తేజస్సు : కిషన్ రెడ్డి

హనుమకొండ:జూలై 07

ఈరోజు వరంగల్ లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే అని అన్నారు.

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు కోసం పని చేశారని ఎన్నటికైనా ఆ రెండు పార్టీలు కలుస్తాయని తెలిపారు. రేపటి శనివారం బీజేపీ సభ చాలా కీలకమైనదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పర్సంటేజీల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. వాటాల ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. బీజేపీపై కొందరు విషం చిమ్ముతున్నారని.. దీన్ని తిప్పి కొట్టాలన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనపై మోదీ మాట్లాడతారని తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాల్సి ఉందన్నారు. కుటుంబ పార్టీల వల్ల దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన రావాలని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ ద్వారా రోజుకు ఏడు గూడ్స్ బోగీల ఉత్పత్తి జరుగుతుందన్నారు. మోదీ తొలుత మామునూర్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుంచి భద్రకాళీ గుడి, అక్కడ నుంచి ఆర్ట్స్ కళాశాలకు వస్తారన్నారు. ఇక్కడే శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు...

సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చందు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు.

ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామన్నారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని వెల్లడించారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని అన్నారు. ఇరు కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయం ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు. కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు....

ఖమ్మం జిల్లాలో యువకుడి దారుణ హత్య

ఖమ్మం జిల్లా :జూలై 07

జిల్లాలో ఓ యువకుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్‌లో యువకుడిని కొందరు యువకులు హత్య చేశారు.

మృతుడు సాయి పవన్‌(23)గా గుర్తించారు. మరొక యువకుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు. గంజాయి మత్తులో ఘర్షణ చోటు చేసుకుందని.. కత్తులతో యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

మృతుడు చికెన్‌ షాపులో పనిచేస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. హాజరైన మంత్రి కేటీఆర్‌

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. హైదరాబాద్‌ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న

ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ హరీశ్‌ రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. టెట్‌ నిర్వహణ, టీచర్ల నియామక ప్రక్రియ, మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి, రెండో విడుత అమలు వంటి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది...

అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఆశ వర్కర్లకు ఎక్కువ జీతాలు : మంత్రి హరీశ్‌ రావు

దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ లో శుక్రవారం శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి మంత్రి హరీశ్‌ రావు నియామక పత్రాలు అందేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లేవాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడు ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌ చెప్పారు. కేసీఆర్‌ కిట్‌తో మాతా శిశు మరణాలను తగ్గించామని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణకు అసలైన డాక్టర్‌ హరీశ్‌ రావు: మంత్రి తలసాని

ఆశావర్కర్ల సేవలు మరచిపోలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానలవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల సేవలు విశేషమైనవని తెలిపారు. తెలంగాణకు అసలైన డాక్టర్‌.. మంత్రి హరీశ్‌ రావు అని వెల్లడించారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.9,750 వేతనం ఇస్తున్నామన్నారు....

ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం

భువనగిరి జిల్లా:జులై 07

యాదాద్రి జిల్లాలో శుక్రవారం ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బోగీలో మంటలు చెలరేగాయి. మొత్తం 6 బోగీలకు వ్యాపించిన మంటలు.. పక్కనే ఉన్న బోగీలకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి కిందకు దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో బోగీలు దగ్ధం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. లోకో పైలట్ గమనించి రైలును ఆపాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రైలును అక్కడికక్కడే ఆపాల్సి వచ్చింది. ఈ రైలులో దాదాపు 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరి సమీపంలో రైలు వేగాన్ని తగ్గించడంతో మంటలను గుర్తించారు. ఈ రైలులోని ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 కోచ్‌లు దగ్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ హరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో గంటలో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. మంటలు ఇతర బోగీలకు వ్యాపించే చోట బోగీల మధ్య ఉన్న లింక్‌ను తొలగించారు. దీంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే మంటలు చెలరేగాయని ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.

నేడు టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

ఈ రోజు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జూన్‌ 14 నుంచి 22 వరకూ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 60 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా రెండుమూడు రోజుల్లో విడుదల కానున్నాయి. జూన్‌ 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగ్గా, 4,12,325 మంది విద్యార్థులు హాజరయ్యారు....