/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్‌ నజీర్‌ Yadagiri Goud
ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్‌ నజీర్‌

విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి..

కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్‌ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు స్పెషల్‌ సీఎస్‌ అనిల్‌ కుమార్‌ సింఘల్‌ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం.

యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు..

గద్దర్‌ కొత్త పార్టీ : పెట్టబోతున్నారా❓️

గద్దర్‌ తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే చర్చ కొనసాగుతుంది. గత కొద్దీ రోజులుగా గద్దర్ ఏ పార్టీ లో చేరుతారనే చర్చ కొనసాగుతుండగా..గద్దర్ మాత్రం ఓ పార్టీ లోకి వెళ్లడం కంటే తానే కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ పార్టీకి గద్దర్ అధ్యక్షుడిగా, నరేష్ కార్యదర్శిగా, గద్దర్ సతీమణి నాగలక్ష్మి కోశాధికారిగా వ్యవహరించబోతున్నారు. మూడు రంగులతో ఉండే పార్టీ జెండాలో పిడికిలి గుర్తు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల కమిషన్‌తో భేటీ అయి గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. గద్దర్ విప్లవానికి పోరాటానికి ప్రతీక. అందువల్లే “గద్దర్ ప్రజా పార్టీ” జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది.

గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఉద్యమానికి ఆకర్షితులై ఆయన పాటలతో ప్రజల్లోకి వెళ్లారు. బహుజనులను జాగృతం చేసేందుకు ప్రయత్నించారు. పాటలతో ఉద్యమాన్ని రగిలించారు. పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్ ఓట్ల రాజకీయాలపై రావాలని నిర్ణయించుకున్నారు.

గద్దర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్‌ పై పోటీ చేస్తానని ప్రకటిస్తారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.....

Lohit Express: తప్పిన రైలుప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్‌..

ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరిచిపోకముందే.. మరో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్ ​ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్‌ నుంచి విడిపోయాయి..

అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో లోహిత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు పార్ట్ లుగా విడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర భమాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు నుంచి కిందికి దూకారు..

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలా - బీహార్‌లోని కిషన్‌గంజ్ మధ్య ఉన్న సూర్యకమల్ రైల్వే స్టేషన్ దగ్గరలో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంజన్‌ ముందుకు కదిలి వెళ్లిపోవడంతో.. దాదాపు పది కోచ్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన ఘటనాస్థలికి చేరుకుని ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను ఆపివేశారు.

అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్‌కు జతచేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే రైలు 16 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కప్లింగ్ వైఫల్యం కారణంగా రైలు కోచ్‌లు విడిపోయినట్లు తెలుస్తోంది. ఒరిస్సా రైలు ప్రమాదం జరిగిన తర్వాత వరుసగా ట్రైన్ యాక్సిడెంట్స్ కు సంబంధించినవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ట్రైన్ లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు.

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల కలకలం

హైదరాబాద్ :జూన్ 21

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం వరుస కత్తిపోట్లు కలకలం రేపాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అనంతరం మందుబాబులు చెలరేగిపోయారు.

మద్యం మత్తులో కత్తిపోట్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కరోజే మూడు కత్తిపోట్ల ఘటనలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

ఈ మూడు ఘటనల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కళ్యాణోత్సవం అనంతరం గత రాత్రి జరిగిన ఘటనలుగా పోలీసులు గుర్తించారు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు...

SB NEWS

జూబ్లీహిల్స్‌లోని క్యూటీబీ పబ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్:జూన్ 21

నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఓ పబ్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 1671, జూబ్లీహిల్స్‌ 36 క్యూటీబీ పబ్‌లోని నాలుగవ అంతస్థులో అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.

కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది....

SB NEWS

తిరుమలలో నేడు భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 21

తిరుపతి లో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 71,935 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 31,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం

•శుభాకాంక్షలు తెలియజేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు

చిట్యాల మండల మరియు మున్సిపాలిటీ ప్రజలకు జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గారు శుభాకాంక్షలు తెలియజేశారు.

ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు విశ్వశాంతి కొరకు ప్రతి ఒక్కరు ప్రతినిత్యం యోగా చేయాలని అదేవిధంగా సుదర్శన క్రియ, ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అన్నారు, సర్వరోగ నివారిణి యోగ అని పల్లపు బుద్ధుడు అన్నారు, యోగ అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం అని,

మోక్ష సాధనలో భాగమైన ధ్యానం అంతః దృష్టి పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది అని, ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడుపడుతుందని, పతంజలి యోగ సూత్రాల ద్వారా ధారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒక్కచోట చేర్చారన్నారు, శరీర ధారుడ్యానికి, ఆరోగ్య సంరక్షణకి రోగ నిరోధకానికి సహాయ పడే శారీరక ఆసనాలను అష్టాంగ యోగము వివరిస్తుందన్నారు.

జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా, సుదర్శన క్రియ ప్రతినిత్యం చేయాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ అనే కోర్సుతో ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు, ధ్యానం మరియు ఉఛ్వాస నీశ్వాసలను చక్కగా పొందుతారని తెలియజేశారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల లోని అన్ని వర్గాలవారు 45 మిలియన్ ప్రజలకు దీని ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందారన్నారు. అదేవిధంగా చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యోగా, సుదర్శన్ క్రియ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు.

ఆదిపురుష్' విషయంలో నేపాల్‌లో రచ్చ,

•ఖాట్మండులో అన్ని హిందీ చిత్రాల ప్రదర్శనపై నిషేధం

•మేయర్ ని మందలించిన నేపాల్ ప్రభుత్వం

'ఆదిపురుష' చిత్రం విడుదలైనప్పటి నుంచి భారతదేశంలోనే కాకుండా నేపాల్‌లో కూడా నిరసనలు ఎదుర్కొంటోంది. ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన చిత్రం నేపాల్‌లో నిషేధించబడింది, వివాదాస్పద చిత్రం 'ఆదిపురుష్' సాకుతో ఖాట్మండు మేయర్ అన్ని హిందీ చిత్రాలను నిషేధిస్తూ డిక్రీ జారీ చేశారు. "ఆదిపురుష్" చిత్రంలో "అభ్యంతరకరమైన" పదాలు మరియు సీత పాత్రపై నేపాల్ రాజధాని ఖాట్మండు సోమవారం నుండి అన్ని హిందీ చిత్రాల ప్రదర్శనను నిషేధించింది.

ఖాట్మండు మెట్రోపాలిటన్ రీజియన్ (కెఎమ్‌సి)లో అన్ని హిందీ చిత్రాలను నిషేధించాలనే నిర్ణయం గురించి, ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా ఫేస్‌బుక్ పోస్ట్‌లో, "జూన్ 19, సోమవారం నుండి, అన్ని హిందీ చిత్రాలను ఖాట్మండు మెట్రోపాలిటన్ ప్రాంతంలో ప్రదర్శించకుండా నిషేధిస్తారు. ఎందుకంటే 'ఆదిపురుషం' సినిమాలోని డైలాగ్‌లోని అభ్యంతరకర పదాలను ఇంకా తొలగించలేదు. “సీతా మాతా భారత్‌కీ బేటీ హై అనే డైలాగ్‌లోని అభ్యంతరకరమైన భాగాన్ని సినిమా నుండి మూడు రోజుల్లోగా తొలగించాలని మేము ఇప్పటికే మూడు రోజుల క్రితం నోటీసు జారీ చేసాము. సినిమా ప్రదర్శనకు అనుమతిస్తే మన జాతీయతకు, సాంస్కృతిక ఐక్యతకు తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రస్తుతం రాజధాని నగరంలోని మొత్తం 17 సినిమా థియేటర్లలో ప్రదర్శింపబడుతున్న అన్ని హిందీ చిత్రాల ప్రదర్శనను అడ్డుకోవాలని షా నిర్ణయించుకున్నారు.

మేయర్ బాలేంద్ర ఆదేశాలపై నేపాల్ ప్రభుత్వం తరపున సమాచార, సమాచార మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రకటన జారీ చేయడం ద్వారా, ఆదిపురుష్‌తో సహా అన్ని చిత్రాల ప్రదర్శనపై ఎలాంటి నిషేధం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆదిపురుషుడి డైలాగ్‌ను మ్యూట్ చేసి సినిమా హాళ్లలో నడపడానికి అనుమతించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంత జరిగినా కొందరు వ్యతిరేకించడం సరికాదన్నారు. ఇండియా అనే పదాన్ని తొలగించి ప్రసార సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత నేపాల్ సెన్సార్ బోర్డును వ్యతిరేకించడం సరికాదు.

ఇక్కడ, నేపాల్‌లో సినిమాను నిషేధించిన తర్వాత, 'ఆదిపురుష్' నిర్మాతలు ఖాట్మండు మేయర్‌కు క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెబుతున్నప్పుడు, నేపాల్ రాజధానిలో హిందీ చిత్రాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని మేకర్స్ అభ్యర్థించారు మరియు సీత 'భారతదేశపు కుమార్తె' అని, తప్పు సరిదిద్దబడింది. నేపాల్‌లో హిందీ 'ఆదిపురుష్' మరియు ఇతర హిందీ చిత్రాలపై నిషేధం దృష్ట్యా, మేకర్స్ క్షమాపణలు రాశారు. ఇందులో నేపాల్ ప్రజల మనోభావాలు ఏమైనా దెబ్బతింటే ముందుగా క్షమాపణలు కోరుతున్నాం.. ఉద్దేశపూర్వకంగా చేయలేదు.

వాస్తవానికి, 'ఆదిపురుష్'లో, సీతాదేవిని భారతదేశపు కుమార్తెగా అభివర్ణించారు, దీని కారణంగా నేపాల్ ప్రజలు కోపంగా ఉన్నారు. సీత పుట్టుక శతాబ్దాలుగా వివాదాస్పదమైంది. సీత బీహార్‌లోని సీతామర్హిలో జన్మించిందని భారతీయులు చెబుతుండగా, సీత నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించిందని నేపాల్ పేర్కొంది. అందుకే సీతను భారత పుత్రికగా పిలవడం పట్ల నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 'ఆదిపురుష్'తో సహా హిందీ చిత్రాలను నిషేధించింది.

మళ్లీ వివాదంలో మనోజ్ ముంతాషిర్ "హనుమంతుడు దేవుడు కాదు, అతను భక్తుడు"

మనోజ్ ముంతాషిర్ ఈరోజుకి ముందు లేదా ఆదిపురుష్ విడుదలకు ముందు, ఈ పేరు యువతలో అందమైన లైన్లు, అద్భుతమైన పాటలకు ప్రసిద్ధి చెందింది. కవి మనోజ్ ముంతాషిర్ అదే యువతను తన సంస్కృతికి దగ్గరగా తీసుకురావడానికి ఆదిపురుష్ డైలాగ్‌లు రాశారని ఆరోపించారు. అయితే తన డైలాగ్స్ వల్ల మనోజ్ ముంతాషిర్ అదే యువత దృష్టిలో పడ్డాడని పశ్చాత్తాపపడుతున్నారు.

“తేరీ మిట్టి మే మిల్ జవాన్” లాంటి అందమైన బాణీలు రాసి జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మనోజ్.. ఆదిపురుషంలో అలాంటి డైలాగులు రాయడం జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా డైలాగ్‌పై జనాలు అభ్యంతరాలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంకా దహనానికి ముందు హనుమంతుడి పాత్రలో ‘కప్డా తేరే బాప్ కా, టెల్ తేరే బాప్ కా, ఆగ్ భీ తేరే బాప్ కీ ఔర్ జలేగీ భీ తేరే బాప్ కీ’ అంటూ హనుమంతుడి పాత్ర డైలాగ్ గురించే జనాల పెద్ద అభ్యంతరం.

సినిమాలోని మరికొన్ని డైలాగులు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఒక సన్నివేశంలో, రావణుడి రాక్షసుడు హనుమంతునితో ఇలా అంటాడు, "ఇది మీ మేనత్త తోటని తినడానికి గాలి వచ్చింది..." మరియు అంగద్ రావణుని సవాలు చేసినప్పుడు, "రఘుపతి రాఘవ రాజా రామ్ బోల్ మరియు ఈ రోజు మీ ప్రాణాలను రక్షించండి. "లేకపోతే ఈరోజు నిలబడి ఉంటాడు, రేపు పడుకుని దొరుకుతాడు.."

ప్రేక్షకులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియాలో 'అసభ్యకరమైన మరియు అవమానకరమైన' భాషగా పేర్కొంటూ పోస్ట్ చేస్తున్నారు.

జనాలు మనోజ్‌పైనా, సినిమాపైనా చాలా విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మనోజ్ ఈసారి తన ఆందోళన మరింత పెరిగిందని చెప్పాడు. నిజానికి, ఒక మీడియా ఛానెల్‌తో సంభాషణ సందర్భంగా, హనుమాన్ జీ దేవుడు కాదని, ఆయన భక్తుడని అన్నారు. ప్రజలు ఆయనను దేవుణ్ణి చేశారు.

ఈ సినిమాలో రాసిన డైలాగులకు ఇప్పటికే జనాలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, మనోజ్ హనుమాన్ జీ గురించి మరొక ప్రకటన ఇచ్చాడు. సినిమాలో తాను రాసిన డైలాగ్స్‌పై క్లారిటీ ఇస్తూ.. “ఇలాంటి డైలాగులు, సింపుల్ లాంగ్వేజ్ రాయడం వెనుక కొండంత బలం ఉన్న బజరంగబలి కూడా చిన్నపిల్లాడిలా ఉండటమే లక్ష్యం. శ్రీరాముడిలా తాత్వికంగా మాట్లాడడు. అతను చెప్పాడు, “బజరంగబలి ఒక దేవుడు కాదు, అతను ఒక భక్తుడు. అతని భక్తిలో శక్తి ఉంది కాబట్టి మేము తరువాత అతన్ని దేవుడిగా చేసాము. మనోజ్ ఈ ప్రకటన తర్వాత, అతని ట్రోలింగ్ మరోసారి ప్రారంభమైంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు: ప్రధాని మోడీ, అమిత్‌షా, సీఎం జగన్ విషెస్!!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు ఈరోజు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా,

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షును పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివేకం, గౌరవంతో పాటు ప్రజల సంక్షేమం కోసం నిబద్ధత కలిగిన నాయకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షించారు.

దేశ పురోభివృద్ధికి ఆమె చేస్తున్న కృషికి ప్రశంసలు అందుతున్నాయని, ద్రౌపది ముర్ము అంకితభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు....