/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Chandrababu: కేంద్ర మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ.. Yadagiri Goud
Chandrababu: కేంద్ర మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ..

అమరావతి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకికి చెందిన రాజేశ్‌కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కోరారు..

అద్దంకికి చెందిన రాజేశ్‌.. ఇటీవల ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. బీచ్‌లో తన పిల్లలను రక్షించే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

రాజేశ్‌ భౌతికకాయాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెచ్చేందుకు సహకారం అందించాలని కేంద్రమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు..

Supreme Court: ముగిసిన సెలవులు.. నేడు సుప్రీంకోర్టులో మణిపూర్ హింస, పురుషుల కమిషన్‌పై విచారణ..

upreme Court: వేసవి సెలవుల అనంతరం జులై 3వ తేదీ సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తెరుచుకుంది. ఈరోజు తొలిరోజైన రెండు ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది..

మొదటి కేసు మణిపూర్ హింసకు సంబంధించినది. దీంతో పాటు పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కూడా విచారణ జరగనుంది. రెండు సందర్భాల గురించి తెలుసుకుందాం. మొదటిది, మణిపూర్‌లోని మైనారిటీ కుకీ గిరిజనులకు సైనిక రక్షణ కల్పించాలని, వారిపై దాడి చేస్తున్న మత సమూహాలపై విచారణ జరపాలని కోరుతూ ఒక NGO సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దానికి సంబంధించిన కేసు విచారణకు రానుంది. మణిపూర్ ట్రైబల్ ఫోరం దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అంతకుముందు, ఎన్జీవో సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణ కోసం పిటిషన్ దాఖలు చేసింది. జూన్ 20 న జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా బెంచ్ దానిని కొట్టివేసింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, దీనిని పాలనా యంత్రాంగం పరిశీలించాలని కోర్టు పేర్కొంది..

టెక్నాల‌జీ సెంట‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మైక్రోచిప్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాస్కామ్ ప్ర‌కారం గ‌త రెండేళ్ల‌లో టెక్నాల‌జీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైద‌రాబాద్‌లోనే సృష్టించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

మైక్రోచిప్ టెక్నాల‌జీ సెంట‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌: కోకాపేట‌లో మైక్రోచిప్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

నాస్కామ్ ప్ర‌కారం గ‌త రెండేళ్ల‌లో టెక్నాల‌జీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైద‌రాబాద్‌లోనే సృష్టించిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికి లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా ఉందన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉందని వెల్లడించారు...

రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఖమ్మం సభలో రాహుల్ చేసిన కామెంట్స్‌కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అంటూ రాహుల్‌పై ఫైర్ అయ్యారు. మీ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందన్నారు. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందన్నారు. అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టారని హరీష్ రావు విమర్శించారు.

‘‘బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది. రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు. అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా? స్కీమ్‌ల్లోని స్కాంల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే. అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు...

ఈ డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం: రేవంత్ రెడ్డి

ఖమ్మం: డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని ఈ డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందన్నారు..

సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలను చూసి సోనియా చలించిపోయారని.. బలిదానాలు చూడలేకే తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలని రేవంత్ అన్నారు. భట్టి మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టో గా ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది ఖమ్మం జిల్లానేనని రేవంత్ తెలిపారు..

Telangana Jana Garjana: కాంగ్రెస్ వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్: రాహుల్

ahul Gandhi Speech At Telangana Jana Garjana Public Meeting: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు..

భట్టి పాదయాత్ర చేసినందుకు అభినందిస్తున్నామన్నారు. భారత్‌ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ఐడియాలజీ దేశాన్ని కలపడం, ఇతరుల ఐడియాలజీ దేశాన్ని విభజించడమన్నారు. దేశమంతా భారత్‌ జోడో యాత్రను సమర్థించిందని. జోడో యాత్రతో విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశామని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజల మనసులో కాంగ్రెస్‌ పార్టీ ఉందని.. అందుకే మీరు కాంగ్రెస్‌ ఆలోచనలు సమర్థించారన్నారు.

భట్టి తెలంగాణలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బలహీనులకు అండగా నిలిచారన్నారు. తెలంగాణకు వచ్చినప్పుడు నా యాత్రకు మీరందరు శక్తినిచ్చారన్నారు. తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేదని.. దానిని కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం ధ్వంసం చేసిందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఖమ్మం సభలో ఎన్నికల హామీలను రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ వస్తే రూ.4వేల వృద్ధులు, వితంతువులకు పెన్షన్ ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. చేయూత పథకం ద్వారా అందిస్తామన్నారు. ఆదివాసులకు పోడు భూములు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో కర్ణాటక ఫలితాలే వస్తాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

కర్ణాటకలో అవినీతి ప్రభుత్వాన్ని పారదోలామన్నారు. తెలంగాణలో బీజేపీ ఖతమైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బీ టీమ్ మధ్యే పోటీ నెలకొంటుందని రాహుల్‌ పేర్కొన్నారు. కర్ణాటక తరహాలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామన్నారు. విపక్ష పార్టీల సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీని పిలవాలని కొన్ని పార్టీలు కోరాయని… కానీ బీఆర్‌ఎస్ వస్తే కాంగ్రెస్ హాజరు కాదని స్పష్టంగా చెప్పామన్నారు. బీఆర్‌ఎస్‌తో కూర్చోమని తేల్చి చెప్పామన్నారు. బీజేపీ బీ టీమ్‌తో కాంగ్రెస్‌కు ఒప్పందం లేదన్నారు.

కాంగ్రెస్‌ను వదిలివెళ్లిన వారికి తలుపులు తెరిచే ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మా ఐడియాలజీ నచ్చిన వారు కాంగ్రెస్‌లోకి రావచ్చొన్నారు. కేసీఆర్‌ అవినీతికి మోడీ అండదండలు ఉన్నాయని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ పని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడమేనని ఆయన విమర్శులు గుప్పించారు..

ప్రజా గర్జనకు కెసిఆర్ భయపడుతున్నాడు : రేణుక చౌదరి

ఖమ్మం జిల్లా:జులై 02

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభ కు తన ఇంటి నుంచి బయలుదేరారు.

అయితే ఖమ్మం నగరంలోని కరుణగిరి వద్ద రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బారికేడ్లను నెట్టుకుని నేరుగా ఖమ్మం సభా ప్రాంగణానికి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా రేణుక చౌదరి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు బారికేడ్లు పెడితే నేను అగుతానా? అని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది ఇంకొకటని విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిజ స్వరూపం బయటపడిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వస్తుండడంతో కేసీఆర్ భయపడుతున్నారన్నారు. తాను కాంగ్రెస్ కార్యకర్తనని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రేణుక చౌదరి స్పష్టం చేశారు.

పరిస్థితి చెయ్యి దాటితే మీదే బాధ్యత.. డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్..!

ఖమ్మం సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి సభకు బయలుదేరిన వాహనాలను అడ్డుకోవడంపై సీరియస్ అయ్యారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండి పడ్డారు.

ఈ అంశంపై డీజీపీతో ఫోన్లో మాట్లాడిన రేవంత్, మధుయాష్కీ గౌడ్.. సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని కోరారు. అడ్డుగోడలు దాటుకునైనా సభకు హాజరవుతామని స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటితే బాధ్యత మీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం సభకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన రేవంత్ రెడ్డి, మధుయాష్కి‌లు బయలుదేరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఇవాళ వాహనాల తనిఖీలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు మండలం లలితపురం, టేకులపల్లి మండలంలో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. బూర్గంపాడు, భద్రాచలం వద్ద ఆర్టీవో అధికారులు, పోలసులు కలిసి చెకింగ్ చేస్తున్నారు. ఖమ్మం సభ దృష్ట్యానే పోలీసులు తనిఖీలు చేపట్టారని అశ్వారావుపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు....

ఖమ్మం నుండే కేసీఆర్ పతనం: బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్

ఖమ్మం: కేసీఆర్ పతనం ఖమ్మం సభ నుండి ప్రారంభం కానుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.ఆదివారంనాడు ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ సభకు అధికార బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాహుల్ గాంధీ సభను విజయవంతం చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నిన్న రాత్రి నుండి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గతంలో ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభను తలదన్నేలా రాహుల్ గాంధీ సభ ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

తమ పార్టీ నేత మువ్వా విజయ్ కుమార్ ను హత్య చేస్తామని వెలిసిన పోస్టర్లపై విజయ్ కుమార్ భార్య ఖమ్మం సీపీని కలిసేందుకు ప్రయత్నిస్తే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.ఒక ఆడబిడ్డకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తమను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్లపై పోలీసుల తీరుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు..

కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 1700 ప్రైవేట్ వాహనాలను సీజ్ చేశారన్నారు. రాహుల్ గాంధీ సభకు వెళ్తే పథకాలు రావని బెదిరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసినా కూడ తాను సత్యాగ్రహ మార్గంలో పనిచేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు..

గోల్కొండ కోటలో నేడు ఆషాడ మాసం నాలుగో బోనం

హైదరాబాద్ :జులై 02

ఆషాఢ మాసం గోల్కొండ బోనాలలో నాలుగో బోనం ఆదివారం జరగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ ఆరెళ్ల జగదీశ్‌ యాదవ్‌, ఈవో శ్రీనివాస రాజులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం జరుగనున్న నాలుగో బోనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వరకు తొట్టెలలను ఊరేగింపుగా తెస్తారు. లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. తొట్టెలను తెచ్చే వారికి స్వాగతం పలకడానికి స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తారు. నాలుగో బోనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టనున్నామని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీకిరణ్ ఖారే ప్రభాకర్‌ తెలిపారు.

తెలంగాణ సంసృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులతో డా.బీఆర్‌.అంబేదర్‌ సచివాలయం లో సమీక్ష నిర్వహించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, తొమ్మిదేండ్లుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం డిప్యూటీ స్పీకర్‌, మంత్రులు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

9న సికింద్రాబాద్‌ మహంకాళి..16న పాతబస్తీ బోనాలు..

ఈ నెల 9న సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు 16న హైదరాబాద్‌ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే ఆలయాల్లో ఏర్పాట్లకు ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్కులు అందజేయాలని అధికారులకు సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్రీన్‌లతో పాటు లేజర్‌ షో ఏర్పాటు చేయాలని, బోనాలను విశిష్టతను తెలియజేసేలా విసృ్తత ప్రచారం నిర్వహించాలని ఐఅండ్‌పీఆర్‌, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, దేవాదాయ, పర్యాటక, సమాచార, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.......