/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడు మల, మూత్ర విసర్జన, విమానాశ్రయంలో అరెస్టు Yadagiri Goud
ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడు మల, మూత్ర విసర్జన, విమానాశ్రయంలో అరెస్టు

విమానంలో ప్రయాణంలో తప్పుడు పనులు చేశారనే వార్తలు ఇప్పుడు సర్వసాధారణంగా మారుతున్నాయి. ప్రతిరోజూ ఇలాంటి ప్రయాణికుల చర్యలు తెరపైకి వస్తున్నాయి, ఇది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా విమానంలో సీటు పక్కనే మల, మూత్ర విసర్జన చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది.ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అలాంటి పని చేశాడు.దీంతో ఆ ప్రయాణికుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫ్లైట్ కెప్టెన్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ముంబై-ఢిల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AIC 866లో సీట్ నంబర్ 17Fలో ఉన్న ఒక ప్రయాణికుడు విమానంలో మల, మూత్ర విసర్జన మరియు ఉమ్మివేసాడు. ఈ ప్రయాణ చర్య తర్వాత, ఆమెను క్యాబిన్ సిబ్బంది కూడా హెచ్చరించారని FIR పేర్కొంది. త‌ప్పుడు ప్ర‌వర్తించ‌డాన్ని ఫ్లైట్ కెప్టెన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎయిర్‌లైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం, క్యాబిన్ సిబ్బంది వార్నింగ్ ఇవ్వడంతో విమాన కెప్టెన్‌కు సమాచారం అందించారు. దీని తరువాత, కెప్టెన్ కంపెనీకి సందేశం పంపాడు, అందులో విమానాశ్రయ భద్రత నిందితుడిని విమానాశ్రయంలో పట్టుకోవాలని కోరింది. కలిసి ప్రయాణిస్తున్న ప్రజలు నిరసన వ్యక్తం చేశారని, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ తర్వాత క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులందరినీ శాంతింపజేశారని ఎయిర్‌లైన్ కంపెనీ తెలిపింది. నిందితుడిని పోలీసులకు అప్పగిస్తామని అందరికీ చెప్పారు.

గతేడాది నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో కూర్చున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై మద్యం మత్తులో శంకర్‌ మిశ్రా మూత్ర విసర్జన చేయగా.. ఈ కేసులో నిందితులను జనవరి 7న బెంగళూరు నుంచి పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత అతడిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

నేడు పుండరీపురం లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

మహారాష్ట్ర :జూన్ 27

నేడు మంగళవారం ఉదయం 8 గంటలకే సీఎం కేసీఆర్ పండరీపురానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ రుక్మిణీ సమేత విఠలశ్వరస్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సంబంధిత కార్యక్రమానికి హాజరు అవుతారు. సోలాపూర్ జిల్లా నేత, ఎన్సీపీకి చెందిన భగీరథ్‌ బాల్కే సహా పలువురు నాయకులు సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో రేపు మధ్యాహ్నం చేరనున్నారు. ఈ సందర్భంగానే కేసీఆర్ ప్రసంగిస్తారు.

అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు ధారాశివ్‌ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. సుమారు 3.30 గంటలకు అక్కడ ప్రత్యేక పూజలు చేయించి, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలోనే తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ ఆలయం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతి భవన్‌కు చేరతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే 4 సార్లు మహారాష్ట్రలో పర్యటన

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటికి 4 సార్లు మహారాష్ట్రలో పర్యటించారు. తొలుత ఫిబ్రవరి 5న నాందేడ్‌లో భారీ బహిరంగ సభ, మార్చి 14న కంధహార్ బహిరంగ సభ నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్ లో పర్యటించారు. అక్కడ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదని ప్రజలు ఆలోచించేలా అక్కడి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల జూన్ 15న నాగ్‌పుర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. త్వరలో ఔరంగాబాద్‌, పుణెలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తాజాగా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన ఐదోసారి అవుతుంది.

ఒక్క సీటు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా - ఠాక్రే

మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే అన్నారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌తో ఒరిగేదేమీ లేదని అన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌గా మారిందని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము అంతటిని మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని, ఇటీవల కర్ణాటక ఎన్నికలకు కూడా డబ్బులు పంపారని ఆరోపించారు...

ఇవాళ 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

న్యూఢిల్లీ..

వందే భారత రైళ్ల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని నేడు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లో ఉదయం 10:30 గంటలకు 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు PMO ప్రకటనలో తెలిపింది..

మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇది ఇలా ఉండగా, యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లో మైనార్టీ హక్కులపై చేసిన వాక్యాలపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు.

ప్రపంచంలోని ప్రజలందరిని ఒక కుటుంబంగా భావిస్తోందనే విషయాన్ని ఒబామా మర్చిపోవద్దని హితవు పలికారు. ఆయన హయాంలో ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు జరిగాయో ఆలోచించుకోవాలని చెప్పారు. భారత్ సెక్యులర్ స్వభావాన్ని అర్థం చేసుకోవాలని తెలిపారు..

రూ.1,25,000 రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ హతం!!

కౌషంబి:జూన్ 27

హత్యలు, దోపిడీలు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్‌‌ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు మట్టుబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌషంబి జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఎన్‍కౌంటర్ చోటుచేసుకుంది.

మృతుడిని మొహమ్మద్ గుర్ఫాన్‌గా గుర్తించారు. మాంఝాన్‌పూర్‌లోని సాండ సుగర్ మిల్లు సమీపంలో లక్నో ఎస్‌టీఎఫ్‌ గాలింపు జరుపుతుండగా జరిగిన ఎదురెదురు కాల్పుల్లో వాంటెండ్ క్రిమినల్ గుర్ఫాన్ హతమైనట్టు కౌషంబి ఎస్‌పీ బ్రిజేష్ శ్రీవాత్సవ తెలిపారు.

గుర్ఫాన్ తలపై రూ.1,25,000 రివార్డు ఉందని చెప్పారు. గాయపడిన గుర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన గుర్ఫాన్‌పై 13 క్రిమినల్ కేసులు ఉన్నట్టు వివరించారు....

Rains: నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..

SB NEWS

SB NEWS

నేడు బిజెపి బహిరంగ సభ

•ముఖ్యఅతిథిగా హాజరుకానున్న దగ్గుబాటి పురంధేశ్వరి

నంద్యాల జిల్లా:జూన్‌ 27

నగరంలోని కల్లూరు బైరెడ్డి ఫంక్షన్‌ హాలులో నంద్యాల జిల్లా బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ బహిరంగ సభ నిర్వహిచను న్నట్లు బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైౖరెడ్డి శబరి తెలిపారు.

సోమవా రం బైరెడ్డి ఫంక్షన్‌ హాల్లో ఆమె సమావేశం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చేపట్టనున్న బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిధిగా హజరవుతారని బైరెడ్డి శబరి తెలిపారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ళ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలకు వివరిస్తారన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌ చార్జి రమేష్‌ నాయుడు, కె,చెన్నయ్య, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జిఎస్‌ నాగరాజు, రామ మోహన్‌రెడ్డి, వీరప్ప, సోమేశ్వర ఆచారి, భాస్కర్‌, రమణ పాల్గొన్నారు.....

నేడు టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో మెగా రక్తదాన శిబిరాలు

యాదాద్రి :జూన్ 27

తెలంగాణ వ్యాప్తంగా నేడు మంగ‌ళ‌వారం టీఎస్ ఆర్ టీ సి ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈమేర‌కు సోమ‌వారం టీఎస్ ఆర్టీసీ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

తెలంగాణ‌లోని 101 డిపోల‌లో ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మెగా ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించ‌నున్నారు.

అందులో భాగంగా యాద‌గిరి గుట బ‌స్ స్టేష‌న్‌లో ర‌క్త‌దాన శిబిరం చేప‌ట్ట‌నున్న‌ట్ట డీపో మేనేజ‌ర్ శ్రీ‌నివాస్ తెలిపారు. ఉత్సాహ‌వంతులైన యువ‌తీ, యువ‌కులు శిబిరంలో పాల్గొని ర‌క్త‌దానం చేయాల‌ని పిలుపునిచ్చారు...

టీటీడీ అప్‌డేట్‌: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు..

సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.

నిన్న(సోమవారం జూన్‌ 26) శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్లుగా లెక్క తేలింది..

16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు ₹2102 కోట్లు..

దిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది..

ఈ ఏడాది బడ్జెట్‌లో (Union Budget) ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు..

ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్‌ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు..

ఢిల్లీలో మోడీ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ:జూన్ 26

అమెరికా, ఈజిప్టులో ఆరు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో సోమవారంనాడు సమావేశమయ్యారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్‌షా నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు.

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుకున్న నేపథ్యంలో మోదీతో అమిత్‌షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధానమంత్రి ఇండియాకు తిరిగి రాగానే దేశంలో ఏమి జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులను సైతం అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజపీ ఎంపీ మనోజ్ తివారీ సమాధానమిస్తూ, అంతా సజావుగానే సాగుతోందా అని నడ్డాను మోదీ ప్రశ్నించారని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అంతా సంతోషంగా ఉన్నారని నడ్డా సమాధానమిచ్చారని తెలిపారు.....