మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి:పల్లకొండ కుమారస్వామి
మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి
వి-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకంలో అనాధ పిల్లలతో పాటుగా వికలాంగులు తల్లిదండ్రులుగా ఉన్న వారి పేద విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకానికి వర్తింపజేయాలని వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు వికలాంగులుగా ఉన్న వారి పిల్లలు పేదరికం వలన విద్యాభ్యాసం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు.
కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడ విద్యను అందించడం కోసం కృషి చేయాలని,ఈ పథకానికి 72 వేల ఆదాయ పరిమితి విధించడం వల్ల,ఆదాయ పరిమితిలో
సడలింపు ఇవ్వాలి. చాలామంది ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యను అభ్యసించడం జరుగుతుందని, ప్రభుత్వం,ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకంలో వర్తింప చేయాలనీ కోరడమైందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాస్తల్య పథకానికి కావాల్సిన ధ్రువ పత్రాలు సరైన సమయానికి అందక విద్య సంస్థలు సెలవులు కావడం వల్ల నాన అవస్థలుపడుతున్నారని దరఖాస్తు గడువు చాలా తక్కువగా ఉందనందున ఈ గడువును మరోసారి పొడిగించాలని తెలిపారు.పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ వాస్తల్య పథకం వికలాంగుల కుటుంబానికి చెందిన వారి పిల్లలు కూడా విద్యను అభ్యసించడానికి సహకారం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.



నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం ఎస్ఎస్సి ఫలితాల్లో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల మంచి ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరైన 42 మంది విద్యార్థులకు 39 మంది విద్యార్థులు 97% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నల్లగొండ, చర్ల పళ్లికి చెందిన శ్యామల శివప్రసాద్ 9.3 మరియు నల్ల రక్షిక 9.2 జిపిఏతో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ చైర్మన్ రమేష్ అభినందించారు.
NLG: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...

NLG: పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

NLG: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...




మెరుగైన వైద్య సేవలు అందించాలి... ఎమ్మెల్యే కంచర్ల

సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై దాడి ఘటన చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపాలిటీ ఉద్యోగి బిక్షం పై అక్రమ నిర్మాణం చేపడుతున్న భద్రయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ మున్సిపాలిటీ ఉద్యోగిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు .




May 13 2023, 15:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
29.8k