/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు పార్వతిపురంలో సీఎం జగన్ పర్యటన Yadagiri Goud
నేడు పార్వతిపురంలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో పర్యటిస్తున్నారు. సందర్భంగా ఏర్పాట్లను జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమ్మఒడి నాలుగో విడత నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం కురుపాంలో ప్రారంభించనున్నారు. మొదటిసారి సిఎం జగన్మోహనరేడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.

ముఖ్యమంత్రి హౌదాలో మొట్టమొదటిసారిగా జగన్‌ మోహన్‌ రెడ్డి జిల్లాకు వస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వాహనాల పార్కింగ్‌ లాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం కురుపాం లో ప్రారంభించడం ఇక్కడ ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు...

నేడు ఎంసెట్ కౌన్సిలింగ్

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది.

ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన వారికి వచ్చే 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని జేఎన్‌టీయూ అడ్మిషన్స్‌ విభాగం అధికారులు తెలిపారు.

ఈ ప్రక్రియ కోసం నగరంలో ఏడు హెల్ప్‌ లైన్‌లను సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ, బాగ్‌లింగంపల్లిలోని బీఆర్‌ అంబేద్కర్‌ కాలేజీ, రామాంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌, మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభు త్వ పాలిటెక్నిక్‌, జూపార్క్‌ సమీపంలోని కులీకుతుబ్‌ పాలిటెక్నిక్‌, మా రేడ్‌పల్లిలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌, గోల్కొండ హోటల్‌ వెనుక ఉన్న యూనివర్సిటీ సైన్స్‌కళాశాలలో ఈ హెల్ప్‌లైన్‌ కేంద్రాలున్నాయి....

కేసీఆర్ డ్రామాలు వద్దు.. శివసేన ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్

కేసీఆర్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డ్రామాలు ఇలాగే కొనసాగితే ఆయన తెలంగాణను కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఉండబోదన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చారని విమర్శించారు.

ఆయన మహారాష్ట్రలో ప్రర్యటిస్తుండగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తోందన్నారు. ఎంవీఏ కూటమి బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ వ్యూహాలపై జాతీయ పార్టీల నజర్:

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ రాజకీయ వ్యూహలను జాతీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తుంటే కేసీఆర్ మాత్రం మహారాష్ట్రను టార్గెట్ చేయడం వెనుక ఆయన అసలు టార్గెట్ ఏంటనే చర్చ జరుగుతోంది. దీంతో కేసీఆర్ నెక్స్ట్ స్టెప్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కేసీఆర్ దూకుడు పెంచడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన యూబీటీ లు స్వరం పెంచాయి....

హైదరాబాద్‌లో భారీ వర్షం

నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, శామీర్ పేట్, నిజాంపేట,

బాచుపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పలుచోట్ల వరద నీరు భారీగా రోడ్లపైకి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిగ్గా ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు ముగిసే వేళ వర్షం కురియడంతో వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు....

బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

సోలాపూర్ :జూన్ 27

మహారాష్ట్ర టూర్‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. తాము ఎవరికి ఏ టీమ్, బీ టీమ్ కాదని మాది రైతులు, కార్మికులు, పేదల టీమ్ అని అన్నారు. చిన్న పార్టీని చూసుకుని జాతీయ పార్టీలు ఎందుకు జడుసుకుంటున్నాయని విమర్శించారు.

బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ మహారాష్ట్రలో పోటీ చేస్తుందని అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం సోలాపూర్ జిల్లాలోని సర్కోలి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్‌ బాల్కే‌తో పాటు పలువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలు కావడం లేదన్నారు. మహారాష్ట్రలో పోటీ చేస్తామంటే ఎందుకు భయం అని ప్రశ్నించారు.

రైతులంతా సంఘటితమై పోరాటం చేస్తే తప్పా రైతు సమస్యలు పరిష్కారం కావన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నేళ్లు పరిపాలించి ఎందుకు పని చేయలేకపోయాయని నిలదీశారు. తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు కావడం లేదన్నారు. పార్టీలో చేరిన భగీరథ్ బాల్కే ఎమ్మెల్యే అవుతారని ఆయన గెలిచాక మంత్రిగా కూడా అవుతారన్నారు...

Narendra Modi: కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటేయండి: మోదీ..

భోపాల్: కేసీఆర్‌ (KCR) కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటువేయాలని, ప్రజలు బాగుండాలంటే మాత్రం భాజపాకు ఓటు వేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని భోపాల్‌లో నిర్వహించిన 'మేరా బూత్‌.. సబ్‌సే మజ్‌బూత్‌ (Mera Booth Sabse Majboot)' కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా.. ఇటీవలి విపక్షాల భేటీపై ధ్వజమెత్తారు.

'అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు 2024 ఎన్నికల్లో భాజపా గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయి. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయి. నేను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నా' అని వ్యాఖ్యానించారు. భాజపాకు కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ పేర్కొన్నారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలే ప్రధానం. పార్టీకన్నా దేశమే పెద్దది' అని ప్రధాని మోదీ అన్నారు..

RevanthReddy: కర్ణాటకలో వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేస్తాం: రేవంత్‌ రెడ్డి

దిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై పార్టీ అధిష్ఠానంతో చర్చించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పార్టీ సీనియర్‌ నేతలు రాష్ట్ర నాయకులకు కొన్ని సూచనలు చేశారని అన్నారు. కర్ణాటకలో అవలంభించిన వ్యూహాల్లో కొన్నింటిని ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని అధిష్ఠానం సూచించినట్లు చెప్పారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే.. వీలైనంత త్వరగా సరిచేసుకుంటామని తెలిపారు..

భారాసతో ఎలాంటి పొత్తులు ఉండబోవని కాంగ్రెస్‌ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌, భారాస ఒకటేనని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిపక్షపార్టీలతో భారాసను భాగస్వామ్యం చేయ్యబోమని అధిష్ఠానం స్పష్టం చేసిందన్నారు. 'కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయండి.. ప్రజల పాలన కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి' అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఈ సమావేశంలో అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు..

Mamata Banerjee: మమతా హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. ఉత్తర బెంగాల్‌ సిలిగుఢిలోని సెవోక్‌ ఎయిర్‌బేస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది..

అయితే, వాతావరణం అనుకూలించక పోవడంతోనే మమతా హెలికాప్టర్‌ అత్యవసరంగా దిగినట్లు తెలుస్తోంది.

జల్‌పాయగుఢీ జిల్లా కేంద్రంతోపాటు అక్కడి క్రాంతీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. అనంతరం మరో సభలో పాల్గొనేందుకు బయలుదేరారు. అదే సమయంలో అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ సెవోక్‌ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా దిగింది. అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సురక్షితంగా ఉన్నారని టీఎంసీ నేత రాజీబ్‌ బెనర్జీ వెల్లడించారు..

Eatala Jamuna: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్‌: భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున ఆరోపించారు. రూ.20కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ భారాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నట్లు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు..

హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు.

''ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోం. కౌశిక్‌ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారు. కౌశిక్‌ రెడ్డిని.. కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్‌రెడ్డి కూలగొట్టించారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణం'' అని జమున ఆరోపించారు.

భాజపాలో ఈటల రాజేందర్‌ సంతృప్తిగా ఉన్నారని ఈటల జమున చెప్పారు. పార్టీ మారను అని ఆయన ఇప్పటికే స్పష్టంగా చెప్పారని తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు..

పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!

ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన.. విశ్రాంతి లేకుండా వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం గోదావరి జిల్లా పర్యటనలో ఉండటంతో నిర్మాతలు షూటింగ్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా, నిమిషం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్స్, పాలిటిక్స్‌లో పాల్గొంటున్నాడు. దీంతో పవన్ కల్యాణ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పెదఅమిరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన భీమవరం నేతలతో భేటీ అనారోగ్య కారణంగా వాయిదా పడింది. ఈ విషయం తెలిసిన జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు....