/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Yadagiri Goud
ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని దిల్లీ రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి కూడా దిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న కిషన్‌రెడ్డి.. దిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈటల, రాజగోపాల్‌రెడ్డితో నిర్వహించనున్న భేటీలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భాజపా కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై భాజపా అధిష్ఠానం దృష్టి పెట్టింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని దిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో కేటీఆర్ భేటీ!!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతున్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్, బీఆర్‌ఎస్‌ ఎంపీలు శనివారం కలిశారు. రాత్రి 10:15కి అమిత్‌షాను కేటీఆర్‌ కలవనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్‌తో పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు. ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ కోరారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్ ఆర్ డి పి, లింకు రోడ్లు, పారిశుద్ధ్యరంగంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అర్బన్ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు హైదరాబాద్ రావాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలకు సంబంధించిన విజ్ఞప్తులను హర్దీప్ సింగ్ పూరికి అందించారు....

ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ 36 రైళ్ల రద్దు.. ఏ ఏ రైళ్లు.. కారణమేంటంటే..

సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకూ ఏకంగా 36 రైళ్లను రద్దు చేసింది.

అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేసింది. హైదరాబాద్ - సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ మరమ్మతు పనుల కోసం ఈ రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

26 నుంచి రద్దు కానున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఏవంటే..

లింగంపల్లి - హైదరాబాద్

హైదరాబాద్ - లింగంపల్లి

చందానగర్ - లింగంపల్లి

లింగంపల్లి - చందానగర్

లింగంపల్లి - ఫలక్నుమ

ఫలక్‌నుమ - లింగంపల్లి

రామచంద్రపురం - ఫలక్‌నుమ

రద్దు కానున్న 36 రైళ్లు..

కాజీపేట-డోర్నకల్ డోర్నకల్-కాజీపేట

డోర్నకల్ విజయవాడ

విజయవాడ డోర్నకల్

భద్రాచలం - విజయవాడ

విజయవాడ - భద్రాచలం

సికింద్రాబాద్ - వికారాబాద్

వికారాబాద్ - సికింద్రాబాద్

సికింద్రాబాద్ - వరంగల్

వరంగల్ - హైదరాబాద్

సిర్పూర్ టౌన్ - కరీంనగర్

కరీంనగర్ - సిర్పూర్ టౌన్ కరీంనగర్ -నిజామాబాద్

నిజామాబాద్-కరీంనగర్

కాజీపేట-సిర్పూర్ టౌన్

బల్హర్షా-కాజీపేట

భద్రాచలం - బళ్లార్ష

సిర్పూర్ టౌన్ - భద్రాచలం

కాజీపేట - బల్హర్షా

బల్హర్షా-కాజీపేట

కాచిగూడ-మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్- కాచిగూడ కాచిగూడ - రాయచూరు

రాయచూరు - గద్వాల్

గద్వాల్ - రాయచుర్

రాయచురు - కాచిగూడ

సికింద్రాబాద్ - మేడ్చల్

మేడ్చల్-సికింద్రాబాద్

మత్తుతో విద్యార్థి చిత్తు

నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సన్ సిటీ వద్ద ఓ విద్యార్థి డ్రగ్స్ తీసుకుంటుండగా శనివారం నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అతని వద్ద 5 గ్రాముల MDMA డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజస్, ఓ వెయింగ్ మిషన్ తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.

డ్రగ్స్‌తో పట్టుబడిన విద్యార్థి సాకేత్‌.. ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని గన్నవరం నివాసి. బెంగుళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ప్రాంతంలో విక్రయించడానికి వచ్చి పోలీసులకు సాకేత్ పట్టుబడ్డాడు.

NDPS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు? బెంగుళూరు లో సాకేత్‌కు డ్రగ్స్ ఎవరు?ఇచ్చారు అనే కోణంలో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ...

జనసేన పార్టీకి గాజు గ్లాసే

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఏపీఎస్‌ఈసీ) ఉత్తర్వులు జారీచేసింది.

జనసేనను రిజర్వుడు సింబల్‌ కలిగిన రిజిస్టర్డ్‌ పార్టీల జాబితాలోనే ఉంచింది. తెదేపా, వైకాపాలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో వాటి గుర్తులతో కొనసాగించింది.

ఆమ్‌ ఆద్మీ పార్టీని గుర్తింపుపొందిన జాతీయ పార్టీగా, సీపీఐ, ఎన్‌సీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా జాబితాలో చేర్చింది.

ప్రస్తుతం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాబితాలో ఉన్న ఆర్‌ఎల్‌డీని రిజిస్టర్డ్‌ పార్టీల జాబితాలో చేర్చింది.

ఈ పార్టీకి ఎలాంటి గుర్తు రిజర్వు చేయలేదు. భారాస ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. ఆ పార్టీ కొత్త పేరు, వివరాలతో ఏపీఎస్‌ఈసీ వద్ద దరఖాస్తు చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు.........

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్ట్‌కు బయలుదేరారు, మొదటిసారిగా ఈ దేశాన్ని సందర్శించడం ఎంత ముఖ్యమో

నాలుగు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్ట్‌ బయల్దేరి వెళ్లారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన ఈజిప్ట్‌లో పర్యటించనున్నారు.ప్రధాని మోదీ ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా అల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కైరోలో పర్యటిస్తున్నారు. జనవరిలో జరిగిన భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీని ఈజిప్ట్ అధ్యక్షుడు రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు.

అమెరికా పర్యటనను ముగించిన తర్వాత, ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, "భారత్-అమెరికా మధ్య స్నేహాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో అనేక ఈవెంట్‌లు మరియు పరస్పర చర్యలలో పాల్గొనే అవకాశం నాకు చాలా ప్రత్యేకమైన USA పర్యటనను ముగించింది." మన దేశాన్ని మరియు భూమిని రాబోయే తరాలకు మంచి ప్రదేశంగా మార్చడానికి కలిసి పని చేస్తూనే ఉంటాము.

ఈజిప్టు రాజధాని కైరోలోని 11వ శతాబ్దానికి చెందిన అల్-హకీమ్ మసీదును కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. దావూదీ బోహ్రా సంఘం సహాయంతో ఇది పునరుద్ధరించబడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించే హీలియోపోలిస్ అమరవీరుల స్మారకాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ మరియు పాలస్తీనాలో మరణించిన దాదాపు 4000 మంది భారతీయ సైనికులకు ఇది స్మారక చిహ్నం.

ఈజిప్టు పర్యటనలో, ప్రధాని మోడీ మార్చిలో ఈజిప్టు అధ్యక్షుడు భారతదేశ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏర్పడిన 'ఇండియా యూనిట్'తో కూడా సంభాషిస్తారని వివరించండి. ఈ యూనిట్‌లో పలువురు అత్యున్నత స్థాయి మంత్రులను చేర్చారు.భారత్‌తో సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ బృందం ఏర్పడింది. ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌సీసీతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వ్యాపార, ఆర్థిక సహకారానికి సంబంధించిన కొత్త రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా కొన్ని అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.

ఈ సమయంలో, భద్రత నుండి వాణిజ్యం మరియు పెట్టుబడుల వరకు సహకారాన్ని పెంచుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాలని భావిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. అదే సమయంలో, 1997 తర్వాత ఒక భారత నాయకుడు ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి.

ఈజిప్టు రాయబారి వేల్ మొహమ్మద్ అవద్ హమెద్ మాట్లాడుతూ, సైనిక పరికరాల సహ ఉత్పత్తితో పాటు, సూయజ్ కెనాల్ ఎకనామిక్ జోన్‌లో భారతదేశానికి అంకితమైన స్లాట్ కూడా రెండు దేశాల సమావేశంలో చర్చించబడుతుంది. ఇది కాకుండా గ్రీన్ హైడ్రోజన్, టూరిజంలో భారత్ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఈ పర్యటనలో, వ్యవసాయం, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు, సమాచార సాంకేతికత, వాణిజ్య ప్రమోషన్ మరియు సంస్కృతిపై ఇరు దేశాల మధ్య నాలుగు లేదా ఐదు ఒప్పందాలు జరగవచ్చని సమాచారం. మరియు ఈజిప్షియన్లు తమ సంబంధాల యొక్క అన్ని అంశాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ఈజిప్ట్‌ను ప్రత్యేక అతిథిగా భారత్ ఆహ్వానించింది.

సహకరించకపోయినా పర్వాలేదు.. మా అభివృద్ధిని అడ్డుకోకండి: మంత్రి కేటీఆర్‌

న్యూఢిల్లీ:జూన్ 24

సహాయం చేయకపోయినా ఫర్వాలేదు.. కనీసం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.

కంటోన్మెంట్‌లో రోడ్ల అభివృద్ధి, స్కైవేల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి కేటీఆర్ ఆయనకు విమతిపత్రం సమర్పించారు. రక్షణ మంత్రితో సమావేశం అనంతరం ఆయన ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథంతో కలిసి తుగ్లక్ రోడ్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామనిఅమరులకు అసలైన నివాళి అభివృద్ధి’ అన్న నినాదంతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ, ఆసియాలో అతిపెద్ద హౌసింగ్ వంటివి అందులో ఉన్నాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెబుతోందని అన్నారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రానికి మరింత చేయూతనివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకెళ్తున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సహకరించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి అందింది గుండు సున్నా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రక్షణ శాఖకు మంత్రులుగా పని చేసే ఐదుగురుని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. దేశంలో జరుగుతున్న ఉద్యోగ కల్పనలో 44 శాతం ఉద్యోగాలు హైదరాబాద్ నుంచేనని చెప్పారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో మూడో వంతు హైదరాబాదులోనే తయారవుతూ గ్లోబల్ హబ్‌గా నిలిచిందని అన్నారు. ఇలా శరవేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను ఆ మేరకు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

మౌలిక వసతుల కల్పనలో సహకరించాలని తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నామని, ప్రధాని నుంచి మొదలుపెట్టి ఐదుగురు రక్షణ మంత్రులను పదే పదే అడిగామని గుర్తుచేశారు. అయినా ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని కేటీఆర్ ఆరోపించారు. వరదల్లో హైదరాబాద్ నగరంలో అతలాకుతలమైన సమయంలో కూడా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారికి కనెక్ట్ చేసే మార్గంలో ఒక ‘స్కైవే’ నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే ఈ స్కై వే నిర్మాణం కోసం మార్గంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం నుంచి రక్షణ శాఖకు చెందిన 96 ఎకరాలు అవసరమవుతుందని, అలాగే ప్యాట్నీ సెంటర్ నుంచి నాగ్‌పూర్ హైవే వరకు 18.5 కి.మీ స్కై వే మేర నిర్మించ తలపెట్టిన మరో స్కైవే కోసం 56 ఎకరాల రక్షణశాఖ స్థలం కావాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతున్నట్టు చెప్పారు. రక్షణ శాఖ ఇచ్చే స్థలానికి సమాన మొత్తంలో మరోచోట స్థలాన్ని ఇస్తామని చెబుతున్నా సరే కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు...

చిక్కిన చిరుత : ఊపిరి పీల్చుకున్న భక్తులు

తిరుమల:జూన్ 24

తిరుమల నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆ చిరుత కోసం జల్లెడ పట్టారు. మొత్తానికి చిరుత బోనుకి చిక్కింది.

అలిపిరి మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతగా అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను అటవీ అధికారులు బంధించారు. దీంతో.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూ నడక దారిలో వెళుతున్న శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

చిరుతను పట్టుకోవడానికి తిరుమల నడక దారిలో రెండు బోన్లు, 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. 2008లో కాలి నడక భక్తులపై చిరుత దాడి చేసినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తాజా ఘటనలో కూడా బాలుడిపై చిరుత దాడి చేసినా మెడ, ముఖం పైన గాయాలు తప్ప ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో తెలుసుకోవడానికి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

అసలేం జరిగిందంటే..

పోలీస్‌ పోస్టు వెనుక వైపు అడవిలోకి బాలుడిని చిరుత పులి నోట కరుచుకుని ఈడ్చుకుంటూ వెళ్లింది. కాసేపటికి దాదాపు 20 మంది పోగయ్యారు. అందరూ కలిసి మొబైల్‌ టార్చ్‌లు ఆన్‌ చేసుకుని అడవిలోకి బయలుదేరారు. అరుస్తూ, కేకలు పెడుతూ అడవంతా గాలించారు. దాదాపు 25 నిమిషాల తర్వాత 150 మీటర్ల దూరంలో రిపీటర్‌ స్థలం వెనుక లోయలో పిల్లాడి ఏడుపు వినిపించింది. ధైర్యం చేసి కిందికి దిగారు. ముఖమంతా నెత్తురోడుతూ చిన్నారి కౌశిక్‌ రోదిస్తున్నాడు. అమాంతం బిడ్డను జవురుకుని రోడ్డు మీదకి జనం పరుగు తీశారు.

ప్రాణాలతో దక్కిన బిడ్డను గుండెలకు హత్తుకుని అల్లుకుపోయింది తల్లి. ఆ తర్వాత భద్రతా సిబ్బంది సాయంతో ఆసుపత్రికి బాబుని తరలించారు. జనం అరుపులు కేకలు, రాళ్ల దాడితో బెదిరిపోయిన చిరుత పులి పిల్లాడిని వదిలి బతుకుజీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆస్పత్రిలో చిన్నారి కౌశిక్‌ కోలుకుంటున్నాడు.కౌశిక్‌ను శుక్రవారం టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పరామర్శించారు......

తిరుమలలో నేడు శనివారం భక్తుల రద్దీ

తిరుపతి :జూన్ 24

తిరుమలలో నేడుశనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

నిన్న శుక్రవారం శ్రీవారిని 72,304 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 32,504 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో కేటీఆర్ భేటీ, అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో స్కైవేల నిర్మాణంపై చర్చించమన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, మౌళిక వసతుల కల్పనలో కేంద్రం చేయూత నివ్వాలన్నారు.

అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరామన్నారు. రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ అడిగామన్నారు. ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామన్నారు. 9 ఏళ్ల నుంచి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.

కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా అన్నారు. హైదరాబాద్ లో స్కై వాక్స్ నిర్మిస్తున్నామన్నారు. ఉప్పల్ లో స్కై వాక్ ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. లీజ్ ల్యాండ్స్ ని జీహెచ్ ఎంసీకి బదలాయించాలని కోరామన్నారు. తెలంగాణకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు...