/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఆర్బిఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన Mane Praveen
Mane Praveen

Sep 09 2024, 16:41

NLG: ఆర్బిఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో సోమవారం, ఆర్బిఐ ఆధ్వర్యంలో అసెస్మెంట్ పద్మ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్యాంకు పెట్టుబడులు, భీమా కు సంబంధించిన అంశాలు గ్రామస్థులకు వివరించారు. ఆర్బిఐ 90 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, ఇందుకోసం ఆర్బిఐ వెబ్సైట్లో ఈ నెల 17 లోపు నమోదు చేసుకోవాలని, గెలుపొందిన వారికి నగదు బహుమతులు ఇస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.1 లక్ష చొప్పున బహుమతులు ఉంటాయని వెల్లడించారు. తదుపరి జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు సెలక్ట్ అయిన వారికి కూడా నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు.

Mane Praveen

Sep 08 2024, 22:06

AP: విజయనగరం జిల్లాలో రేపు విద్యాసంస్థ లకు సెలవు

విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి.

సోమవారం(సెప్టెంబర్ 9) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సోమవారం కలెక్టరేట్ లో జరగాల్సిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Mane Praveen

Sep 08 2024, 21:54

NLG: తల్లితండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మైనర్లు..ఆర్థిక సాయం చేసిన జైశ్రీరామ్ హెల్పింగ్ హాండ్స్
నాంపల్లి మండలంలోని కేతపల్లి గ్రామంలో జైశ్రీరామ్ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామ యువకులు సేకరించిన రూ.15,100/- ఇటీవల మృతిచెందిన పల్లేటి మహేష్ కుటుంబానికి అందజేశారు. పల్లేటి మహేష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత వారం మృతి చెందగా దశదినకర్మ కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.

వారం రోజుల క్రితం పల్లెటి మహేష్ మృతిచెందగా వారి భార్య కూడా కొంత కాలం క్రితం మరణించారు. వారికి  కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ముగ్గురు మైనర్లు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఒంటరి వాళ్ళం అయ్యామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పై చదువుల కోసం ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలని, తమని ప్రభుత్వం ఎలాగైనా ఆదుకొని మాకు ఒక దారి చూపించాలని కూతురు విలపించారు. నాంపల్లి మండలంలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు నిరుపేద కుటుంబానికి తమ వంతు సాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పెరికేటి రమేష్, దండిగ లింగయ్య, పెరికేటి జగన్, ఎడ్ల గిరి, రాజబోయిన హనుమంతు, వడ్లకొండ ప్రవీణ్ యాదవ్, చేపూరి శ్రీను, పగిల్ల నగేష్, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 08 2024, 20:23

NLG: రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి, పార్లమెంటులో సమగ్ర చట్టం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
రైతుల పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంతో పాటు, పార్లమెంటులో సమగ్ర చట్టం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.

మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో కామ్రేడ్ పగిళ్ల చిన్న నరసింహ నగర్ లో జరిగిన సిపిఎం 17వ గ్రామ శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రైతుల పట్ల వివక్ష చూపుతుందని, రెండు సంవత్సరాల నుంచి దేశం నడిబొడ్డున రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, రైతుల మీద అక్రమ కేసులు పెట్టడం తప్ప రైతుల సమస్యలు పరిశీలించడం లో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో రైతాంగానికి తగిన బడ్జెట్ కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో కంటే ఈసారి బడ్జెట్లో 19వేల కోట్లు తగ్గించారని కూలీల పట్ల కూడా మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, ప్రజలకు ఇచ్చిన ఆరు గారంటీలను అమలు చేయాలని, పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీని చేయాలని, రైతుల ఖాతాల్లో వెంటనే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం హాజరై మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను ఆమోదించాలని, లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అలాగే కల్వకుంట్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, కల్వకుంట్ల నుంచి వెల్మకన్నె వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనంతరం నూతన గ్రామ కమిటీని ఎన్నుకొన్నారు. నూతన కార్యదర్శిగా పగిళ్ల మధు, సహాయ కార్యదర్శిగా బొందు చిన్న నరసింహ, వీరితోపాటు మరో 9 మంది తోటి కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయక కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, గ్రామ శాఖ నాయకులు నారబోయిన నరసింహ, బొందు అంజయ్య, అయితగోని యాదయ్య, పగిళ్ల యాదయ్య, కట్ట మారయ్య, పుల్కారం అంజయ్య, జిల్లపల్లి యాదయ్య, పగిళ్ల వెంకన్న, కట్ట ఆంజనేయులు, బొందు సుందరయ్య, చేకూరి బిక్షం, కుక్కల బాలస్వామి, సింగపంగా లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 08 2024, 20:09

లెంకలపల్లి: ఘనంగా గణనాథుడికి రెండో రోజు పూజలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు, గ్రామంలోని గాంధీ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి 2వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పగిల్ల సత్యనారాయణ నరసమ్మ కుటుంబం 2వ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

Mane Praveen

Sep 08 2024, 19:25

NLG: సమాచార హక్కు వికాస సమితి జెండా ఆవిష్కరణ
నల్లగొండ: పట్టణంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో, ఆదివారం ఆ కమిటీ రాష్ట్ర గౌరవ సలహాదారుడు గాదె వినోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ ల చేతుల మీదుగా ఆర్టిఐ వికాస సమితి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికాస సమితి స్థాపించి 8 సం.లు పూర్తి చేసుకుని 9 సం.లో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఆర్టిఐ ద్వారా ప్రభుత్వం లో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, కార్యదర్శి కర్నాటి యాదగిరి, చింత సైదులు, గుండు సంపత్, ఆది మల్ల దేవేందర్, తుంగతుర్తి రామకృష్ణ, గంటకంపు గణేష్, యేష మల్ల రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 07 2024, 21:22

TG: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ కమిషన్ కొత్త చైర్మన్ కీలక వ్యాఖ్యలు
HYD: తెలంగాణలో స్థానిక ఎన్నికల  సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమితులైన నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు తన ప్రధాన ఎజెండా అని, సమాజంలో శ్రేయస్సు ఉండాలంటే జనాభాలో మెజారిటీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ సైతం చేస్తున్నారని, రాష్ట్రంలో కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆ లక్ష్యం దిశగా బీసీ కమిషన్ పని చేస్తుందన్నారు.

గత బీసీ కమిషన్ కులగణన విషయంలో ఎంత మేరకు పని చేసిందో వివరాలు తెప్పించుకుని వాటిని పరిశీలించి తామెంత త్వరలో పూర్తి చేయగలమో చేస్తామన్నారు. అన్ని బీసీ కుల సంఘాలు సహకరిస్తే గానీ ఎన్నికల లోపే కులగణన చేయడం అసాధ్యం. అందుకు బీసీ సంఘాలు ఆందోళన బాటలో కాకుండా సహకారం బాటలో ఉండాలని కోరారు. బీసీ కుల సంఘాలు ఆందోళన పడాల్సిన అవసరం గానీ ఆందోళన చేయాల్సిన అవసరం గాని లేదన్నారు. కులగణన విషయంలో బీసీ కమిషన్ కు ఏ విధంగా సహకరించాలో అనే దృక్ఫథంతో ఆలోచన చేయాలని కోరారు.

Mane Praveen

Sep 07 2024, 19:46

TG: సుభాన్ ధైర్యసాహసాలను మెచ్చుకొని రూ. 51, 000/- నగదు అందజేసిన అసదుద్దీన్ ఓవైసీ
ఖమ్మం ప్రకాష్ నగర్లో 9 మంది ప్రాణాలు కాపాడిన సుభాన్ ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ  అభినందించారు.

సుభాన్ ధైర్యసాహసాలను మెచ్చుకొని ఆయనకు 51000/- నగదు పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. ఖమ్మంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేశారు.

Mane Praveen

Sep 07 2024, 19:30

నల్గొండ మునిసిపాలిటీ కి  రూ. 25 లక్షల నగదు పురస్కారం..
నల్గొండ మునిసిపాలిటీ కి  రూ. 25 లక్షల నగదు పురస్కారం లభించింది. ఈ రోజు రాజస్థాన్ లోని జైపూర్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో జరిగిన స్వచ్ఛ్ వాయు దివస్ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి  భూపేందర్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ చేతుల మీదుగా ఈ నగదు పురస్కారం ను స్వీకరించారు. కాగా స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024 లో నల్గొండ నగరం జనాభా కేటగిరి(<3 లక్షలు)లో దేశంలోనే 2వ స్థానం సాధించించిన విషయం తెలిసిందే. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో, 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించ గా, నల్గొండ నగరం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరచి ఈ ఘనతను సాధించి ఈ నగదు పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

Mane Praveen

Sep 07 2024, 16:02

TG: ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజలు నిర్వహించిన సిఎం రేవంత్ రెడ్డి
HYD: రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాల కు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న  నిర్ణయం తీసుకున్న ట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్త ముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించి సిఎం రేవంత్ రెడ్డి తొలి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు, దేవుడి ఆశీస్సుల వల్ల తక్కువ నష్టాలతో బయటపడ్డామని అన్నారు.

ఈ పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యుడు దానం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.