/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz యువ గళం పాదయాత్రలో అపశృతి..లోకేష్‌ భుజానికి గాయం Andrapradesh
యువ గళం పాదయాత్రలో అపశృతి..లోకేష్‌ భుజానికి గాయం

యువ గళం పాదయాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. యువ గళం పాదయాత్ర చేస్తున్నా నారా లోకేష్‌ భుజానికి గాయం అయింది. అయితే.. కుడి భుజం నొప్పితోనే నారా లోకేష్..పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పలువురు మహిళలు తన కుడిచేయి పట్టుకొని థాంక్స్ చెప్పాలని చూడడంతో కుడి భుజం నొప్పిగా ఉందంటూ ఎడమ చేతితో థాంక్స్ చెప్పారు నారా లోకేష్.

దీంతో నారా లోకేష్‌ భుజానికి గాయం అయిందని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి కుడి భుజం నొప్పిగా ఉందని చెప్పారు నారా లోకేష్. సెల్ఫీ తీసుకునే సమయంలో తన బిడ్డను ఎత్తుకొని ఫోటో తీసుకోవాలని లోకేష్ ను కోరగా తన చేయి నొప్పిగా ఉందంటూ మహిళతో చెప్పారు నారా లోకేష్. ఈ సంఘటన నేపథ్యంలోనే… ఈ విషయం బయటపడింది.

ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నపెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్​కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు సరఫరా చేసిన కరెంట్​కు సంబంధించి తెలంగాణ, ఏపీకి బకాయిపడిందని వివరించారు. 

శుక్రవారం పార్లమెంట్ లోని పీఎం ఆఫీసులో ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు. అరగంటకుపైగా సాగిన ఈ సమావేశంలో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఏపీకి సంబంధించిన 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. విభజన జరిగి తొమ్మిదేండ్లు గడుస్తున్నా.. చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు.

కీలకాంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలని కోరారు. ఏపీకి సంబంధించి.. 2014–15 ఆర్థిక సంవత్సరం నాటి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద పెండింగ్​లో ఉన్న రూ.36,625 కోట్లు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

 కేంద్రం సహకారం అందిస్తే కొద్దికాలంలోనే పోలవరం పూర్తవుతుందని, ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600.74 కోట్లు ఖర్చు చేసిందని, ఈ బకాయిలను చెల్లించాలని కోరారు. పోలవరం అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అడహక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

ఏపీ బడ్జెట్ పై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ బడ్జెట్ పేదరిక నిర్మూలనకు పునాది అని తెలిపారు మంత్రి రోజా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఐదోసారి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పునాది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించేలా బడ్జెట్ లో డిబిటి పథకాలకు 54,228 కోట్ల కేటాయింపులు చేయడం హర్షణీయం అన్నారు రోజా.

ఈ రాష్ట్రంలోని పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ కొండంత భరోశాను కలిగించింది. జగనన్న మాట తప్పడు మడమ తిప్పడు అని మరో సారి ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు కేటాయింపుల ద్వారా స్పష్టమైంది. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలందరి ఆకాంక్షలను గౌరవించారు. ముఖ్యంగా ఓ మహిళా మంత్రిగా ఈ బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన ప్రాధ్యాన్యతకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వివరించారు.

మహిళలకు ఇళ్ల నిర్మాణం, అమ్మఒడి, సున్నావడ్డీ రుణాలు, వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపి జగనన్న మరోసారి మహిళా పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చి, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ తరువాత రాష్ట్ర ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యేలా ఈ బడ్జెట్ ను రూపొందించారు. ఇలాంటి బడ్జెట్ ప్రతులను చించేసిన తెలుగుదేశం పార్టీకి ఈ బడ్జెట్ ద్వారా మేలు జరిగే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు రాబోయే రోజుల్లో వాళ్ల భవిష్యత్ ని చించేయడం ఖాయం.“ అన్నారు రోజా.

TTD : ఇక వారికి ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభం... - టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో టీటీడీ ఇ.ఓ ధర్మారెడ్డి మాట్లాడారు. తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి.

తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. రోజూ వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అన్నారు.

రాష్టంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాం అన్నారు. టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయి.. వాటి సరసన రాజాం ఆలయం చేరిందన్నారు.

మరో 36 శాటిలైట్లను ప్రయోగించనున్న ఇస్రో... ఎప్పుడంటే...

బ్రిటన్ కంపెనీ వన్ వెబ్ కు చెందిన మరో 36 శాటిలైట్లను ఇస్రో ఈ నెల 26న ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది.

 ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 36 శాటిలైట్లను రాకెట్ లో అమర్చే ప్రక్రియ పూర్తయిందని గురువారం వన్ వెబ్ కంపెనీ వెల్లడించింది. వన్ వెబ్ కంపెనీతోపాటు సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని భారతి ఎంటర్ ప్రైజెస్ కలిసి ‘వన్ వెబ్, లియో (లో ఎర్త్ ఆర్బిట్)’ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీని స్థాపించాయి. 

లో ఎర్త్ ఆర్బిట్ లోకి మొత్తం 618 శాటిలైట్లను పంపి.. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోయిన ఏడాది అక్టోబర్ 23న కూడా ఇస్రోకు చెందిన ఎల్వీఎం –3 (లాంచ్ వెహికల్ మార్క్–3) రాకెట్ ద్వారా 36 శాటిలైట్లను నింగికి చేర్చారు. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ మేరకు ఇప్పుడు మరో 36 శాటిలైట్లను పంపనున్నారు. 

అమెరికన్ కంపెనీ స్పేస్ ఎక్స్, ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ తోనూ ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటివరకు 17 విడతల్లో 582 శాటిలైట్లను నింగికి పంపారు. ఇస్రో చేపట్టబోయే ప్రయోగంతో అంతరిక్షంలో వన్ వెబ్ శాటిలైట్ల సంఖ్య 618కు చేరుతుంది. దీంతో వన్ వెబ్ ఆధ్వర్యంలో జనరేషన్ 1 లియో కాన్ స్టెల్లేషన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

AP : MLC ఎన్నికలలో 4 స్థానాలు కైవసం చేసుకున్న వైకాపా

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా, శ్రీకాకుళం, కర్నూలులో మొత్తం 4 స్థానాలను వైకాపా గెలుచుకుంది. రాష్ట్రంలోని ముగ్గురు గ్రాడ్యుయేట్లు, ఇద్దరు ఉపాధ్యాయులు, మూడు స్థానిక అధికారుల నియోజకవర్గాలకు మార్చి 16న పోలింగ్ జరిగింది. మూడు స్థానిక అధికారుల నియోజకవర్గాలు శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కర్నూలులో 95 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మార్చి 16న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. శుక్రవారం ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 

శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు 632 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణపై 108 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో 12 ఓట్లు చెల్లని అని తేలింది.

అలాగే పశ్చిమగోదావరి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి రెండు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కావూరు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. శ్రీనివాస్‌కు 481 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1,136 ఓట్లకు గాను ఆయనకు 988 ఓట్లు వచ్చాయి.

AP : దేవాలయాలలో తలనీలాల టికెట్ రేట్లు పెంచిన ఏపీ దేవాదాయ శాఖ

హిందూ సనాతన సంప్రదాయంలో పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర ఆలయాల్లో భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలోని ఆలయాల్లోని క్షురకులు తమకు కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగానే జీతం ఇవ్వమంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

తన పరిధిలోకి వచ్చే హిందూ ఆలయాల్లోని తలనీలాల టికెట్ ధరను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల్లోని తలనీలాల సమర్పణకు ఇప్పటి వరకూ టికెట్ ధర రూ.25లు ఉండగా ఆ టికెట్ ధర రూ. 40కి పెంచింది. ఇక నుంచి ఆలయాల్లో తలనీలాలను తీసే విధులను నిర్వహించే క్షురకులు కమిషన్ గా రూ. 20 లు ఇవ్వాలని దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ముఖ్య కార్యదర్శి ఎం.హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు.

అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!

అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాసన సభలో ఎలా చెబుతారని ప్రశ్నించారు. 

ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టచ్చినట్లు కనపడుతోంది. విభజన ఆంధ్రప్రదేశ్‌కు అంటే 2014 నుండి రాష్ట్రానికి 9 లక్షల3 వేల 336 కొట్లు అప్పులు ఉన్న పరిస్ధితి.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులను ఈ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకున్న విధంగా ఇది ఒక స్టిక్కర్ బడ్జెట్ గా అభివర్ణించారు సోమువీర్రాజు.

రాష్ట్ర బడ్జెట్ 80 శాతం రెవిన్యూ వ్యయం కాగా మూలధనం వ్యయం పెరగక పోవడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు సోము వీర్రాజు.. మూలధనం వ్యయం లేక పోతే ఆర్ధిక కార్యకలాపాలు జరగక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు కుంటుపడతాయి. ద్రవ్యలోటు పెరిగిపోవడంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. 

ప్రతినెల సుమారుగా 21 వేల కోట్లు రాష్ట్రానికి అవసరం ఉండగా సుమారు 10 వేల కోట్లు ఆదాయంగా వస్తున్నా ప్రతి నెల నాలుగువేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు.. మిగిలిన ఏడు వేల కోట్లు ఏవిధంగా సమకూరుతున్నాయన్న విషయం ప్రభుత్వం వెల్లడించడం లేదు. కాబట్టి ప్రభుత్వ ఆర్ధిక తీరుతెన్నుల పై మిలియన్ డాలర్ల అనుమానం కలుగుతోంది. కార్పోరేషన్ల పై తీసుకున్నరుణాలకు సంబంధించిన విషయాలను ఆర్ధిక మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లు రిజిస్ట్రేషన్ కంపెనీ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి కార్పోరేషన్ లావాదేవీలు కంపెనీ రిజిస్ట్రార్ కు నివేదిస్తున్నారా? లేదా? అని ఘాటుగా ప్రశ్నించారు సోము వీర్రాజు.

మూలధన వ్యయం విషయం బుగ్గన క్లారిటీ ఇవ్వక పోగా.. ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో కూడా వెల్లడించక పోతే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టి ప్రజలకు ఏం చెప్పదల్చారని ప్రశ్నించారు సోమువీర్రాజు.. వ్యవసాయానికి కేంద్రం ఇస్తున్న సహకారంతో పోలిస్తే రాష్ట్రం ఇస్తున్నది లేశ మాత్రమే. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేధ్యం, భూసార పరీక్షలు బడ్జె కేటాయింపులు అంకెల్లో ఘనంగా ఉన్నా క్షేత్రస్ధాయిలో రైతులకు నిరాశ ఎదురు అవుతోంది. మద్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఒక అంకెలగారడీగానే కనపడుతోంది.

ఉత్తరాంద్ర, రాయలసీమల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నేటికీ సమస్యల సుడిగుండంలోనే ఉండడమే ఇందుతార్కాణం. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఇస్తున్న సహకారం మాత్రమే కనపడుతోంది.. అయితే, బడ్జెట్ లో రాష్ట్రం చేస్తున్నట్లుగా ఎలా చూపించుకుంటారని ప్రశ్నించారు. ఇళ్లు నిర్మాణానికి సంబంధించి ఆర్ధిక మంత్రి అంతా రాష్ట్రం చేస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తే జాలి వేస్తోంది. కేంద్రం ఇచ్చిన ఇళ్లు సకాలంలో నిర్మాణం చేయకుండా అబద్దాలతో ఇళ్లు కడుతోందని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి.. బడ్జెట్ ముఖ్యాంశాలు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది.

 మొత్తం రూ.2,79,279 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి..

 అందులో రెవున్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు కాగా మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా ఉన్నాయి.

సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ కేటాయింపుల ముఖ్యాంశాలు

రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్

ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు

వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు

పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు

బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు

పర్యావరణానికి రూ.685 కోట్లు

జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు

హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు

గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు

నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు

మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు

కార్మిక శాఖకు రూ.796 కోట్లు,

ఐటీ శాఖకు రూ.215 కోట్లు

న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు

స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు

బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు

ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు

ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు

ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ.4887 కోట్లు

క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్ రూ.346.78 కోట్లు

మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు కేటాయింపు

యూత్, టూరిజం రూ.291 కోట్లు

డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు కేటాయింపు

పెన్షన్లు రూ.21,434 కోట్లు

రైతు భరోసాకు రూ.4020 కోట్లు

జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు

వసతి దీవెనకు రూ.2200 కోట్లు

వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు

అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు

పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు

మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు

నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు

ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు కేటాయింపు

అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు

సివిల్ సప్లై – రూ. 3725 కోట్లు,

 జీఏడీకి రూ.1,148 కోట్లు

పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు, 

ప్రణాళిక 809 కోట్లు

రెవెన్యూ రూ.5380 కోట్లు,

 రియల్ టైం గవర్నెస్ రూ.73 కోట్లు

స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు

సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు, 

R&Bకి రూ.9119 కోట్లు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు

రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు

కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు

వాహనమిత్ర రూ.275 కోట్లు

నేతన్న నేస్తం రూ.200 కోట్లు

మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి రూ.50 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.200 కోట్లు

వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు

వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు

అమ్మఒడి రూ.6500 కోట్లు కేటాయించారు.

ఈ రోజే హస్తినకు పయనం... మోదీ, షాలతో భేటీ కానున్న జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి 7:30 గంటలకు ఆయన హస్తినకు పయనం కానున్నారు.

 ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఓవైపు నేడు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం జరుగుతుండగా.. సాయంత్రం ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడం పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు సీఎం జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. 

అలాగే రాష్ట్రంలోని సమస్యలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలకు సంబంధించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాజధాని అంశంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.