/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz శంకరమ్మకు గన్ మెన్లను కేటాయించిన తెలంగాణ సర్కార్..! Yadagiri Goud
శంకరమ్మకు గన్ మెన్లను కేటాయించిన తెలంగాణ సర్కార్..!

తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామవాసి శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి కేటాయించడం ఖాయమని తెలుస్తోంది.

అమరవీరుల స్మృతి వనం ఆవిష్కరణలో పాల్గొనాలని ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో.. అందులో భాగంగానే బుధవారం నాడు పార్టీ అధినేతను ఆమె కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

దీంతో అభ్యర్థుల ఎంపికపై గత కొద్ది రోజులుగా కేసీఆర్ కసరత్తు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ తరుణంలోనే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని నిరసన వ్యక్తం అవుతుండటం.. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం పెద్ద ఎత్తున పడుతుందని భావించిన కేసీఆర్ శంకరమ్మకు శాసనమండలి సభ్యురాలిగా ఎంపిక చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

ఇందులో భాగంగా శంకరమ్మకు ఓ పీఏ, గన్ మెన్‌గా ఓ కానిస్టేబుల్‌తో పాటు ఆమెకు ప్రభుత్వ వెహికల్ కేటాయించినట్లు సమాచారం. గురువారం నుండి పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆమెకు అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.....

హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే?

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రహస్య సర్వేలు నిర్వహించిన బాస్.. అన్నిపార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇంతకీ ఈ ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు..? ఎన్ని విడతలుగా అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు..? బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి..? సీక్రెట్ సర్వేలు ఎలా చేశారు..?

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎలాగైనా సరే 100 స్థానాల్లో గెలిచి.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావలన్నది కేసీఆర్ ఆలోచన. ఇందుకు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అన్నీ వ్యూహాత్మకంగా చేసుకుంటూ వస్తున్నారట. మొదట అన్ని అసెంబ్లీ స్థానాల్లో మూడో కంటికి తెలియకుండా రహస్య సర్వేలు చేయించారట. ఇందులోని డేటా ఆధారంగా కేటాయించాలనుకున్న వారికి కేసీఆర్ పాస్‌మార్క్ స్కేలు పెట్టుకున్నారట. అసెంబ్లీ టికెట్ రావాలంటే 35 శాతంతో పాసైతే సరిపోదు.. కచ్చితంగా 40 నుంచి 45 శాతం వరకు పాజిటివ్ రేటింగ్ ఉంటేనే ఈసారి బీఫారం ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇలా ఎవరికైతే పాస్ పర్సెంటేజ్ ఉంటుందో వారందరి పేర్లతో తొలి జాబితాను రిలీజ్ చేయడానికి సీఎం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ 35 శాతం కూడా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదని సార్ ఫిక్సయ్యారట. ఎందుకంటే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా బాస్ భావిస్తున్నారు.. ఏ ఒక్క స్థానాన్ని చేజేతులారా పోగొట్టుకోకూడదన్నదే టార్గెట్!. ఎలాంటి పైరవీలకు చోటు లేకుండా బంధుత్వం, సన్నిహిత సంబంధాలు ఇలాంటివి అస్సలే చూడకుండా కేసీఆర్ సీక్రెట్ సర్వేలు చేయించారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 15 తర్వాత ఏ క్షణంలో అయినా బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను స్వయంగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలిజాబితాలో మొత్తం 80 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. తొలి జాబితాలో ఉండే ఆ 80 మంది ఎవరన్న దానిపై ఇప్పుడు బీఆర్ఎస్‌ వర్గాల్లో, ఆశావహుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి అయినా కేసీఆర్ కరుణించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకున్న వారికి సీక్రెట్ సర్వేతో టెన్షన్ మొదలైందట. అయితే.. సరిగ్గా జులై రెండోవారంపైనే ఎందుకు ప్రకటన అంటే దీనికి పెద్ద ప్లానే ఉందట. ముందుగా ప్రకటన చేస్తే ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని సరిచేసుకునేందుకు ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చినట్లు అని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పట్నుంచి మరింత గ్రాఫ్ పెంచుకుని ఎక్కడ తేడాలున్నాయనేది నెగిటివ్‌ను పాజిటివ్ చేసుకునేందుకు ఈ వ్యవధిని బాస్ ఇస్తున్నారట. అంతేకాదు.. ప్రకటన తర్వాత ఇక ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకే పూర్తిగా పరిమితం కావాలని కీలక ఆదేశాలు కేసీఆర్ ఇవ్వబోతున్నారట. అంటే మొదటి జాబితాలో పేర్లు వచ్చిన వారికి కనీసం నాలుగు నెలలు సమయం దొరుకుతుందన్న మాట. దీంతో గ్రాఫ్ పెంచుకోవచ్చు.. అదే విధంగా కొద్దో గొప్పో ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి వెళ్లి తగ్గించుకొని ఎన్నికల నాటికి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించుకోవచ్చన్నది కేసీఆర్ ప్లానట.

తిరుమలలో నేడు భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 22

తిరుపతి లొ నేడు గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 77,120 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 34,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....

SB NEWS

పాకిస్థాన్‌లో తుగ్లక్ డిక్రీ వచ్చింది, కాలేజీ క్యాంపస్‌లో హోలీ నిషేదం

పాకిస్థాన్‌లోని మైనారిటీ వర్గాల ప్రజలు జీవించడం కష్టంగా మారుతోంది. మైనారిటీ వర్గాల గొంతును అణిచివేసేందుకు ఒక్కో ఉపాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కాలేజ్ క్యాంపస్‌లో హోలీ వేడుకలపై పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ నిషేధం విధించింది. దీనిపై నిషేధం విధిస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి కార్యకలాపాలు దేశంలోని సామాజిక-సాంస్కృతిక విలువలకు పూర్తిగా భిన్నమైనవని, దేశ ఇస్లామిక్ గుర్తింపు తక్కువగా ఉందని పేర్కొంటూ ఈ నిషేధం విధించారు.

ఇలాంటి కార్యకలాపాలు దేశ సామాజిక-సాంస్కృతిక విలువలకు పూర్తిగా విఘాతం కలిగిస్తున్నాయని, ఇవి భిన్నమైనవని, ఇస్లామిక్ గుర్తింపుకు విరుద్ధమని, అన్ని విద్యాసంస్థల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ ఉన్నత విద్యా కమిషన్ నిషేధించిందని పాకిస్థాన్ 'ఆజ్ న్యూస్' పేర్కొంది. దేశం. కాలేజీ క్యాంపస్‌లో ఇస్లామిక్ విలువల విధ్వంసానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరం. అలాంటి ఒక ఉదాహరణ హిందువుల పండుగ హోలీ.

దీంతో రచ్చ మొదలైంది

జూన్ 12న ఇస్లామాబాద్‌లోని ఖైద్-ఎ-అజామ్ యూనివర్సిటీలో హోలీ పండుగను నిర్వహించారు. మెహ్రాన్ విద్యార్థి మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇది విశ్వవిద్యాలయం యొక్క రాజకీయేతర సాంస్కృతిక సంస్థ. ఈ ఘటన జరిగినప్పటి నుంచి రచ్చ మొదలైంది.

ఈ ఉత్తర్వులను కొందరు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు

ఈ ఉత్తర్వులను కొందరు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హోలీ దీపావళి సింధీ సంస్కృతిలో భాగమని దేశ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కొందరు విద్యార్థులు అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం సింధీ భాషను అంగీకరించదు లేదా హిందూ పండుగలకు గౌరవం ఇవ్వదు. తమను తాము మానవ హక్కుల కోసం చాంపియన్లుగా ప్రకటించుకున్న పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఇప్పుడు ఏం చేస్తారని విద్యార్థులు అంటున్నారు. దీనితో పాటు, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఏదైనా గొంతు ఎత్తారా లేదా అని అడిగారు.

ముస్లిమేతరుల కష్టాలు పెరిగాయి

పాకిస్తాన్‌లో ప్రభుత్వం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నదని, దాని వల్ల అక్కడ ముస్లిమేతరుల సమస్యలు పెరిగాయని మీకు తెలియజేద్దాం. అక్కడ, ముస్లిమేతరులకు రాజకీయాలలో ప్రవేశం పరిమితం చేయబడింది, అలాగే భారతదేశంలో వలె వారి రక్షణ కోసం అలాంటి ఏర్పాట్లు లేవు. దేశ విభజన తరువాత, పాకిస్తాన్‌లో ముస్లిమేతరుల సంఖ్య మొత్తం జనాభాలో 14% కంటే ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు హిందువులు అక్కడ 5% కూడా లేరు.

నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు.. గంగులకు పొన్నం సవాల్

కరీంనగర్ జిల్లా :జూన్ 21

మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ మగాడివైతే టీడీపీలో ఉండి గెలవాలని సవాల్ విసిరారు. బుధవారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ... ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని అన్నవా గంగుల అంటూ ప్రశ్నించారు. ‘‘నా ఓటమి గురించి మాట్లాడుతున్నావ్.. సీఎం కూతురు కవిత ఓడిపోలేదా’’ అని వ్యాఖ్యలు చేశారు.

ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్ పార్లమెంట్‌లో వినోద్ రావు ఎంపీగా ఓడిపోలేదా అని నిలదీశారు. గంగుల దొంగ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. దున్నపోతులా బలిసి రైతుల గురించి పట్టించుకోవట్లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ నేత బండి సంజయ్, మంత్రి గంగుల ఆలయాల్లో కలుసుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రోజుకో పండుగను నిర్వహించడంపైనా మాజీ ఎంపీ విమర్శలు గుప్పించారు. దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బెల్ట్ షాప్‌ల పండుగ మరిచిపోయారు అంటూ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

కాగా.. నిన్న మంగళవారం పొన్నం ప్రభాకర్‌పై మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లోనే పొన్నం విలువ బయటపడిందని... కనీసం కార్పోరేటర్‌ను కూడా గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎం మాత్రమే కాదని.. తన మీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయవచ్చన్నారు.

తన పని తాను చేసుకుంటానని.. తన జోలికి వస్తే విడిచిపెట్టబోనని హెచ్చరించారు. తన మీద పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కేసులు వేశారన్నారు. వారిద్దరూ ఒక్కటేనన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ విచారణలో ఏమీ తేలలేదన్నారు. ఎన్నికల ముందు గానా బజానాలు రావడం సహజమేనన్నారు. బీఆర్ఎస్ 60 శాతం, కాంగ్రెస్, బీజేపీ రెండు కలిపి నలభై శాతమేనని గంగుల అన్నారు....

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే

•సర్వరోగ నివారిణి యోగ

•ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో పెద్దకాపర్తి గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారు హాజరై విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. యోగ డే సందర్భంగా పల్లపు బుద్ధుడు పాఠశాల విద్యార్థులచే యోగా ఆసనాలు, ప్రాణాయామం బస్రిక, మెడిటేషన్ సాధనలు నేర్పించారు.

సర్వరోగ నివారిణి యోగ అని అన్నారు, ప్రతినిత్యం యోగ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం అని, ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని తెలియజేశారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు 1982 సంవత్సరంలో స్థాపించారు విశ్వశాంతి కొరకు ఇప్పటివరకు 186 దేశాలలో అన్ని వర్గాల ప్రజలు సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నారన్నారు. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు, పద్మాసనాలు, ప్రాణాయామం, బస్రిక, సుదర్శన క్రియ చేయడం వలన మనలోని జీవశక్తిని పెంపొందించుకొని ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించగలమన్నారు.

పెద్దకాపర్తి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రతినిత్యం ప్రతి ఒక్కరు జీవితంలో ఆనందదాయకంగా ఉండాలంటే యోగా, సుదర్శన క్రియ ప్రతిరోజు ఒక గంట సేపు చేయాలన్నారు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ అనే కోర్సుతో ఒత్తిడిని పారదోరి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుందని పల్లపు బుద్ధుడు తెలియజేశారు.

ధ్యానం మరియు ఉఛ్వాస నిశ్వాసలను చక్కగా పొందుతారని తెలిపారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు ముఖ్యఅతిథి బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారికి, పెద్ద కాపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలింగచారీ గారికి, smc వైస్ చైర్మన్ నిలకంఠం నరేష్ గారికి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లోకందర్ రెడ్డి , శకుంతల, లచ్చిరెడ్డి, రామ్ భోపాల్, కైలాసం, జ్ఞానేశ్వర్ చారి , నాయకులు గంజి గోవర్ధన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటరీస్ పాకాల దినేష్, బూత్ అధ్యక్షుడు మోర ధనుంజయ , మర్రి హరీష్ రెడ్డి, ,అనగంటి తిరుమలేష్,గుండెబోయిన నర్సింహ, కాటం సందీప్ యాదవ్ , ఈరటి తేజ , బత్తుల శివ, అనగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా..? నేడు హైదరాబాద్ కు రానున్న సీఈసీ బృందం..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే సీఈసీ సభ్యులు బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రానున్నారు..

ఈ నేపథ్యంలో త్వరలోనే నగారా మోగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి నేతృత్వంలో అధికారుల టీం హైదరాబాద్ లో నాలుగు రోజులు మకాం వేయనుంది.

ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీరు భేటీ అయ్యే కానున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు.

గడప గడపకు.., జగనన్న సురక్షపై మొదలైన సీఎం జగన్‌ సమీక్ష

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్ష ప్రారంభమైంది..

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.

జులై 1వ తేదీ నుంచి జరిగే జగనన్న సురక్షా కార్యక్రమంపైనా ఈ సమావేశంలోనే చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకురానుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. దాదాపు నెలపాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది..

ED Raids: తెలంగాణలో పలు చోట్ల ఈడీ సోదాలు..

హైదరాబాద్‌లో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు..

బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుండి అధికారులు బృందాలుగా విడిపోయి కార్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి బయలుదేరారు.

హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్లలో ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచులతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీల్లో ఈడీ దాడులు చేపడుతోంది. దాదాపు 6 జిల్లాలో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల్లోని నిధులు వ్యవహారాల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు..

తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీకి గుండె శస్త్రచికిత్స

ఉద్యోగాల కోసం నగదు కుంభకోణం కేసులో గత వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీకి బుధవారం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స జరగనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ అన్నారు.

అతన్ని అరెస్టు చేసినప్పుడు, బాలాజీ తీవ్రమైన ఛాతీ నొప్పి గురించి ఫిర్యాదు చేశాడు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు, అక్కడ వైద్యులు "క్రిటికల్ బ్లాక్స్" ఉనికిని నిర్ధారించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్‌ కావేరి ఆస్పత్రికి తరలించారు.

గత వారం నిర్ధారణకు ముందు బాలాజీకి "క్రిటికల్ బ్లాక్స్" గురించి తెలియదని సుబ్రమణియన్ చెప్పారు.

బాలాజీని అరెస్టు చేసిన తర్వాత ఆయన అధికారిక నివాసం మరియు కార్యాలయంలో 18 గంటల పాటు ED దాడులు జరిగాయి.

బాలాజీని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు బాలాజీ అనారోగ్యంతో ఉన్నట్లు చూపించే అవకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. బాలాజీకి శస్త్ర చికిత్స జరగాల్సిన రోజునే బుధవారం కోర్టు ఈ కేసును విచారించనుంది.

కాగా, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో బాలాజీని కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది సోమవారం మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.