/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి Miryala Kiran Kumar
ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలి.

మృతుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం తో పాటు,భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి.

 ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన బి.ఎస్.పి  ముఖ్య కార్యకర్త సమావేశంలో మునుగోడు నియోజకవర్గం నాయకులు పెండెం  ధనుంజయ నేత పాల్గొని మాట్లాడుతూ  

 కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప గిస్తున్నది. అందు కోసం ఆయా రంగాల రెగ్యులర్ ఉద్యోగులను తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతున్నది. 

రెండు జూన్ రాత్రి ఏడున్నర గంటలకు జరిగిన ప్రమాదం కూడా రైల్వేలో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక పరిణామా ల ఫలితమే నని రైల్వే కార్మికులు అంటున్నారు.

ప్రైవేటీ కరణ వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గించారు. ట్రాక్ పరిశీలన చేసే వాళ్లు తగ్గి పోయారు. ఇంకో వైపు ఈ పాత ట్రాక్ ల మీదనే వేగంగా నడిచే వందే భారత్ రైళ్లు ప్రవేశ పెడుతున్నారు. 

ఏకారణాలతో పట్టాలు ఎలా మారుతున్నాయో పరిశీలన లేదు. రైల్వే శాఖ వైఫల్యానికి ఆ రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారి నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఇవి కేవలం ప్రమాద మరణాలు కావు. రైల్వే శాఖ చేసిన హత్యలు. 

మహబూబ్ నగర్ జిల్లా లో అప్పన్న పల్లి దగ్గర రైల్ ప్రమాదం జరిగినప్పుడు రైల్వే శాఖ మంత్రి గా ఉండిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జరిగింది అంతకన్నా మూడు నాలుగు రెట్లు పెద్ద తీవ్ర ప్రమాదం. 

 కరుణ గల భారత ప్రజలందరూ ఈ ప్రమాదాన్ని ప్రభుత్వ వైఫల్య మని గుర్తించాలని బాధితులకు న్యాయం కోసం కృషి చేయాలని కోరుతున్నాము. 

ప్రధాన మంత్రి, రైల్వే మంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటనలు చేస్తూ కన్నీరు కారుస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వీరందరూ దేశంలో అమలు అవుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విధానాలకు బాధ్యులు. ఈ మరణాలకు కూడా వీరు బాధ్యత వహించాలి. 

ప్రతి బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల పరిహారం తో పాటు ప్రతి కుటుంబానికి ఒక భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. 

ఊహించకుండా మృత్యు వాత పడిన, కోలుకోలేని విధంగా గాయాల బారిన పడిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తూ...

 ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి  నాయకులు బొట్టు శివ, పందుల సూరన్న, హరీష్, తీగల రమేష్, శివ, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగురాలు అయినా అవివాహితపై అగాయిత్యం చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం వెంటనే శిక్షించాలి: Ts వికలాంగుల జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ కుమారస్వామి

దివ్యాంగురాలైన అవివాహితపై అఘాయిత్యం చేసిన వ్యక్తిపై 2016 చట్టం అమలు చేయాలి.

తెలంగాణ వికలాంగుల-జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్

     వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండల కేంద్రంలోని పత్రిక మిత్రులతో తెలంగాణ వికలాంగుల జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు ఎన్ని చట్టాలు వచ్చిన,ఎన్ని ప్రభుత్వాలు మారిన మా పరిస్థితులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు.

   2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 కేసు అమలు చేస్తే దివ్యాంగ మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.బాపునగర్ గ్రామానికి చెందిన వివాహిత దివ్యాంగురాలుపై అదే గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కారోబార్ (మల్టీ పర్పస్ వర్కర్)గా పనిచేస్తున్న గుగులోత్ రాజు అఘాయిత్యానికి పాల్పడి పలుమార్లు అత్యాచారం చేశాడనీ వెంటనే కారోబార్ విధులనుంచి తొలిగించి ఆ వ్యక్తిపై 2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 కేసు అమలు చేసి కఠినంగా శిక్షించి తగిన విధంగా చర్య తీసుకొని జైలుకి పంపించాలని డిమాండ్ చేశారు.

   ఆ దివ్యాంగ మహిళకి తగిన న్యాయం జరగాలంటే అత్యాచారం చేసిన గుగులోత్ రాజుపై 2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 అమలు చేస్తే ఆ మహిళకి తగిన న్యాయం జరుగుతుందనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వికలాంగుల-జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి కోరారు.

నల్గొండ పట్టణం చెందిన ప్రముఖ వైద్యుని కుమారుడు ఐఏఎస్ కు సెలెక్ట్ అయిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కంచర్ల

ప్రెస్ నోట్..

 నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దామెర యాదయ్య గారి కుమారుడు దామేర హిమవంషి.... ఇటీవల ఐ ఏ ఎస్... కు సెలెక్ట్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని...

 ఈరోజు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు.

ఈ సందర్భంగా కంచర్ల... దామెర హిమవంశిని బొకే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు...

 అత్యున్నత స్థాయి సర్వీస్ లో సెలెక్ట్ అయినందున... కన్న తల్లిదండ్రులకు, నల్లగొండకు, రాష్ట్రానికి,మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు....

 నల్గొండ డి.ఎస్.పి ఎన్ నరసింహారెడ్డి, తీగల జాన్ శాస్త్రి...

 వెంట ఉన్నారు

తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది..! తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం వివిధ దశలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం స్మరించుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో ఎదురైన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను అధిగమించిన అడ్డంకులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ స్వయం పాలనకు 9ఏళ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి వెళ్తున్నామన్నారు. అనుమానాలు పటాపంచలు చేస్తూ అద్భుతంగా నిలదొక్కుకున్నామన్నారు. ప్రత్యర్థుల కుయుక్తులు తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమని చెప్పారు.

వెనుకబాటుతనానికి గురైన తెలంగాణ నేడు దేశాన్ని ముందుకుతీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో విజయం సాధించామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలువడం సంతృప్తికరంగా ఉందన్నారు. ‘తెలంగాణ మోడల్‌’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారన్నారు. దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు పొందడం మన ఘన విజయమని, ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమన్నారు. అన్నిరంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తూ మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా జరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలన్నారు.

స్థానిక కౌన్సిలర్ తల్లి గారి మృతి పట్ల నివాళులర్పించి సంతాపం తెలియజేసిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల, మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి

నల్లగొండ పట్టణ పరిధిలోని ఏడవ వార్డు కౌన్సిలర్ మారగోని గణేష్ గౌడ్ తల్లి అంశమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థివ దేహానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, పూలమాలవేసి నివాళులర్పించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు, మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండలో తప్పిపోయిన వృద్ధులకు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, సామాజిక కార్యకర్త సాధిక్ పాష

అభాగ్యులకు అండగా

నల్గొండ కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి సామాజిక కార్యకర్త, మరియు మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు తన గొప్ప మనసును చాటుకుంటు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే నల్గొండ కు చెందిన సాదిక్ పాషా గారు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తు సమాజానికి తన వంతు సేవలు అందిస్తు పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. 2018 లో తన స్నేహితుని బంధువులు(భార్యా భర్తలు) అనారోగ్యంతో చనిపోగా తానే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించి వారి ఇద్దరు పిల్లల్ని నల్గొండ కు తీసుకువచ్చి సి.డబ్ల్యూ.సి ద్వారా మేయర్స్ బాల భవన్ లో ఆశ్రయం కల్పించి వారికి ఉచిత విద్యా, వసతి కల్పించి వారికి గార్డియన్ గా(సంరక్షకునిగా)వున్నాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు అబ్బాయి 5వ తరగతి అమ్మాయి 3వ తరగతి చదువుతున్నారు. అతను చేసే సేవలకు గాను పలు అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. కోవిడ్ సమయంలో ఎందరికో తన సేవలు అందించి విజయవాడలో కోవిడ్ వారియర్ అవార్డును సైతం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సమాజంలో నిరాదరణకు గురైన వారికి, అనాధాలకు, వృద్ధులకు, వికలాంగులకు, అత్యవసర సమయంలో రక్తదానం, మరియు అభాగ్యులకు సేవలు చేస్తుంటానని తాను సామాజిక సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన ఆ భగవంతునికి ఎల్లప్పుడూ రుణ పడి వుంటానని సామాజిక సేవలోనే తనకు తృప్తి వుంటుందని సామాజిక సేవతోనే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుందన్నారు అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి తమకు తొచిన విధంగా ఎదో ఒక రూపంలో సామాజిక సేవలు చేసి సమాజంలో మానవత్వాన్ని చాటాలని అలాగే రక్తదానానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు రావాలని అభిలాషించారు.

పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే కంచర్ల

పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధిలోని పానగల్ వాటర్ ప్లాంట్ ను స్థానిక మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, డిఈ రాములు, కౌన్సిలర్ ఖయ్యుం బేగ్ గార్లు తదితరులు పాల్గొన్నారు.

కిడ్స్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: కిడ్స్ స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్లగొండ పట్టణ పరిధిలోని మీర్ బాగ్ కాలనీలో మై చోట కిడ్స్ స్కూల్ ను నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. వారి వెంట నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు కౌన్సిలర్ మారగోని భవాని గణేష్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల లక్ష్మయ్య, సింగిల్ విండో డైరెక్టర్ సయ్యద్ హాశం, సిపిఎం సీనియర్ నాయకులు దండంపల్లి సత్తయ్య, సలీం గార్లు తదితరులు పాల్గొన్నారు.

ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్‌ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!

Haryana: ఆఫీస్‌లో ఉద్యోగులు బీర్‌ తాగుతూ పని చేసుకోవచ్చు.. హరియాణాలో కొత్త మద్యం పాలసీ!

చండీగఢ్‌: ఆఫీస్‌లో పని ఒత్తిడిగా అనిపిస్తే.. చాల మంది ఉద్యోగులు క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగుతుంటారు. మరికొంతమంది మాత్రం సాయంత్రం ఆఫీస్‌ అయ్యాక..

పబ్‌, బార్‌కో వెళ్లి రిలాక్స్‌ అవుతుంటారు. ఇకపై ఆఫీస్‌ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరంలేదు. క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగినట్లు.. ఆ రాష్ట్రంలో క్యాంటీన్‌కు వెళ్లి బీర్‌ తాగొచ్చు. ఎక్కడంటారా? హరియాణాలో. ఈ మేరకు హరియాణా (Haryana) ప్రభుత్వం ఉద్యోగులు ఆఫీస్‌లోనే మద్యం సేవించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది కేవలం కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమేనని తెలిపింది. హరియాణా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని (Liquor Policy) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆఫీస్‌ పరిసరాల్లో ఆల్కహాల్‌ శాతం తక్కువ ఉన్న బీర్‌, వైన్‌ వంటి వాటిని తాగేందుకు అనుమతించింది..

జూన్‌ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. మే 9 తేదీన జరిగిన సమావేశంలో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఐదువేలు మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చు. ఇందుకోసం కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక లైసెన్స్‌ (L-10F)ను జారీ చేస్తుంది. లైసెన్స్‌ కోసం ఆయా సంస్థలు రూ. 10 లక్షలు వార్షిక రుసుము చెల్లించాలి. దాంతోపాటు మరో రూ. 3 లక్షలు సెక్యూరిటీ మొత్తంగా చెల్లించాలి. అలానే, సంస్థలో క్యాంటీన్‌ కోసం రెండు వేల చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. నిబంధనల ప్రకారం లైసెన్స్‌ పొందిన సంస్థల వద్ద ఎలాంటి రద్దీ ఉండకూడదు. కలెక్టర్‌, ఎక్సైజ్‌, ఐటీ కమీషనర్ల అనుమతితో లైసెన్స్‌ మంజూరు చేస్తారు.

డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హార్థిక శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు నియోజకవర్గ నాయకులు

డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హార్థిక శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు నియోజకవర్గ నాయకులు

మే 7వ తేదీన జరిగిన బీఎస్పీ తెలంగాణ బరోసా సభ లో బీఎస్పీ జాతీయ అధినేత్రి మాయావతి గారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సందర్బంగా బిఎస్పి నాయకులు పెండం ధనంజయ్ నేత ఆధ్వర్యంలో ఆర్ఎస్పీ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బోట్ట శివన్న ఎద్దుల పృథ్వీరాజు, సూరన్న,కొమ్ము గణేష్,గోలి ప్రవీణ్ , నారపాక సైదులు , వడ్డేపలి సైదులు,తదితరులు పాల్గొన్నారు.