/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఢిల్లీకి బయలేర్దిన సీఎం వైఎస్‌ జగన్‌.. Yadagiri Goud
ఢిల్లీకి బయలేర్దిన సీఎం వైఎస్‌ జగన్‌..

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రులను ఆయన కలవనున్నారు..

ఏపీకి రావలసిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హోంమంత్రి అమిత్‌షా, సాయంత్రం 4:30కి ప్రధాని మోదీ, 6 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని జనపథ్‌-1 నివాసానికి చేరుకుంటారు..

ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా:జులై 05

ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాయపోల్‌ సమీపంలో చోటుచేసుకుంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..

కందుకూరుకు చెందిన నారాయణరెడ్డి, లంగర్‌హౌస్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన భానుప్రసాద్‌, హస్తినాపురం ఈస్ట్‌ కాలనీకి చెందిన నవీన్‌ ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు బైక్‌పై రాయపోల్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా దూసుకొచ్చిన మారుతి వాహనం (ఏపీ28 బీఎస్‌ 0010) వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలొదిరారు. కాగా, భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల హైదరాబాద్‌ వెళ్లే దారిలో ఉంటే.. వీరు రాయపోల్‌ వైపుగా ఎందుకు వచ్చారో తెలియాల్సి వుంది. కారును నడిపిస్తున్న పి.శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆసరా అవుతారనుకుంటే..

ఉన్నత చదువులు చదివి కుటుంబాలకు ఆసరాగా నిలబడతారని అనుకుంటే రోడ్డు ప్రమాదం ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయపోల్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడటంతో కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులను అప్పగించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు...

బండి సంజయ్​ను తప్పించడంతో అభిమాని సూసైడ్​.. లేఖ రాసి

ఖమ్మం జిల్లా :జులై 05

బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక తన అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ఈ ఘటన ఖమ్మం జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్​ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

బండి సంజయ్​ని బాధ్యతల నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక పోతున్నా అని ఓ లేఖ కూడా రాసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ​ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.........

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ

తిరుపతి :జులై 05

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 76,254 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....

"ఆఫత్" రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం

•వాతావరణ శాఖ 20 రాష్ట్రాల్లో భారీ వర్షం హెచ్చరికను జారీ

రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రాజధాని ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాల ప్రక్రియ కొనసాగుతోంది.పలుచోట్ల కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితి అధ్వానంగా మారింది. అయినా దాని నుంచి ఉపశమనం లభిస్తుందన్న ఆశ లేదు. వాస్తవానికి దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఢిల్లీలో రానున్న ఆరు నుంచి ఏడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, దక్షిణ ద్వీపకల్పం మరియు ఉత్తర మహారాష్ట్రలో జూలై 6 వరకు మరియు గుజరాత్‌లో జూలై 8 వరకు తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. జూలై 8 వరకు అంచనా ప్రకారం, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని అనేక జిల్లాలు ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్‌లో భారీ వ‌ర్షాల‌కు అలర్ట్ జారీ చేశారు రానున్న మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, డెహ్రాడూన్, బాగేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు ఆ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు జూలై 8వ తేదీ వరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

ఏయే రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి?

తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, గోవా, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, త్రిపురలలో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్‌లలో వర్షాలు కురిసే అవకాశం లేదు.

వర్షాకాలం జూలై 10 వరకు కొనసాగుతుందని అంచనా.

IMD నివేదిక ప్రకారం, ఈ రౌండ్ తేలికపాటి నుండి మోస్తరు వర్షం జూలై 10 వరకు కొనసాగుతుంది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది.

ఉన్నత విద్యామండలి చెర్మన్ లింబాద్రి ని కలిసిన: వేముల గోపినాథ్

శాలిగౌరారం :తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి ని ప్రభుత్వం ఇటీవలె నియమించడం జరిగింది.

ఈ సందర్బంగా హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం లో శాలిగౌరారం మండలానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ కారులు వేముల గోపి నాథ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు,

ఈ సందర్బంగా గోపినాథ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి లోకానికి మేలు జరిగే విధంగా చైర్మన్ గా కృషి చేయాలని ప్రొఫెసర్ లింబాద్రి కోరారు..

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డి : బండి సంజయ్ పరిస్థితి ఏంటి❓️

ఎన్నికల ముందు బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా పాఠకులు అనుకున్నట్లుగా తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పుకు సంబంధించిన ప్రత్యేక కథనాలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అగ్రనాయకత్వం నియమించింది. రెండు మూడ్రోజుల్లో అధ్యక్ష పదవీ బాధ్యతలను కిషన్ రెడ్డి స్వీకరించనున్నారు.

ఇక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ ఛైర్మన్‌‌గా కేంద్రం నియమించింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎవరూ ఊహించని వ్యక్తిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. సీనియర్ నేత, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజు స్థానంలో సత్యకుమార్, సుజనా చౌదరిని కూడా పరిశీలించిన అధిష్టానం ఆఖరి నిమిషంలో.. పురంధేశ్వరిని నియమించడం పెద్ద ట్విస్టే అని చెప్పుకోవచ్చు. అధ్యక్ష పదవుల మార్పులకు సంబంధించి, ఇతర నేతల పదవులకు సంబంధించి అన్నీ అధికారిక ప్రకటనలు వచ్చేశాయి.

బండి పరిస్థితి ఇదీ!!

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. బండిని మార్చొద్దని.. ఆయన్ను మారిస్తే రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలించవని పదే పదే నివేదికలు, ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా ఈ మార్పును తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే తనకు ఎలాంటి పదవి అక్కర్లేదని.. సామాన్య కార్యకర్తగానే పార్టీకోసం పనిచేస్తానని కూడా బండి తన అత్యంత సన్నిహితుల వద్ద భావోద్వేగానికి లోనైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడి ఎంపికలో మల్లగుల్లాలు పడిన అధిష్టానం ఆఖరికి మార్పులు, చేర్పులు చేసేసింది. అయితే బండిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవిని స్వీకరించడానికి బండి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి చూస్తే.. తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, పంజాబ్‌కు కూడా అధ్యక్షులను అధిష్టానం మార్చింది. ఈ మార్పులు, చేర్పులు రానున్న ఎన్నికల్లో ఏ మాత్రం బీజేపీకి లాభం చేకూరుస్తాయో వేచి చూడాలి మరి....

భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పరిస్థితి ఏంటి?

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత రాజకీయం నడుస్తోంది. పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కలుపుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్‌దే హవా. జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో జక్కు శ్రీహర్షిణి ఆ పదవి చేపట్టారు. ఎంతో హుషారుగా ఆ పదవిలో కూర్చున్నా.. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఆమె ఉత్సహాన్ని ఆవిరి చేస్తున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ ఎత్తుగడల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట జడ్పీ ఛైర్‌పర్సన్‌.

భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీహర్షణిని పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. దీనికి ఎమ్మెల్యే వైఖరే కారణమని చెవులు కొరుక్కుంటున్నారు. గండ్ర జ్యోతి భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్షురాలు అయిన తర్వాత శ్రీహర్షణికి పార్టీ పరంగా ఇంకా ఇబ్బందులు పెరిగాయట. గండ్ర జ్యోతి కూడా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఒక జడ్పీ ఛైర్‌పర్సన్‌ మరో జడ్పీ ఛైర్‌పర్సన్‌ విషయంలో చెక్‌ పెట్టడం రాజకీయంగా కూడా చర్చగా మారుతోంది.

ప్రొటోకాల్ ఇవ్వకపోవడం.. పార్టీ నేతలు కూడా లెక్క చేయకపోవడంతో.. దూకుడు తగ్గించారట శ్రీహర్షణి. కార్యక్రమాలే రావడం లేదట. మాజీ ఎమ్మెల్యేకు లభిస్తున్న గౌరవం కూడా దక్కడం లేదని టాక్‌. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వడం కూడా ప్రతికూలంగా మారుతోందని.. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవి కేవలం అలంకార ప్రాయంగా మారిపోయిందని వాపోతున్నారట. ప్రాధాన్యం ఇస్తే.. రేపటి రోజున నియోజకవర్గంలో పోటీకి వస్తారనే భయంతోనే ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు చెక్‌ పెడుతున్నట్టు కొందరి అనుమానం.

మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్‌, మహదేవ్‌పూర్‌ మండలాల్లో చేపట్టే కార్యక్రమాలకు మాత్రే జడ్పీ ఛైర్మన్‌ హోదాలో శ్రీహర్షిణి హాజరువుతున్నారట. జిల్లాలో 11 మండలాలు ఉంటే.. కేవలం ఆరు మండలాల్లోనే ఆమె పర్యటించే పరిస్థితి ఉందట. దీనిపై అధికారపార్టీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటుంటే.. విపక్షాలకు మాత్రం పెద్ద అస్త్రంగా మారిపోతున్నాయి జరుగుతున్న పరిణామాలు. తాజాగా జరిగిన స్థాయి సంఘం సమావేశానికి కూడా ఆమె రాలేదు. ఇక్కడి పరిణామాలపై టీఆర్‌ఎస్‌ పెద్దలు కూడా ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి....

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి రాజీనామా❓️

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అందజేశారు.

గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాల మధ్య బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.

మంగళవారం జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం తను రాజీనామా చేసినట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.

హైదరాబాద్ కలెక్టరేట్‌ ముట్టడికి ఏబీవీపీ యత్నం

నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం కలెక్టరేట్ ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. విద్యా సమస్యలపై ఆందోళనకు దిగిన ఏబీవీపీ కలెక్టరేట్‌ వద్ద నిరసనకు దిగింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ వెంటనే చెల్లించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అధిక ఫీజులు వసూల్ చేస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లనీయడంతో అడ్డుకోవడంతో ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు.. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నాకు దిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు...