Sep 07 2024, 08:34
NLG: గాలి కాలుష్యంపై అవగాహన..
గణపతి మట్టి విగ్రహాల పంపిణీ
నల్లగొండ: మున్సిపల్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని RP రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నీలి ఆకాశాల కోసం స్వచ్ఛమైన గాలి అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నిపుణులు విద్యార్థినిలకు గాలి కాలుష్యంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా స్వచ్ఛమైన గాలి కోసం తీసుకోవలసిన చర్యలను వివరించారు.
కాలేజీ ఆవరణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి వృక్షార్పణ కార్యక్రమం నిర్వహించారు. నల్లగొండ మున్సిపల్ కౌన్సిల్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకుల్లో రెండవ స్థానం సాధించి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. గాలి స్వచ్ఛత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థిని లకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
అంతేకాకుండా సైకిల్ పై కళాశాలకు వచ్చే విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమానికి ముందు జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సురేష్ గుప్తా,తదితరులు పాల్గొన్నారు.
Sep 07 2024, 21:22