/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz చేనేత కార్మికునికి ఆర్థిక సహాయం అందజేసిన నల్లగొండ పద్మశాలి సంఘం నాయకులు Miryala Kiran Kumar
చేనేత కార్మికునికి ఆర్థిక సహాయం అందజేసిన నల్లగొండ పద్మశాలి సంఘం నాయకులు

ఆర్థిక సహాయం అందజేత:

కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి, చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట రాజీవ్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు తిరందాసు వెంకటేశం ఇంటి (రేకుల)పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని మగ్గం ఇతర సామాగ్రి వర్షానికి తడిసి భారీ నష్టం జరిగింది.ఈ విషయం తెలుసుకుని నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం తరఫున శ్రీ పొట్ట బత్తిని సత్యనారాయణ గారు తమ వంతు తక్షణ సహాయంగా 10,000 రూపాయల ను బాధిత కుటుంబాన్ని పరామర్శించి అందజేశారు. వారి వెంట జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు స్థానిక పద్మశాలి నాయకులు ఉన్నారు.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నా పాల్గొన్న నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నాలు ముఖ్యఅతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు నీల వెంకటేష్ , రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జనార్దన్ గౌడ్ పాల్గొనడం జరిగింది

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనగనలో కులగన్న ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు 70 సంవత్సరాల పాలనలో బీసీలను బిచ్చగాడు లాగా చూస్తున్నారు బట్ట మీద పప్పు మీద పెట్రోల్ మీద ప్రతి దాని మీద పన్ను కట్టేది బీసీలు బీసీల బడ్జెట్లో 2000 కోట్లు పెంచడం చాలా దురదృష్టకరం బీసీలకు బిస్కెట్లు కూడా రావు కేంద్రంలో క్రిమిలే విధానాన్ని రద్దు చేయాలని ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు నీల వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న 2656 కులాలు ఉండగా అందులో 36 కులాలు మాత్రమే పార్లమెంటు రాజ్యసభ పార్లమెంటు అసెంబ్లీ మెట్లు ఎక్కారు కానీ మిగతా కులాలు విద్యా ఉద్యోగ ఆర్థికంగా దూరమై సంచర జాతుల్లాగా మిగిలిపోయారు ఇప్పటికైనా రిజర్వేషన్లు అందాలంటే జనగణలో కులగనగా ఏర్పాటు చేయాలి అప్పుడే బీసీలకు తగిన ఫలితం లభిస్తుందని నీళ్ల వెంకటేష్ సద్దేవ చేశారు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కులాల వారిగా లెక్కలు ఎప్పుడైతే తీస్తుందో ప్రతి కులానికి అప్పుడే ఫలాలు అందుతాయని కులాల పేరు చెప్పుకొని రాజకీయ పార్టీలు

పదవులతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ బీసీలు మాత్రం జెండాలు మోసుకుంటూ జేజేలు కొట్టుకుంటూ కుర్చీలు మొసుకుంటూ వాళ్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు అందుకే బీసీల రాజ్యాధికారం కోసం కృష్ణయ్య గారు చేస్తున్న పోరాటంలో భాగంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితేనే న్యాయమైన డిమాండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్

 నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డు ఆర్జాలబావిలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవాలని కోరారు. సంపూర్ణ అంధత్వమే నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కంటి వెలుగు పథకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...

 ఈ సమ్మేళనంలో... జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు...

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అభివృద్ధి సంక్షేమ పథకాల నిర్వహణలో... వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో.. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో..ప్రభుత్వం ద్వారా లబ్ధి చెందారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బంగారు తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యిందని, ఒకప్పుడు కరెంటుకు మంచినీటికి సాగునీటికి, ఎరువులు విత్తనాలకు ఎలాంటి పరిస్థితి ఉందో ఈనాడు ప్రజలు బెరిజు వేసుకోవాలని... ప్రతి బజారులో ప్రతి మూలలో ప్రతి ఇంట్లో చర్చ జరుపుకోవాలని సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అందుకు... టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచవలసిఉందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో... తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, జెడ్పిలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు, చీర పంకజ్ యాదవ్, సుంకరి మల్లేష్,గౌడ్ కటికం సత్తయ్య గౌడ్,... తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి , డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, స్థానిక సర్పంచ్, వంటపాక పరశురాములు, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రొట్టెల రమేష్, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యురాలు, వనపర్తి జ్యోతి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, కంచర్ల విజయ తదితరులు పాల్గొన్నారు

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.

కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో కస్తూర్బాగాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు హంస ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మీ గారు హాజరు కావడం జరిగింది వారి చేతుల మీదుగా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది., 

ఈ సందర్భంగా చెరుకు లక్ష్మి గారు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని పట్టుదల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు హంస ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం అన్నారు.

*ఈ కార్యక్రమంలో నాయకులు పూల సైదులు కందికంటి నాగేంద్రబాబు టి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్ జిల్లా సంపత్ రాజేష్ సిబ్బంది అనిత సబిత ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

ICDS మాన్యం చెల్క సెక్టార్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం

ICDS MANYAMCHELKA SECTOR వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం అవగాహన(POSHAN PAKWADA)కార్యక్రమం

స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ICDS మాన్యం చెల్క సెక్టార్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన POSHAN PAKWADA కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ బాలికల పాఠశాల ఆర్.పి.రోడ్డులో అనిమీయ క్యాంపు నిర్వహించి బాలికలకు రక్త పరీక్షలు జరిపి వారికి ఆరోగ్య సలహాలు ముఖ్యంగా రక్తహీనత గురించి అదనపు కలెక్టర్ గారు బాలికలకు పలు ఆరోగ్య సలహాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా పౌష్టికాహారానికి సంబంధించిన పలు ఆహార పదార్థాలు ప్రదర్శించి విద్యార్థులకు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా గారు DWO సుభద్ర గారు, CDPO నిర్మల గారు, సూపర్ వైజర్ ప్రణీత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, వార్డు కౌన్సిలర్ రయిసా బేగం,అంగన్వాడీ టీచర్స్ నస్రీన్ సుల్తానా, స్వరూపరాణి,అండాలు, అయేషా హుమెరా, వెంకటలక్ష్మి, రాజిలోచన, శ్రీదేవి, హెల్పర్ అన్వరున్నిసా, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ: పలు శుభకార్యాలలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి 

నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డుకు చెందిన కట్ట హనుమంతు, లావణ్య కుమారుని మొదటి జన్మదిన వేడుకలో మరియు 40వ వార్డుకు చెందిన నాంపల్లి వెంకటేష్, కవిత చిన్నారుల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు హాజరై, చిన్నారులను ఆశీర్వదించారు. వారి వెంట నల్లగొండ సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, నాంపల్లి శ్రీనివాస్, అన్వర్, వనం చంద్రశేఖర్, మిరియాల కిరణ్ కుమార్, పోషం గిరి, కైరం కొండ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ: గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కాటమయ్య దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మున్సిపల్ ఛైర్మెన్ మందడి..

గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. 17వ వార్డు పరిధిలోని అనేశ్వరమ్మ గుట్ట వెనుక గౌడ కులస్తుల ఆరాధ్య దైవం సురమాంబ కాటమయ్య దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గీత కార్మికులకు ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.

దివ్యాంగుల గృహలక్ష్మికీ 5 లక్షలు కేటాయించాలి

తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్.

అక్షర దివిటి చెన్నారావుపేట ప్రతి నిధి:

   వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో దివ్యాంగుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో దయనియా స్థితిలో దివ్యాంగులు పూట గడవక కొట్టుమిట్టాడుతున్నరాని సీఎం కెసిఆర్ గారు కరుణ చూపి గృహ లక్ష్మికీ 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలనీ కోరాడం జరిగింది.

    ప్రభుత్వం అమలు చేస్తున్న గృహలక్ష్మికీ 5 శాతం రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు తొలి జాబితాలో అవకాశం కల్పించి ప్రభుత్వం ఇస్తున్న 3లక్షలతో పాటు దివ్యాంగుల శాఖలో మరో 2 లక్షలు రూ,,కేటాయించి ఆ డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వమే నిర్మించి దివ్యాంగులకు ఇవ్వాలని తెలంగాణ దివ్యాంగుల సమాజం తరుపున తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి సీఎం కెసిఆర్ గారికి, ఆయా శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ గార్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

  

    ఈ కార్యక్రమంలో దివ్యాంగుల-జేఏసీ రాష్ట్ర నాయకులు దేవర రాజు,జిల్లా నాయకులు దారావత్ రమేష్,రాజు,అనిల్,సతీష్,సుధాకర్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు నిరసన కార్యక్రమం

యుటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకై నల్లగొండ జిల్లా క్లాక్ టవర్ నందు అధ్యక్షులు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనార్టీ బందును 10000 కోట్లతో ఏర్పాటు చేయాలని wak బోర్డ్ లాండ్స్ ను కాపాడాలని ప్రతి జిల్లాకి ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని అర్హులైన మైనార్టీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ న్యాయవాది బియ్యంకే పార్టీ నాయకులు నజీరుద్దీన్ గారు బహుజనయువశక్తి సమితి అద్యక్షులు అభిలాష్ పెరిక ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ కుడుతల నాగరాజ్ ముస్లిం సోదరులు పాషా హమ్జాద్ రషీద్ భాయ్ సోఫియాను తాహెర్ నజీర్ జమీల షరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.