/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Monsoon | ఖమ్మం జిల్లాను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులు భారీ వర్షాలు.. Yadagiri Goud
Monsoon | ఖమ్మం జిల్లాను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులు భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ర్టానికి ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వాతావరణ కేంద్ర ప్రకటనతో రైతన్నలు సాగుకు సమాయత్తం కానున్నారు.

SB NEWS

SB NEWS

SB NEWS

సిబ్బంది అప్రమత్తతతో బాలుడిని కాపాడగలిగాం : TTD ఈవో ప్రకటన

తిరుమలలో పులి దాడిలో గాయపడిన బాలుడిని TTD EO ధర్మారెడ్డి పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. నడక మార్గంలో బాలుడు తాతతో కలిసి వెళుతుండగా చిరుత దాడి చేసిందని ఈవో చెప్పారు.

అయిదుగురు పోలీసులు అరుస్తూ ఫారెస్ట్ లోకి పరిగెత్తారని… భారీగా శబ్దాలు చేయడంతో చిరుత భయపడి బాలుడిని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు.

సిబ్బంది అప్రమత్తలతోనే బాలుడిని కాపాడగలిగామని వెల్లడించారు. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి బాధాకరమని అన్నారు.

నడక మార్గంలో భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాలినడక మార్గంలో భక్తులను యధావిధిగా అనుమతిస్తున్నట్లు ప్రకటించారు..

నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్న సీఎం జగన్‌.

ప్రత్యేక క్యాంపులతో సేవలు..

దీంతో పాటుగా జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు.

అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా సేకరిస్తారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్క్‌లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మిషన్‌ 2024.. పట్నాలో నేడే విపక్షాల సమావేశం

•ఒకే కుటుంబంలా పోరాడుతామన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమత

పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి..

20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్‌ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్,

మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు..

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ

హైదరాబాద్‌: తెలంగాణ మెడికల్‌ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది..

మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్‌ చేసినట్లు తెలిపింది.

'హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్‌ పీజ మెడికల్‌ సీట్స్‌ స్కామ్‌పై కేసు నమోదు చేశాం.

సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం' అని ఈడీ పేర్కొంది..

ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్‌ చేరువ..!

వాషింగ్టన్‌: భారత అంతరిక్ష రంగం (Indian Space Industry)లో కీలక పరిణామం. ఇప్పటివరకు భారతీయ వ్యోమగామి (Indian Astronaut) అడుగుపెట్టని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మనకు చేరువకానుంది.

2024లో ఐఎస్‌ఎస్‌కు ఉమ్మడి మిషన్‌ (Joint Mission)ను భారత్- అమెరికాలు ప్రకటించనున్నట్లు వైట్‌హౌస్‌ (White House) వెల్లడించింది.

నాసా (NASA), ఇస్రో (ISRO)ల నడుమ ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికాలో పర్యటిస్తున్న వేళ.. దీనిపై ఒక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు అంతరిక్ష అన్వేషణకు, ముఖ్యంగా జాబిల్లిపై ప్రయోగాలకు సంబంధించి అమెరికా రూపొందించిన 'ఆర్టెమిస్‌ ఒప్పందం (Artemis Accords)'లో భాగం కావాలని భారత్‌ నిర్ణయించినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది..

గ్రూపు-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని పిటిషన్.. టీఎస్ పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు!

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓఎంఐర్‌పై హాల్ టికెట్ నెంబర్, ఫొటో ఎందుకు లేదని, బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్ పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో స్పందించిన కోర్టు అక్టోబర్‌లో నిర్వహించిన మాదిరిగా ఈసారి ఎందుకు పరీక్షను నిర్వహించలేదని ప్రశ్నించింది. పరీక్షల్లో అక్రమాలు నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించింది. దీంతో కమిషన్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పరీక్షల ఏర్పాట్లు అనేవి టీఎస్ పీఎస్సీ విచక్షణ అధికారమని కోర్టు దృష్టికి తీసుకుచ్చారు.

బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫొటో అనేది ఖర్చుతో కూడుకుందని దీనికోసం సుమారు రూ.1.50 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. అయితే ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా ఇన్విజిలేటర్ల అభ్యర్థులను ధృవీకరించారని కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను చాలామంది రాసినప్పటికీ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని కేవలం ముగ్గురు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల వద్ద నుండి డబ్బులు తీసుకున్నారు కదా అని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల విషయంలో ఖర్చులు ముఖ్యం కాదని పేర్కొంది. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్ పీఎస్సీ బాధ్యత అని ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది........

CM KCR: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం.. ప్రారంభించిన కేసీఆర్

కొల్లూరు: ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 15,660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈ గృహాల సముదాయానికి 'కేసీఆర్‌ నగర్‌ 2బీకే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీ'గా నామకరణం చేశారు. ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను సీఎం అందజేశారు.

అనంతరం అక్కడి గృహాలను కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ఈ గృహ సముదాయంలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు.

117 బ్లాకులుగా విభజన చేశారు. జీ+9, జీ+10, జీ+11 అంతస్తుల చొప్పున కట్టారు. 37శాతం భూమిలో ఇళ్లు నిర్మించారు. మిగిలిన 63శాతం భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించారు.

అమరవీరుల కుటుంబ సభ్యుల అరెస్ట్

సచివాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన తెలుపుతున్న అమరవీరుల కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు తమను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విస్మరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఒకవైపు తెలంగాణ దశాబ్ది వేడుకల ముగింపు సమావేశాలు కొనసాగిస్తూనే.. ఇంకొకవైపు అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు. అందులో భాగంగా అమర జ్యోతిని ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపలేదు. అయితే తమకు ఎందుకు ఆహ్వానించలేదని అమరవీరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపాయి.

ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అధికారులు ఆరు కుటుంబాలకే ఆహ్వానాలు ఇచ్చారని, ఆ ఆరు కుటుంబాలతోనే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. 12 వందలమంది తల్లి కడుపు కోతలు ఏమవుతాయని వారు నిలదీశారు.

సీఎం కేసీఆర్‌ను కలుస్తామని మీడియా ద్వారా చాలా సార్లు తెలియజేశామని.. ఇంతవరకు ముఖ్యమంత్రి తమను పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు 12 వందల మంది బలదానం చేసుకున్నారని చెప్పారని, ఇప్పుడు 6 వందలమందిని మాత్రమే గుర్తించారని, 12 వందల మందిని గుర్తించాలని వారు కోరుతూ భావోద్వేగానికి లోనయ్యారు....

మళ్లీ గెలిపించండి.. పటాన్ చెరు-హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తా…

మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తానని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంగారెడ్డిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుప్రతికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. మోసపోతే.. గోసపడుతాం.. ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నమో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నాం.. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాం.. కేసీఆర్‌ కిట్‌ ఎలా ఉంటుందో చూశారన్నారు.

హరీశ్‌రావు ఆరోగ్యమంత్రిగా వచ్చాక వైద్యరంగం కొత్త పరుగులు పెడుతున్నదన్నారు. కేసీఆర్‌ కిట్‌ కాదు.. మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్‌ కిట్‌ను తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య రంగంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు. హైదరాబాద్‌కు వెళ్లే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ తప్ప మరొకటి లేకుంటే. అద్భుతమైన ఐదు కార్పొరేట్‌ స్థాయిలో ఆసుపత్రులు తీసుకువస్తున్నామన్నారు.

ప్రభుత్వరంగంలోనే 17వేల బెడ్స్‌ ఉంటే.. ప్రస్తుతం 50వేల బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా పత్రి బెడ్‌కు ఆక్సిజన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దగ్గరలోని ఇస్నాపూర్‌లోనే 500 టన్నుల ఆక్సిజన్‌ తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎవరినో అడుగకుండా మన ఆక్సిజన్‌ మనమే తీసుకునే విధంగా పెట్టుకున్నామన్నారు . కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్లీ ముందు కొనసాగాలంటే.. నిన్నా మొన్న 20 రోజుల నుంచి కార్యక్రమాలు ఎలా చేశారో.. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని దీవించినట్లయితే బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందామన్నారు. కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకెళ్దామన్నారు.

ఈ రాష్ట్రం ఇంత త్వరలో ఇంత బాగైతుందని ఎవరూ ఊహించలేదన్నారు. తెలంగాణ ఏర్పడకూడదని మాట్లాడినటువంటి పెద్దలే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారెకరాలు కొనుక్కుందుము.. ఇప్పుడు తెలంగాణలో ఒకరం అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుకుంటున్నరని చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. అంటే విషయం తారుమారైంది.. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమేనన్నారు. తెలంగాణ భూములు ఎలా పెరిగాయో తెలుసు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా వారిని సమైక్య శక్తులు కన్ఫ్యూజ్‌ చేశాయన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు. కానీ, పటాన్‌చెరువులో ఇవాళ ఎకరం భూమి ధరం ఎంత ? ఆ రోజు ఎంత ఉండే ? ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నదన్నారు. రూ.30కోట్లు పలికితే చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చన్నారు. ఇంకా నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుందన్నారు...