/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన Yadagiri Goud
కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన

సిరిసిల్లజిల్లా :జూన్ 20

నేడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా ఉన్నతాధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పర్యటన వివరాలు:

ఉదయం 10. 30 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభోత్సవం. ఉదయం 11 గంటలకు మన ఊరి-మన బడి లో భాగంగా నిర్మించిన ఎల్లారెడ్డిపేట పాఠశాల భవన సముదాయం ప్రారంభోత్సవం. కంప్యూటర్ చాంప్స్’ కార్యక్రమం ప్రారభోత్సవం. జిల్లాలో 60 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య) అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు వికలాంగులకు దాదాపు 1000 మందికి సహాయాలు మరియు ఉపకరణాల పంపిణీ. పద్మానాయక ఫంక్షన్ హాల్‌, సిరిసిల్ల పట్టణం. మధ్యాహ్నం 3: 30 గంటలకు పట్టణంలోని మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీ ప్రారంభోత్సవం, చేయనున్నారు.....

నేడు తెలంగాణ విద్యాదినోత్సవం.. విద్యార్థులకు పోటీలు..!

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయం, అన్ని గురుకుల పాఠశాలలు, వైద్య, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్, ఐటీఐ, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ తదితర అన్ని విద్యాసంస్థల్లో విద్యాదినోత్సవం వేడుకలు జరుగనున్నాయి. గత తొమ్మిదేళ్లలో విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను తెలియజేయనున్నారు.

‘మన ఊరు – మనబడిలో భాగంగా పలు పాఠశాలలను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాటికి ప్రారంభోత్సవం చేయనున్నారు. దాంతో పాటు 10వేల గ్రంథాలయాలు, 1600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ను ప్రారంభించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మామిడితోరణాలు, పూలతో అందంగా అలంకరించి విజయోత్సవాలను ఘనంగా జరుపనున్నారు. నిర్వహిస్తారు.

విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు మన బడి కార్యక్రమం’తో పాటు 1001 గురుకులాలు, హార్టీకల్చర్, ఫారెస్ట్, మహిళ, హెల్త్ యూనివర్సిటీ, జిల్లాకో మెడికల్‌ కాలేజీకి, నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు, జూనియర్‌-డిగ్రీ కాలేజీల (రెసిడెన్షియల్‌ సహా)పై వివరించనున్నారు. విద్యా దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో విద్యార్థులు ర్యాలీలు తీయనున్నారు. ఆ రోజున పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి, తొమ్మిదేళ్ల విద్యారంగంలో పాఠశాల ప్రగతి, విద్యారంగంలో సాధించిన విజయాలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలల్లో యూనిఫారాలు, ట్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌ల ప్రారంభోత్సవం, అనుబంధ పోషకాహారం కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో, సాంస్కృతిక కార్యక్రమాలు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందికి సన్మానించనున్నారు.,....

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమల :జూన్ 20

తిరుపతి లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు మంగళవారం టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న సోమవారం శ్రీవారిని 69,879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,519 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

మొక్కలే మానవ మనుగడకు జీవనాధారం

•ప్రతి ఒక్కరూ బాధ్యత తో మొక్కలు నాటి సంరక్షించాలి:

•నల్లగొండ డిఎస్పి నరసింహారెడ్డి

మొక్కలే మానవ మునుగడకు జీవనాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నల్లగొండ డిఎస్పి వరాల నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

నల్గొండ డీఎస్పీ కార్యాలయం, టూ టౌన్ సర్కిల్ కార్యాలయం, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయా స్టేషన్ల అధికారులు మొక్కలు నాటి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న హరితహారం లో భాగంగా పోలీస్ స్టేషన్లలో సైతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అపూర్వరావు గారి ఆదేశాల మేరకు విరివిగా మొక్కలు నాటడం జరిగిందన్నారు.

మొక్కలు నాటడంతో పాటు సంరక్షించడం వల్ల ఆహ్లాదం పెంపొందడంతో పాటు మానవుల జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతుందన్నారు. భూమి మీద ఉన్న అన్ని ప్రాణులకు కూడా ఆక్సిజన్ అందించడంలో మొక్కలు ఎంతగానో దోపడతాయన్నారు.

నల్లగొండ డివిజన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి నాగ దుర్గ ప్రసాద్, ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్, చిట్యాల సిఐ శివరాం రెడ్డి, నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నార్కట్ పల్లి ఎస్సై సైదా బాబు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, సిబ్బంది ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడు : కొండా మురళి

కాంగ్రెస్ నేత కొండా మురళి-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్‌ లో మొదలైన విమర్శలు పర్వానికి ఇప్పట్లో బ్రేక్ పడేటట్లు కనిపించడం లేదు. మురళి-బీఆర్‌ఎస్ నేతలు తగ్గేదేలే అన్నట్లుగా సవాళ్లు విసురుకుంటున్నారు.

కేటీఆర్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యలపై మురళి ఈ రోజు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ లేడని తెలిపారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నాడు కాబట్టే కవిత అరెస్ట్ కాలేదని చెప్పారు. ‘‘నాకు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ.

రేవంత్రెడ్డి ని కలిసి పరకాల టికెట్ అడుగుతా. అధిష్టానం ఒప్పుకుంటే పరకాలలో నేనే నిలబడతా. కొండా సురేఖని వరంగల్లో గెలిపిస్తా.. నేను పరకాలలో గెలుస్తా. నంది పైపులు అమ్ముకునే ధర్మారెడ్డి.. నన్ను బ్రతిమాలి పెద్ద కాంట్రాక్టు తీసుకున్నాడు’’ కొండా మురళి తెలిపారు.

నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా!

‘నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా.. నన్ను రౌడీ అంటున్నావు.. మీ పార్టీ నాకెలా ఎమ్మెల్సీ ఇచ్చింది. శ్రీకృష్ణదేవరాయులు వంశంలో పుట్టినోళ్లం. మీసాలు మెలేస్తం. నువ్వు ఆడది కాదాయే.. మొగోడివి కాదాయె.. మీసాలు లేక ఎవరో తెలియకపాయె.. మీసాలుంటే మెలేస్తే బుద్ధివంతుడివి, ధైర్యవంతుడివి అనుకునేవాళ్లం’ అని కొండా మురళి, కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యజమానుల పైన చర్యలు తీసుకోవాలి

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు తో సతమతం అవుతున్న పేద ప్రజల నుండి బలవంతంగా ఫీజులు ముందే కట్టాలని ఫీజులు చెల్లిస్తేనే పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు కొన్ని పాఠశాలల్లో అరకొర వసతులతోనే ప్రవేట్ పాఠశాలలను ప్రారంభించారు.

నార్కట్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా చైతన్య ఈటెక్నిక్ స్కూల్ పేరుతో పాఠశాల పారంభిస్తామని చెప్పి అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతుంది కావున తక్షణమే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. విద్యాహక్కు చట్టాన్ని కూడా అమలు చేయాలని , ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని

ప్రతి ఒక్కరికి పాఠ్య పుస్తకాలు అందజేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుతున్నాము ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, నరేష్, పండ్ల హరికృష్ణ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పశువుల మందపై పెద్ద పులి దాడి

నంద్యాల జిల్లా:జూన్ 19

ఆత్మకూరు మండలం పెద్ద అనంతపురం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం అవుల మంద పై పెద్దపులి దాడి చేసింది.. ఈ దాడిలో రెండు అవులు మృతి చెందాయి… పులి దాడిని ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపర్లు కేకలు వేయడంతో పులి అడవులలోకి పారిపోయింది..

సమాచారం అందుకున్నఅటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పులి దాడి చేసిన వివరాలను సేకరించారు.. . ఇటీవల అడవి సమీప గ్రామాలలో పశువులపై తరుచు పులులు దాడులు చేస్తున్నాయని,

పులుల బారి నుంచి తమను కాపాడాలని స్థానికుల వేడుకున్నారు.. పులి దాడితో భయపడుతున్న ప్రజలకు భరోసా ఇస్తూ, పికెట్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు...

SB NEWS

రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన : వైయస్ షర్మిల

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ , రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బ‌ఘేల్, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే , ఎంపీ సంజ‌య్ రౌత్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ న‌వ్ జ్యోత్ సింగ్ సిద్దూ తో పాటు ప‌లువురు రాహుల్ గాంధీకి అభినంద‌న‌లు తెలిపారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాహుల్ గాంధీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు, ఇది చాలా సంతోష‌క‌ర‌మైన రోజని, మీరు మీ ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో ప్ర‌జ‌ల‌కు స్పూర్తినిస్తూ హృద‌య పూర్వ‌క ప్ర‌య‌త్నాల ద్వారా సేవ చేస్తూ ఉండాల‌ని షర్మిల ట్వీట్ లో కోరారు. ఆరోగ్య‌వంతంగా, సుఖ సంతోషాల‌తో విల‌సిల్లాల‌ని అకాంక్షించారు.

కాంగ్రెస్ లో విలీనం నిజమేనా?

తెలంగాణలో వైఎస్పార్ టీపీ ని కాంగ్రెస్ లో కలిపేస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ రాహుల్ కు షర్మిల విషెస్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకించి రాహుల్ కు షర్మిల ట్వీట్ చేయటం వెను క ఉద్దేశం కూడా అదే అని పలువురు నేతలు రీ ట్వీట్లు మొదలుపెట్టారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రెండు సార్లు బెంగళూరు వెళ్లిన షర్మిల డిప్యూటీ సీఎం ను కలిసిన సందర్భాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం అవన్నీ ఏమీ లేవని , తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు....

నేటి నుంచి పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌:జూన్ 19

నిర్వహణ పనుల కారణంగా సోమవారం 19 నుంచి 25 వ తేదీ వరకు కొన్ని మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు.

లింగంపల్లి - హైదరాబాద్‌ (రైలు నెంబర్‌: 47129, 47132, 47133, 47135, 47136), హైదరాబాద్‌-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47105, 47108, 47109, 47110, 47112), ఉందానగర్‌- లింగంపల్లి (రైలు నెంబర్‌: 47165, 47211),

లింగంపల్లి - ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47189, 47179), లింగంపల్లి - ఉందానగర్‌ (రైలు నెంబర్‌: 47178, 47212), ఫలక్‌నుమా -లింగంపల్లి (రైలు నెంబర్‌: 47158) సర్వీసులను ఈ రోజు నుంచి 24 వరకు రద్దు చేశారు.

ఉందానగర్‌ - లింగంపల్లి (రైలు నెంబర్‌: 47214) , రామచంద్రాపురం - ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47177), ఫలక్‌నుమా-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47156), ఉందానగర్‌-లింగంపల్లి (రైలు నెంబర్‌: 47157), లింగంపల్లి-ఉందానగర్‌ (రైలు నెంబర్‌: 47181) సర్వీసులను 25వ తేదీ వరకు రద్దు చేశారు. లింగంపల్లి-ఫలక్‌నుమా (రైలు నెంబర్‌: 47182) సర్వీసును ఈనెల 25న రద్దు చేశారు....

నిజంనిప్పులాంటిది

సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ‘చేతబడి’ చేశారన్న ఆరోపణతో దళిత దంపతులను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని భార్య చేతబడి చేస్తున్నారన్న అ

చేతబడి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టిన గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ‘చేతబడి’ చేశారన్న ఆరోపణతో దళిత దంపతులను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని భార్య చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది గ్రామస్తులు యాదయ్య అతని భార్యను గ్రామ నడివీధిలోని చెట్టుకు తాళ్లతో వేలాడదీసి కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.....