/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే Yadagiri Goud
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే

•సర్వరోగ నివారిణి యోగ

•ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో పెద్దకాపర్తి గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారు హాజరై విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. యోగ డే సందర్భంగా పల్లపు బుద్ధుడు పాఠశాల విద్యార్థులచే యోగా ఆసనాలు, ప్రాణాయామం బస్రిక, మెడిటేషన్ సాధనలు నేర్పించారు.

సర్వరోగ నివారిణి యోగ అని అన్నారు, ప్రతినిత్యం యోగ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం అని, ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని తెలియజేశారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు 1982 సంవత్సరంలో స్థాపించారు విశ్వశాంతి కొరకు ఇప్పటివరకు 186 దేశాలలో అన్ని వర్గాల ప్రజలు సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నారన్నారు. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు, పద్మాసనాలు, ప్రాణాయామం, బస్రిక, సుదర్శన క్రియ చేయడం వలన మనలోని జీవశక్తిని పెంపొందించుకొని ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించగలమన్నారు.

పెద్దకాపర్తి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రతినిత్యం ప్రతి ఒక్కరు జీవితంలో ఆనందదాయకంగా ఉండాలంటే యోగా, సుదర్శన క్రియ ప్రతిరోజు ఒక గంట సేపు చేయాలన్నారు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ అనే కోర్సుతో ఒత్తిడిని పారదోరి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుందని పల్లపు బుద్ధుడు తెలియజేశారు.

ధ్యానం మరియు ఉఛ్వాస నిశ్వాసలను చక్కగా పొందుతారని తెలిపారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు ముఖ్యఅతిథి బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారికి, పెద్ద కాపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలింగచారీ గారికి, smc వైస్ చైర్మన్ నిలకంఠం నరేష్ గారికి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లోకందర్ రెడ్డి , శకుంతల, లచ్చిరెడ్డి, రామ్ భోపాల్, కైలాసం, జ్ఞానేశ్వర్ చారి , నాయకులు గంజి గోవర్ధన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటరీస్ పాకాల దినేష్, బూత్ అధ్యక్షుడు మోర ధనుంజయ , మర్రి హరీష్ రెడ్డి, ,అనగంటి తిరుమలేష్,గుండెబోయిన నర్సింహ, కాటం సందీప్ యాదవ్ , ఈరటి తేజ , బత్తుల శివ, అనగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా..? నేడు హైదరాబాద్ కు రానున్న సీఈసీ బృందం..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే సీఈసీ సభ్యులు బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రానున్నారు..

ఈ నేపథ్యంలో త్వరలోనే నగారా మోగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి నేతృత్వంలో అధికారుల టీం హైదరాబాద్ లో నాలుగు రోజులు మకాం వేయనుంది.

ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీరు భేటీ అయ్యే కానున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు.

గడప గడపకు.., జగనన్న సురక్షపై మొదలైన సీఎం జగన్‌ సమీక్ష

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్ష ప్రారంభమైంది..

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.

జులై 1వ తేదీ నుంచి జరిగే జగనన్న సురక్షా కార్యక్రమంపైనా ఈ సమావేశంలోనే చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకురానుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. దాదాపు నెలపాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది..

ED Raids: తెలంగాణలో పలు చోట్ల ఈడీ సోదాలు..

హైదరాబాద్‌లో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు..

బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుండి అధికారులు బృందాలుగా విడిపోయి కార్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి బయలుదేరారు.

హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్లలో ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచులతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీల్లో ఈడీ దాడులు చేపడుతోంది. దాదాపు 6 జిల్లాలో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల్లోని నిధులు వ్యవహారాల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు..

తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీకి గుండె శస్త్రచికిత్స

ఉద్యోగాల కోసం నగదు కుంభకోణం కేసులో గత వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీకి బుధవారం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స జరగనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ అన్నారు.

అతన్ని అరెస్టు చేసినప్పుడు, బాలాజీ తీవ్రమైన ఛాతీ నొప్పి గురించి ఫిర్యాదు చేశాడు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు, అక్కడ వైద్యులు "క్రిటికల్ బ్లాక్స్" ఉనికిని నిర్ధారించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్‌ కావేరి ఆస్పత్రికి తరలించారు.

గత వారం నిర్ధారణకు ముందు బాలాజీకి "క్రిటికల్ బ్లాక్స్" గురించి తెలియదని సుబ్రమణియన్ చెప్పారు.

బాలాజీని అరెస్టు చేసిన తర్వాత ఆయన అధికారిక నివాసం మరియు కార్యాలయంలో 18 గంటల పాటు ED దాడులు జరిగాయి.

బాలాజీని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు బాలాజీ అనారోగ్యంతో ఉన్నట్లు చూపించే అవకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. బాలాజీకి శస్త్ర చికిత్స జరగాల్సిన రోజునే బుధవారం కోర్టు ఈ కేసును విచారించనుంది.

కాగా, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో బాలాజీని కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది సోమవారం మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

పశువుల రవాణా బిల్లు 2023 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరణ

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ అండ్ లైవ్‌స్టాక్ ట్రాన్స్‌పోర్ట్ బిల్లు 2023ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది, అయితే విస్తృత నిరసనల తర్వాత, డ్రాఫ్ట్ ఇప్పుడు ఉపసంహరించబడింది.

అవసరాన్ని బట్టి, పశువుల దిగుమతి చట్టం 1898లో మార్పులు చేస్తూ, పశువుల ఉత్పత్తి మరియు పశువుల దిగుమతి మరియు విస్తరణ బిల్లు 2023 యొక్క ముసాయిదా పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడింది.

సంప్రదింపుల సమయంలో, ప్రతిపాదిత డ్రాఫ్ట్‌ను అర్థం చేసుకోవడానికి మరియు తదుపరి వ్యాఖ్యలు లేదా సూచనలను అందించడానికి తగిన సమయం అవసరమని గమనించినట్లు డ్రాఫ్ట్ ఉపసంహరణ అధికారిక ఉత్తర్వు పేర్కొంది.

ఇంకా, జంతు సంక్షేమం మరియు సున్నితత్వాలు మరియు భావోద్వేగాలకు సంబంధించిన సంబంధిత అంశాలతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రాతినిధ్యాలు అందించబడ్డాయి మరియు అందువల్ల విస్తృత సంప్రదింపులు అవసరం.

"పై పరిగణనలను దృష్టిలో ఉంచుకుని మరియు సమర్థ అధికారం యొక్క ఆమోదంతో, ప్రతిపాదిత ముసాయిదా బిల్లు ఉపసంహరించబడుతుంది" అని ఆర్డర్ పేర్కొంది.

జంతు హక్కుల కార్యకర్తలు, రైట్‌వింగ్ గ్రూపులు మరియు జైన మత పెద్దలు ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, వారు వివిధ కారణాల వల్ల దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్‌లోని వర్గాలు ఈ బిల్లు విచ్చలవిడి పశువుల బెడదకు దివ్యౌషధం కావచ్చని, అయితే మతపరమైన మనోభావాలు మరియు సాంస్కృతిక విశ్వాసాలను దెబ్బతీసేందుకు సంస్థ అనుమతించదని పేర్కొంది.

2022-23లో, భారతదేశం $5.11 మిలియన్ల విలువైన ప్రత్యక్ష పశువులను ఎగుమతి చేస్తుందని అంచనా వేయబడింది, వీటిలో ఎక్కువ భాగం గొర్రెలు మరియు మేకలు.

ఈ జంతువులను పండుగల సమయంలో పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తారని వాణిజ్య వర్గాలు తెలిపాయి.

“పశువుల దిగుమతి మరియు ఎగుమతి బిల్లు జంతువుల పట్ల క్రూరత్వాన్ని స్పష్టంగా పెంచుతుంది. పశువుల నిర్వచనంలో కుక్కలు మరియు పిల్లులు మరియు పక్షులను చేర్చడం హాస్యాస్పదంగా ఉంది. ఈ బిల్లు ఖచ్చితంగా శాపం, దీనిని వ్యతిరేకించాలి.

న్యూజిలాండ్ వంటి దేశాలు సజీవ జంతువులను సరుకులుగా రవాణా చేసే క్రూరమైన పద్ధతిని నిలిపివేసినట్లు జంతు హక్కుల కార్యకర్త ఫైజాన్ జలీల్ మీడియాకు తెలిపారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు.. రేవంత్‌తో కీలక భేటీ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపార్టీలో చేరుతున్నారనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పొంగులేటి ఎపిసోడ్‌ ఉత్కంఠతకు ఇవాళ్టితో తెరపడనుంది. పొంగులేటి కాంగ్రెస్‌లో ఎంట్రీకి దాదాపు ఖాయమైంది. హస్తంపార్టీలో చేరేందుకు అటు పొంగులేటి సైతం రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌లో చేరికపై అనుచరులతో కలిసి అధికారికంగా ప్రకటించనున్నారు పొంగులేటి.

దీనికోసం ఇప్పటికే ముఖ్య అనుచరులతో మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్‌కు రావాలంటూ అనుచరులకు ఫోన్లు చేశారు. అనౌన్స్‌మెంట్ తర్వాత నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున తన అనుచరులతో కలిసి పొంగులేటి ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇక ఇవాళ పొంగులేటి ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జూపల్లి, పొంగులేటితో సమావేశం అవుతారు రేవంత్‌ రెడ్డి. పార్టీలో చేరాల్సిందిగా ఇద్దరి నేతలను రేవంత్ ఆహ్వానించనున్నారు.

ఇదే క్రమంలో పొంగులేటితో పాటు వచ్చే మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా రేవంత్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. రేవంత్‌తో భేటీ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. యూస్ టూర్‌ను ముగించుకుని 22న ఢిల్లీకి చేరుకోనున్నారు. రాహుల్ ఢిల్లీకి రాగానే తమ అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు పొంగులేటి, జూపల్లి వెళ్లి.. ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు.

ముందుగా బీఆర్‌ఎస్‌ పట్ల అసంతృప్తిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరే ప్రకటించగా.. నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆయనతో జత కలిశారు. జూపల్లి జతకలిశాక.. తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై పలు సమావేశాలు కూడా నిర్వహించారు. ఒకానొక దశలో స్వంతగా పార్టీని ఏర్పాటు చేస్తారనే టాక్ కూడా వినిపించింది. ఇదే క్రమంలో వీరిద్దరూ కలిసి ఖమ్మం, మహబూబ్ నగర్ లలో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా వారి ఆత్మీయులతో సుధీర్ఘంగా చర్చించారు....

India: ఉగ్రవాదులకు చైనా అండ.. మండిపడ్డ భారత్‌..

దిల్లీ: పాకిస్థాన్‌ కేంద్రంగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్‌ మిర్‌ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా చైనా అడ్డుపుల్ల వేసింది..

దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

'అనేక సభ్య దేశాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. ఈ ప్రతిపాదన విజయవంతం కాకపోతే, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్‌లో నిజంగా ఏదో తప్పు ఉందని నమ్మడానికి మాకు న్యాయమైన కారణాలు ఉన్నాయి. అల్పమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిషేధిత జాబితాలోకి చేర్చలేకపోతే.. మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన సంకల్పం లేనట్టే' అని చైనాపై తీవ్రంగా మండిపడింది.

ఎవరీ సాజిద్‌ మీర్‌..

పాక్‌ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా ఉగ్ర ముఠాలో సాజిద్‌ మీర్‌ 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2011 వరకు ఈ ముఠా విదేశాల్లో జరిపిన దాడులకు మీర్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరించాడు. 2008లో ముంబయిలో చోటుచేసుకున్న 26/11 పేలుళ్లలో ఇతడే కీలక సూత్రధారి. అతడిపై అమెరికా 5 మిలియన్‌ డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. కాగా.. గతంలో సాజిద్‌ మీర్‌ చనిపోయినట్లు పాకిస్థాన్‌ ప్రచారం చేసింది. కానీ, పశ్చిమ దేశాలు నమ్మలేదు. అతడి మృతిపై ఆధారాలు చూపించాలంటూ డిమాండ్‌ చేశాయి. దీంతో వెనక్కి తగ్గిన పాక్‌.. గత ఏడాది జూన్‌లో అతడికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

మరోపక్క, భారత్‌ సాజిద్‌ను మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్‌, అమెరికా సంయుక్తంగా ఓ ప్రతిపాదననూ సిద్ధం చేశాయి. దీనిని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లోని భద్రతా మండలికి చెందిన 'అల్‌ఖైదాపై ఆంక్షల కమిటీ'సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా చైనా అడ్డుకుంది.

ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్‌ నజీర్‌

విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి..

కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్‌ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు స్పెషల్‌ సీఎస్‌ అనిల్‌ కుమార్‌ సింఘల్‌ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం.

యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు..

గద్దర్‌ కొత్త పార్టీ : పెట్టబోతున్నారా❓️

గద్దర్‌ తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే చర్చ కొనసాగుతుంది. గత కొద్దీ రోజులుగా గద్దర్ ఏ పార్టీ లో చేరుతారనే చర్చ కొనసాగుతుండగా..గద్దర్ మాత్రం ఓ పార్టీ లోకి వెళ్లడం కంటే తానే కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి గద్దర్ అధ్యక్షుడిగా, నరేష్ కార్యదర్శిగా, గద్దర్ సతీమణి నాగలక్ష్మి కోశాధికారిగా వ్యవహరించబోతున్నారు. మూడు రంగులతో ఉండే పార్టీ జెండాలో పిడికిలి గుర్తు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల కమిషన్‌తో భేటీ అయి గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. గద్దర్ విప్లవానికి పోరాటానికి ప్రతీక. అందువల్లే “గద్దర్ ప్రజా పార్టీ” జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది.

గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఉద్యమానికి ఆకర్షితులై ఆయన పాటలతో ప్రజల్లోకి వెళ్లారు. బహుజనులను జాగృతం చేసేందుకు ప్రయత్నించారు. పాటలతో ఉద్యమాన్ని రగిలించారు. పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ ఓట్ల రాజకీయాలపై రావాలని నిర్ణయించుకున్నారు.

గద్దర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రకటిస్తారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.....