/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz 111 జీవో రద్దు తో జరగబోయేది ఏమిటి❓️ Yadagiri Goud
111 జీవో రద్దు తో జరగబోయేది ఏమిటి❓️

ఆదమరిస్తే పట్నం ఆగమవుతుంది. ప్రభుత్వం 111 జీవో రద్దు చేసి సర్కార్ పట్నానికి పాడె కడుతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగు నీరందించే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్‌లా మారే ప్రమాదం ఉందని తెలంగాణ సమాఖ్య, హైదరాబాద్‌ జిందాబాద్‌, తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు, మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారని తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ దేశాయి అన్నారు.

గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది.

అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది.

భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ తెచ్చిన జీవో 111ను పూర్తిగా తొలగించడం దుర్మార్గం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. జంట జలాశయాలను రక్షించుకోవడానికి జంటనగరాల ప్రజలు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే 25న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని సెంట్ జాన్స్ చర్చ్ ఎదురుగా ఉన్న గురుస్వామి హాల్ లో “111జీవో రద్దుతో పట్నానికి పాడె” అంశం మీద భవిష్యత్తు కార్యాచరణ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరితో పాటు పలువురు పర్యావరణవేత్తలు, మేధావులు పాల్గొంటారన్నారు.

అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు.

మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సంబంధిత శాఖ అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హెల్త్ డే రోజున మిగతా 24 జిల్లాలలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు.

అదేవిధంగా మాత, శిశు మరణాలను అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. గర్భిణీల్లో రక్తహీనతను నివారిస్తూ, పుట్టబోయే శిశువులు ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రభుత్వం ప్రస్తుతం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాల ప్రగతి గురించి మంత్రి జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీఆర్ శిక్షణ కార్యక్రమంపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాకు 2,630 న్యూట్రీషన్ కిట్లు : కలెక్టర్ శరత్

జిల్లాకు 2,630 న్యూట్రిషన్ కిట్స్ వచ్చాయని జిల్లా కలెక్టర్ శరత్ మంత్రికి తెలిపారు. న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాకు 19 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా, 18 బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరొక బస్తీ దవాఖాన ప్రారంభానికి సిద్ధంగా ఉందని, త్వరలో దాదాని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రికి వివరించారు....

TS News: పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్గొండ: ''నన్ను సీఎం..సీఎం అని అనొద్దు.. మంత్రి పదవినే వదిలివేశాను.. నాకు ఏ పదవీ ముఖ్యం కాదు. నాకు ప్రజలే ముఖ్యం..

మీకోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమే. ఐదు సార్లు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.'' అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komatireddy Venkat reddy) వ్యాఖ్యానించారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు పూజలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 60వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..

సీఎం అనకుంటేనే సీఎం అవుతానని, మీరు సీఎం.. సీఎం అంటే అంతా కలిసి ఎమ్మెల్యేగనే ఓడిస్తారని అన్నారు. వచ్చే వారం పది రోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందన్నారు..

SB NEWS

UPSC సివిల్‌ సర్వీసెస్‌ 2022 తుది ఫలితాలు విడుదల

న్యూ ఢిల్లీ:

సివిల్‌ సర్వీసెస్‌ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది UPSC. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది.

అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌-Aకు 473 మందిని, గ్రూప్‌-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్‌-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది.

జనరల్‌ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, OBC కేటగిరీ కింద 263 మందిని, SC కేటగిరీ కింద 154 మందిని, ST వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఫలితాల్లో ఇషితా కిషోర్‌ టాపర్‌గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్‌ మూడో స్థానం దక్కించుకున్నారు.

ఇషితా కిషోర్‌

సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల విజయభేరి

IAS/IPS వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తోట శరత్ చంద్ర తెలిపారు.

తమ అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి దాదాపు 45 మంది అభ్యర్థులు ఈ ఏడాది ర్యాంకులు సాధించారని ఇందులో చాలామందికి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి మెరుగైన సర్వీసులు వస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా అత్యున్నత సర్వీసులకు ఎంపికవడం పట్ల శరత్ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు...

మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

మంత్రి కేటిఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాలతో ట్రయల్ రన్

మంగళవారం ఉదయం 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి గోదావరీ జలాలను ఎత్తిపోత

త్వరలోనే మల్కపేట రిజర్వాయర్‌ ప్రారంభానికి సన్నాహాలు

వేములవాడ:

నియోజకవర్గం కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ - 9 లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది.

మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.

అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం సరిగ్గా 07.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు.

ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎత్తి పోతల సలహాదారు పెంటా రెడ్డి, MRKR,WPL ఏజెన్సీ ల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్ ఎప్పటి కప్పుడు ట్రయల్ రన్ పై అధికారులను ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు.

మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టు కు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది.

మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటిసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూముల సస్యశ్యామలం కానున్నాయి.

రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌ ను

త్వరలోనేప్రారంభించనున్నారు..

శాసనసభ ఎన్నికలకు సిద్ధం కండి: డీజీపీ

హైదరాబాద్‌: ఎన్నికల నిర్వహణలో ప్రతిసారీ కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, అందుకే ఈ ప్రక్రియలో పాల్గొనడం ప్రతి అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని డీజీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

మరో అయిదారు నెలల్లో రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఎస్పీలు, కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికలకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి, పాత కేసులు... తదితర అంశాలను డీజీపీ వివరించారు.

జూన్‌, జులైల్లో చేయాల్సిన పనులు, కేంద్ర బలగాలతో సమన్వయం, సిబ్బంది మోహరింపు వంటి అంశాలపై అంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లలో చాలామందికి గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం లేదని,

వారంతా సీనియర్‌ అధికారుల సహకారం తీసుకోవాలని అంజనీకుమార్‌ సూచించారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల నిర్వహణలో పాల్గొని వచ్చిన అదనపు డీజీ సౌమ్యా మిశ్ర, డీసీపీ అభిషేక్‌ మొహంతి తమ అనుభవాలను పంచుకున్నారు.

Cough syrup: దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

దిల్లీ: భారత్‌ (India)లోని కొన్ని కంపెనీలు తయారుచేసిన దగ్గు మందుల (Cough syrup) కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం ఇటీవల తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

ఆ సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ (Govt Labs)లలో అనుమతి తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే ఎగుమతులు (Exports) చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది..

''దగ్గు మందు (Cough syrup) ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఏదైనా ప్రభుత్వ లాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్‌ సమర్పిస్తేనే తమ దగ్గు మందులను ఎగుమతి చేసేందుకు అనుమతులు లభిస్తాయి.

జూన్‌ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి'' అని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) ఓ అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌, రీజినల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (RDTL - Chandigarh), సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబ్‌ (CDL - Kolkata), సెంట్రల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (CDTL - Chennai Hyderabad, Mumbai), ఆర్‌డీటీఎల్‌ (గువాహటి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో దగ్గు మందుకు తనిఖీలు చేయించుకోవాలని కేంద్రం ఎగుమతుదారులకు స్పష్టం చేసింది..

జాతకం చూస్తానని..రూ.2.65 లక్షలతో ఉడయించాడు

•నందిగామ మండలం ఈదులపల్లి లో ఘటన

నేను శ్రీశైలం నుంచి వచ్చిన స్వామీజీని.. మీ జాతకం చూస్తాను అని ఓ కుటుంబాన్ని బురిడీ కొట్టించి రూ.2.65 లక్షలతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు..

నందిగామ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన సునీత(25) ఇంటికి రెండు నెలల క్రితం ఓ వృద్ధుడు వచ్చి తన పేరు రాములు అని మీ జాతకం చూస్తానని మొదట 15000 తీసుకున్నాడు..

సదరు మహిళ డబ్బులు ఇవ్వడంతో అమాయకత్వాన్ని గమనించిన ప్రబుద్ధుడు మరో పథకం వేశాడు. మీ భర్తకు ప్రాణహాని ఉందని, మీ ముగ్గురు ఆడ పిల్లల మంచి కోసం పరిహారం పూజలు చేయాలని నమ్మబలికాడు.

అంతేకాకుండా మీ ఇంట్లో బంగారు నిధులు ఉన్నాయని బయటకు తీసేందుకు 2.50 లక్షల ఖర్చు అవుతుందని చెప్పాడు.. నమ్మిన సునీత మొత్తం రూ.2.65 లక్షలు ఇచ్చింది.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెబితే నీ భర్త ప్రాణాలకు గండం ఉంటుందని నమ్మించాడు.

ఒకే రోజులో తన పని ముగించుకొని.. ఒక నెలలో తిరిగి వచ్చి బంగారు నిధులు తీస్తానని వెళ్లిపోయాడు.. నెల తర్వాత రాకపోవడంతో సునీత వృద్ధుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసింది.. అతను ఇప్పుడు లేడు అని బదులు రావడంతో తాను మోసపోయినట్లు భావించి నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

బ్యాంకు ఖాతాలపై ఐటి కన్ను

ఎవరైనా తప్పు చేస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష

మరోవైపు బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునే యత్నాల్లో బడాబాబులు

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఆ నోట్లు వుంటే సెప్టెంబరు 23వ తేదీలోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అంతవరకు బయట మార్కెట్‌లో కూడా అవి చలామణిలో ఉంటాయి. దుకాణదారులు, వ్యాపారులు తీసుకోబోమని చెప్పడానికి వీల్లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే గతంలో పెద్ద నోట్ల రద్దు అయినప్పుడు చాలామంది వ్యాపారులు, ధనవంతులు వారి బ్లాక్‌మనీని ఎలా వైట్‌ చేసుకున్నారో...ఇప్పుడు కూడా అలాగే చేయడానికి సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..ఎవరైనా సరే సెప్టెంబరు 23వ తేదీ వరకు రోజుకు పది నోట్లు చొప్పున రూ.20 వేలు బ్యాంకులో వేసి, దానికి సరిపడా మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలా చేస్తే నెలకు రూ.6 లక్షల వరకు మార్చుకోవచ్చు. అయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా! అని మనవి కాని డబ్బు (ఇంకెవరివో) తీసుకొని మీ ఖాతాల్లో వేస్తే ఇబ్బందులు తప్పవు. సెప్టెంబరు 23 వరకు ప్రతి ఖాతాను ఐటీ విభాగం పరిశీలిస్తుంది.

రెండు లక్షల రూపాయలలోపు రూ.2 వేల నోట్ల లావాదేవీలు ఉంటే...సాధారణ అంశంగానే పరిగణిస్తుంది. అంతకు మించి రూ.2 వేల నోట్లు వేసినట్టయితే వాటిపై సెక్షన్‌ 68 ప్రకారం వివరణ కోరుతుంది. దానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించి, ఆధారాలు చూపాలి. గతంలో ఎన్నడూ చూపని ఆదాయం ఇప్పుడు చూపిస్తే...దానిని తప్పుడు పనిగా భావించి ఆదాయ పన్ను+జరిమానా వసూలు చేస్తుంది. ఇది ట్రాన్సాక్షన్‌ మొత్తంలో 84 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేశారనుకుంటే...దానికి సరిగ్గా లెక్కలు చెప్పకపోతే రూ.8.4 లక్షలు ఐటీ విభాగానికి కట్టాల్సి ఉంటుంది. పొరపాటున ఏ స్నేహితుడికో సాయం చేద్దామనే ఆలోచనతో వారి డబ్బులు మీ ఖాతాలో వేసుకుంటే...ఈ భారం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విచారణలో మనీ లాండరింగ్‌ జరిగిందని ఐటీ శాఖ భావిస్తే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.

కొత్త ఖాతాలు తెరవద్దు

ధనవంతులైన మిత్రులు తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి మన పేరుతో కొత్తగా ఇంకో బ్యాంకులో ఖాతా తెరుస్తామని అంటారు. మీకు ఏమీ భయం అవసరం లేదని, సెప్టెంబరు నెల ముగియగానే ఆ ఖాతా క్లోజ్‌ చేస్తామని, ఏ సమస్య రాదని చెబుతారు. ఇలా కొత్తగా ప్రారంభించే ఖాతాలు, అందులో వేసే మొత్తాలను బ్యాంకులతో పాటు ఐటీ శాఖ కూడా ట్రాక్‌ చేస్తుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ ఉంటుంది కాబట్టి...ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నా ఒక్కరి పేరుపైనే చూపిస్తాయి. ఇది కూడా తప్పే. ఇలాంటి వాటికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

రిటర్న్‌ ఫైల్‌ చేసినా...

కొంతమంది ఇలాంటి డబ్బులను ఐటీ రిటర్న్‌లలోను చూపించడానికి యత్నిస్తున్నారు. పరిధికి మించి బ్యాంకు ఖాతాలో రూ.2 వేల నోట్లను డిపాజిట్‌ చేస్తే సెక్షన్‌ 115-బీబీఈ...ప్రకారం మూడేళ్ల తరువాత కూడా ఆ రిటర్న్‌లను పునః సమీక్ష చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంబంధం లేని వ్యక్తుల రూ.2 వేల నోట్లను తీసుకొని బ్యాంకు ఖాతాల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తే...వారికి ప్రయోజనం... చేసిన వారికి నష్టం, జైలు శిక్షపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిదని విశాఖకు చెందిన ఐటీ అధికారి ఒకరు సూచించారు.

టికెట్లను ప్రకటించేస్తున్న కేటీఆర్ వీరికి మాత్రం టెన్షనే

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) దూకుడు పెంచింది. తరచుగా పర్యటనలు చేపడుతూ, పార్టీకి ఆదరణ పెంచేందుకు కింది స్థాయి నేతల్లో ఉత్చాహం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారు తరచుగా జిల్లాలు పర్యటనలు చేపడుతూ, కీలకమైన ఎన్నికల హామీలను ఇస్తూ , ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మంత్రి కేటీఆర్( Minister KTR ) జిల్లాల పర్యటనలో అనేక కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ వారిని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుగానే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితులు అనుకూలంగా మార్చేందుకు కేటీఆర్ చొరవ తీసుకుంటున్నారు.

బిజెపి, కాంగ్రెస్ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చకు పెడుతున్నారు . వివాదాలు లేని నియోజకవర్గాల్లో ని అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ జిల్లా పర్యటనలు ఎక్కువగా చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పర్యటనలో పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మాజీ ఎంపీ వినోద్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి అని , బండి సంజయ్ ను ఇంటికి పంపి వినోద్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.

వరంగల్ లో వినయ్ భాస్కర్, కామారెడ్డి జిల్లా జక్కల్ లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే విషయంలోనూ కేటీఆర్ ఇదే విధంగా ప్రకటనలు చేశారు. కేటీఆర్ జిల్లా పర్యటనల్లో ఈ విధంగా కొన్ని కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై పార్టీలో చర్చనీయాంశం గా మారింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేటీఆర్ మౌనంగా ఉండడంతో , అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ దక్కడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది.

రామగుండం ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడిన కేటీఆర్ చందర్ మంచి యువకుడు అని ,బాగా కష్టపడతాడని , ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నాడని, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు . కానీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పకపోవడంతో, ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుంది. ఇక పెద్దపల్లి ఎంపీ బార్లకుంట వెంకటేష్ పేరును కూడా కేటీఆర్ ప్రస్తావించలేదు దీనిపైన చర్చ జరుగుతోంది. అవినీతి వ్యవహారాలు, గ్రూపు రాజకీయాలతో వివాదాల్లో ఉంటున్న వారి విషయంలో సైలెంట్ గా ఉండడంతో వారికి టిక్కెట్ దక్కదు అనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం కేటీఆర్ జిల్లా టూర్లపై ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.