/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రూ.1,25,000 రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ హతం!! Yadagiri Goud
రూ.1,25,000 రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ హతం!!

కౌషంబి:జూన్ 27

హత్యలు, దోపిడీలు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్‌‌ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు మట్టుబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌషంబి జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఎన్‍కౌంటర్ చోటుచేసుకుంది.

మృతుడిని మొహమ్మద్ గుర్ఫాన్‌గా గుర్తించారు. మాంఝాన్‌పూర్‌లోని సాండ సుగర్ మిల్లు సమీపంలో లక్నో ఎస్‌టీఎఫ్‌ గాలింపు జరుపుతుండగా జరిగిన ఎదురెదురు కాల్పుల్లో వాంటెండ్ క్రిమినల్ గుర్ఫాన్ హతమైనట్టు కౌషంబి ఎస్‌పీ బ్రిజేష్ శ్రీవాత్సవ తెలిపారు.

గుర్ఫాన్ తలపై రూ.1,25,000 రివార్డు ఉందని చెప్పారు. గాయపడిన గుర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన గుర్ఫాన్‌పై 13 క్రిమినల్ కేసులు ఉన్నట్టు వివరించారు....

Rains: నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..

SB NEWS

SB NEWS

నేడు బిజెపి బహిరంగ సభ

•ముఖ్యఅతిథిగా హాజరుకానున్న దగ్గుబాటి పురంధేశ్వరి

నంద్యాల జిల్లా:జూన్‌ 27

నగరంలోని కల్లూరు బైరెడ్డి ఫంక్షన్‌ హాలులో నంద్యాల జిల్లా బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ బహిరంగ సభ నిర్వహిచను న్నట్లు బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైౖరెడ్డి శబరి తెలిపారు.

సోమవా రం బైరెడ్డి ఫంక్షన్‌ హాల్లో ఆమె సమావేశం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చేపట్టనున్న బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిధిగా హజరవుతారని బైరెడ్డి శబరి తెలిపారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ళ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలకు వివరిస్తారన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌ చార్జి రమేష్‌ నాయుడు, కె,చెన్నయ్య, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జిఎస్‌ నాగరాజు, రామ మోహన్‌రెడ్డి, వీరప్ప, సోమేశ్వర ఆచారి, భాస్కర్‌, రమణ పాల్గొన్నారు.....

నేడు టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో మెగా రక్తదాన శిబిరాలు

యాదాద్రి :జూన్ 27

తెలంగాణ వ్యాప్తంగా నేడు మంగ‌ళ‌వారం టీఎస్ ఆర్ టీ సి ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈమేర‌కు సోమ‌వారం టీఎస్ ఆర్టీసీ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

తెలంగాణ‌లోని 101 డిపోల‌లో ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మెగా ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించ‌నున్నారు.

అందులో భాగంగా యాద‌గిరి గుట బ‌స్ స్టేష‌న్‌లో ర‌క్త‌దాన శిబిరం చేప‌ట్ట‌నున్న‌ట్ట డీపో మేనేజ‌ర్ శ్రీ‌నివాస్ తెలిపారు. ఉత్సాహ‌వంతులైన యువ‌తీ, యువ‌కులు శిబిరంలో పాల్గొని ర‌క్త‌దానం చేయాల‌ని పిలుపునిచ్చారు...

టీటీడీ అప్‌డేట్‌: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు..

సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.

నిన్న(సోమవారం జూన్‌ 26) శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్లుగా లెక్క తేలింది..

16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు ₹2102 కోట్లు..

దిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది..

ఈ ఏడాది బడ్జెట్‌లో (Union Budget) ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు..

ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్‌ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు..

ఢిల్లీలో మోడీ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ:జూన్ 26

అమెరికా, ఈజిప్టులో ఆరు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో సోమవారంనాడు సమావేశమయ్యారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్‌షా నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు.

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుకున్న నేపథ్యంలో మోదీతో అమిత్‌షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధానమంత్రి ఇండియాకు తిరిగి రాగానే దేశంలో ఏమి జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులను సైతం అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజపీ ఎంపీ మనోజ్ తివారీ సమాధానమిస్తూ, అంతా సజావుగానే సాగుతోందా అని నడ్డాను మోదీ ప్రశ్నించారని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అంతా సంతోషంగా ఉన్నారని నడ్డా సమాధానమిచ్చారని తెలిపారు.....

నల్గొండ పట్టణంలో ఘోర ప్రమాదం.. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

నల్లగొండజిల్లా :జూన్ 26

జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలోని ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు.

పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....

Uppal Skywalk: 'ఉప్పల్‌ స్కైవాక్‌'ను ప్రారంభించిన కేటీఆర్‌.. ప్రత్యేకతలివీ..

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ కూడలిలో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ దీన్ని నిర్మించింది..

660 మీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ స్కైవాక్‌కు మొత్తంగా రూ.25 కోట్లు కేటాయించారు.

నాలుగు వైపుల నుంచి నేరుగా ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు ఈ వంతెనను అనుసంధానించారు.

మెట్లు ఎక్కలేని వారికోసం ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కైవాక్‌ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పించ్చిన రూఫ్‌లను ఏర్పాటు చేశారు..

స్కైవాక్‌ ప్రత్యేకతలివీ..

• నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లు

• నిధులు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి

• పొడవు: 660 మీటర్లు

• వెడల్పు: 3, 4, 6 మీటర్ల చొప్పున

• ఉప్పల్‌ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానం

• మెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం ప్రయాణించే వారు: 25-30 వేల మంది

• రింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య: సుమారు 20 వేలు

• పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నడక సాగించే వీలు

సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లును పరిశీలించిన కేంద్ర ఎన్నికల అధికారి

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కరీంనగర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం నోడల్ అధికారి అబాసాహెబ్ ఆత్మారాం కావ్లే అన్నారు. పట్టణంలోని ఈవీఎం గోడౌన్ లో రానున్న ఎన్నికల కొరకు సిద్ధం చేస్తున్న ఈవీయం ఎఫ్.ఎల్.సీ, వెబ్ కాస్టింగ్, ఈవీఎంలను భద్రపరచే గదిని ఆయన సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భం కావ్లే మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో చేపడుతున్న ఎఫ్.ఎల్.సీ, ఎన్నికల ఏర్పాట్లు ఈసీఐ నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఎఫ్.ఎల్.సీ నిర్వహణ, ఈవీఎంలు గోడౌన్ లోకి వెళ్లడం మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోలింగ్ యూనిట్, వీవీ ప్యాట్ యంత్రాల మొదటి దశ చెకింగ్ ప్రక్రియ, మాక్ పోల్, ఈవీఎం భద్రపరిచే గది, సమస్యలు తలెత్తిన వాటిని వేరుగా భద్రపరచడం, సీసీ కెమెరాల ద్వారా నిర్వహిస్తున్న వెబ్ కాస్టింగ్, అలారం, భద్రత సిబ్బంది, వ్యారికేటింగ్ తదితర విషయాలను పరిశీలించడంతో పాటు పలు విషయాలను గురించి జిల్లా కలెక్టర్, సీపీలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎ.ఎల్.సీలో పాల్గొనడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఏ.వో జగత్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ మోహనా చారి, సీపీఐ(ఎం) మేలుకూరి వాసుదేవ రెడ్డి, బీఎస్పీ గాలి అనిల్ కుమార్, బీఆర్ఎస్ సత్తినేని శ్రీనివాస్, టీడీపీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు......