నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...
నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...
నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, ఓ సిగరెట్ పాకెట్తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు
ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా..? ఏ బంధాలూ లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే పాతికేళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచ్ కూడా కదిలించలేకపోతున్నారేమో… ఐనా రాతి లోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది… నవీన్ కూడా అంతే… నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు… అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు… విషయం ఏమిటంటే?
కిసన్ శేషదేవ్… సంబల్పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబం… చిన్నప్పుడు ఏడాది వయస్సున్నప్పుడే తల్లిని కోల్పోయాడు… 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసన్ కూలీ పని చేయాల్సి వచ్చింది… 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు… అప్పటికి తనకు పద్దెనిమిదేళ్లు… రెండేళ్ల క్రితం అక్కను కూడా పొగొట్టుకున్నాడు… ప్రస్తుతం అనాథ…
చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్… ప్రతి పరీక్షలోనూ తనే టాప్… 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్లో టాపర్గా నిలిచి, ప్లస్టూ వరకు అక్కడే చదివాడు… తరువాత 2012లో National Entrance Screening Test (NEST) రాశాడు… 17వ ర్యాంకు… కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు… 2013లో మళ్లీ రాశాడు, ఈసారి 15వ ర్యాంకు, NISER లో అయిదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు
2018… ఒడిశా నాలెడ్జ్ హబ్లో ఓ పెద్ద మీటింగ్… విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నిషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసన్ను ఆహ్వానించాడు… అప్పట్లో స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్తో ఉన్న కిసన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చాడు… తరువాత కిసన్ జర్మనీలోని Gottingen లోని జార్జ్-అగస్ట్ యూనివర్శిటీలో చేరాడు… పీహెచ్డీ చేశాడు… ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్టు…
గత నెల చివరివారంలో పట్నాయక్ రోమ్ వెళ్లాడు… దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు… శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు… అందరి ఎదుట శేషదేవ్కు కాసేపు మాట్లాడే చాన్స్ దొరికింది… తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి, ఊపుతూ… ఇదేమిటో తెలుసా అంటూ… ముఖ్యమంత్రి తనకు ఏయే సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ఎమోషన్తో చెబుతూ పోయాడు…
‘‘నాకు సార్ చెప్పింది ఒకటే… పది మందికీ ఉపయోగపడు అన్నాడు… పదే పదే అదే గుర్తొస్తుంది… మా ఊళ్లో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను… 30 లక్షలతో ఇల్లు కట్టాను… నథింగ్ నుంచి నన్ను ఎవిరీ థింగ్ స్టేజీకి తీసుకొచ్చాడు సీఎం… తిరిగి వచ్చేస్తాను, ఓ పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో… నాకు ఎవరూ లేరు సార్, అందరినీ కోల్పోయాను, అయితే ఏమిటి సార్, మీరున్నారు, మీరే నా తండ్రి…’’ శేషదేవ్ ముగించాడు… అదుగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్ కంటి నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి… ఆ ఎమోషన్ పేరు ఆనందమే…
ఇందులో ఏముంది అనకండి… మనసంతా పాజిటివిటీని నింపే ఇలాంటి వార్తలు చదవాలి… ఖచ్చితంగా చదవాలి… ఓ గిరిజన విద్యార్థి కష్టనష్టాల జీవనప్రయాణం ఇది… రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్ వంటి నేతలూ ఉంటారని తెలియాలి… ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందనీ, అది కొన్నిసార్లు కంటికట్టలు తెంచుకుని బయటికి దూకుతాయని కూడా తెలియాలి…!!
ఇలాంటి వాళ్ళు కావాలి మన దేశానికి,తరాలు సంపద కూడబెట్టే వాళ్ళు కాదు.

నవీన్ పట్నాయక్ గారు కంటతడిి...12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...




బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, 60 నుంచి 70 అసెంబ్లీ టికెట్లను కేటాయించాలి, అనే నినాదాలను ప్రజలకు వివరిస్తూ వారి సంతకాల ద్వారా మద్దతు తెలియజేయాలని కోరగా వివిధ వర్గాల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి పంబాల అనిల్ గారు, ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ గారు, మహిళ కన్వీనర్ గోస్కొండ కవిత గారు, నియోజకవర్గ ఇన్చార్జీలు వంటపాక యాదగిరి, అంకెపాక శ్రీనివాస్ గార్లు నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి అడ్వకేట్ గారు తిప్పర్తి మండల అధ్యక్షులు పేరపాక లింగస్వామి గారు, ప్రధాన కార్యదర్శి దాసరపు నవీన్ కుమార్, పజ్జురు గ్రామ శాఖ అధ్యక్షులు దాసరపు రవితేజ మరియు వీరస్వామి, కృష్ణయ్య, సతీష్, వెంకన్న, యాదయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.


బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారు, శ్రీ మిరియాల వెంకటేశం గారిని రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారికి అలాగే నా నియామకానికి సహకరించిన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి, రాష్ట్ర చేనేత కన్వినర్ శ్రీ ఎన్నం శివ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మరియు జిల్లా రాష్ట్ర నాయకుల అందరికి కృతజ్ఞతలుుు తెలియజేశారు. ఈ సందర్భంగాా వెంకటేశం గారుు మాట్లాడుతూ బాధ్యతగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిర్వర్తిస్తూ రాష్ట్రములో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఉదృతం చేస్తాననిి తెలియజేశారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ రెట్ లో సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డీ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గార్ల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ యర్ర మాద కృష్ణా రెడ్డి జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ కారుణ్ కుమార్, సైదులు గౌడ్ ,రామ కృష్ణ, యం. వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.
దేశానికి కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివి



Feb 14 2023, 19:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.7k