/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో మెగా రక్తదాన శిబిరాలు Yadagiri Goud
నేడు టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో మెగా రక్తదాన శిబిరాలు

యాదాద్రి :జూన్ 27

తెలంగాణ వ్యాప్తంగా నేడు మంగ‌ళ‌వారం టీఎస్ ఆర్ టీ సి ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈమేర‌కు సోమ‌వారం టీఎస్ ఆర్టీసీ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

తెలంగాణ‌లోని 101 డిపోల‌లో ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మెగా ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించ‌నున్నారు.

అందులో భాగంగా యాద‌గిరి గుట బ‌స్ స్టేష‌న్‌లో ర‌క్త‌దాన శిబిరం చేప‌ట్ట‌నున్న‌ట్ట డీపో మేనేజ‌ర్ శ్రీ‌నివాస్ తెలిపారు. ఉత్సాహ‌వంతులైన యువ‌తీ, యువ‌కులు శిబిరంలో పాల్గొని ర‌క్త‌దానం చేయాల‌ని పిలుపునిచ్చారు...

టీటీడీ అప్‌డేట్‌: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు..

సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.

నిన్న(సోమవారం జూన్‌ 26) శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్లుగా లెక్క తేలింది..

16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు ₹2102 కోట్లు..

దిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్లు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది..

ఈ ఏడాది బడ్జెట్‌లో (Union Budget) ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించింది. ఏపీకి మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 'స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు అందుతుంది. ఈ నేపథ్యంలో రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంతో విద్య, వైద్యం, నీటి పారుదుల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు..

ఈ పథకం కింద నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉండగా.. కేరళ, ఏపీ మాత్రం ఈ జాబితాలో లేవు. అత్యధికంగా బిహార్‌కు రూ.9640 కోట్లు కేంద్రం రుణం మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇదే తరహా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద రూ.95,147.19 కోట్లకు ఆమోదం తెలపగా.. రూ.81,915.35 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కొవిడ్‌ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టారు..

ఢిల్లీలో మోడీ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ:జూన్ 26

అమెరికా, ఈజిప్టులో ఆరు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో సోమవారంనాడు సమావేశమయ్యారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్‌షా నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు.

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుకున్న నేపథ్యంలో మోదీతో అమిత్‌షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధానమంత్రి ఇండియాకు తిరిగి రాగానే దేశంలో ఏమి జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులను సైతం అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజపీ ఎంపీ మనోజ్ తివారీ సమాధానమిస్తూ, అంతా సజావుగానే సాగుతోందా అని నడ్డాను మోదీ ప్రశ్నించారని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అంతా సంతోషంగా ఉన్నారని నడ్డా సమాధానమిచ్చారని తెలిపారు.....

నల్గొండ పట్టణంలో ఘోర ప్రమాదం.. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

నల్లగొండజిల్లా :జూన్ 26

జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలోని ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

స్థానికంగా ఉన్న న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు.

పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు....

Uppal Skywalk: 'ఉప్పల్‌ స్కైవాక్‌'ను ప్రారంభించిన కేటీఆర్‌.. ప్రత్యేకతలివీ..

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ కూడలిలో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ దీన్ని నిర్మించింది..

660 మీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ స్కైవాక్‌కు మొత్తంగా రూ.25 కోట్లు కేటాయించారు.

నాలుగు వైపుల నుంచి నేరుగా ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు ఈ వంతెనను అనుసంధానించారు.

మెట్లు ఎక్కలేని వారికోసం ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కైవాక్‌ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పించ్చిన రూఫ్‌లను ఏర్పాటు చేశారు..

స్కైవాక్‌ ప్రత్యేకతలివీ..

• నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లు

• నిధులు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి

• పొడవు: 660 మీటర్లు

• వెడల్పు: 3, 4, 6 మీటర్ల చొప్పున

• ఉప్పల్‌ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానం

• మెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం ప్రయాణించే వారు: 25-30 వేల మంది

• రింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య: సుమారు 20 వేలు

• పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నడక సాగించే వీలు

సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లును పరిశీలించిన కేంద్ర ఎన్నికల అధికారి

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కరీంనగర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం నోడల్ అధికారి అబాసాహెబ్ ఆత్మారాం కావ్లే అన్నారు. పట్టణంలోని ఈవీఎం గోడౌన్ లో రానున్న ఎన్నికల కొరకు సిద్ధం చేస్తున్న ఈవీయం ఎఫ్.ఎల్.సీ, వెబ్ కాస్టింగ్, ఈవీఎంలను భద్రపరచే గదిని ఆయన సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భం కావ్లే మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో చేపడుతున్న ఎఫ్.ఎల్.సీ, ఎన్నికల ఏర్పాట్లు ఈసీఐ నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

ఎఫ్.ఎల్.సీ నిర్వహణ, ఈవీఎంలు గోడౌన్ లోకి వెళ్లడం మొదలుకొని ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోలింగ్ యూనిట్, వీవీ ప్యాట్ యంత్రాల మొదటి దశ చెకింగ్ ప్రక్రియ, మాక్ పోల్, ఈవీఎం భద్రపరిచే గది, సమస్యలు తలెత్తిన వాటిని వేరుగా భద్రపరచడం, సీసీ కెమెరాల ద్వారా నిర్వహిస్తున్న వెబ్ కాస్టింగ్, అలారం, భద్రత సిబ్బంది, వ్యారికేటింగ్ తదితర విషయాలను పరిశీలించడంతో పాటు పలు విషయాలను గురించి జిల్లా కలెక్టర్, సీపీలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎ.ఎల్.సీలో పాల్గొనడం విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఏ.వో జగత్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ మోహనా చారి, సీపీఐ(ఎం) మేలుకూరి వాసుదేవ రెడ్డి, బీఎస్పీ గాలి అనిల్ కుమార్, బీఆర్ఎస్ సత్తినేని శ్రీనివాస్, టీడీపీ రవీందర్, తదితరులు పాల్గొన్నారు......

'కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో' నినాదంతో ముందుకు సాగాలి: రాహుల్‌ గాంధీ..

ఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్‌ , జూపల్లి కృష్ణారావు భేటీ ముగిసింది. వీరిద్దరితోపాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి, ముఖ్య నాయకులు పిడమర్తి రవి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా ఉన్నారు..

ఏఐసీసీ కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశం సాగింది.

ఈ సందర్భంగా జూలై 2న ఖమ్మం సభకు రావాలని రాహుల్‌ను పొంగులేటి, జూపల్లి కోరారు. అనంతరం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. టీ కాంగ్రెస్‌లో ఘర్‌ వాపసి జరుగుతోందని.. నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కాగా తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, సీనియర్‌ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌, జూపల్లి కృష్ణారావు నేడు(సోమవారం) రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరునున్నారు. ఇందులో భాగంగానే వీరు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఇక, ఢిల్లీలో ఉన్న వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ‍కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పొంగులేటి, జూపల్లి ఉన్నట్టు సమాచారం. అనంతరం, మధ్యాహ్నం రెండు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. పొంగులేటి, జూపల్లితో పాటు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరంతా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లికి పయనమయ్యారు.

ఈ సందర్బంగా మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజంనిప్పులాంటిది

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ చేతికి హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి, అభినందించారు. ఆ తర్వాత ఆయన ప్రత్య

మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ చేతికి హోం మంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి, అభినందించారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక బస్సులో మహారాష్ట్రకు బయలుదేరారు. బస్సులో మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఇక సీఎం బస్సు వెంట 600 వాహనాలు భారీ కాన్వాయ్‌గా బయలు దేరాయి. అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.00 గంటకు ఒమర్గాకు చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి.. సాయంత్రం 4.30 గంటలకు షోలాపూర్ చేరుకుంటారు. ఈ రోజు షోలాపూర్‌లో బస చేస్తారు. ఆ సమయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశం అవుతారు. అలాగే తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు షోలాపూర్ నుంచి పండరీపురం చేరుకుంటారు. అక్కడి విఠోభా రుక్మిణి మందిరంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ధారాశివ్ జిల్లాలోని తుల్జాభవానీ అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు...
ఉప్పల్‌లో మరో మణిహారం నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

మహా నగరానికి తూర్పు దిక్కున మరో మణిహారం సిద్ధమైంది. ఉప్పల్‌లో వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఆకాశ నడక మార్గం సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. మంత్రి కేటీఆర్‌ నేడు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

రామంతాపూర్‌, సికింద్రాబాద్‌ వైపు నుంచి ఎల్‌బీనగర్‌ వైపు, ఉప్పల్‌ నుంచి రామంతాపూర్‌, సికింద్రాబాద్‌ వైపు.. ప్రతి రోజు వేలాది మంది పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఉప్పల్‌ రింగురోడ్డు వద్ద రోడ్డు దాటేందుకు ఎంతో ప్రయాస పడుతుండేవారు.

ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగించే సుమారు 30 వేల మందికి పైగా ప్రయాణికులు సైతం ఎటు వైపు వెళ్లాలన్నా ఎంతో ఇబ్బందిగానే ఉండేది. ఈ క్రమంలో ఈజీగా రోడ్డు దాటేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్కైవాక్‌తో ఉప్పల్‌ రింగురోడ్డు వద్ద పాదచారులు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించనున్నారు.

నగరంలోనే మొదటిది..

దాదాపు రూ.25 కోట్లతో హెచ్‌ఎండీఏ ఉప్పల్‌ స్కైవాక్‌ను నిర్మించింది. 660 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆకాశ నడక మార్గం నగరంలో మొట్టమొదటి నిర్మాణం. రాబోయే వందేళ్ల పాటు వినియోగంలో ఉండేలా ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కైవాక్‌ను ఎంతో పటిష్టంగా నిర్మించినట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనికోసం సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్‌ స్టీల్‌ను వినియోగించారు. వివిధ రకాల స్కైవాక్‌ నమూనాలను పరిశీలించిన అనంతరం హెచ్‌ఎండీఏ ప్రస్తుతం ఉన్న ఏర్పాటును ఖరారు చేసింది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 2020లోనే పనులు ప్రారంభించినప్పటికీ కోవిడ్‌ కారణంగా నిర్మాణంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ప్రస్తుతం నిర్మా ణం పూర్తి చేసుకొని వినియోగంలోకి రానుంది.......