/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కాలేశ్వరం ప్రాజెక్టు కు ఖర్చు చేసింది 80 వేల కోట్లు లక్ష కోట్లు ఎలా అవినీతి జరిగింది ❓️రాహుల్ జీ Yadagiri Goud
కాలేశ్వరం ప్రాజెక్టు కు ఖర్చు చేసింది 80 వేల కోట్లు లక్ష కోట్లు ఎలా అవినీతి జరిగింది ❓️రాహుల్ జీ

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డురంగా ఉంది. ఖర్చు పెట్టింది 80 వేల కోట్లు అయితే లక్ష కోట్లు అవినీతి ఏలా జరుగుతుందని? రాహుల్ గాంధీ వాఖ్యల పై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క చెరువు అయినా బాగు చేశారా.? నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా..?

అంటూ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రంగనాయక సాగరులో ముంచి లేవడితే కాంగ్రెస్ నాయకులకు నీళ్ళు ఉన్నవి, లేనిది తెలుస్తది కావొచ్చునని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో బుధవారం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లా ఆధ్వర్యంలో రైతులకు స్పింక్లర్లు-తుంపర సేద్య పరికరాలు పంపిణీ, ఆయిల్ ఫామ్ సాగు అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు హాజరై 1001 స్పింక్లర్లు-తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టే భూమికి బరువైన పంట పండుతున్నది. కాళేశ్వరం పని కానిదే ఈ ఘనత సాధ్యమౌతదా అంటూ చెప్పుకొచ్చారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 300 స్పింక్లర్లు సెట్లు పంచేదని, కానీ ఇవాళ ఒక్కరోజు 1001 మందికి స్పింక్లర్లు పంపిణీ చేసుకుంటున్నామని, ఇప్పటికే సిద్ధిపేట జిల్లాలో రెండేళ్లలో 17 వేల స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని, చిన్నకోడూర్ మండలంలోనే 5100 స్పింక్లర్లు సెట్లు ఇచ్చామని గుర్తు చేశారు.

రైతులను చైతన్యం చేయాలని, బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమని జిల్లా వ్యాప్తంగా 17 వేల స్పింక్లర్లు సెట్లు పంపిణీ చేసేందుకు రూ.20 కోట్ల 18 లక్షల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం భరించిందని, ఇది రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు.

ఈ యేడు కాలమయ్యే అంశం పై సీఎం కేసీఆర్ సమీక్షించి రైతు శ్రేయస్సు కోసం ఆలోచన చేశారని, రైతులకు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

గతంలో రైతులు ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారు కానీ., ఇప్పుడు సీఎం కేసీఆర్, కాళేశ్వరం పై నమ్మకంతో నారు పోస్తున్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతులలో ఎంతో మార్పు వచ్చిందని, కాలంతో నిమిత్తం లేకుండా నీళ్లు అందిస్తున్నట్లు, యాసంగి పంట నూకలుగా మారి తుట్టి అవుతున్నా.., ఆ నష్టాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.

రైతులు గుండెజారి పోవొద్దని, రైతుల కోసం చుక్క చుక్క ఒడిసి పట్టి కాళేశ్వరం జలాశయాలు నింపాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని, కాలం ఎత్తి పోయినా.. కాళేశ్వరం గేట్లు ఎత్తి రైతులకు కాల్వల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

కాళేశ్వరంతో యాసంగిలో 55 లక్షల ఎకరాల పంట పండింది. పండిన పంట 26 వేల కోట్లు రూపాయల ధాన్యం కొన్నాం. ఎక్కడా గుంట, ఎకరం ఎండలేదు. మూడేళ్లలో యుద్ధంలా పనిచేసి కాళేశ్వరం నిర్మించినట్లు వివరించారు.

ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం వాడు నూకలు తినమని చెప్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నూకల ఖర్చు భరించి అందరికీ బియ్యం అందిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో 7 గంటలు కూడా కరెంటు ఉండేది కాదనీ, కానీ ఇప్పుడు నిరంతరాయంగా వ్యవసాయ బావుల వద్ద కరెంటు ఉంటుందని చెప్పారు.

కరెంట్ బిల్లుపోతే పోతుందని, ప్రతి ఒక్క రైతుకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఇంకా వానలు మొదలు కాకున్నా., అన్నీ గ్రామాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.

జిల్లాలో 8 వేల 500 ఏకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లు, ఈ సంవత్సరం 1800 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నట్లు, ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉన్నదని, ఆయిల్ ఫామ్ లాభాల పంటగా ఎకరాకు 80 వేల రూపాయల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు.

ఈ మేరకు ఆయిల్ ఫెడ్ సిద్ధిపేట జిల్లా కమిటీ మెంబర్లకు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ వైస్ ఛైర్మన్ సోమిరెడ్డి, జిల్లాలోని పలు మండలాల ఏంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సునీత, అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు......

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

హైదరాబాద్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం (8న) ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు..

అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..

Manipur: పక్కా ప్లాన్‌ ప్రకారం ఆయుధ లూటీకి యత్నం..

మణిపుర్‌ (Manipur) రాష్ట్రంలోని ఇండియన్‌ రిజర్వు బెటాలియన్‌ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. వీటిని భద్రతా దళాలు అడ్డుకొన్నాయి.

ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని ధౌబాల్‌ జిల్లాలో చోటు చేసుకొంది. ఇక్కడ వందల సంఖ్యలో అల్లరి మూకలు ఐఆర్‌బీ బెటాలియన్‌ పోస్టుపై దాడి చేశాయి. ఐఆర్‌బీ దళాలకు మద్దతుగా సైన్యం, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఇతర దళాలు రాకుండా అల్లరి మూకలు రహదారులను ముందే తవ్వేశాయి. కానీ, అస్సాం రైఫిల్స్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ముప్పు తప్పింది. వీరు అల్లరిమూకలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.

మణిపుర్‌లోని చాలా పోస్టుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 326 మందిని అరెస్టు చేశారు..

బుధవారం తెల్లవారుజామున కాల్పులు

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో హింస ఆగడంలేదు. తాజాగా బుధవారం తెల్లవారు జామున భారీగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఇప్పటి వరకు ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం రాలేదు. మంగళవారం రాత్రి తొలి ఘటన ఖోయిజుంతాబి ప్రాంతంలో చోటు చేసుకొంది. మరో ఘటన బుధవారం తెల్లవారు జామున 4.30 సమయంలో తూర్పు ఫైలెంగ్‌ ప్రాంతంలో జరిగింది. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదు..

Kamareddy: సీఎస్‌ శాంతికుమారి పేరుతో సైబర్‌ నేరగాళ్ల చాటింగ్‌

కామారెడ్డి: ధనార్జనే ధ్యేయంగా సైబర్‌ నేరగాళ్లు రోజుకోతీరుగా మోసాలకు పాల్పడుతున్నారు..

నిరక్షరాస్యులతో పాటు ఉద్యోగులు, ఉన్నతాధికారులను సైతం ఉచ్చులోకి దింపి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల పేర్లను సైతం వాడుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

తాజాగా కామారెడ్డి జిల్లాలో పలువురు ఉద్యోగులకు సీఎస్‌(ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) శాంత కుమారి పేరుతో సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌ చేయడంతో పాటు వాట్సప్‌ కాల్స్‌ వచ్చాయి. ఇలా చాటింగ్‌ ద్వారానే తమ అవసరాన్ని తెలియజేస్తూ నగదును పంపించాలని పురమాయిస్తున్నారు. సైబర్‌ మోసాలపై అవగాహన ఉన్న ఉద్యోగులు ఆయా కాల్స్‌ను తిరస్కరిస్తున్నారు..

ఢిల్లీకి బయలేర్దిన సీఎం వైఎస్‌ జగన్‌..

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రులను ఆయన కలవనున్నారు..

ఏపీకి రావలసిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హోంమంత్రి అమిత్‌షా, సాయంత్రం 4:30కి ప్రధాని మోదీ, 6 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని జనపథ్‌-1 నివాసానికి చేరుకుంటారు..

ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా:జులై 05

ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాయపోల్‌ సమీపంలో చోటుచేసుకుంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..

కందుకూరుకు చెందిన నారాయణరెడ్డి, లంగర్‌హౌస్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన భానుప్రసాద్‌, హస్తినాపురం ఈస్ట్‌ కాలనీకి చెందిన నవీన్‌ ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు బైక్‌పై రాయపోల్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా దూసుకొచ్చిన మారుతి వాహనం (ఏపీ28 బీఎస్‌ 0010) వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలొదిరారు. కాగా, భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల హైదరాబాద్‌ వెళ్లే దారిలో ఉంటే.. వీరు రాయపోల్‌ వైపుగా ఎందుకు వచ్చారో తెలియాల్సి వుంది. కారును నడిపిస్తున్న పి.శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆసరా అవుతారనుకుంటే..

ఉన్నత చదువులు చదివి కుటుంబాలకు ఆసరాగా నిలబడతారని అనుకుంటే రోడ్డు ప్రమాదం ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయపోల్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడటంతో కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులను అప్పగించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు...

బండి సంజయ్​ను తప్పించడంతో అభిమాని సూసైడ్​.. లేఖ రాసి

ఖమ్మం జిల్లా :జులై 05

బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక తన అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ఈ ఘటన ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్​ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

బండి సంజయ్​ని బాధ్యతల నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక పోతున్నా అని ఓ లేఖ కూడా రాసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ​ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.........

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ

తిరుపతి :జులై 05

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 76,254 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....

"ఆఫత్" రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం

•వాతావరణ శాఖ 20 రాష్ట్రాల్లో భారీ వర్షం హెచ్చరికను జారీ

రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాజధాని ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాల ప్రక్రియ కొనసాగుతోంది.పలుచోట్ల కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితి అధ్వానంగా మారింది. అయినా దాని నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశ లేదు. వాస్తవానికి దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఢిల్లీలో రానున్న ఆరు నుంచి ఏడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, దక్షిణ ద్వీపకల్పం మరియు ఉత్తర మహారాష్ట్రలో జూలై 6 వరకు మరియు గుజరాత్‌లో జూలై 8 వరకు తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. జూలై 8 వరకు అంచనా ప్రకారం, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని అనేక జిల్లాలు ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్‌లో భారీ వ‌ర్షాల‌కు అలర్ట్ జారీ చేశారు రానున్న మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, డెహ్రాడూన్, బాగేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు ఆ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు జూలై 8వ తేదీ వరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

ఏయే రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి?

తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, గోవా, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపురలలో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్‌లలో వర్షాలు కురిసే అవకాశం లేదు.

వర్షాకాలం జూలై 10 వరకు కొనసాగుతుందని అంచనా.

IMD నివేదిక ప్రకారం, ఈ రౌండ్ తేలికపాటి నుండి మోస్తరు వర్షం జూలై 10 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది.

ఉన్నత విద్యామండలి చెర్మన్ లింబాద్రి ని కలిసిన: వేముల గోపినాథ్

శాలిగౌరారం :తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి ని ప్రభుత్వం ఇటీవలె నియమించడం జరిగింది.

ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం లో శాలిగౌరారం మండలానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ కారులు వేముల గోపి నాథ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు,

ఈ సందర్బంగా గోపినాథ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి లోకానికి మేలు జరిగే విధంగా చైర్మన్ గా కృషి చేయాలని ప్రొఫెసర్ లింబాద్రి కోరారు..