/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz BJP: ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి భాజపా అధిష్ఠానం పిలుపు.. Yadagiri Goud
BJP: ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి భాజపా అధిష్ఠానం పిలుపు..

దిల్లీ: తెలంగాణపై భాజపా అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని దిల్లీ రావాలని ఆదేశించారు..

ఈ మేరకు వీరిద్దరు ఇవాళ లేదా రేపు దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాలకు పలువురు సీనియర్లు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భాజపా కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై భాజపా అధిష్ఠానం దృష్టి పెట్టింది.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని దిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ భాజపా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్ :జూన్ 23

తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతం అయిన ప్రజలకు తీపి కబురు అందింది.

నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు,రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట...

జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ 3 హత్యలు

•సైకో సీరియల్‌ కిల్లర్‌ అరెస్టు

రాజేంద్రనగర్ అతను కరడుగట్టిన నేరస్థుడు. అయిదుగుర్ని కిరాతకంగా చంపాడు. ఒళ్ళు గగుర్పొడిచే నేరచరిత్ర ఉన్న అతనికి యావజ్జీవ శిక్ష పడింది. కానీ క్షమాభిక్ష లభించి జైలు నుంచి బయటికొచ్చాడు. మళ్లీ అతనిలో ఉన్మాది నిద్రలేచాడు. వరుసగా మూడు హత్యలు చేశాడు. హైదరాబాద్‌ ప్రజలను భయభ్రాంతులను చేసిన ‘సైకో సీరియల్‌ కిల్లర్‌’ బ్యాగరి ప్రవీణ్‌ (34)ను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.

ఈ కేసుల వివరాలను రాజేంద్రనగర్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. రాజేంద్రనగర్‌ ఇంద్రారెడ్డి నగర్‌ బస్తీకి చెందిన ప్రవీణ్‌ కూలీ పనిచేసేవాడు. 2011లో బుద్వేల్‌లో ప్రకాశ్‌ అనే వ్యక్తి బయట పడుకుని ఉండగా బండరాయితో మోది చంపాడు. కొన్ని రోజులకు అలాగే అత్తాపూర్‌ పిల్లర్‌ నెం.127 వద్ద ఓ యాచకుడిని హతమార్చాడు. తర్వాత ప్రవీణ్‌ తన మిత్రులు షేక్‌ ఫయాజ్‌, దర్గా నరేశ్‌తో కలిసి ఇంద్రారెడ్డినగర్‌ బస్తీకి చెందిన భార్యాభర్తలు, వారి కొడుకుని హత్య చేశారు. ఇంటి బయట పడకున్న వ్యక్తిని చంపి, ఇంట్లోకి వెళ్లి అతని భార్యపై అత్యాచారం చేసి గొంతు కోసి హతమార్చారు. ఆమె పక్కనే ఉన్న కొడుకుని కూడా చంపి పారిపోయారు. అప్పట్లో వరసగా జరిగిన 5 హత్యలు కలకలం రేపాయి. 2014 జూన్‌లో ప్రవీణ్‌కు యావజ్జీవ శిక్ష పడింది. గతేడాది అక్టోబరు 29న క్షమాభిక్షపై విడుదలయ్యాడు. తర్వాత ప్రవీణ్‌లోని ఉన్మాది మళ్లీ నిద్రలేచాడు. ఈ నెల 8న నేతాజీనగర్‌లో ఆరుబయట పడుకున్న గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశాడు. మంగళవారం (20వ తేదీ)అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మరో ఇద్దర్ని చంపాడు. కాటేదాన్‌ స్వప్న థియేటర్‌ సమీపంలో ఖజారియా దుకాణం ముందు పడుకున్న గుర్తు తెలియని వ్యక్తి తలపై బండరాయితో మోది చంపి అతని వద్ద ఉన్న రూ.400 తీసుకుని దుర్గానగర్‌ వైపు వెళ్లాడు. అక్కడ దుప్పట్లు అమ్ముకునే ప్రకాశ్‌ (55) అనే వ్యక్తి ఆరుబయట పడుకుని ఉండగా అతని తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అతని వద్ద ఉన్న రూ.1500 తీసుకుని పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నిందితుడిని 24 గం టల్లో పట్టుకున్నారు. ప్రవీణ్‌పై చోరీ, దోపిడీ, చైన్‌స్నాచింగ్‌ కేసులు కూడా ఉన్నట్టు గుర్తించారు...

మాల్ ప్రాక్టీస్ కింద 29 మంది విద్యార్థులు బుక్

కేయూ క్యాంపస్ :జూన్ 23

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నేడు జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 29 మంది మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ పి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎ నరేందర్ తెలిపారు.

200 మంది మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ కావడం నిజమేనా?

కేయూ పరిధిలో ఇప్పటి వరకు నిర్వహించిన డిగ్రీ పరీక్షల్లో సుమారు గా 200 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థుల ను ఎడాపెడా మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. పరీక్షల నిర్వహణకు కనీస సౌకర్యాలు లేని పరీక్షా కేంద్రాలను బాధ్యులు చేయకుండా విద్యార్థులను చిన్న చిన్న కారణాలతో డిబార్ చేస్తుండడంతో, ఇటీవలి కాలంలో యూనివర్సిటీ లో పరీక్షల ఫీజులు కూడా పెద్ద ఎత్తున పెంచే సరికి ఈ కోణంలో ఏమైనా కారణం ఉందా అని ఫెయిల్,డిబార్ అయిన విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఫెయిల్,డిబార్ విద్యార్థులు ఫీజులు తప్పనిసరిగా కట్టాల్సి వస్తుంది.

ఫీజులు రూపంలో గణనీయంగా వసూలు చేసుకోవడానికి ఈ విధంగా డిబార్ అనే కారణాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సమాచారం. అసలు విశ్వవిద్యాలయంలో సరిపోయినంత మంది బోధనా సిబ్బంది లేరు అనే అపవాదు ఉండనే ఉన్నది. దీనికి తోడు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర కేంద్రాలకు తనిఖీలకు వెళ్లడానికి సిబ్బంది ఎలా సరిపోతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీ పరిధి లో రెండు వందల మంది విద్యార్థుల ను మాల్ ప్రాక్టీస్ క్రింద బుక్ చేసి అపవాదు మూట కట్టుకొంటున్నది. చూడాలి ఇంకా ఎంత మందిని బుక్ చేస్తారో...

కెసిఆర్ తక్షణమే అనాథలకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి - MRPS

కలెక్టర్ కార్యాలయం ముందు "అనాథల అరిగోస దీక్ష"

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాథలకు అనేక హామీలు ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు కేసీఆర్ నెరవేర్చలేదని తక్షణమే అనాథలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారి పిలుపుతో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు MRPS, మహాజన సోషలిస్ట్ పార్టీ(MSP) ఆధ్వర్యంలో అనాథ పిల్లలతో "అనాథల అరిగోస దీక్ష"ను చేపట్టారు.

ఈ దీక్షకు MSF జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ.. సమాజంలో తల్లిదండ్రులు లేని, సంరక్షకులు లేని అత్యంత నిస్సహాయులైన అనాథలను సైతం మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.

KCR అనాథలకు అనేక హామీలుఇస్తూ అనాథలకు ఇక ప్రభుత్వమే అమ్మానాన్న అని, వారికి గురుకుల పాఠశాలలు ఏర్పరుస్తామని, అనాథ పిల్లలందరికీ స్మార్ట్ కార్డులు ఇస్తామని, వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తామని, రోడ్లపైన కూడళ్ల పైన బిక్షటన చేసే వారిని ప్రభుత్వమే గుర్తించి హోమ్స్ లో షేల్టర్ కల్పిస్తామని, అనాథల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని అనేక హామీలు ఇచ్చి వీటి పైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు కూడా చేసి ఇప్పటివరకు ఒక్క హామీనీ నెరవేర్చలేదని అన్నారు.

తక్షణమే వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని,వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో అనాథ బాలురు, బాలికలు పాల్గొన్నారు.

ఈ దీక్షలో MSP నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, MRPS నల్లగొండ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ, MRPS జిల్లా కో- కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ, MSP జిల్లా నాయకులు ఆడేపు నాగార్జున మాదిగ, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్ మాదిగ, MSP నాగార్జునసాగర్ ఇంచార్జ్ మడుపు శ్రీనివాస్ మాదిగ, MSP మిర్యాలగూడ ఇంచార్జ్ మచ్చ ఏడుకొండల్ మాదిగ, MSP మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమిరే స్వామి మాదిగ, ఎంఎస్పి నల్గొండ మండలం ఇంచార్జ్ బొజ్జ దేవయ్య MRPS నాయకులు సన్నీ మాదిగ, ఏర్పుల వెంకటయ్య బోర్ర మోష, ఏడుకొండలు మాదిగ , MSF నాయకులు త్రినేత్ర మాదిగ, వంగూరి బన్ని మాదిగ, విజ్ఞాన్ మాదిగ, శివ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి తదితర నాయకులు పాల్గొన్నారు.

Kashmir: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించి..

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను నేడు భద్రతా దళాలు మట్టుబెట్టాయి..

కుప్వార వద్ద జరిగిన ఈ ఆపరేషన్‌ను భారత సైన్యంలోని చినార్‌ కోర్‌ దళాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించాయి.

దాదాపు వారం వ్యవధిలో ఇదే ప్రాంతంలో జరిగిన రెండో ఆపరేషన్‌ ఇది. ఈ ఎన్‌కౌంటర్‌ సరిహద్దుకు అత్యంత సమీపంలో మచిల్‌ సెక్టార్‌ వద్ద చోటు చేసుకొంది.

సరిహద్దుకు అవతల ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించే క్రమంలో కాలా జంగిల్‌ వద్ద ఎన్‌కౌంటర్‌ మొదలైంది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. జూన్‌ 16వ తేదీన ఇదే జిల్లాలోని జుమగుండ వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ రోజుల వ్యవధిలోనే తొమ్మిది మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చినట్లైంది..

ఉరుమడ్ల గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమం

•ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాలు ఇంటింటికీ

•కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల కాలంలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం వైపు అడుగులు వేస్తూ భారత దేశ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు.

అవినీతిరహిత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గ్రామంలో వాడ వాడల ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి విజయాలను తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాలను ఇంటింటికీ వెళ్లి అందజేశారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి గాను 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి ప్రధానమంత్రి కి మద్దతు తెలుపండి అని ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంత్యోదయ స్ఫూర్తి తో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదల గృహాలకు నల్ల నీరు మరియు విద్యుత్ అందించడం, రైతు సంక్షేమానికి పెద్దపీట ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ. 6000 ఆర్థిక సహాయం, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ద్వారా 37.5 కోట్ల మంది రైతులు నమోదు,

MSP లో చారిత్రాత్మక పెరుగుదల, కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4 కోట్ల రైతులకు రూ. 4.7 లక్షల కోట్ల క్రెడిట్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా 57 లక్షల మంది రైతులకు లబ్ధి, మౌలిక సదుపాయాల అపూర్వ వృద్ధి,PM గతి శక్తి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు, వందే భారత్ రైలు ప్రారంభం, జాతీయ రహదారుల నిర్మాణ వేగం, ఈశాన్య రాష్ట్రాల చారిత్రక అభివృద్ధి, ఈశాన్య రాష్ట్రాల్లో 76% తగ్గిన తీవ్రవాద ఘటనలు, అస్సాం లో 2000 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం, సాంస్కృతిక వారసత్వంలో కొత్త శకం, అయోధ్య రామ జన్మభూమి లో భవ్య మందిరం,

కాశీ విశ్వనాథ్, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గ్రాండ్ కారిడార్ నిర్మాణం, సోమనాథ్, కేదార్ నాథ్ ఆలయాల పునరుద్ధరణ, జన్ జాతీయ గౌరవ్ దివస్, 10 గిరిజన మ్యూజియంలు, అత్యున్నత త్యాగం చేసిన మన సైనికుల గౌరవార్థం న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నిర్మాణం, నారీ నారాయణి: మహిళా సాధికారత, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 9.6 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు జారి గ్యాస్ స్టవ్ ల పంపిణీ, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 11. 72 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం, స్టాండ్ అప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా 27.6 కోట్ల మంది మహిళా లబ్ధిదారులకు రుణాలు,

ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా 3. 03 కోట్ల మంది మహిళలకు సహాయం, భారతదేశ అమృతకాలం భావితరం సశక్తీకరణ, 390 కొత్త విశ్వవిద్యాలయాలు, 7 కొత్త IITలు మరియు ఏడు కొత్త IIMలు స్థాపన, 15 ఎయిమ్స్ మరియు 225 మెడికల్ కాలేజీలు స్థాపన, పీఎం శ్రీ యోజన ద్వారా 14,500 పాఠశాలల అభివృద్ధి, 1.37 కోట్ల మంది యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా శిక్షణ, దేశంలో ఒక లక్ష స్టార్టప్ లు మరియు 100 ప్లస్ యూనికార్నలు, ఉద్యోగమేళాల ద్వారా 71,000 పైన నియామక పత్రాల పంపిణీ, అందరికీ ఆరోగ్యకరమైన జీవితం 10.7 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భీమా కవరేజ్, ఆయుష్మాన్ భారత్ ద్వారా 4.5 కోట్ల ప్రజలకు ఉచిత చికిత్స,

జన్ ఔషధీ కేంద్రాలు, వైద్యశాలల బలోపేతం, ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కేంద్రాలు, ప్రపంచంలోనే అత్యంత భారీ టీకా కార్యక్రమం ద్వారా 220 కోట్ల పైన కరోనా టీకా డోసులు, మిషన్ ఇంద్రధనుష్, మధ్యతరగతికి సులభతర జీవితం, సశక్త భారతదేశం నేడు భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా కాలంలో వందే భారత్ మిషన్ ద్వారా 2. 97 కోట్ల మంది భారతీయులు స్వదేశం తరలింపు, భారతదేశం భద్రత పటిష్టం, ఆర్టికల్ 370 రద్దు, వసుదైవ కుటుంబం, డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ తీర్చి దిద్దాడన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నకిరేకల్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఎస్సీ మోర్చా చిట్యాల మండల అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, యాదయ్య, శ్రీను, మల్లేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య

ఖమ్మం జిల్లా:జూన్ 23

పెనుబల్లి మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.

కారాయి గూడెం గ్రామానికి చెందిన కుటుంబం మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

గ్రామానికి చెందిన పొట్రూ వెంకటకృష్ణరావు (40), భార్య సుహాసిని (35), కూతురు అమృత (16) ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

భార్య సుహాసినికి అనారోగ్య సమస్యలు కారణంగా అప్పుల బాధల్లో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. అనారోగ్యానికి సంబంధించి భార్యకు ఇటీవల ఒక సర్జరీ జరిగినట్లు కూడా చెబుతున్నారు. ఆత్మ హత్యకు ముందే ప్రిపేరైన కుటుంబం కొత్త తాడులు పీటలు తో సహా సొంత మామిడి తోటకు వచ్చి ఉరి వేసుకున్నారు....

కూతురుతో కలిసి మీడియా ముందుకు రామ్ చరణ్, ఉపాసన

హైదరాబాద్ :జూన్ 23

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది.

కాసేపటి క్రితం ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తమ బిడ్డను తీసుకుని రామ్ చరణ్, ఉపాసన ఇంటికి బయల్దేరారు. అయితే, చిన్నారి ముఖం కనిపించకుండా వస్త్రాలతో కప్పి ఉంచారు.

ఈ సందర్భంగా మీడియాతో చరణ్ మాట్లాడుతూ, తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.

కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు. పాపకు ఏం పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించామని, 21వ రోజున ఆ పేరును తానే వెల్లడిస్తానని తెలిపారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.........

భారీ ఎన్ కౌంటర్… నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ :జూన్ 23

జమ్మూకశ్మీర్ లో ఈరోజు భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

కుప్వారాలోని మచల్​ సెక్టార్ లో గల నియంత్రణ రేఖ ఎల్ఓసీ సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు ఈరోజు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.

ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ గుండా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు

ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.