/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి Miryala Kiran Kumar
ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారు...

నల్గొండ పట్టణంలోని తన నివాసం వద్ద ప్రియతమా నేత కేసిఆర్ గారి జన్మదిన సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం అన్నదానం చేశారు...

ఆ భగవంతుని దీవెనలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు

ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు వహించి పరిపాలనలో కొత్త నమూనాను రూపొందించిన నిరంతర తపస్వి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలిపారు

రానున్న రోజుల్లో దేశ పురోభివృద్ధి చెందాలంటే దేశ రాజకీయాలలో కెసిఆర్ గారు ముఖ్య పాత్ర వహించి దేశ భవిష్యత్తును మార్చాలని ఆకాంక్షించారు...

రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర కోట్ల జనాభా ఆకాంక్షను నెరవేర్చి వారి అభ్యున్నతికి కృషి కోసం అహర్నిశలు పాటుపడుతున్న మహోన్నతమైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలిపారు

కేసీఆర్ జన్మదిన సందర్భంగా నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు డప్పు సప్పులతో నృత్యలు చేశారు...

ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం యాదవ్ టిఆర్ఎస్ ముఖ్య నాయకులు పోలే వెంకటాద్రి ముక్కమల్ల వెంకన్న యాదవ్ నారీ నరసింహ పోలోజు వెంకటాచారి, కర్నాటి మల్లేష్ గోనె వాసు రావు సతీష్ అలుగుబెల్లి సైదిరెడ్డి జిల్లా పెళ్లి ఇంద్ర ఆంజనేయులు కట్ట శ్రీనివాస్ కంచర్ల శ్రవణ్ గౌడ్ కొండాపురం అరుణ్ కొప్పు మహేష్ పాక సాయి మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు... తదితరులు పాల్గొన్నారు.

మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు

మీసేవా కేంద్రాలు మరియు ఆధార్ కేంద్రాల అక్రమ వసూళ్లపై చర్యలు

జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ భాస్కరరావు గారి సమక్షంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ(ఇండియన్)

మీ సేవ, చందు మీ సేవ, మరియు పవన్ మీ సేవ. కేంద్రాలు వినియోగదారుల నుండి అదనపు వసూళ్లకు పాల్పడుతుండడంతో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మానవతా వాది అయిన శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేయగా సంబంధిత మీసేవ కేంద్రాల నిర్వాహకులకు షో కాజ్ నోటీసులు జారీ చేసి అంతర్గత విచారణ అనంతరం ఈరోజు పిర్యాదు దారు అయిన శ్రీ సాదిక్ పాషా గారి సమక్షంలో జాయింట్ కలెక్టర్ గారు సదరు మీ సేవా కేంద్రాల అక్రమ వసూళ్లపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తే నిర్భయంగా తమకు పిర్యాదు చేస్తే అటువంటి వారిపై విచారణ జరిపి కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని తెలుపుతూ అక్రమాలకు పాల్పడ్డ సదరు నిర్వాహకులకు ఎటువంటి శిక్ష వేయాలో పిర్యాదుదారు అయిన సాదిక్ పాషా గారినే అడగడంతో వారు మానవతా దృక్పథంతో మొదటి తప్పుగా భావించి మందలించి మరలా తప్పు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఒక్కొక్కరికి 2000/- రూపాయలు జరిమానా విధిస్తూ భవిష్యత్తులో మళ్ళీ వీరిపై పిర్యాదు వస్తే వీరి కేంద్రాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తు ప్రతి మీసేవా కేంద్రాల్లో రేట్ల పట్టిక స్పష్టంగా పెద్ద అక్షరాల్లో ఉండేలా ఏర్పాటు చేసి పిర్యాదు చేయడానికి స్థానిక అధికారి పేరు మరియు ఫోన్ నంబరు వినియోగదారులకు కనపడేలా ఏర్పాటు చేయాలని సదరు అధికారులను ఆదేశించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, జాతీయ వినియోగదారుల హక్కుల సంస్థ కార్యదర్శి శ్రీ ఎం.డి. సాదిక్ పాషా, జాతీయ మానవ హక్కుల మండలి సభ్యులు జి.జనార్ధన్, జి.కరుణాకర్, వినియోగదారుల హక్కుల సంస్థ సలహాదారు శ్రీ మదగోని భిక్షపతి గారు మరియు పాత్రికేయుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి

   నల్గొండ పట్టణ ప్రజలు గత ఆరు నెలల నుండి దూళి, దుముకు అనారోగ్యానికి గురి అవుతున్నారు, రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి

   నల్లగొండ పట్టణములొ రోడ్ల మరమ్మతులు గత ఆరు నెలల నుండి కొనసాగడం వలన పట్టణ ప్రజలు ధూళి, దుముకు గురి అయి అనారోగ్యం పాలవుతున్నారు. మరమతులను త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినారు. తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంల నేడు జరిగినది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడినారు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగిసిన నల్గొండ జిల్లాలో కొంతమంది రైతులకు పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం ఇంకా అందలేదని ప్రభుత్వం స్పందించి వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లా కమిటీ కొన్ని తీర్మానాలను చేయడం జరిగింది. ధరణి పోర్టల్ లో తవ్వే కొద్ది సమస్యలు వెలుగు చూస్తున్నాయి భూవిస్తీర్ణములో మార్పులకు అవకాశం లేకపోవడం, కొత్త పహాని అందుబాటులో ఉండడం లేదని ధరణి లోని సమస్యలనువెంటనే పరిష్కరించాలని తీర్మానించనైనది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా 24 గంటలు రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదు, దానితో పంటలు ఎండి పోయే పరిస్థితి కనిపిస్తుంది కావున ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 24 గంటలు కరెంటును సరఫరా చేయాలని తీర్మానించనైనది. వచ్చే సాధారణ ఎన్నికలలో నల్గొండ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టాలని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రేపు తేదీ17-2-2023 న హైదరాబాదులో జరగబోయే రాష్ట్ర కమిటీ సమావేశానికి పంపడం. జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మారే బోయిన శ్రీధర్ ఉపాధ్యక్షులు సాతీరు యాదయ్య, కార్యదర్శి పులి పాపయ్య, వై పాపిరెడ్డి, కిరణ్ కుమార్ విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్బీఐ ఏటీఎంలో నమ్మించి మోసం చేసి నాలుగు వేలు డ్రా చేసుకుని పారిపోయిన దుండగుడు

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా//

ఎస్బీఐ ఏటీఎంలో నమ్మించి మోసం చేసి నాలుగు వేలు డ్రా చేసుకుని పారిపోయిన దుండగుడు

సిర్పూర్

స్తానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాదితుడు

సీసీ ఫూటేజి ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు

పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి,స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం:ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి

 స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం

 ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

      ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు 

      దొడ్డి కొమరయ్య భవన్లో బుధవారం సిపిఎం నల్గొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఇవ్వకుండా కార్పొరేటీకరణ చేయడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. పేదలు, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి 60 శాతం నిధులు తగ్గిస్తూ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ను సవరించి ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రానికి రావడానికి ఉన్న పంచాయతీరాజ్ ,ఆర్ అండ్ బి రోడ్లను డబల్ రోడ్లుగా మార్చాలని, దెబ్బతిని గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేయాలని పాదయాత్రలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు. పట్టణంలో ప్రధాన రహదారులు మినహా శివారు ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, తదితర సమస్యలపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

       *ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశమ్ ,పాలడుగు ప్రభావతి, నల్లగొండ పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, నన్నూరి వెంకటరమణారెడ్డి, తుమ్మల పద్మ, నల్లగొండ ,తిప్పర్తి, కనగల్లు మండల కార్యదర్శిలు నలపరాజు సైదులు, మన్నె బిక్షం, కందుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.

మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావ్

మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హిందూ స్మశాన వాటికను మహాప్రస్థానంగా పునరుద్ధరించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 3 కోట్ల 59 లక్షలతో నిర్మిస్తున్న మహాప్రస్థానం నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. రామానుజులరెడ్డిని పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహాప్రస్థానం మొత్తం కలియతిరిగి పనులను పరిశీలించిన కలెక్టర్ నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని, మార్చి నెలాఖరు వరకు మహాప్రస్థానం పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మునిసిపల్ కమిషనర్ పి రామానుజులరెడ్డి ఈఈ జికేడి ప్రసాద్, ఏఈ సుమంత్, మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు.

మునుగోడు మండలంలో ఎమ్మార్వో గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన SHVS క్యాలెండర్.

సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను మునుగొడు మండలంలోని mro కృష్ణా రెడ్డి dt నరేష్ ,mpdo జానాయ్య ,పంచాయతీ రాజ్ ae రామకృష్ణ గార్ల చే క్యాలెండర్ ఆవిష్కరణ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ జిల్లా కార్యదర్శి p సైదులు గౌడ్,మునుగొడు నియోజకవర్గం అధ్యక్షులు అద్దంకి రామ లింగయ్య ప్రదాన కార్యదర్శి సురిగి శ్రీశైలం,సహదేవు తదితరలు పాల్గొన్నారుు

కడప అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి

వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాల నాయకులతో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనగా 15 2 2023 తేదీన 11 గంటలకు నిరసన కార్యక్రమం జరపడమైనది విషయం ఏమనగా విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాచకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది దీనిని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మానసిక వికలాంగుల పైన మరియు వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బి సుబ్బారావు రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య సంఘ సేవకులు సల్లావుద్దీన్ ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి ఎం ఎస్ పి నాయకులు మాతయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను మరియు నగర అధ్యక్షుడు ప్రసాద్ విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్ సుబ్బరాయుడు మరియు ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి బి ఓబయ్య ఆరిపుల్ల రా చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారుు.

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

జగిత్యాల జిల్లా : 

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.,

ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొని 

కండక్టర్‌ మృతి చెందగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.. 

వారిని హుటాహుటిన 

జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. 

జగిత్యాల నుంచి వరంగల్‌ 

వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికాగా బస్సులో 8 మంది ప్రయాణికులున్నట్లు ఆర్టీసీ 

అధికారులు తెలిపారు... 

ఈ రోజు సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన ఉండగా కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం 

చోటు చేసుకుంది..

మృతి చెందిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి కు చెందిన బొల్లం సత్యం గా గుర్తింపు.

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

ఈనెల 19వ తేదీన హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించబోయే హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి బైక్ ర్యాలీని పురస్కరించుకొని ఈరోజు రామగిరి రామాలయంలో వాల్ పోస్టల్ ఆవిష్కరించడం జరిగింది.

 హిందూ వాహిని ఉమ్మడి జిల్లా ప్రముఖ్ సంగపాక రాంబాబు గారు మాట్లాడుతూ ఈ ఆదివారం 19వ తేది సాయంత్రం 4.00 గంటలకు స్థానిక రామగిరి రామాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభం అయితుందని, ఈ ర్యాలీలో సంఘ వివిధ క్షేత్ర ప్రముఖులు పెద్దలు ,కార్యకర్తలు మరియు హిందూ బంధువులందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గండికోట రాజు, ఉపాధ్యక్షుడు తారల నరేష్, జిల్లా కమిటీ మెంబర్ దొండ నరేందర్, ఉపాధ్యక్షుడు పందిరి మాధు, గురు, సతీష్ ,హరి ,తదితరులు పాల్గొన్నారు.