తిరుపతికి తియ్యటి వార్తను ప్రకటించిన కేంద్రం
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం కావడంతోపాటు వరుసగా నాలుగు రోజులు సెలవుదినాలు కావడంతో రైళ్లన్నీ కిక్కిరిసి నడవబోతున్నాయి.
రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈనెల 14, 16 తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతి మధ్య (07653) నడవబోతున్నాయి.
రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మార్గమధ్యంలో షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటాయి.
షిరిడీ వెళ్లేవారికి అనుకూలంగా ఈనెల 14వ తేదీన తిరుపతి నుంచి నాగర్ సోల్ మధ్య 07417 పేరుతో మరో రైలు నడవనుంది. తిరుపతిలో ఉదయం 8.15 గంటలకు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నాందేడ్, ఔరంగాబాద్ మీదుగా తర్వాత రోజు ఉదయం 10.00 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 07418 పేరుతో 15వ తేదీ రాత్రి 10.00 గంటలకు నాగర్ సోల్ లో బయలుదేరి తర్వాతరోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
అధికారులకు ప్రయాణికుల ఫిర్యాదు ఏపీలో ప్రధాన నగరమైన కడపకు ఈ నాలుగు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఇచ్చారు. అయితే వివిధ ప్రాంతాలకు వెళుతున్న రైళ్లు కొన్ని కడప జిల్లాలోని కొన్ని స్టేషన్లలో ఆగడంలేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా తర్వాత హాల్టింగ్ నిలిపివేశారని, వెంటనే పునరుద్ధరించాలంటూ అధికారులకు విన్నవించారు.
కొన్ని కొన్ని స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆరునెలలపాటు రైళ్లను ఆపుతున్నామని, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం రైల్వేకు బాగుంటే కొనసాగిస్తామని, లేదంటే అంతటితో ఆ సౌకర్యాన్ని నిలిపివేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.




తాజా ఆరోపణలతో అదానీ స్టాక్స్ పడిపోతాయా? మార్కెట్ నిపుణుల సమాధానమిదే..! అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సెబీ చైర్పర్సన్ మాధుబి పురి బచ్, ఆమె భర్తకు అదానీ ఆఫ్షోర్ వ్యాపారంలో వాటాలు ఉన్నాయని ఆరోపించింది. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమవుతాయా? మార్కెట్ నిపుణుల ఏమంటున్నారు? అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, ఈసారి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్ పర్సన్ మాధుబి పురి బచ్ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ గ్రూప్ మారిషస్ ఆఫ్షోర్ ఫండ్స్లో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కొత్త ఇన్వెస్ట్గేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పనితీరుపై చర్చకు దారితీసింది. సోమవారం ఆగస్టు 12వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పతనమయ్యే అవకాశం ఉందా? అనేది ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరి ఈ అంశంపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? 2023లో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ అదానీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలు చేసింది. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి లాభపడిందని, స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ సమయంలో గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. అయితే, ఆ తర్వాత తమ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ షేర్లు వేగంగా కోలుకున్నాయి. హిండెన్బర్గ్ ఆరోపణల ముందు సమయంలోని విలువను దాటి ట్రేడింగ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్నకు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. అవి అదానీ పోర్ట్స్ అండే సెజ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్డీటీవీ ఉన్నాయి. తాజా ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందిస్తున్నారు. 2023తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు వేరని గుర్తు చేశారు. హిండెన్బర్గ్ తాజా ఆరోపణల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్లో అదానీ స్టాక్స్లో భారీ అమ్మకాలు ఉండకపోవచ్చని, అలాగే స్టాక్ మార్కెట్ సైతం భారీ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలేమీ ఉండకపోవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మొదట్లో ప్రభావం కనిపించవచ్చు కానీ, మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయి. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. మార్కెట్లు ప్రారంభమైన తర్వాత అదానీ స్టాక్స్ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. కానీ, మళ్లీ రికవరీ అవుతాయి.' అని ఇండిట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నట్లు మింట్ వెల్లడించింది.
తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) స్పందించారు.





Aug 12 2024, 15:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
23.1k