/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రైతులు బాగుండాలనే పెట్టుబడి సాయం: పత్తికొండలో సీఎం జగన్‌ Yadagiri Goud
రైతులు బాగుండాలనే పెట్టుబడి సాయం: పత్తికొండలో సీఎం జగన్‌

కర్నూలు: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు.

మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నా. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ అభివాదం చేసి మరీ తన ప్రసంగం ప్రారంభించారాయన.

రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతన్నల కోసం భరోసా ఇస్తూ.. బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోనే సాయం జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ పెట్టుబడి సాయం అని అన్నారాయన..

ప్లాట్ ఫామ్ ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ రెండు గంటలు నరకం

ఖమ్మంజిల్లా :

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గురువారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది,రైలు ఎక్కుతుండగా ఓమహిళ జారిపడింది. ట్రైన్‌, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోయింది.

మధిరకు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వరరావు అతని భార్య కల్యాణి ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారు. ఆసుపత్రిలో చూపించుకున్న అనంతరం తిరిగి మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

ఇంటర్ సిటీ ట్రైన్ రావడముతో ముందు నాగేశ్వర రావు ఎక్కాడు. వెనుకనే భార్య కల్యాణి కూడా ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా రైలు కదిలింది.

దీంతో మహిళ కాలుజారి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కపోయి రెండు గంటలు నరకం అనుభవించింది,ఏడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. దీనిని గమనించిన రైల్వే సిబ్బంది అతి కష్టం మీద మహిళను బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...

ములుగు జిల్లా లో నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్టు

ములుగు జిల్లా:

వాజేడు మండలంలో నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె శివప్రసాద్ ఈ వివ‌రాల‌ను వెల్లడించారు..

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు అగ్ర నాయకులు దళ సభ్యులు ..మరికొంతమంది వాజేడు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన మిషన్లను తగలబెట్టి ..అటుగా వచ్చే పోలీసు పార్టీని ల్యాండ్ మెన్ ఏర్పాటు చేసి చంపాలని కుట్ర పన్నుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలతో వాజేడు నుండి గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న దారిలో తనిఖీ నిర్వహించారు..

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ పై ఒక బస్తా బ్యాగు పెట్రోల్ టీం తో గుమ్మడిదొడ్డి వైపు నుండి వాజేడు వైపు వస్తు పోలీస్ పార్టీని చూసి పారిపోవాలని ప్రయత్నించారు..

గమనించిన పోలీసులు వారిని అదుపులో తీసుకొని తనిఖీ చేయగా.. అందులో పేలుడు పదార్థాలు కనిపించడంతో ఇద్దరు పంచులను పిలిపించి వారి సమక్షంలో విచారణ నిర్వహించారు.. పుల్లూరి నాగరాజు వావిలాల నర్సింగరావు ఎం పెల్లి జాగావా కంబాలపల్లి గణపతి అనే నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు...

వాహనదారులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం మూడు వారాలపాటు ఘనంగా నిర్వహిస్తున్నది. తొలిరోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. ఈ సందర్భంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆ మార్గాల్లో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.

అమరవీరుల స్తూపం వద్ద..

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్‌ మినార్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు, బీజేఆర్‌ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్‌ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తారు.

ఆంక్షలు ఎక్కడంటే..

వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదాన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు.

ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు. అలాగే, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జం క్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. అఫ్టల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

బడాగణేశ్‌ లేన్‌ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లేన్‌లోకి మళ్లిస్తారు.

మింట్‌లేన్‌ నుంచి బడాగణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు........

నా కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు ఉరితీస్తా : కొండ మురళి

వరంగల్ జిల్లా :

వరంగల్‌లో కాంగ్రెస్ నేత కొండా మురళీ అనుచరులు, వ‌రంగ‌ల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అనుచరుల మధ్య నిన్న జరిగిన వివాదంపై కొండా మురళీ గురువారం నాడు ఘాటుగా స్పందించారు.

తన కార్యకర్తలను టచ్ చేస్తే నాలో పాత మురళీ బయటకు వస్తాడు అంటూ హెచ్చరించారు. తన కార్యకర్తల జోలికి వస్తే క్రేన్‌కు ఉరివేసి వేలాడదీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖ దే... ఇది రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు.

వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరతామని తనతో చెబుతున్నారు. కానీ వారిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కొండా మురళీ పేర్కొన్నారు....

2000 రూపాయల నోట్లు, ఉపసంహరణ నక్సలైట్ల కు ఎదురు దెబ్బ

ఛత్తిస్ గడ్ :

2000 రూపాయల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం తో,నక్సలైట్లకు ఎదురుదెబ్బ తగిలింది ఎందుకంటే దోపిడీ ద్వారా సేకరించిన నిధులు ప్రధానంగా ఈ డినామినేషన్‌లోనే ఉన్నాయని మహారాష్ట్రలోని సీనియర్ పోలీసు అధికారి గురువారం పేర్కొన్నారు.

నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునేందుకు నక్సలైట్లు చురుగ్గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గత గురువారం ఇద్దరు వ్యక్తులను నక్సలైట్ కమాండర్‌కు చెందిన రూ. 6 లక్షల 2,000 కరెన్సీ నోట్లతో అరెస్టు చేశారు.

2000 రూపాయల నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది మరియు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని లేదా సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవాలని ప్రజలను కోరింది.

గడ్చిరోలి రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సందీప్ పాటిల్ పీటీఐతో మాట్లాడుతూ రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవడం నక్సలైట్లకు ఎదురుదెబ్బ తగిలిందని, పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్ల నుంచి నక్సలైట్లు దోపిడీ చేసిన సొమ్ము ప్రధానంగా ఈ డినామినేషన్‌లోనే ఉండి వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిందని అన్నారు. అడవులలో.

తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునేందుకు నక్సలైట్లు చురుగ్గా మారారని గడ్చిరోలి పోలీసులకు నిఘా సమాచారం అందిందని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఇది వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో రూ.2,000 నోట్లలో రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని, నక్సలైట్ల నుంచి ఈ డినామినేషన్‌లో కరెన్సీని పొందిన వ్యక్తిపై నమోదైన నేరాన్ని ఆ అధికారి ప్రస్తావించారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారని, జన మిలీషియా మరియు ప్రధాన నక్సలైట్ మద్దతుదారులపై నిఘా ఉంచారని పాటిల్ చెప్పారు.

పోలీసులు టెండు లీవ్స్ కాంట్రాక్టర్లపై కూడా నిఘా ఉంచారు మరియు బ్యాంకు అధికారులతో రూ. 2,000 నోట్ల మార్పిడి గురించి సమాచారం కోసం టచ్‌లో ఉన్నారు.....

సిద్ధిపేటలో రైల్వేట్రాక్ పనులను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేటజిల్లా :

సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైను పనులు రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య మంత్రి హరీష్‌రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్ధిపేట ఆర్డీఓ రమేశ్ బాబు, ఇతర అధికార యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయి రైల్వే ట్రాక్ పనులను మంత్రి పరిశీలించారు.

సిద్ధిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని రైల్వే శాఖ అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

దుద్దెడ - సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనుల గురించి మంత్రికి రైల్వే శాఖ అధికారులు వివరించారు. దుద్దెడ - సిద్ధిపేట రైల్వే ట్రాక్ పనులలో భాగంగా మందపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఆరా తీసి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.......

అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా?

నటి అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా? ఆమె అభిమానులను ఇప్పుడు పట్టి పీడిస్తున్న అనుమానం ఇదే. అందుకు కారణం లేకపోలేదు. 2015లో ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్ర విజయం ఈమె దశను మార్చేసింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అనుపమ పరమేశ్వరన్‌ బాగా ఓన్‌ చేసుకున్నారని చెప్పక తప్పదు. అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు భాషను కూడా నేర్చుకుంది. అదే విధంగా తమిళంలోనూ ధనుష్‌ జంటగా కోడి, అధర్వ సరసన తల్లి పోగాదే వంటి చిత్రాల్లో నటించింది.

ఇక మాతృభాషలో నటిస్తున్న ఈమె బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌తో జత కట్టిన కార్తికేయ–2 తెలుగుతో పాటు హిందీలోనూ సంచలన విజయం సాధించింది. అలా బాలీవుడ్‌ ప్రేక్షకులను పరిచయం అయిన అనుపమ ప్రేమ వ్యవహారంపై కూడా 10 రకాల వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్‌ క్రికెటర్‌ బుమ్రాతో ప్రేమాయణం అంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఇటీవల ఆయన తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో ఆ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడింది.

తాజాగా నటి అనుమప పరమేశ్వరన్‌ ఒక ప్లాస్టిక్‌ పేపర్‌ను ఉంగరంగా తయారు చేసి తన వేలికి తొడుక్కుని తన ఎంగేజ్‌మెంట్‌ ఉంగరం అంటూ ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పేర్కొంది. దీంతో తమ అభిమాన నటి పెళ్లికి సిద్ధమైందా అంటూ అభిమానులు తెగ కలవరపడిపోతున్నారు.

అయితే ఆమె సరదాగా అలా చేసినట్లు పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం పెళ్లి తలపుల్లో అనుపమ. ఆ రహస్య ప్రేమికుడు ఎవరో? అంటూ వైరల్‌ చేస్తున్నారు. కాగా ఈ 27 ఏళ్ల పరువాల సుందరి ప్రస్తుతం తమిళంలో నటుడు జయం రవి, కీర్తిసురేష్‌లతో కలిసి సైరన్‌ చిత్రంలో నటిస్తోంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల :

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం 80,284 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారిని 34,096 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

SB NEWS

SB NEWS

బ్రేకింగ్ న్యూస్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

ఖమ్మం జిల్లా :

జిల్లాలోని కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణి జర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్‌బంకు ఎదురుగా లారీ కారు పరస్పరం ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్ర గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

మృతులు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్(13)గా గుర్తించారు.

హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఉద్యోగి. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది....

SB NEWS